-
మోదీపై విపక్షాలది దుష్ప్రచారమే
న్యూఢిల్లీ: ‘‘కేంద్రం ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్షాల ఆరోపణలన్నీ దుష్ప్రచారాలు మాత్రమే. పలు కేసుల్లో ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్లోనూ ఇదే స్పష్టమైంది’’ అని బీజేపీ పేర్కొంది. సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు ఈ మేరకు చేసిన రాజకీయ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు ఈ మేరకు వెల్లడించారు. ‘‘రఫేల్, పెగసస్, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, నోట్ల రద్దు, ఈడబ్ల్యూఎస్ కోటా తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర దుష్ప్రచారం సాగించాయి. కానీ వీటికి సంబంధించిన అన్ని కేసుల్లోనూ కేంద్రం వైఖరిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించింది. విపక్షాలు చెబుతున్నదంతా అబద్ధమేనని దీంతో తేలిపోయింది’’ అని ఆమె అన్నారు. మోదీపై వారి నిరాధార ఆరోపణలను చట్టపరంగా తిప్పికొట్టామన్నారు. ‘‘దేశం కోసం పనిచేస్తున్న మోదీకి ప్రపంచదేశాల్లో గౌరవం లభిస్తోంది. దేశ ప్రతిష్టను ఆయన పెంచారు’’ అన్నారు. 2023 ఎన్నికలు కీలకం: నడ్డా లోక్సభ ఎన్నికలకు ముందు 2023లో ఎన్నికలు జరిగే 9 రాష్ట్రాల్లో ఒక్కదాన్నీ బీజేపీ కోల్పోరాదని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును చరిత్రాత్మకంగా ఆయన అభివర్ణించారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతోందని కొనియాడారు. మోదీకి ఘన స్వాగతం అంతకుముందు కార్యవర్గ సమావేశానికి వస్తున్న మోదీకి బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. పటేల్ చౌక్ నుంచి ఎన్డీఎంసీ కన్వెన్షన్ దాకా పార్టీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రధానిపై పూలు చల్లారు. నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ విజయాలను తెలుపుతూ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. వేదిక వద్ద మోదీకి నడ్డా స్వాగతం పలికారు. -
మిస్ఫైర్ అయిందా..?
సాక్షి,న్యూఢిల్లీ: అవినీతి...నల్లధనం...ఉగ్రవాదం..నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకే సాహసోపేత నిర్ణయం తీసుకున్నామని గత ఏడాది నవంబర్ 8న నోట్ల రద్దు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుని సరిగ్గా ఏడాది అవుతోంది. ఏడాదిలో ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరాయా..? సగటు భారతీయుడికి ప్రయోజనాలు దక్కాయా..? ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి..? అందరి మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడం లేదు. నోట్ల రద్దు పర్యవసానాలను బేరీజు వేసేందుకు ఏడాది సమయం స్వల్పకాలికమైనా ఈ వ్యవధిలో మోదీ నిర్ణయంతో సానుకూల ఫలితాల కన్నా ప్రతికూలతలే ఎదురయ్యాయి. చెలామణిలో ఉన్న 86 శాతం నగదు చెల్లదని ప్రకటిస్తూ మోదీ ప్రవచించిన ఉద్దేశాలు మొక్కుబడి మాటలుగా మిగిలాయి. వృద్ధి రేటు వెనక్కు... నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా పరుగులు పెట్టిన దేశ వృద్ధి రేటు నగదు కొరతతో డీలా పడింది. జీడీపీ వృద్ధి రేటు కనిష్టస్థాయికి