breaking news
overseas employees
-
విదేశాల నుంచి ఉద్యోగులు.. కంపెనీలకు జీఎస్టీ నోటీసులు
దేశంలోని అనేక కంపెనీలకు ఇటీవల జీఎస్టీ నోటీసులు రావడం గురించి ఎక్కువగా వింటున్నాం. అయితే కంపెనీలకు ఎందుకిలా వరుసపెట్టి జీఎస్టీ నోటీసులు వస్తున్నాయని పరిశీలిస్తే అసలు కారణం తెలిసింది. భారత్కు చెందిన చాలా కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు విదేశాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే విదేశీ సంస్థలు, వాటి అనుబంధ కంపెనీలు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఈ కంపెనీలు ఆయా దేశాల్లో ఉద్యోగులను అక్కడి చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నియమించుకుంటాయి. అయితే బయటి దేశాల్లో నియమించుకున్న ఉద్యోగులను భారత్కు డిప్యూటేషన్పై తెచ్చుకున్న కంపెనీలకు ఇటీవల జీఎస్టీ నోటీసులు అందాయి. బయటి దేశాల నుంచి డిప్యూటేషన్పై వచ్చిన ఉద్యోగులకు సంబంధించిన జీతాన్ని తమ విదేశీ సంస్థకు ఇక్కడి కంపెనీలు తిరిగి చెల్లిస్తుంటాయి. ఇలా బయటి దేశాల నుంచి డిప్యూటేషన్పై వచ్చినవారిని సెకెండెడ్ ఎంప్లాయీస్ అంటారు. విదేశీ సంస్థకు రియింబర్స్ చేసే వీరి జీతాలపై సర్వీస్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఈమేరకు నార్తర్న్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కేసులో భాగంగా 2022 మేలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును అనుసరిస్తూ ఆయా కంపెనీలకు జీఎస్టీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ నోటీసులపై కంపెనీల్లోని ట్యాక్స్ నిపుణులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. "2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసుల మదింపు పరిమితి కాలం సెప్టెంబర్తో ముగిసిన నేపథ్యంలో కంపెనీలకు వరుపెట్టి నోటీసులు వచ్చాయి. ఇటువంటి నోటీసులు అందుకున్న కంపెనీలు వాస్తవాలను పరిశీలించుకుని ముందుకు వెళ్లాల్సిఉంటుంది" అని కేపీఎంజీ-ఇండియా, భాగస్వామి, ఇన్డైరెక్ట్ ట్యాక్స్ నేషనల్ హెడ్ అభిషేక్ జైన్ అన్నారు. -
1800 మంది ఇన్ఫీ ఉద్యోగులకు భారీగా వేతనం
బెంగళూరు : దేశీయం రెండో టెక్ దిగ్గజంగా పేరున్న ఇన్ఫోసిస్ విదేశీ ఉద్యోగులకు భారీగా వేతనాలు చెల్లిస్తోంది. అంతర్జాతీయ కేంద్రాల్లో పనిచేస్తున్న 1800 మందికి పైగా ఉద్యోగులు కోటికి పైగా వేతనాలు ఆర్జిస్తున్నట్టు తెలిసింది. వీరిలో 150 మందిని కంపెనీ గత ఆర్థిక సంవత్సరమే నియమించుకుంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో వర్క్ ఫోర్స్ ను మరింత విస్తరిస్తున్న క్రమంలో ఈ వ్యయాల కంపెనీకి మరింత సవాళ్లు కానున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. అయితే 2017 ఆర్థికసంవత్సరంలో కేవలం 50 మంది భారతీయ ఉద్యోగులకు మాత్రమే కోటిపైగా వేతనాలు చెల్లించింది. ఈ సంఖ్య 2015 ఆర్థిక సంవత్సరంలో 113-117 మధ్యలో ఉండేది. భారత్ లో ఇన్ఫోసిస్ కు 1,51,956 మంది ఉద్యోగులున్నారు. అంతర్జాతీయంగా మాత్రం 48,400 మందే ఉన్నారు. కానీ విదేశీ ఉద్యోగులకు మాత్రమే ఇన్ఫోసిస్ ఎక్కువగా వేతనాలు ఇస్తోంది. ఇప్పటికే 1800 మందికి పైగా విదేశీ ఇన్ఫీ ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. ఏళ్ల తరబడి అనుభవం, విదేశ కరెన్సీలో వేతనాలు ఇవ్వడంతో వీరి వేతనాలు ఇంత భారీగా ఉన్నాయని తెలిసింది. 2016లో నియమించుకున్న మాదిరిగానే అంతర్జాతీయ కేంద్రాల్లో 2017లోనూ ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, ఈ రెండేళ్లలో కూడా సగటు వేతనాలు స్థిరంగా ఉన్నాయని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఇటీవల ప్రకటించిన అమెరికా నియామక వ్యూహాలతో ఈ పెంపు ప్రభావం ఉందని, ఇప్పటికే వీటితో మార్జిన్ గైడెన్స్ ను తగ్గించినట్టు కంపెనీ తెలిపింది. గతనెలలోనే ఇన్ఫోసిస్ అమెరికాలో 10వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రక్షణాత్మక విధానాలు విపరీతంగా పెరగడం, మరోవైపు ఆటోమేషన్ ప్రభావంతో గ్లోబల్ గా రిక్రూట్ మెంట్లను ఇన్ఫోసిస్ పెంచుతోంది. అయితే ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాక ఆన్ షోర్ నియామకాల వ్యయాలను దేశీయ ఐటీ ఇండస్ట్రి మొత్తం తీవ్రంగా ఎదుర్కొంటోంది. వీసా నిబంధనలు కఠినతరమవుతుండటంతో వ్యయాలు పెరుగుతున్నాయి. అంతేకాక ట్రంప్ విధానాలతో వీసాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ స్థానికంగా ఉద్యోగ నియామకాలను పెంచుతున్నాయి.