-
ఎన్నికలకు సర్వం సిద్ధం
-
రాజకీయ నేతలతో ఈసీ బృందం భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ నేతృత్వంలోని బృందం సోమవారం మధ్యాహ్నం రాష్ట్రానికి చేరుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఈసీ బృందం రాష్ట్రంలోని గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీల నాయకులతో హోటల్ తాజ్ క్రిష్ణలో భేటీ అయ్యింది. ఈసీతో సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు నేతలు హాజరుకానున్నట్లు సమాచారం. అంతేకాక ఈసీ ఒక్కో పార్టీ నాయకులతో దాదాపు 10 నిమిషాల పాటు సమావేశం కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈసీతో భేటీ నిమిత్తం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు హోటల్ తాజ్ క్రిష్ణకు చేరుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు వీరితో ముఖాముఖి నిర్వహించి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈసీ బృందంతో భేటికి హాజరైన పార్టీలు - సభ్యులు బీఎస్పీ - సిద్ధార్థ్ పూలే బీజేపీ - ఇంద్రసేనా రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం సీపీఐ - చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు సీపీఎం - నంద్యాల నర్సింహా రెడ్డి, వెంకటేష్ ఎంఐఎం - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ జాఫ్రీ టీఆర్ఎస్ - వినోద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ - మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ టీడీపీ - రావుల చంద్రశేఖర్ రెడ్డి, గురుమూర్తి వైసీపీ - రవికుమార్, సంజీవరావు పార్టీలతో సమావేశం ముగిసిన అనంతరం ఈసీ బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, పోలీసు విభాగం నోడల్ అధికారి, అదనపు డీజీ జితేందర్రెడ్డిలతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. రేపటి షెడ్యూల్ మంగళవారం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు,డీఐజీలు, ఐజీలతో సమావేశం మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 7 గంటల వరకు అన్ని జిల్లాల డిఇఓలు, ఎస్పీలతో సమావేశం బుధవారం షెడ్యూల్ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు నోడల్ అధికారులు, ఇంకమ్ టాక్స్ అధికారులు, బ్యాంకు అధికారులు, రైల్వే, ఎయిర్పోర్ట్, సీపీఎఫ్, రాష్ట్ర పోలీస్ అధికారులతో సమావేశం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సీఎస్, డీజీపీ, ఫైనాన్స్ సెక్రటరీ, ఆబ్కారీ ముఖ్య కార్యదర్శి, రవాణా అధికారులతో భేటీ మధ్యాహ్నం 12.30 గంటల నుండి 1.00 వరకు మీడియా సమావేశం అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లనున్న ఈసీ బృందం -
నేడు రాజకీయ పార్టీలతో ఈసీ బృందం ముఖాముఖి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లావస బృందం సోమవారం రాష్ట్రానికి రానుంది. రాష్ట్రంలో మూడురోజులపాటు పర్యటించనుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సోమవారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ముఖాముఖి నిర్వహించి అభిప్రాయాలు సేకరించనుంది. సాయంత్రం 7.30 నుంచి 8.30 గంటల వరకు సీఈవో రజత్ కుమార్, పోలీసు విభాగం నోడల్ అధికారి, అదనపు డీజీ జితేందర్రెడ్డిలతో భేటీ అయి ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయ నుంది. మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలు, ఐజీలతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనుంది. 24న ఉదయం 10 నుంచి ఉదయం 11 గంటల వరకు ఆదాయ పన్ను శాఖ డైరెక్టర్ జనరల్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో సమావేశమై ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకోనుంది. ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషితో సమావేశం కానుంది. మధ్యాహ్నం 12.30 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు విలేకరుల సమావేశం నిర్వహించనుంది. ఎన్నికల కమిషనర్ల బృందం సాయంత్రం 4.40 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనుంది. -
