breaking news
Nitin Nabin
-
భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల బాహాబాహీ
సాక్షి యాదాద్రి: భువనగిరి జిల్లా కేంద్రంలోనూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరస్పరం కార్యాలయాలపై దాడులకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ముందుగా బీజేవైఎం కార్యకర్తలు మంగళవారం ఉదయం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి క్యాంప్ కార్యాలయంపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్రెడ్డిల ఫ్లెక్సీలు, నేమ్ బోర్డులపై పెట్రోల్, డీజిల్, ఆయిల్తో పాటు కాషాయ రంగును చల్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేవైఎం దాడికి నిరసనగా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు భువనగిరి పట్టణ పరిధిలోని నల్లగొండ బైపాస్ రోడ్డులోని బీజేపీ కార్యాలయంపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో రెండు పార్టీల నాయకులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్–బీజేపీ శ్రేణులు ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ రాళ్లదాడిలో ఇరువర్గాల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.రాష్ట్ర బీజేపీకి అండగా ఉంటాం: నితిన్నబీన్ తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయన్న వార్తలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబీన్ ఆరా తీశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావుకు ఫోన్ చేసిన నబీన్ ఈ రెండు రోజుల్లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీకి, నేతలకు జాతీయ పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని రాంచందర్రావుకు నితిన్నబీన్ భరోసా ఇచ్చారు. ⇒ ‘ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? దాడులు చేసే వారిని కాపాడుతూ పరామర్శకు వెళ్లే వారిని అరెస్ట్ చేయడమేంటీ?’అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.⇒ ‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన..వెయ్యి మోసాల దగా కోరు పాలన. ఇది ప్రజా పాలన కాదు. చేతల్లో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన’అని బీజేపీ ఎంపీ డా.కె.లక్ష్మణ్ విమర్శించారు. ⇒ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. డీజీపీని కలిసిన బీజేపీ ప్రతినిధి బృందం బీజేపీ కార్యాలయాలు, నాయకులపై జరిగిన దాడులపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి బీజేఎల్పీ ఉపనేత పాయల్శంకర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. యూత్ కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు బీజేపీ ఆఫీస్ ఎదుట ఏర్పాటు చేసిన సంత్ శిరోమణి రవిదాస్ చిత్రపటాల పోస్టర్లపై నల్లరంగు పూసిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెట్టాలని అబిడ్స్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ ఫిర్యాదు చేశారు.ఎక్కడికక్కడ బీజేపీ నేతల అరెస్టులు సాక్షి, నెట్వర్క్: బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా మంగళవారం ట్యాంక్బండ్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, మాజీ మేయర్ కార్తీకరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్గౌడ్లను అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని మలక్పేట పోలీస్స్టేషన్కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. ⇒ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావును మంగళవారం పోలీసులు తార్నాకలోని ఆయన నివాసం వద్ద అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డిని పరామర్శించేందుకు వెళుతుండగా, రాంచందర్రావును అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ రాంచందర్రావును అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. -
రాంచందర్రావుకు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఫోన్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న చందంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఫోన్ చేశారు. పార్టీ కార్యాలయంపై దాడులు, నేతల అరెస్ట్లపై ఆరా తీశారు. అదే సమయంలో కాంగ్రెస్ నిరంకుశ విధానంపై పోరాటాన్ని కొనసాగించాలని రాంచందర్రావుకు నబిన్ సూచించారు. కాగా, తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల దాడులు, నిరసనలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. నిన్న(సోమవారం, ఆగస్టు 31వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు కాంగ్రెస్ శ్రేణులు నల్లరంగు వేయగా, ప్రతిగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై, బిహార్లో విద్యార్థులపై బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు యూత్ కాంగ్రెస్ శ్రేణులు నల్ల రంగు పూయడంపై బీజేవైఎం శ్రేణులు మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గాం«దీభవన్ ముట్టడికి యతి్నంచారు. గాంధీభవన్పై కోడ్డిగుడ్లు విసిరేసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పరస్పర నిరసన దాడులతో నల్లగొండ జిల్లా కేంద్రం అట్టుడికింది. శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంపై (వ్యక్తిగత కార్యాలయం) సోమవారం బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి నేతృత్వంలో కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేశారు. అక్కడే ఉన్న మంత్రి ప్లెక్సీకి నిప్పంటించారు. దీంతో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో దేవరకొండ రోడ్డు చైతన్యపురికాలనీలో ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారు.ఇదీ చదవండి: ‘ ఫ్రెండ్లీ పోలీస్.. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడమేనా?’ -
