breaking news
Nitin Nabin
-
రాజ్యసభకు నితిన్ నబీన్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు సన్నాహాలను వేగవంతం చేసింది. మంగళవారం 9 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ను బిహార్ నుంచి బరిలోకి దించనుంది.తొలివిడతగా మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఖాళీ అయ్యే స్థానాలకు బీజేపీ ప్రకటించిన పేర్లు ఇవే..బిహార్ నుంచి నితిన్ నబీన్, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి శివేష్ కుమార్, అసోంనుంచిఎమ్మెల్యే తెరాష్ గోవాలా, రాష్ట్ర మంత్రి జోగెన్ మోహన్, ఛత్తీస్గఢ్ నుంచి పార్టీ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షురాలు లక్ష్మీ వర్మ, హరియాణా నుంచి లోక్సభ మాజీ ఎంపీ సంజయ్ భాటియా, ఒడిశా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, రాజ్యసభ ఎంపీగా ఉన్న సుజీత్ కుమార్, పశ్చిమ బెంగాల్ నుంచి పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్ రాహుల్ సిన్హా ఉన్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలకు ఈనెల 16వ తేదీన పోలింగ్ జరగనుంది. -
రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎంపిక
ఢిల్లీ: ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన నితిన్ నబీన్ను రాజ్యసభకు పంపనుంది పార్టీ అధిష్టానం. ఈ మేరకు 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. బిహార్ నుంచి నితీన్ నబీన్తో పాటు శివేష్ కుమార్లను రాజ్యసభకు ఎంపిక చేసింది. వీరిద్దరితో పాటు మిగతా వారి వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం నుంచి తేరాష్ గోవాలా,జోగెన్ మోహన్ఛత్తీసగఢ్ నుంచి లక్ష్మి వర్మహర్యానా సంజయ్ భాటియాఒడిశా నుంచి నుంచిమన్మోహన్ సామల్, సుజిత్ కుమార్పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాసొంత రాష్ట్రమైన బిహార్ నుంచి నితిన్ నబీన్..ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్ నబీన్ ఇన్నాళ్లూ బిహార్లో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన్ను కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ బంకీపూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ముందున్న 5 రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే అత్యంత కీలకమైన ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ, అసెంబ్లీకి హాజరవ్వడం అంత సులభమేమీ కాదు. అటు ఎమ్మెల్యేగా, ఇటు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ద్వంద్వ పాత్రలు పోషించడం కష్టమని అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే ఆయనను ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే మాదిరిగా మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాజ్యసభకు పంపారు. వచ్చే ఏప్రిల్లో బిహార్లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనిలో భాగంగానే రాజ్యసభ సభ్యుల ఎంపికను షురూ చేసింది బీజేపీ. -
నేటి నుంచి బెంగాల్లో బీజేపీ ‘పరివర్తన్ యాత్ర’
సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాషాయదళం ముందుకు సాగుతోంది. పోలింగ్కు ముందు పార్టీ శ్రేణులను సన్న ద్ధం చేసేలా బృహత్ కార్యాచరణతో ముందుకెళుతోంది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేలా ఆదివారం నుంచి వారం పాటు ‘పరివర్తన్ యాత్ర’కు శ్రీకారం చుట్టింది. 260 భారీ సభలు..2021 అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ బీజేపీ 77 సీట్లు గెలుచుకుంది. ఈసారి 160 స్థానాలు లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో తృణముల్ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాత్రను మొదలు పెట్టనుంది. రాష్ట్రంలో రాజ్యాంగం అమలుకావడం లేదని, మహిళలపై నేరాలు పెరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తోంది. ముఖ్యంగా రైతులకు లబ్ధి చేకూర్చే పీఎం కిసాన్ వంటి పథకాలు రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదని చెబుతోంది. అక్రమ ఓటర్లు, చొరబాటుదారుల అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ జాతీయ భద్రతపై టీఎంసీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. వీటన్నింటినీ తమ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇందుకుగాను 260 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు, 250 చిన్నచిన్న సమావేశాలు ఏర్పాటు చేస్తూ మొత్తంగా 5 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేలా యాత్రను డిజైన్ చేశారు. దీనిద్వారా ప్రత్యక్షంగా కోటిన్నర మంది ప్రజలను కలవాలన్నది లక్ష్యంగా ఉంది. ఆదివారం ప్రారంభం కానున్న ఈ యాత్రలో తొలిరోజు కూచ్బెహర్ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరు కానుండగా, నదియా ఉత్తర్లో మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఘార్గ్రామ్లో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పురులియాలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి పాల్గొననున్నారు. 2వ తేదీన దక్షిణ 24 పరగణాలు, మథురాపూర్, రాయదిఘి సభలకు హోంమంత్రి అమిత్ షా, హౌరా, హూగ్లీ జిల్లాల సభలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాద్వాన్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు సభలకు హాజరు కానున్నారు. ఈ యాత్ర చివరి రోజు నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా ఈ యాత్ర ముందుకు సాగనుంది. -
రాజ్యసభ సీట్లపై బీజేపీ వ్యూహాం.. 21 టార్గెట్!