డిసెంబర్ 7న ఎన్నికలు.. 11న ఫలితాలు
-
ఎన్నికల జాతర షురూ
న్యూఢిల్లీ: తదుపరి లోక్సభ ఎన్నికలకు రిహార్సల్స్గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల శాసన సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. మావోయిస్టుల సమస్య కారణంగా ఛత్తీస్గఢ్లో రెండు విడతల్లో, మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఒకే దఫాలో పోలింగ్ జరుగుతుంది. అసెంబ్లీని రద్దుచేసినప్పటి నుంచే తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాక్షికంగా అమల్లోకి రాగా, శనివారం నుంచి 5 రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలుకానుంది. ఛత్తీస్గఢ్లో నవంబర్ 12, 20 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న 18 స్థానాల్లో నవంబర్ 12న, మిగిలిన 72 స్థానాల్లో నవంబర్ 20న పోలింగ్ నిర్వహిస్తారు. 230 సీట్లున్న మధ్యప్రదేశ్, 40 సీట్లున్న మిజోరంలో నవంబర్ 28న, 200 స్థానాలున్న రాజస్తాన్, 119 సీట్లున్న తెలంగాణలో డిసెంబర్ 7న పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11న వెల్లడిస్తారు. ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వచనాసదన్లో జరిగిన మీడియా సమావేశంలో కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లావాసాతో కలసి ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ ఈ షెడ్యూల్ను విడుదల చేశారు. తెలంగాణలో సీఎం కె.చంద్రశేఖర రావు అసెంబ్లీని 9 నెలల ముందే రద్దుచేయగా, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ గడువు జనవరి 5న ముగియనుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి 7న, మిజోరం శాసనసభ గడువు డిసెంబర్ 15న ముగియనున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీకి జనవరి 20 వరకు గడువు ఉంది. 12.30కు బదులుగా 3గంటలకు.. మధ్యాహ్నం 12.30 గంటలకు జరగాల్సిన ఎన్నికల సంఘం ప్రెస్మీట్ 3 గంటలకు వాయిదాపడటంపై విమర్శలు వచ్చాయి. రాజస్తాన్లో ప్రధాని మోదీ ర్యాలీ ఉన్నందునే ఆలస్యం చేశారని, మోదీ ఒత్తిడికి ఈసీ తలొగ్గిందని ప్రతిపక్షాలు ఆరోపించడంపై రావత్ వివరణ ఇచ్చారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, కొన్ని అధికారిక పనుల వల్లే మీడియా సమావేశం రెండున్నర గంటలు ఆలస్యమైందని చెప్పారు. దీని వల్ల పలానా వర్గానికి అనుచిత లబ్ధి చేకూరిందని భావిస్తే, రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. భాగస్వామ్య పక్షాలను సంతృప్తిపరచి, నిష్పాక్షికంగా, విశ్వసనీయతతో ఎన్నికలు నిర్వహించడం తమ బాధ్యత అని తెలిపారు. తెలంగాణ ఓటర్ల జాబితాపై నెలకొన్న సందిగ్ధత, భారీ వర్షాల ముప్పు నేపథ్యంలో ఉపఎన్నికను వాయిదావేయాలని తమిళనాడు కోరడం వల్లే ప్రెస్మీట్ కాస్త ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. ఎన్నికల సంఘం అధికారులు 5 రాష్ట్రాల్లో పర్యటించి, భాగస్వామ్య పక్షాలతో చర్చించారని, అంతా సిద్ధంగా ఉందని నిర్ధారించుకున్నాకే షెడ్యూల్ను విడుదలచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు ఓటరు ధ్రువీకరణ రశీదు ఇచ్చే వీవీప్యాట్లను వినియోగిస్తామని చెప్పారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను అవసరమైన మేరకు సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మోదీ ఒత్తిడి వల్లే.. రాజస్తాన్లోని అజ్మీర్లో తన ర్యాలీకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఎన్నికల సంఘం ప్రెస్మీట్ ఆలస్యమయ్యేలా ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతూ ఈసీ ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉందని పేర్కొంది. బీజేపీ సూపర్ ఈసీగా వ్యవహరిస్తోందని మండిపడింది. కోల్కతాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ గతేడాది గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తూ కూడా ఎన్నికల సంఘం ఇలాగే వ్యవహరించిందని ఆరోపించారు. ‘ ఇలాంటి వ్యూహాలు ఫలించవని బీజేపీ, ఈసీ గుర్తుంచుకోవాలి. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీకి ఓటేయొద్దని ఇప్పటికే నిర్ణయించుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ఉప ఎన్నికలు కర్ణాటకలో మూడు లోక్సభ స్థానాలకు నవంబర్ 3న ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. షిమోగా, బళ్లారి, మాండ్యా స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ స్థానాల్లోని ఎంపీలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలవడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 5 లోక్సభ స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించబోమని ఈసీ స్పష్టం చేసింది. నేర చిట్టా విప్పాల్సిందే సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు సందర్భంగా గత నేరచరిత్రను వెల్లడించాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ వివరాలను సంబంధిత రాజకీయ పార్టీకి తెలియజేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించే అఫివిడవిట్లో డిక్లరేషన్ ఇవ్వాలి. రాజకీయ పార్టీలు ఎవరికైతే టిక్కెట్లు ఇస్తున్నాయో వారి గత నేర చరిత్ర వివరాల్ని పార్టీ వెబ్సైట్లో పొందుపరచాలని, ప్రతికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అఫిడవిట్ పార్ట్–ఏలోని ఫారమ్–26 ద్వారా అభ్యర్థులు తమ ఫోన్ నంబర్, ఈ–మెయిల్, సామాజిక మాధ్యమాల ఖాతాలు, ఆదాయ వనరుల వివరాలు వెల్లడించాలి. ఈ నిబంధనలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. సీ–విజిల్తో కోడ్ ఉల్లంఘనలకు చెక్.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సీ–విజిల్ యాప్ ద్వారా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కోడ్ ఉల్లంఘన ఘటనలపై ప్రజలు ఈసీకి ఫిర్యాదుచేయొచ్చు. 5 నిమిషాల నిడివి గల వీడియోలను యాప్ ద్వారా చిత్రీకరించి పంపవచ్చు. ఫోన్లోని పాత వీడియోలను, ఫోటోలను యాప్ స్వీకరించదు. కోడ్ ఉల్లంఘన ఘటనల వీడియోలను ప్రత్యక్షంగా చిత్రీకరించి పంపాలి. వెంటనే ఓ గుర్తింపు నంబర్ వస్తుంది. ఇలా పంపిన వీడియోలు డిస్ట్రిక్ కంట్రోల్ రూంకు చేరుతాయి. అక్కడి నుంచి ఫ్లైయింగ్ స్క్వౌడ్ బృందాలకు చేరవేస్తారు. ఈ బృందాలు జియోగ్రాఫికల్ లోకేషన్ ఆధారంగా ఆ ప్రాంతానికెళ్లి దర్యాప్తుచేస్తారు. దీనిపై ఆ ప్రాంత రిటర్నింగ్ అధికారికి సమాచారమిచ్చి తదుపరి చర్యలు తీసుకుంటారు. గతంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సరైన ఆధారాలు లేకపోవడం, అలాంటి ఘటనలు ఆలస్యంగా వెలుగుచూసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు చేపట్టింది. ఫలితాల కోసం నెలరోజుల నిరీక్షణ.. ఛత్తీస్గఢ్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఆ రాష్ట్రంలో రెండు దఫాల్లో ఎన్నికలు నవంబర్ 12న, 20న జరుగుతాయి. ఫలితాల కోసం మాత్రం ప్రజలు డిసెంబర్ 11 వరకు ఎదురుచూడాల్సిందే. పోలింగ్ను ఐదు రాష్ట్రాల్లో వేర్వేరు దఫాల్లో నిర్వహిస్తున్నా ఫలితాల్ని ఒకేసారి ప్రకటించాలని ఈసీ నిర్ణయించడమే ఇందుకు కారణం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ రాజకీయ నేతలపై మావోయిస్టుల దాడి జరిగింది. మావోల ప్రాబల్యమున్న 18 స్థానాల్లో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం పోలీసు బలగాలను ఇక్కడ వినియోగించాల్సి వస్తున్నందున రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement