breaking news
paga paga paga Movie
-
మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్: కోటి
‘‘నేను ఈ రోజు ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి కారణమైన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని సంగీత దర్శకుడు, నటుడు కోటి అన్నారు. అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య జంటగా రవి శ్రీ దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పగ పగ పగ’. సుంకర బ్రదర్స్ సమర్పణలో సత్యనారాయణ సుంకర నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. శుక్రవారం జరిగిన సక్సెస్ మీట్లో కోటి మాట్లా డుతూ– ‘‘పగ పగ పగ’ సినిమాకు మ్యూజిక్ చేద్దామని వెళ్లాను.. అయితే దాంతోపాటు నాతో యాక్టింగ్ కూడా చేయించారు. మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.. ఇంకా పెద్ద హిట్ చేయాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని చూడనివారు చూసి, మమ్మల్ని ఆశీర్వదించాలి’’ అన్నారు రవి శ్రీ దుర్గా ప్రసాద్. నిర్మాతలు సత్య నారాయణ సుంకర, ఫైట్ మాస్టర్ రామ్ సుంకర మాట్లాడుతూ.. ‘మా స్టంట్ మాస్టర్ యూనియన్ సపోర్ట్ వల్లే ఈ సినిమా తీశాం. ప్రేక్షకుల స్పందన చూసి, మా కష్టం మరచిపోయాం. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రం తీయడం జరిగింది. కోటి గారితో వర్క్ చేసే అవకాశం రావడం చాలా హ్యాపీ గా ఉంది. మా తమ్ముడు హీరోగా అద్భుతంగా నటించాడు. సీనియర్ నటుల సపోర్ట్ మరవలేనిది’అన్నారు. చిత్ర హీరో అభిలాష్ సుంకర మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఫైటర్ గా నేను 320 సినిమాలకు వర్క్ చేశాను. మా అన్నలు నన్ను నమ్మి నాపై ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశారు. వారికి నా పాదాభివందనాలు, దర్శకులు రవి గారు మంచి కథ ఇచ్చి మమ్మల్ని బాగా డైరెక్ట్ చేశారు. కోటి గారి మ్యూజిక్ వింటూ పెరిగిన నేను తనతో కలసి నటించడంతో పాటు, మ్యూజిక్ కూడా తనే ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అన్నాడు. -
‘పగ పగ పగ’ మూవీ రివ్యూ
టైటిల్: పగపగపగ నటీనటులు: కోటి, అభిలాస్ సుంకర, దీపిక ఆరాధ్య, బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు తదితరులు నిర్మాత : సత్య నారాయణ సుంకర దర్శకత్వం : రవి శ్రీ దుర్గా ప్రసాద్ సంగీతం : కోటి సినిమాటోగ్రఫీ : నవీన్ కుమార్ చల్లా ఎడిటర్ : పాపారావు విడుదల తేది: సెప్టెంబర్ 22,2022 ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా విలన్ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం ‘ పగ పగ పగ’.అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్, మూవీ మోషన్ పోస్టర్, కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్కు మంచి స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ చిత్రం కథంతా 1985,90,2006వ సంవత్సరంలో సాగుతుంది. బెజవాడలోని బెజ్జోనిపేటకు చెందిన జగ్గుభాయ్(కోటి), కృష్ణ(బెనర్జీ) కాంట్రాక్ట్ కిల్లర్స్. ఒక్కసారి డీల్ కుదుర్చుకుంటే.. ప్రాణాలు పోయినా సరే డీల్ పూర్తి చేస్తారు. ఒక పోలీసు హత్య కేసులో కృష్ణ అరెస్ట్ అవుతాడు. ఆ సమయంలో జగ్గూభాయ్కి కూతురు సిరి(దీపిక ఆరాధ్య) పుడుతుంది. కృష్ణ ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుతానని మాట ఇచ్చిన జగ్గు.. అతను జైలుకు వెళ్లగానే ఆ ఊరి నుంచి పారిపోతాడు. తర్వాత హత్యలను చేయడం మానేసి జగదీష్ ప్రసాద్గా పేరు మార్చుకొని పెద్ద వ్యాపారవేత్త అవుతాడు. కృష్ణ ఫ్యామిలీ మాత్రం కష్టాలు పడుతూనే ఉంటుంది. కానీ అతని కొడుకు అభి(అభిలాష్)ని మాత్రం చదువులో రాణిస్తాడు. అభి చదువుకునే కాలేజీలోనే సిరి చేరుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. జగదీష్ మాత్రం వీరి పెళ్లికి నిరాకరిస్తాడు. దీంతో ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకుంటారు. తను గారాబంగా పెంచుకున్న కూతురిని తీసుకెళ్లిన అభిపై జగదీష్ పగ పెంచుకుంటాడు. అల్లుడిని చంపడానికి ఓ ముఠాతో డీల్ కుదుర్చుకుంటాడు. కానీ కూతురు ప్రెగ్నెన్సీ అని తెలిసి ఆ డీల్ని వద్దనుకుంటాడు. కానీ ఇంతలోపే ఆ డీల్ చేతులు మారి చివరకు బెజ్జోనిపేటకు చెందిన ఓ వ్యక్తికి చేరుతుంది. అసలు ఆ డీల్ తీసుకుంది ఎవరు? తన అల్లుడిని కాపాడుకోవడానికి జగదీష్ చేసిన ప్రయత్నం ఏంటి? అభి తండ్రి కృష్ణ చివరకు ఏం చేశాడు? అభి ప్రాణాలను ఎవరు రక్షించారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ప్రస్తుతం ఆడియెన్స్ను ఆకట్టుకోవడం, థియేటర్లకు రప్పించడం చాలా కష్టంగా మారింది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్పా ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు రవి శ్రీ దుర్గా ప్రసాద్. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా.. దానిని తెరపై చూపించడంలో, ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్లో కథ అంతగా రక్తి కట్టించదు. కాలేజీ ఎపిసోడ్ సరదాగాసాగుతుంది. అభి, సిరిల మధ్య కెమిస్ట్రీ బాగుంది. జగ్గూభాయ్ కాస్త జగదీష్ ప్రసాద్గా మారడం.. వ్యాపారంలో రాణించడం.. అదేసమయంలో కృష్ణ కష్టాలతో బాధపడడం, సిరి, అభిలు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. అసలు కథ అంతా సెకండాఫ్లో ఉంటుంది. కాంట్రాక్ట్ కిల్లర్ని పట్టుకునేందుకు జగ్గుభాయ్ చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా సాగుతాయి. ఈ కథకి పోకిరి సినిమాలోని ఓ సన్నివేశాన్ని లింక్ చేయడం బాగుంది. క్లైమాక్స్ మాత్రం ఉహకు భిన్నంగా, టైటిల్కి తగ్గట్టుగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కెరీర్లో మొదటి సారి విలన్ పాత్ర పోషించాడు సంగీత దర్శకుడు కోటి. జగ్గూ అలియాస్ జగదీష్ ప్రసాద్ పాత్రకు న్యాయం చేశాడు. విలన్గా, కూతురికి మంచి నాన్నగా అదరగొట్టేశాడు. హీరో అభిలాష్కి ఇది తొలి సినిమా. అయినప్పటికీ చాలా చక్కగా నటించాడు.సీరియస్, కామెడీ సీన్స్తో పాటు యాక్షన్ ఎడిసోడ్స్లోనూ అదరగొట్టేశాడు. హీరోయిన్గా సిరి పాత్రలో దీపిక మెప్పించింది. బెనర్జీ, కరాటే కళ్యాణి, జీవాతో పాటు మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. కోటీ సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. నవీన్ కుమార్ చల్లా సినిమాటోగ్రఫీ, పాపారావు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘పగ పగ పగ’.. ఫస్ట్డే ఫస్ట్ షో ఫ్రీ
ఏ సినిమాకైనా మొదటి రోజు మొదటి ఆట ఎంతో ముఖ్యం. మౌత్ టాక్తో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రాలెన్నో ఉన్నాయి. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోను ఉచితంగా వేస్తున్నారంటే.. సినిమా మీద ఎంత నమ్మకం ఉండాలి. ఇప్పుడు పగ పగ పగ సినిమా యూనిట్ కూడా అదే నమ్మకంతో ఉన్నట్టుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం పగ పగ పగ. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా పగ పగ పగ చిత్రం రాబోతోంది. వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించారు. నిర్మాత సత్య నారాయణ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో అందరికీ ఫ్రీగా చూపించాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. సినిమా మీదున్న నమ్మకంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు తెలిపారు. బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కోటి అందించారు.