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకునేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 37 స్థానాల్లో కనీసంగా 21 స్థానాలను తన ఖాతాలో వేసుకునే దిశగా కసరత్తులు మొదలుపెట్టింది. మొత్తం సీట్లలో 19 స్థానాలు కచ్చితంగా ఎన్డీఏ పక్షాలకు దక్కుతాయని రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి. మరో రెండు సీట్లను కొద్దిపాటి సర్దుబాట్లతో దక్కించుకోవచ్చన్న అంచనాతో ఆ దిశగా రాష్ట్రాల నేతలతో బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు మొదలుపెట్టింది. మెజార్టీ సీట్లే లక్ష్యంగా కసరత్తు..ప్రస్తుతం 245 సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీయేకు 133 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి సొంతంగా 103 సీట్లున్నాయి. మెజారిటీకి అవసరమైన 123 సీట్లకు ఇంకా కొంత దూరంలోనే ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అధికార బీజేపీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో 10 రాష్ట్రాల ముఖ్య నేతలతో ఇప్పటికే బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబిన్, అగ్ర నేతలు చర్చలు మొదలుపెట్టారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. 288 మంది ఎమ్మెల్యేలున్న మహారాష్ట్రలో ఎన్డీయేకు 235 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఖాళీ అయిన 7 స్థానాల్లో కనీసం 6 స్థానాలు ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉంది.బీహార్లో ఎన్డీఏ పక్షాలకు ఉన్న బలం ఆధారంగా 5 స్థానాలకుగాను 4 స్థానాలు గెలుచుకోవడం ఖాయంగా కని్పస్తోంది. ఐదో స్థానంపై ఎన్డీఏ కూటమి ఆశలు పెట్టుకుంది. ఐదో స్థానం గెలిచేందుకు ప్రతిపక్ష శిబిరం నుంచి ముగ్గురు శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఎన్డీఏకు దొరకడం అంత కష్టమేమీ కాదనేది పార్టీ వర్గాల అంచనా. ఒడిశాలో 4 స్థానాలకు గానూ రెండింటిలో ఎన్డీఏ, మరొక సీటును ప్రతిపక్ష పార్టీలు గెలుచుకునే అవకాశం ఉంది. మరో సీటును ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే బీజేడీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం.హరియాణాలో రెండు సీట్లకుగాను ఒక సీటు బీజేపీ ఖాతాలో పడగా మరో సీటుకు ఏ పారీ్టకి తగినంత బలం లేదు. దీంతో ఆ సీటుపైనా బీజేపీ కన్నేసింది. వరుసగా రెండు పర్యాయాలు పూర్తిచేసిన వారిని పక్కనపెట్టడం, పార్టీ జాతీయస్థాయి పదవుల్లో ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, వయోపరిమితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ మార్చినెల తొలివారంలో అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ఆరంభించింది.బీహార్ నుంచి నితిన్ నబిన్.. ప్రస్తుతం బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు బిహార్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీయూకి చెందిన కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్లకు తిరిగి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ను బిహార్ రాష్ట్రం నుంచే రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. కొత్తగా పార్టీ తీర్థం పుచ్చుకున్న భోజ్పురి నటుడు పవన్ సింగ్కు ఇదే రాష్ట్రం నుంచి సభ్యత్వం దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్దాస్ అథావాలేకు తిరిగి రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయి. ఒడిశా లేదా హరియాణా రాష్ట్రం నుంచి మాజీ కేంద్ర మహిళా మంత్రి స్మృతీ ఇరానీని రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
కమీషన్ల సర్కార్.. వసూళ్ల రాజ్యం!