పతనమైంది. విపక్షాలు, రాజకీయ పరిశీలకులతో పాటు ఆర్థిక నిపుణులూ నోట్ల రద్దు బెడిసికొట్టిందని విశ్లేషించారు. నల్లధనం, అవినీతి నియంత్రణ ప్రక్రియ నోట్ల రద్దుతో ముగిసేది కాదంటూ నోమురా హోల్డింగ్స్ చీఫ్ ఇండియా ఎకనమిస్ట్ సొనాల్ వర్మ స్పష్టం చేశారు. నల్లధనం కేవలం నగదులోనే ఉండదని, అది రియల్ ఎస్టేట్, బంగారం వంటి పలు రూపాల్లో ఉంటుందని వర్మ అన్నారు. నకిలీ కరెన్సీ సరిహద్దుల నుంచీ వెల్లువెత్తుతున్న నకిలీ నోట్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు నోట్ల రద్దు ఉపకరిస్తుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అతిపెద్ద నిర్ణయం ఈ దిశగానూ ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. నోట్ల రద్దుకు ముందు చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 0.07గా ఉన్న నకిలీ నోట్లు ఈ ఏడాది జూన్ 30 నాటికి 0.08 శాతానికి పెరిగాయి. మరోవైపు ఆర్బీఐ నూతనంగా ప్రవేశపెట్టిన రూ 2000 నోట్లలోనూ నకిలీలు ముంచెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున రూ 2000, రూ 500 నకిలీ నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. నల్లధనం గత ఏడాది నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే సుప్రీం కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం చెలామణిలో ఉన్న రూ 15 లక్షల కోట్ల కరెన్సీలో మూడింట ఓ వంతు బ్యాంకుల్లో జమ కాదని, ఆ మేరకు పెద్దమొత్తంలో నల్లధనమంతా చెల్లుబాటు కాకుండా పోతుందని ప్రభుత్వం నివేదించింది.అయితే రద్దయిన నోట్లలో 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరినట్టు ఆర్బీఐ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. రద్దయిన నోట్లన్నీ బ్యాంకు డిపాజిట్ల రూపంలో నేరుగా వ్యవస్థలోకి ప్రవేశించడంతో ఇక బ్లాక్మనీని తుడిచిపెట్టడం ఎలా సాధ్యమని ఏబీఎన్ ఆమ్రో బ్యాంక్ సీనియర్ ఎకనమిస్ట్ అర్జెన్ డికుజెన్ విస్మయం వ్యక్తం చేశారు. డిజిటల్ లావాదేవీలు నోట్ల రద్దుకు ప్రభుత్వాన్ని ప్రేరేపించిన నగదు రహిత లావాదేవీలూ ఆశించిన మేర పుంజుకోలేదు. డిజిటల్ పేమెంట్ రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న పేటీఎం నోట్ల రద్దు అనంతరం తన సబ్స్క్రైబర్లను భారీగా పెంచుకుని లాభాలు దండుకుంది. మ్యూచ్వల్ ఫండ్లలోకీ నిధులు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి నగదు చెలామణి సాధారణ స్థితిలోకి చేరగానే డిజిటల్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి.అయితే నోట్ల రద్దు నిర్ణయం లేకుంటే ఈ మాత్రమైనా డిజిటల్ లావాదేవీలు జరిగేవి కాదని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుభాష్ గార్గ్ అంచనా వేశారు. ఉగ్రవాదం నోట్ల రద్దుతో ఉగ్రవాదానికి చెక్ పెట్టవచ్చని ప్రధాని మోదీ చెప్పినట్టుగా జమ్మూ కశ్మీర్లో నోట్ల రద్దు అనంతరం రాళ్ల దాడులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గినా మళ్లీ క్రమంగా కశ్మీర్లో రాళ్ల దాడులు చోటుచేసుకుంటున్నాయి. నోట్ల రద్దుతో వీటికి నేరుగా సంబంధం ఉన్నదా అనేది అస్పష్టమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
వివాదాలు.. నినాదాలు!