యువతే లక్ష్యంగా బరిలోకి..!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యువతకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ఆకాంక్షలను మరింత లోతుగా అర్థం చేసుకుని వారితో అనుసంధానాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ అంశమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, యువతతో పార్టీ కమ్యూనికేషన్ను మరింత పటిష్టం చేసే వ్యూహాలను ఇందులో ప్రముఖంగా చర్చించారు. దీర్ఘకాలిక అభివృద్ధే అజెండాఢిల్లీలో శనివారం జరిగిన సమావేశంలో కొత్తగా నియ మితులైన బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు హేమంగ్ జోషితో పాటు మాజీ యువమోర్చా అధ్యక్షులు అను రాగ్ ఠాకూర్, పూనమ్ మహాజన్, తేజస్వీ సూర్య పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతీ ఇరానీ, గుజరాత్ ఉపముఖ్యమంత్రి హర్‡్ష సంఘవి, ఛత్తీస్గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ, ఎంపీలు రవి కిషన్, కమలేశ్ పాశ్వాన్, గురు ప్రకాశ్, యోగేంద్ర చందోలియా, రాజు బిస్తా పాల్గొన్నారు. యువతకు పార్టీని చేరువగా తీసుకెళ్లడం, చర్చలు, అనుసంధానాన్ని మెరుగుపరిచే వ్యూహాలపై వీరు చర్చించారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం, దీర్ఘకాలిక అభివృద్ధిని ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాల పై వారికి నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. సామాజిక మాధ్యమాలు, ఆధునిక కమ్యూనికేషన్ మార్గాలను విస్తృతంగా ఉపయోగించుకుని యువతతో మమేకం కావాలని సూచించినట్లు సమాచారం. యువత సమస్యలు, ఆకాంక్షలను తెలుసుకుని వాటిపై పార్టీ స్పందించే విధానాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాస్తవంగా ప్రజలకు చేరుతున్నాయా లేదా అన్నది యువ నాయకత్వం క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని నబీన్ సూచించారు. ప్రభుత్వం–ప్రజల మధ్య పార్టీ వారధిగా వ్యవహరించాలని, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి అవసరమైన చోట ప్రభుత్వానికి చేరవేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని యువ నేతలకు నబీన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రజల్లో పార్టీపై విశ్వాసాన్ని పెంచేలా నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేయాలని నేతలకు సూచించారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించే విషయంలో పార్టీ నాయకులు సంయమనం, క్రమశిక్షణ పాటించాలని నబీన్ సూచించినట్లు సమాచారం. సంస్థాగత గౌరవాన్ని కాపాడుతూ వాస్తవాలు, క్రమబద్ధమైన వాదనల తో రాజకీయ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువ నేతలకు ఆయన మార్గనిర్దేశం చేసినటుŠల్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రధానిగా 12 ఏళ్లు అందించిన సుపరిపాలన, అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజెప్పడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో శనివారం ప్రారంభమైన బీజేపీ జాతీయ కమిటీ సమావేశానికి కొనసాగింపుగా.. ఆదివారం పదాధికారుల విస్తృతస్థాయి సంస్థాగత సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి నితిన్ నబీన్ అధ్యక్షత వహించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్తో సహా ఏడు రాష్ట్రాల్లో జరగనున్న అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు పలు సంస్థాగత అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజులపాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ను ఒక మహత్తర ప్రజా ఉద్యమంగా చేపట్టాలని బీజేపీ శ్రేణులకు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ హయాంలో పెను మార్పులు సాధించిన ‘నయా భారత్’రూపురేఖలను, వాస్తవాలను, గణాంకాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని సూచించారు. పేదల జీవితాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు, వేగంగా విస్తరించిన మౌలిక సదుపాయాలు, పేదరికం నుంచి కోట్లాది మంది బయటపడిన తీరు, ప్రపంచ వేదికపై భారత్కు దక్కుతున్న ప్రాధాన్యతను యువతకు తెలియజెప్పేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని స్పష్టం చేశారు. ‘సేవా సంకల్ప్ అభియాన్’స్ఫూర్తిని దేశంలోని అన్ని మూలలకు, అన్ని సామాజిక వర్గాలకు చేరవేసేలా సమగ్ర కార్యాచరణను ఖరారు చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బి.ఎల్.సంతోష్, జాతీయ ఉపాధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, ఇన్ఛార్జ్లు, కొత్తగా నియమితులైన ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు. -
ఓట్ల కోసం వందేమాతరానికి అవమానమా?