మహబూబ్నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధితెలంగాణలో కమీషన్ల సర్కార్ నడుస్తోందని, వసూళ్ల రాజ్యం కొనసాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాహుల్గాం«దీ–రేవంత్రెడ్డి (ఆర్ఆర్) ట్యాక్స్, హఫ్తా, కమీషన్లు వసూలు అవుతున్నాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రజల్లోకి వెళతామని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేసేలా కార్యాచరణకు రూపకల్పన చేస్తామని తెలిపారు. బుధవారం మహబూబ్నగర్లో బీజేపీ బూత్స్థాయి కార్యకర్తల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇలాగైతే ఎక్కువ కాలం అధికారంలో ఉండలేరు.. ‘తెలంగాణలో కొన్ని నెలలుగా వరసగా దేవాలయాలు, గుళ్లపై దాడులు, కూల్చివేతల ఘటనలు జరుగుతున్నాయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇదే పద్ధతి కొనసాగిస్తే ఎక్కువకాలం అధికారంలో ఉండలేరు. సనాతన, హైందవ ధర్మంపై దాడులను బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. వాటిని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడే ప్రసక్తే లేదు’ అని నితిన్ నబీన్ అన్నారు.హామీలు నెరవేర్చకుండా మోసం ‘ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలను నారీశక్తిగా మార్చేందుకు, స్వశక్తితో నిలిపేందుకు కృషి చేస్తుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారికిచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తోంది. ప్రతి మహిళకు నెలకు రూ.రెండున్నర వేలు, కళ్యాణలక్ష్మీ కింద తులం బంగారం వంటి వాగ్దానాలను ఎప్పుడో మరిచిపోయింది. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఎలాంటి తేడా లేదు. కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి మహిళలకు ఈ విషయాలన్నీ వివరించాలి. ప్రస్తుతం జరుగుతున్న మోసం, దగాపై పోరాడాలి. కాంగ్రెస్ రైతులు, రైతుకూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన ఒక్కహామీని కూడా నెరవేర్చలేదు. ఈ వర్గాలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో ఈ సర్కార్కు తగిన బుద్ధి చెప్పాలి..’అని నితిన్ నబీన్ విజ్ఞప్తి చేశారు. రేవంత్ సర్కార్వి సంతుషీ్టకరణ రాజకీయాలు ‘రాష్ట్రంలో రేవంత్ సర్కార్ సంతుïÙ్టకరణ రాజకీయాలు చేస్తూ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కించపరుస్తోంది. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెబుతూ నిస్సిగ్గుగా ముస్లిం ఓట్బ్యాంక్ కోసమే పనిచేస్తూ కాంగ్రెస్ చరిత్రను చాటుతోంది. అల్పసంఖ్యాక వర్గాల ఓట్ల కోసం వక్ఫ్ భూముల్లో అక్రమాలకు వంత పాడుతున్నారు. దీనికి ధీటైన జవాబు ఇవ్వాల్సిన అవసరముంది. బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు (8 శాతం ఓటింగ్), 2024 లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు (35 శాతం ఓటింగ్) గెలిచేలా ప్రజలు మద్దతు పలికారు. ఈ ఎన్నికల తర్వాత ఏ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీ గెలుపొందుతోంది. మహారాష్ట్ర, బిహార్, చండీగఢ్, కేరళ, గోవా తదితర రాష్ట్రాల్లో జరిగిన వివిధ ఎన్నికల్లో పార్టీ విజయదుందుభి మోగించింది. ప్రతి బూత్లో 50% పైగా ఓటింగ్ సాధించాలి రాష్ట్రంలో కూడా బీజేపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నందున రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లో 50 శాతానికి పైగా ఓటింగ్ సాధన లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వ విజయాలు, ప్రజలకు వివిధ పథకాల ద్వారా అందిస్తున్న ప్రయోజనాల గురించి ప్రజలకు కార్యకర్తలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనూ కమలం వికసించేలా..యువ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా, అన్నివర్గాల ప్రజల్లో సంతోషం వెల్లివిరిసేలా చేయాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం. ఆ తర్వాత 2028లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం కూడా ఖాయం. అయితే బీజేపీ అధికారం కోసం ప్రాకులాడడం లేదు. రాష్ట్ర భవిష్యత్, ఇక్కడి ప్రజల క్షేమం, అభ్యున్నతే లక్ష్యం. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రోడ్డు, రైల్వే కారిడార్లు, రెండు ఇండ్రస్టియల్ కారిడార్లు, మరెన్నో ప్రయోజనాలు చేకూరేలా చేశారు. రాష్ట్ర ప్రజల పట్ల మోదీకున్న ప్రేమాభిమానాలను ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం తెలంగాణ ప్రజల పక్షానే ఉందని చెప్పడానికి ఇదే తార్కాణం..’అని బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. అంతకుముందు శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాం అమ్మవారికి, మైసిగండి ఉమామహేశ్వర అమ్మవారికి, తెలంగాణ విమోచన పోరాట యోధులకు, సర్దార్ వల్లభాయ్పటేల్కు నమస్సుమాంజలి ఘటించారు. తాజాగా పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారికి అభినందనలు తెలియజేశారు. మళ్లీ ఏప్రిల్లో వస్తా.. ‘మున్సిపల్ ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేయండి...మంచి ఫలితాలు సాధించండి... జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తా.. ఈ సారి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలి..మళ్లీ ఏప్రిల్లో వస్తా..’ అని నితిన్ నబీన్ మహబూబ్నగర్ నుంచి తిరుగు ప్రయాణంలో రాష్ట్ర పార్టీ నేతలకు చెప్పినట్లు రాంచందర్రావు ‘సాక్షి’ కి తెలిపారు. ఘన స్వాగతం శంషాబాద్: నితిన్ నబీన్ తొలిసారి తెలంగాణ పర్యటన సందర్భంగా బీజేపీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, రాజసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. -
రాజ్యసభకు నితిన్ నబీన్?