పతిపక్షం పట్టు విడవలేదు. ప్రభుత్వం బెట్టు వీడలేదు. పంతాలపై ఎవరూ తగ్గలేదు. పార్లమెంటు స్తంభించిపోయింది. నినాదాలతో దద్దరిల్లింది. వాగ్వాదాలతో గందరగోళంగా మారింది. వాయిదాలపై వాయిదాలతో గడచిపోయింది. వర్షాకాల సమావేశాల్లో బుధవారం రెండో రోజూ ఏ చర్చా లేకుండానే తుడిచిపెట్టుకుపోయింది. ప్రతిపక్షాల దాడిని.. కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రాల్లో అవినీతి ఆరోప ణలను ప్రస్తావిస్తూ అధికారపక్షం ఎదురు దాడిని ఉధృతం చేసింది. కోల్స్కాం నిందితుడికి పాస్పోర్ట్ ఇప్పించాలంటూ తనను ఒత్తిడి చేశారని సుష్మా.. ఉత్తరాఖండ్ సీఎం హరీశ్రావత్పై స్టింగ్ ఆపరేషన్ సీడీలను బయటపెట్టిన నిర్మలాసీతారామన్.. వెరసి.. ప్రభుత్వంపై విపక్షం దాడి, అధికారపక్షం ఎదురు దాడిగా ఘర్షణ మరింతగా ముదురుతోంది. * పార్లమెంటులో ప్రతిష్టంభన * ఉభయసభలూ వాయిదా * వ్యాపమ్, లలిత్గేట్లపై లోక్సభ వెల్లో విపక్షాల ఆందోళన * సుష్మా, రాజే, చౌహాన్లు రాజీనామా చేయాలని డిమాండ్: నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన * సభ్యులపై స్పీకర్ ఆగ్రహం.. క్రమశిక్షణ చర్యలకు హెచ్చరిక; అధికార పక్షం ఎదురుదాడి * కాంగ్రెస్ రాష్ట్రాల సీఎంల అవినీతిపై చర్చిద్దామన్న జైట్లీ సాక్షి, న్యూఢిల్లీ: లలిత్మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలను పదవుల నుంచి తొలగించాలన్న డిమాండ్తో ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయసభల్లోనూ తీవ్రస్థాయిలో నిరసనకు దిగాయి. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్చౌహాన్లు పదవులకు రాజీనామా చేయనిదే ఎటువంటి చర్చనూ జరగనివ్వబోమని లోక్సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ తదితర పార్టీలు రెండోరోజూ భీష్మించాయి. ఆ పార్టీల సభ్యులు తమ డిమాండ్లతో వెల్లోకి వెళ్లి నినాదాలు చేస్తుంటే.. అధికారపక్షం ప్రతి నినాదాలకు దిగింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఆరోపణలను ప్రస్తావిస్తూ ఎదురుదాడి చేసింది. గందరగోళాల మధ్య ఉభయసభలూ ఎటువంటి కార్యకలాపాలూ జరపకుండానే గురువారానికి వాయిదాపడ్డాయి. లోక్సభలో విపక్షాల హోరు... బుధవారం ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన తర్వాత వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలు, దుర్ఘటనల్లో మరణించిన వారికి నివాళులర్పించింది. రాజమండ్రి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన 29 మందికి కూడా నివాళులు తెలిపింది. ఆ తరువాత విపక్షాల ఆందోళన, నిరసనలతో సభ హోరెత్తింది. తొలుత టీఆర్ఎస్ సభ్యులు తెలంగాణకు తక్షణమే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. ఆ వెంటనే కాంగ్రెస్, వామపక్షాలు, ఎన్సీపీ తదితర పార్టీల సభ్యులు వ్యాపమ్, లలిత్గేట్ వివాదాలపై నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యులు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంలో స్పీకర్ సుమిత్రా మహాజన్.. వివిధ అంశాలపై వాయిదా తీర్మానాల కోసం సభ్యులు ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ‘బడే మోదీ మెహర్బాన్, తో చోటే మోదీ పెహల్వాన్’ (బలవంతుడైనవ్యక్తి మద్దతుతో చిన్న వ్యక్తి కూడా బలవంతుడవుతాడనే హిందీ సామెతను నరేంద్రమోదీ, లలిత్మోదీలకు అన్వయించిన నినాదం), ‘ప్రధాని మౌనం వీడాలి’, ‘మోదీ గారూ 56 అంగుళాలు చూపండి.. సుష్మా, రాజేలను త్వరగా తొలగించండి’ అనే నినాదాలు రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. సుష్మా అధికారపక్షం వైపు మొదటి వరుసలో హోంమంత్రి రాజ్నాథ్సింగ్, రవాణామంత్రి నితిన్గడ్కారీల పక్కన కూర్చున్నారు. కాంగ్రెస్ సభ్యులు తమ చేతులపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులు ప్రదర్శించవద్దని స్పీకర్ హెచ్చరించినా వారు వాటిని కొనసాగించారు. నిరసన తెలుపుతున్న సభ్యుల చర్యను స్పీకర్ తప్పుపట్టారు. గందరగోళం కొనసాగటంతో ప్రారంభమైన 9 నిమిషాలకే సభను స్పీకర్ 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. క్రమశిక్షణ చర్యలకు స్పీకర్ హెచ్చరిక... సభ తిరిగి 12 గంటలకు ప్రారంభమైన తర్వాత.. సానియామీర్జా సహా అంతర్జాతీయ విజయాలు సాధించిన పలువురు క్రీడాకారులకు స్పీకర్ అభినందనలు తెలిపారు. అనంతరం.. సభలో వ్యవహరించాల్సిన తీరు, సభామర్యాదలకు సంబంధించి స్పీకర్ ప్రకటన చేస్తూ 349, 351, 352 నిబంధనలను చదివి వినిపించారు. సభ్యులు వీటికి కట్టుబడి ఉండడం లేదని, వీటిని అనుసరించని పక్షంలో తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పీకర్ హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లయింది. వారు మళ్లీ వెల్లోకి దూసుకెళ్లారు. టీఆర్ఎస్ సభ్యులు కూడా తమ ప్రత్యేక హైకోర్టు డిమాండ్తో వెల్లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో పది నిమిషాల్లోనే స్పీకర్ సభను 2 గంటల పాటు వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశమైన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగటంతో రెండు నిమిషాలకే ఉప సభాపతి ఎం.తంబిదురై సభను గురువారానికి వాయిదా వేశారు. ఈ గందరగోళం మధ్యలోనే.. భూసేకరణ బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లీమెంటరీ సంఘం గడువును పొడిగించాలన్న తీర్మానానికి ఆమోదం తెలిపారు. రాజ్యసభలో వాగ్వాదాల జోరు: అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి. బుధవారం ఉదయం సమావేశమయ్యాక.. వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన వారికి నివాళులు అర్పించిన వెంటనే కాంగ్రెస్, బీఎస్పీ, వామపక్షాలు సుష్మా, వసుంధర, చౌహాన్లు పదవులకు రాజీనామాలు చేయనిదే సభలో ఎలాంటి చర్చా సాధ్యం కాదని భీష్మించాయి. సాధారణ కార్యకలాపాలను నిలిపివేసి లలిత్మోదీ, వ్యాపమ్స్కాంపై చర్చ జరపాలని 267 నిబంధన కింద నోటీసులు ఇచ్చినట్లు సతీశ్చంద్రమిశ్రా (బీఎస్పీ), నరేశ్అగర్వాల్ (ఎస్పీ), తపన్కుమార్సేన్ (సీపీఎం), డి.రాజా (సీపీఐ)లు తెలిపారు. లలిత్కు సాయం చేయటంలో చట్టంలోని ఏ ఒక్క నిబంధనను సుష్మా ఉల్లంఘించారో స్పష్టంగా చెప్పాలని.. సభా నాయకుడు అరుణ్జైట్లీ విపక్షాలను ప్రశ్నించారు. విపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. వాయిదానోటీసులు ఇచ్చిన సభ్యు లు మాట్లాడేందుకు అనుమతించాలని పేర్కొనగా.. అందుకు జైట్లీ నిరసన వ్యక్తం చేస్తూ ఇటువంటి ఆచరణను ప్రతిరోజూ అనుమతించవచ్చా అని ప్రశ్నించారు. ‘‘నినాదాల రాజకీయాలు చాలు. మీరు చర్చ ప్రారంభించండి.’’ అని అన్నారు. వారు రాజీనామా చేయాలి: విపక్ష నేతలు ‘నేను తినను, తిననివ్వను’ అని బీరాలు పోయిన వారి బండారాన్ని వ్యాపమ్స్కాం బయటపెట్టిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని జేడీయూ నేత శరద్యాదవ్ పేర్కొన్నారు. దర్యాప్తులో వారు నిర్దోషులుగా తేలితే వారు మరింత బలపడతారని వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణగా.. 1990ల్లో జైన్ హవాలా కేసులో తమ పేర్లు వచ్చినపుడు తాను, బీజేపీ నేత అద్వానీ రాజీనామాలు చేసిన ఉదంతాన్ని ప్రస్తావించారు. ‘వ్యాపమ్’ ఒక రాష్ట్ర అంశం: జైట్లీ వ్యాపమ్ కుంభకోణం అనేది ఒక రాష్ట్ర అంశమని.. రాష్ట్ర అంశాలను పార్లమెంటులో చర్చించేలా నిబంధనలు మార్చి, కొత్త సంప్రదాయాలు నెలకొల్పాలని విపక్షం భావిస్తే.. తొలుత కేరళ, హిమాచల్ప్రదేశ్, పుదుచ్చేరీ అస్సాం, గోవాలకు సంబంధించిన అంశాలను చర్చించాలని.. జైట్లీ ఎదురుదాడికి దిగారు. సుష్మాస్వరాజ్కు సంబంధించిన విషయాన్ని చర్చించాలని ప్రతిపక్షాలు కోరుకుంటే.. ఆ చర్చను ప్రారంభించాలన్నారు. అయితే.. వ్యాపమ్ ఒక రాష్ట్రానికి పరిమితమైన అంశం కాదని, ఆ స్కాంతో సంబంధమున్న వారు మధ్యప్రదేశ్కు వెలుపల అనుమానాస్పదంగా చనిపోయారని సీపీఎం నేత సీతారాం ఏచూరి వాదించారు. సభ కొనసాగినంతసేపూ, వాయిదాలు వాగ్వివా దాలతోనే సాగింది. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ రెండో రోజు కూడా ఎలాంటి కార్యక్రమాలు జరగకుండానే గురువారానికి వాయిదా పడింది. పార్లమెంటులో పరిశోధన విభాగం: పార్లమెంట్లో కొత్తగా ఒక పరిశోధన విభాగం ఏర్పడనుంది. పార్లమెంట్లో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ పలువురు ఎంపీలు స్పీకర్ సుమిత్ర మహాజన్కు విజ్ఞప్తి చేయడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హైకోర్టు కోసం టీఆర్ఎస్ ఎంపీల నిరసన తెలంగాణ రాష్ట్రానికి తక్షణమే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు బుధవారం లోక్సభలో ఆందోళనకు దిగారు. సభ సమావేశమైన వెంటనే.. టీఆర్ఎస్ ఎంపీలు పది మంది వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు మొదలుపెట్టారు. ప్రత్యేక హైకోర్టు డిమాండ్తో ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి తమ తమ స్థానాల్లో నిల్చొని ప్రత్యేక హైకోర్టు కావాలని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ లోక్సభాపక్ష నేత ఎ.పి.జితేందర్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం విడిపోయి సంవత్సరమైంది. ఇప్పటివరకు పార్లమెంటు నాలుగు పర్యాయాలు సమావేశమైంది. ప్రతి సమావేశాల్లోనూ ప్రత్యేక హైకోర్టు ఇవ్వాలని అడుగుతున్నాం. మా ముఖ్యమంత్రి.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, న్యాయమంత్రి, హోంమంత్రిని కలిశారు. తప్పకుండా చేస్తామన్నారు. కానీ చేయలేదు. రాష్ట్రం విడిపోయినప్పుడు మొట్టమొదట హైకోర్టు ఏర్పాటుచేస్తారు. కానీ కేంద్ర కేబినెట్ మంత్రులు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతూ రావాల్సిన హైకోర్టు రాకుండా చేస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ కేసులన్నీ కూడా ఆంధ్రా హైకోర్టు న్యాయమూర్తుల వద్దకు వెళితే మాకు న్యాయం జరగడం లేదని మొదటి నుంచి చెప్తున్నాం. హైకోర్టు మాకు వచ్చేంతవరకు మేం నిరసన తెలుపుతాం’’ అని పేర్కొన్నారు. ఎంపీ కె.కవిత మాట్లాడుతూ ‘‘ఈ ప్రధానమంత్రి కేబినెట్లోని సీనియర్ మంత్రులు కొందరు హైకోర్టు విభజన కాకుండా ఆపుతున్నారని తెలిసింది. అందువల్ల ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన తెలంగాణ ప్రజల పక్షాన నిలుస్తారని ఆశిస్తున్నాం. ఈ సమావేశాలు ముగిసేంతవరకు రోజూ నిరసన కొనసాగిస్తాం. పార్లమెంటును స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తాం’’ అని చెప్పారు. కోల్గేట్ నిందితుడికి పాస్పోర్ట్ కోసం ఒత్తిడి చేశారు: సుష్మా న్యూఢిల్లీ: కోల్గేట్ కుంభకోణంలో నిందితుడు సంతోష్ బగ్రోదియాకు ‘డిప్లొమాటిక్ పాస్పోర్ట్’ ఇప్పించాలంటూ కాంగ్రెస్ నేత ఒకరు తనపై ఒత్తిడి తెచ్చారంటూ కేంద్రమంత్రి సుష్మ ట్విటర్లో బాంబు పేల్చారు. ‘‘కోల్ స్కాం నిందితుడు సంతోష్ బగ్రోదియాకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇప్పించాల్సిందిగా కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు నాపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ నేతపేరును పార్లమెంటులో వెల్లడిస్తా..’’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. పార్లమెంటు ఆవరణలో చేపట్టదలచిన మౌన దీక్షను కాంగ్రెస్ వాయిదా వేసుకుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement