breaking news
online issue
-
అమ్మాయి చదువుకు సమస్య పరిష్కారం
పార్వతీపురం: ‘అమ్మాయి చదువుకు ఆన్లైన్ కష్టాలు’ శీర్షికన సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కథనం ప్రచురితమైన 24గంటలు గడవక ముందే సంబంధిత అధికారులు స్పందించారు. ఈ నెల 25న తనకు రేషన్కార్డు ఆన్లైన్ సమస్య వుందని, ఈ కారణంగా తనకు స్కాలర్షిప్ మంజూరు కాలేదని, ఐటీడీఏ పీఓ డా.జి.లక్ష్మీశకు కురుపాం మండలం ఈతమానుగూడకు చెందిన పాలక మౌళిక విన్నవించుకుంది. తన సమస్యను పరిష్కరించాలని వేడుకుంది. లేకుంటే తన చదువు నిలిచిపోతుందని ప్రాధేయపడింది. ఇదే విషయాన్ని సాక్షి ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన కురుపాం తహసీల్దార్ సూర్యకళ వెనువెంటనే ఆన్లైన్ సమస్యను పరిష్కరించారు. అప్పటి వరకు ఆన్లైన్లో కేవలం మౌళికకు చెందిన వివరాలు మాత్రమే నమోదై ఉన్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ సమస్య పరిష్కరించిన తరువాత కుటుంబ సభ్యుల అందరి వివరాలు ఆన్లైన్లో నమోదయ్యాయి. ఈ విషయాన్ని విద్యార్ధిని మౌళికకు సాక్షి ప్రతినిధి ఫోన్ ద్వారా సమాచారం అందించగా ఆమె సాక్షికి ధన్యవాదాలు తెలియజేసింది. సాక్షి ప్రయత్నం ద్వారా నా సమస్య పరిష్కారం కావడంతో పాటు చదువుకు ఆటంకం తొలగినందుకు రుణ పడి వుంటానని పేర్కొంది. అమ్మాయి చదువుకు ఆన్లైన్ కష్టాలు -
ఇక ఆన్లైన్లో పారిశ్రామిక లైసెన్సులు
కొత్త పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమల లైసెన్సింగ్ విధానాన్ని సులభతరం చేసేందుకు కొత్త పరిశ్రమ పెట్టాలనుకునేవారికి ఆన్లైన్లోనే లైసెన్సులు మంజూరు చేస్తామని తెలిపారు. దీనివల్ల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్న మాట. ఈ మేరకు అసెంబ్లీలో ఆమె ఓ ప్రకటన చేశారు. ఈ లైసెన్సుల కోసమే ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్ పెడుతున్నామని, అందులో ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారం అంతా ఉంటుందని ఆమె చెప్పారు. ఈ పోర్టల్ చూస్తే, పారిశ్రామిక వేత్తలతో పాటు సామాన్యులు కూడా ప్రభుత్వ పథకాలన్నింటి గురించి తెలుసుకోవచ్చని జయలలిత అన్నారు. ఈ పోర్టల్ తయారీకి రూ. 2.24 కోట్ల ఖర్చయినట్లు ఆమె చెప్పారు. ఇక 2014-15 సంవత్సరంలో ఒక్కోటీ రూ. 1.65 కోట్ల వ్యయంతో ఐదు జిల్లాల్లో ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలకు కొత్త భవనాలు కట్టిస్తున్నట్లు కూడా ఆమె అసెంబ్లీలో ప్రకటించారు.