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నూతన అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ మరికొద్ది నెలల్లో రాజ్యసభ సభ్యత్వం తీసుకోబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం బిహార్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నబీన్ను ఏప్రిల్లోనే రాజ్యసభకు ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన సొంత రాష్ట్రమైన బిహార్ నుంచే ఆయన ఎంపిక ఉండవచ్చని తెలుస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్ నబీన్ ఇన్నాళ్లూ బిహార్లో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన్ను కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ బంకీపూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ముందున్న 5 రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే అత్యంత కీలకమైన ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ, అసెంబ్లీకి హాజరవ్వడం అంత సులభమేమీ కాదు. అటు ఎమ్మెల్యేగా, ఇటు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ద్వంద్వ పాత్రలు పోషించడం కష్టమని భావిస్తున్నారు. ఆయనను రాజ్యసభకు పంపడం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో ఇదే మాదిరిగా మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాజ్యసభకు పంపిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నాయి. వచ్చే ఏప్రిల్లో బిహార్లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఖాళీ అవుతున్న స్థానాల్లో రెండింటిని బీజేపీ తీసుకొని, మిగతా మూడింటిని కూటమి పార్టీలకు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. తమ రెండింటిలో ఒక స్థానం నుంచి నబీన్ను రాజ్యసభకు పంపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో స్థానం నుంచి భోజ్పురి నటుడు పవన్ సింగ్కు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
బీజేపీ నూతన సారథికి ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల’ సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళపతిగా బాధ్యతలు చేపట్టిన నలభై ఐదేళ్ల నితిన్ నిబీన్కు తొలి అడుగులే అగ్నిపరీక్షగా నిలవనున్నాయి. కొద్ది నెలల్లో జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల రూపంలో ఆయన తక్షణ సవాలు ఎదురుకానుంది. ముఖ్యంగా బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణముల్కు ఎదురొడ్డి పార్టీని అధికారంలోకి తేవడం కత్తిమీద సామే కానుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించే ప్రణాళిక ఏ మేరకు ఫలించేదీ తమిళనాడు, కేరళ ఎన్నికలు తేల్చనున్నాయి. వీటికి తోడు పార్టీపరమైన సమన్వయం, ఎన్డీఏ భాగస్వాములు, ఇతర మిత్రపక్షాలతో సమన్వయం, పంచాయతీ నుంచి పార్లమెంట్ స్థాయి దాకా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత నబీన్ భుజస్కంధాలపై ఉంది.ఆ మూడు రాష్ట్రాలే అసలు సవాలు కొద్ది నెలల్లో జరగనున్న బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలు నబీన్కు అత్యంత కీలకం కానున్నాయి. వాటిలో బెంగాల్ను బీజేపీ అత్యంత సీరియస్గా తీసుకుంటోంది. పదిహేనేళ్లుగా అప్రతిహాతంగా సాగుతున్న తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అధికారానికి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. బెంగాల్ అసెంబ్లీలో 294 సీట్లకు గాను మమత పార్టీకి 223, బీజేపీకి కేవలం 65 సీట్లున్నాయి. ఈ పరిస్థితుల్లో 150 సీట్ల మెజారిటీ మార్కును చేరుకోవడం బీజేపీకి గట్టి సవాలేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.2024 లోక్సభ ఎన్నికల్లోనూ బెంగాల్లో బీజేపీ గ్రాఫ్ దిగజారింది. 2019లో 18 సీట్లు నెగ్గగా పోయినసారి ఆరింటిని కోల్పోయి 12 స్థానాలతో సరిపెట్టుకుంది. తృణముల్ ఎంపీ స్థానాలు 22 నుంచి 27 స్థానాలకు పెరిగాయి. కోల్కతాతో పాటు చాలా నగర ప్రాంతాల్లో బిహారీ వలసదారులు ఎక్కువ. కనుక అటు నుంచే నరుక్కు రావాలన్నది నబిన్ యోచన. జాతీయ భద్రత, జీవనోపాధి, శాంతిభద్రతలు, వలసలు తదితరాలపై విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు తృణమూల్కు బలమున్న చోట బీజేపీ ఓటు శాతం పెంచే, గ్రామీణ ఓటర్లతో బీజేపీకి అనుబంధం పెంచే చర్యలపై కొత్త అధ్యక్షుడు దృష్టి పెట్టే అవకాశముంది. ప్రజల్లో గుర్తింపున్న నేతలకే టికెట్లని నబీన్ ఇప్పటికే శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు పంపారు.