సాక్షి, న్యూఢిల్లీ: బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వందేమాతర గీతాన్ని అవమానిస్తోందని బీజేపీ ధ్వజమెత్తింది. వందేమాతరాన్ని రెండు చరణాలకే పరిమితం చేస్తూ ఆగస్టు 19న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీసుకున్న నిర్ణయాన్ని ఖండించింది. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతనంగా ఏర్పాటైన జాతీయ పదాధికారుల తొలి సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో వందేమాతరం ప్రతిష్టను, చారిత్రక ప్రాముఖ్యతను పరిరక్షించేందుకు 10 అంశాలతో కూడిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. వందేమాతరం గేయ విశిష్టతను చాటేలా, దాని ప్రాముఖ్యతపై యువతలో అవగాహన పెంచేలా దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని తీర్మానించింది. వందేమాతరాన్ని రెండు చరణాలకే పరిమితం చేస్తూ కాంగ్రెస్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం దశాబ్దాల క్రితం ఆ పార్టీ చేసిన చారిత్రక తప్పిదాలకు కొనసాగింపేనని పదాధికారుల భేటీ అభిప్రాయపడింది. మరోవైపు, వందేమాతరానికి గేయం గౌరవాన్ని పునరుద్ధరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేసిందని బీజేపీ వెల్లడించింది. ఇటీవల ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై పూర్తి వందేమాతరాన్ని ఆలపించారు. కానీ అదే రోజు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం పాడుతుండగా, రెండో చరణం తర్వాత ఆపేయాలని సోనియా గాంధీ సైగ చేసినట్లు బీజేపీ ఆరోపించింది. 1937 నాటి నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తూ రెండు చరణాలు మాత్రమే పాడే సంప్రదాయాన్ని కొనసాగించాలని ఆగస్టు 19న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానించడాన్ని బీజేపీ విమర్శించింది. ముస్లిం లీగ్ లాంటి శక్తుల అభ్యంతరాలకు తలొగ్గిన నాటి మనస్తత్వమే కాంగ్రెస్లో నేటికీ ఉందని మండిపడింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా, జాతీయ గీత పరిరక్షణ కోసం పదాధికారుల సమావేశంలో బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 19న సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా ఖండిస్తూ, పూర్తి వందేమాతరం గౌరవాన్ని పరిరక్షిస్తామని తీర్మానించింది. వందేమాతరం ఒక శక్తిమంతమైన సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదమని, శుద్ధమైన జాతీయ భావనకు ప్రతీక అని నాడు మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించింది. జాతీయ స్ఫూర్తిని రగిలించిన ఈ గీతాన్ని సంకుచిత రాజకీయాలకు వాడుకోవడాన్ని అడ్డుకుంటామని తీర్మానంలో స్పష్టం చేసింది. నూతన పదాధికారులతో ప్రధాని భేటీ న్యూఢిల్లీ: కొత్తగా ఎన్నికైన జాతీయ పదాధికారులతో ప్రధాని మోదీ శనివారం భేటీ అయ్యారు. కొత్త ఆలోచనలు, కొత్త దృక్పథాల సమ్మేళనంగా పార్టీని మార్చేందుకు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా పదాధికారులను ఎంపిక చేసినట్లు వారితో మోదీ చెప్పారు. ‘‘సంస్థాగత సమావేశాలు అనేవి కొత్త ఆలోచనల సమ్మేళనంగా జరుగుతాయి. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు, ప్రజలతో మరింతగా మమేకమయ్యేందుకు కొత్త నాయకులు ఇచ్చే సలహాలు, సూచనలను వినేందుకు పార్టీ సమావేశాలు జరుగుతుంటాయి. పారీ్టలో కొత్త బాధ్యతలు భుజాలకెత్తుకున్న నూతన పదాధికారులతో భేటీ అద్భుతంగా సాగింది’’అని వాళ్లతో భేటీ తర్వాత ప్రధాని మోదీ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. -