తమిళనాట... ఇక దక్షిణాదిలో కీలకమైన తమిళనాడులో ఈసారైనా పట్టు సాధించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. డీఎంకే ప్రభుత్వ అవినీతి, విద్య, ఉద్యోగ రంగాల్లో వైఫల్యాలు, వాగ్దానాల అమలులో వైఫల్యాల వంటి అంశాల్లో ప్రజల్లోకి వెళ్లేలా కొత్త అధ్యక్షుడు ప్రణాళిక రచించారు. రాష్ట్రంలో సొంతంగా విజయం సాధించే పరిస్థితులు లేనందున అన్నాడీఎంకేతో (AIDMK) పొత్తు, ఇతర చిన్న పార్టీల మద్దతు ద్వారా ఓటు బ్యాంకును విస్తరించాలని భావిస్తున్నారు. ఓబీసీ, దళిత వర్గాలతో పాటు యువత, మహిళలను ఆకర్షించేలా కార్యక్రమాల నిర్వహణ, బూత్ స్థాయిలో బలహీనంగా ఉన్న కేడర్ను బలోపేతం చేయడం, స్థానిక భాషలో సోషల్ మీడియా ప్రచారానికి ప్రాధాన్యతపై నబీన్ ఫోకస్ చేసే అవకాశముంది.234 అసెంబ్లీ స్థానాలకు గాను పార్టీ గెలవగలిగే అవకాశామున్న 65 స్థానాలను ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తోంది. ఎన్నికల పొత్తు దిశగా అన్నాడీఎంకేతో వారంలో చర్చలు మొదలవనున్నాయి. కేరళలో బీజేపీ ఇప్పటికే ‘మిషన్–2026’పేరుతో భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు దీటుగా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా దూకుడు పెంచింది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో సాధించిన చరిత్రాత్మక విజయం బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అక్కడ 45 ఏళ్ల తర్వాత ఎల్ల్డీఎఫ్కు కమలం పార్టీ చెక్ పెట్టడం తెలిసిందే. ఈ విజయాన్ని అసెంబ్లీ ఎన్నికలకు పునాదిగా మార్చుకోవాలని చూస్తోంది.చదవండి: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, కార్యకర్తల శిక్షణ, ముందస్తుగా అభ్యర్థుల ఎంపిక వంటివి మొదలయ్యాయి. గ్రామాల నుంచి నగరాల దాకా ఓటర్లను నేరుగా కలిసే ప్రచారానికి ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర నేతలకు కొత్త అధ్యక్షుడు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అయితే కేరళలో దశాబ్దాలుగా బలంగా ఉన్న వామపక్ష రాజకీయాలు, జాతీయ పార్టీల పట్ల సంప్రదాయ వ్యతిరేకత బీజేపీకి పెద్ద సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో తొలిసారి ఓటేసే నవ యువతను తమ వైపు తిప్పుకోవడంతో పాటు కీలకమైన విద్య, ఉద్యోగాలపై ప్రచారం చేయాలన్నది కొత్త అధ్యక్షుని వ్యూహమని బీజేపీ నేతలు చెబుతున్నారు. -
పార్టీ వ్యవహారాల్లో... నబీన్ నా బాస్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రస్థానంలో నూతన శకానికి తెర లేచింది. బిహార్కు చెందిన యువ నాయకుడు నితిన్ నబీన్ సిన్హా పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమం ఇందుకు వేదికైంది. బీజేపీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో 45 ఏళ్ల నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు.ఈ మేరకు సర్టిఫికెట్ను ఆయనకు అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఐదో అంతస్తులోని చాంబర్లో ప్రస్తుత అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా నుంచి నబీన్ లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అతిరథ మహారథులంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, పుష్కర్ సింగ్ ధామి, నయాబ్ సింగ్ సైనీ, ప్రమోద్ సావంత్, ముఖ్యమంత్రి పేమా ఖండు తదితరులు వీరిలో ఉన్నారు. మోదీతో పాటు వారంతా నబీన్ను స్వయంగా అధ్యక్ష చాంబర్లోకి తోడ్కొని వెళ్లారు.బీజేపీ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన అధ్యక్షునిగా, బిహార్ నుంచి వచ్చిన తొలి సారథిగా నబీన్ నిలిచారు. బీజేపీకి ఆయన 12వ అధ్యక్షుడు. నబీన్ ఎన్నికను చరిత్రాత్మక ఘట్టంగా నడ్డా అభివర్ణించారు. ఇంతకాలం తనకు అన్నివిధాలా సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.నితిన్ వెన్నంటి సాగుతాం: మోదీబీజేపీ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన నబీన్కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను నవతరానికి ప్రతినిధి (మిలీనియల్)గా అభివర్ణించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ నేతగా, ప్రధానిగా ఎంత అనుభవమున్నా అన్నింటికంటే ముందు నేను బీజేపీ కార్యకర్తను. ఇకపై పార్టీపరమైన వ్యవహారాల్లో నితిన్ నాకు బాస్’’ అని చెప్పారు. ఆయన్ను పదేపదే ‘గౌరవనీ యులైన’ అంటూ సంబోధించారు.‘‘యువకుడైన నబీన్ శక్తియుక్తులు, వ్యవస్థాగత వ్యవహారాల్లో ఆయనకున్న అపార అనుభవం పార్టీకి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇకపై ఆయన నోట వచ్చే ప్రతి మాటా మాకందరికీ నూతన దిశానిర్దేశం చేస్తుంది. పార్టీ భావి కార్యాచరణకు నబీన్ మార్గదర్శకత్వం వెలకట్టలేని ఆస్తి కానుంది’’ అన్నారు. ‘‘పార్టీ కార్యకర్తగా నేను కూడా నా పనితీరును ఎప్పటికప్పుడు నూతన అధ్యక్షునికే నివేదిస్తాను. నా పనితీరుకు సంబంధించిన రహస్య నివేదికను రాసేది ఆయనే. కనుక నబీన్ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నా’’ అని మోదీ చెప్పుకొచ్చారు. బీజేపీ వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు ఎన్డీఏ భాగస్వాముల నడుమ సమన్వయం సజావుగా కొనసాగేలా చూ డాల్సిన బాధ్యత కూడా నబీన్దేనని గుర్తు చేశారు.కాంగ్రెస్ తప్పిదాలు మనం చేయొద్దుకాంగ్రెస్ తప్పిదాల నుంచి నేర్చుకోవాలని బీజేపీ నేతలు, కార్యకర్తలకు మోదీ సూచించారు. ‘‘1984 లో 50 శాతం పై చిలుకు ఓట్లతో 400కు పైగా లోక్సభ స్థానాలు సాధించిన కాంగ్రెస్ నేడు 100 సీట్లు కూడా నెగ్గలేక ఆపసోపాలు పడుతోంది. కనుక ఆ పార్టీ దుర్లక్షణాలన్నింటినీ నిశితంగా గమనించి మనం వాటికి దూరంగా ఉందాం. అప్పుడిక మనల్ని ఎవరూ ఓడించలేరు’’ అన్నారు. నిష్పాక్షిక ఆత్మవిమర్శే బీజేపీ బలమని గుర్తు చేశారు.‘‘బీజేపీ ఒక సంప్రదాయం. అది ఒక కుటుంబం. సభ్యత్వం కంటే సంబంధాలకు విలువనిచ్చే పార్టీ. పదవుల ద్వారా కాకుండా ప్రక్రియ ద్వారా పనిచేసే పార్టీ బీజేపీ. ఇక్కడ అధ్యక్షులు మారినా ఆదర్శాలు, దిశానిర్దేశాలు మారవు. వాజపేయీ, అడ్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి దిగ్గజాల సారథ్యంలో బీజేపీ సున్నా నుంచి శిఖరస్థాయికి ఎదిగింది. వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా సారథ్యంలో మరింత ఎదిగింది’’ అని గుర్తు చేసుకున్నారు.చొరబాట్లు, అర్బన్ నక్సల్స్తో... దేశ భద్రతకే ప్రమాదం!చొరబాటుదారులు, అర్బన్ నక్సల్స్ దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారారని మోదీ ఆందోళన వెలిబుచ్చారు. చొరబాటుదారులను గుర్తించి తిప్పి పంపడం చాలా ముఖ్యమన్నారు. అక్రమ వలసలతో సంపన్న దేశాలు కూడా సతమతమవు తున్నాయి. వారిని వెళ్లగొడుతున్నాయి. వారు ప్రజలను కొల్లగొట్టడాన్ని భారత్ ఎప్పటికీ అనుమతించబోదు. కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు దన్నుగా నిలుస్తున్నాయి. వాటి ముసుగు తొలగించి ప్రజల ముందు నిలబెడదాం’’ అని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.‘‘దేశం ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య అర్బన్ నక్సలిజం. ‘‘నా గురించి, ఎన్డీఏ ప్రభుత్వం గురించి సానుకూలంగా ఎవరు మాట్లాడినా లక్ష్యం చేసుకుని నోరు మూయించే కార్యక్రమం జరుగుతోంది. కొందరు జర్నలిస్టులు కూడా వారిని దారుణంగా హేళన చేసి అవమా నిస్తున్నారు. అంటరానివాళ్లుగా ముద్ర వేస్తున్నారు. ఇదంతా అర్బన్ నక్సల్స్ నూతన శైలి. వీరంతా కలిసి దేశానికి చేటు చేసేందుకు నిత్యం ప్రయత్ని స్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. వీరికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయడం చాలా అవసరమన్నారు.అట్టహాసంగా కార్యక్రమంనబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆయనను మోదీ పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యాలయం కోలాహలంగా మారింది. జై శ్రీరాం, జై నితిన్ నబీన్ నినాదాలతో మార్మోగింది. ఆయన భార్య, పిల్లలు, కుటుంబీకులు, సన్నిహితులు కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలుగు నేతల సందడినబీన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షులు ఎన్.రాంచందర్రావు, పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, శ్రీనివాసవర్మ, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, అంజిరెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. వారంతా నబీన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.రాజకీయాల్లోకి యువతబీజేపీ నూతన సారథి నబీన్ పిలుపున్యూఢిల్లీ: రాజకీయాల్లోకి ప్రజలు మరింత చురుగ్గా రావాల్సిన అవస రముందని బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా అభిప్రా యపడ్డారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తద్వారా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని కలసికట్టుగా సాకారం చేసుకుందామని పేర్కొ న్నారు. ‘‘అయితే రాజకీయాలు 100 మీటర్ల రేసు కాదు. సుదీర్ఘంగా సాగే మారథాన్. అక్కడ పరీక్ష వేగానికి కాదని, శారీరక సామర్థ్యానికి. యువత దీన్ని గుర్తించాల్సిన అవసరముంది’’ అన్నారు.బీజేపీ సారథిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం పార్టీ ప్రధాన కార్యాల యంలో ఆయన నేతలు, కార్యక ర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీలో ప్రతి కార్యకర్తకూ పనికి తగిన గుర్తింపు ఎప్పుడూ లభిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరి కృషినీ గుర్తించేంత శక్తియుక్తులు బీజేపీ ‘వాచ్టవర్’కు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. కీలకమైన పశ్చిమ బెంగాల్తో పాటు రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బూత్ నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి దాకా పూర్తి చిత్తశుద్ధి, అంకితభావంతో పని చేయాలని సూచించారు. విపక్ష ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, డీఎంకేలపై నబీన్ ఈ సందర్భంగా ఘాటు విమర్శలు చేశారు. కార్తీక దీప సంప్రదాయాన్ని కూడా అడ్డుకునే కుయుక్తులకు డీఎంకే సర్కారు దిగిందన్నారు. ఇలాంటి శక్తులను ఓడించి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు. -
కమల దళపతిగా నితిన్ నబీన్
ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్.. జెపీ నడ్డా నుంచి బాధ్యతలు స్పీకరించారు. ఇవాళ(జనవరి 20, మంగళవారం) ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజానాథ్ సింగ్, పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలడని.. ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు. ‘‘నేను బీజేపీ కార్యకర్త.. నితిన్ నాకు బాస్. బీజేపీలో నిర్ణయాలు, ఎంపికలు అన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయి. దేశసేవ, ప్రజాసేవే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది’’ అని మోదీ పేర్కొన్నారు.‘‘ప్రభుత్వానికి అధిపతి అయినా... బీజేపీ కార్యకర్త కావడమే నాకు గర్వ కారణం. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నితిన్ నబీన్ విజయవంతంగా నిర్వహించారు. తనను తాను రుజువు చేసుకున్నారు. పార్టీ కంటే, దేశం ముఖ్యమనే నినాదంతో పనిచేస్తున్నాం. కుటుంబ రాజకీయ పార్టీలు యువకులకు తలుపులు మూసేస్తున్నాయి. ఇలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువకులను రాజకీయ నాయకులను తయారు చేయాలనుకుంటున్నాను..బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం పనిచేస్తుంది. మోదీకి అనుకూలంగా వార్తలు రాసినా, చెప్పినా వారిని అర్బన్ నక్సల్స్ టార్గెట్ చేస్తున్నారు. అర్బన్ నక్సలైట్ల ఆగడాలను అరికట్టాలి. కాంగ్రెస్ పార్టీ అధోగతికి ఆ పార్టీ విధానాలు కారణం. కుటుంబ రాజకీయాలే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచాయి. కాంగ్రెస్ లక్షణాలు మన పార్టీకి అంటకుండా జాగ్రత్తపడాలి’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు.కాగా, 26 ఏళ్లకే ఎమ్మెల్యే. 45వ ఏటే బీజేపీ వంటి అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కునిగా రికార్డు. నితిన్ నబీన్ రాజకీయ ప్రస్థానం తొలినుంచీ ఆసక్తికరమే. ఆయన ఎన్నికతో బీజేపీ పగ్గాలు రెండో తరం చేతికి అందినట్టయింది.నిజానికి బీజేపీలో జాతీయ స్థాయి ప్రముఖ నేతల జాబితాలో నబీన్ పేరు ఎప్పుడూ పెద్దగా లేదు. అలాంటి నేతలకు ఏకంగా అధ్యక్ష పగ్గాలు అందడం అనూహ్యమనే చెప్పాలి. నబీన్ జన్మించింది బీజేపీ పురుడు పోసుకున్న 1980లోనే కావడం విశేషం. ఆయన జార్ఖండ్లోని రాంచీలో జన్మించారు. ఆయన కాయస్థ కులస్తుడు.యువకుడే అయినా పాలన, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు తదితరాల్లో అపార అనుభవం ఆయన సొంతం. నబీన్ రాజకీయ ప్రస్థానం బీజేపీ యువజన విభాగమైన యువమోర్చాతో మొదలైంది. నబీన్ కుటుంబానికి ఆరెస్సెస్తో సన్నిహిత బంధముంది. ఆయన తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కూడా బీజేపీ నాయకుడే. పట్నా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉంటూ 2006లో మరణించారు. దాంతో జరిగిన ఉప ఎన్నికలో నబీన్ ఏకంగా 60 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అప్పటినుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు! 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ ఇన్చార్జిగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపి జాతీయ నాయకత్వాన్ని మెప్పించారు.తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ఛత్తీస్గఢ్లో 11 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లు నెగ్గేలా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి నడ్డా వారసునిగా పలువురు ప్రముఖుల పేర్లు విన్పించినా, పార్టీ నాయకత్వం మాత్రం అనూహ్యంగా నబీన్ వైపు మొగ్గింది. గత డిసెంబర్ 16న ఆయనను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించింది. మంగళవారం ఆయన నుంచి నబీన్ లాంఛనంగా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్నారు. ఆయనకు భార్య దీప్మాలా శ్రీవాత్సవ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కీలకమైన పశ్చిమబెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపాల్సిన గురుతర బాధ్యత నబీన్ భుజస్కంధాలపై ఉంది. -
కమల దళపతి నితిన్ నబీన్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నూతన అధ్యక్షునిగా బిహార్కు చెందిన పార్టీ యువ నేత నితిన్ నబీన్ సిన్హా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవి చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కునిగా 45 ఏళ్ల నబీన్ రికార్డు సృష్టించారు. అంతేగాక బిహార్ నుంచి వచి్చన తొలి బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయనే కావడం విశేషం! మంగళవారం ఉదయం 11 గంటలకు బీజేపీ 12వ అధ్యక్షునిగా నబీన్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జగత్ప్రకాశ్ నడ్డా పదవీకాలం ముగియడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియలో భాగంగా కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ముగిసింది. నబీన్ ఒక్కరి తరఫునే నామినేషన్లు దాఖలవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. మంగళవారం ఈ మేరకు లాంఛనంగా ప్రకటన వెలువడనుంది. నబీన్ ప్రస్తుతం బీజేపీ తాత్కాలిక అధ్యక్షునిగా ఉండటం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ సంతకంతో కూడిన నబీన్ నామినేషన్ సెట్టును నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తదితరులు రిటరి్నంగ్ అధికారి కె.లక్ష్మణ్కు సమర్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, నయాబ్సింగ్ సైనీ, ప్రమోద్ సావంత్, పెమా ఖండు, పుష్కర్సింగ్ ధామి, బీజేపీ అగ్ర నేతలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నబీన్ తరఫున బీజేపీ రాష్ట్ర శాఖలు కూడా ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశాయి. అలా మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలైనట్టు లక్ష్మణ్ వివరించారు. నబీన్కు శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నబీన్కు రానున్న పశి్చమబెంగాల్ సహా పలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపడం అగి్నపరీక్షగా నిలవనుంది. తొలిసారి అడ్వాణీ, జోషీ లేకుండా! బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు పార్టీ కురువృద్ధులు లాల్కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ గైర్హాజరయ్యారు. అధ్యక్ష ఎన్నికల ఓటర్ల జాబతాలో కూడా వారి పేర్లు లేవు. ఇలా జరగడం బీజేపీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1980 నుంచీ ఇప్పటిదాకా జరిగిన 11 మంది అధ్యక్షుల ఎన్నికల్లో వారు భాగస్వాములుగా ఉంటూ వచ్చారు. అయితే అడ్వాణీ, జోషీ ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ శాఖ నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ శాఖకు సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉంది. దాంతో అధ్యక్ష ఎన్నికల ఓటర్ల జాబితాలో వారి పేర్లు చేర్చేందుకు వీల్లేకుండా పోయిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. యంగెస్ట్ ప్రెసిడెంట్గా!న్యూఢిల్లీ: 26 ఏళ్లకే ఎమ్మెల్యే. 45వ ఏటే బీజేపీ వంటి అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కునిగా రికార్డు. నితిన్ నబీన్ రాజకీయ ప్రస్థానం తొలినుంచీ ఆసక్తికరమే. ఆయన ఎన్నికతో బీజేపీ పగ్గాలు రెండో తరం చేతికి అందినట్టయింది.నిజానికి బీజేపీలో జాతీయ స్థాయి ప్రముఖ నేతల జాబితాలో నబీన్ పేరు ఎప్పుడూ పెద్దగా లేదు. అలాంటి నేతలకు ఏకంగా అధ్యక్ష పగ్గాలు అందడం అనూహ్యమనే చెప్పాలి. నబీన్ జన్మించింది బీజేపీ పురుడు పోసుకున్న 1980లోనే కావడం విశేషం. ఆయన జార్ఖండ్లోని రాంచీలో జన్మించారు. ఆయన కాయస్థ కులస్తుడు. యువకుడే అయినా పాలన, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు తదితరాల్లో అపార అనుభవం ఆయన సొంతం. నబీన్ రాజకీయ ప్రస్థానం బీజేపీ యువజన విభాగమైన యువమోర్చాతో మొదలైంది. నబీన్ కుటుంబానికి ఆరెస్సెస్తో సన్నిహిత బంధముంది. ఆయన తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కూడా బీజేపీ నాయకుడే. పట్నా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉంటూ 2006లో మరణించారు. దాంతో జరిగిన ఉప ఎన్నికలో నబీన్ ఏకంగా 60 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అప్పటినుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు! 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ ఇన్చార్జిగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపి జాతీయ నాయకత్వాన్ని మెప్పించారు. తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ఛత్తీస్గఢ్లో 11 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లు నెగ్గేలా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి నడ్డా వారసునిగా పలువురు ప్రముఖుల పేర్లు విన్పించినా, పార్టీ నాయకత్వం మాత్రం అనూహ్యంగా నబీన్ వైపు మొగ్గింది. గత డిసెంబర్ 16న ఆయనను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించింది. మంగళవారం ఆయన నుంచి నబీన్ లాంఛనంగా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్నారు. ఆయనకు భార్య దీప్మాలా శ్రీవాత్సవ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కీలకమైన పశ్చిమబెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపాల్సిన గురుతర బాధ్యత నబీన్ భుజస్కంధాలపై ఉంది.