బీజేపీలో నితిన్ మార్క్ షురూ.. తొలి రోజే ఎన్నికల రోడ్మ్యాప్ సిద్ధం!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నూతనంగా నియమితులైన జాతీయ కార్యవర్గంతో శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, యువతకు మరింత చేరువకావడం తదితర అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అత్యంత పిన్న వయస్కుడైన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నిలిచిన నబీన్.. త్వరలోనే వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. Delhi: BJP national president Nitin Nabin chaired an introductory meeting with the BJP’s new team of national office-bearers at the party headquarters in Delhi(Source: ANI Picture Service) pic.twitter.com/deDwtFmgNw— ANI (@ANI) August 22, 2026ఇటీవలే ప్రకటించిన 65 మంది సభ్యుల నూతన కార్యవర్గంలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. ఉపాధ్యక్షులుగా వసుంధర రాజే సింధియా, తీరథ్ సింగ్ రావత్, రామ్ మాధవ్ తదితరులు నియమితులయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా (సంస్థాగత) బీఎల్ సంతోష్ కొనసాగుతుండగా, సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివప్రకాష్, సౌదాన్ సింగ్ వ్యవహరించనున్నారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియా ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టారు.జాతీయ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నియమితులయ్యారు. ఐటీ విభాగాధిపతిగా అమిత్ మాల్వియా స్థానంలో దీపక్ మ్హాస్కే, యువమోర్చా అధ్యక్షుడిగా తేజస్వి సూర్య స్థానంలో హేమాంగ్ జోషిని నియమించారు. నూతన కార్యవర్గానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్ ’వేదికగా శుభాకాంక్షలు చెబుతూ.. అనుభవం, యువశక్తి కలగలసిన ఈ బృందం ప్రజాసేవలో ముందంజలో ఉంటుందని ఆకాంక్షించారు.ఇది కూడా చదవండి: అమెరికా వీసా రూల్స్ దెబ్బకు భారతీయ జంట విలవిల -
బీజేపీ నయా టీమ్లో మహిళలకు పెద్దపీట!
-
65 మందితో నబీన్ కొత్త టీమ్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబీన్ తొలిసారి అత్యంత కీలకమైన జాతీయ కార్యవర్గంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్) అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 65 మందితో సోమవారం నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ జాబితాలో సీనియర్లతోపాటు యువత, మహిళలకు పెద్దపీట వేశారు. ఇందులో 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, 16 మందిని జాతీయ కార్యదర్శులుగా నియమించారు.ఆంధ్రప్రదేశ్లో మూలాలున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు రాంమాధవ్ను ఢిల్లీ కోటాలో జాతీయ ఉపాధ్యక్ష పదవి అప్పగించారు. అలాగే ఉత్తరప్రదేశ్కు చెందిన కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ అత్యంత కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అలా వారిద్దరూ జాతీయ కార్యవర్గంలో పునఃప్రవేశించారు. అయితే తెలంగాణ నుంచి ఏ ఒక్కరికీ చోటుదక్కలేదు.ఇప్పటివరకు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించిన డీకే అరుణకు కొత్త జాతీయ కార్యవర్గంలో చోటు లభించలేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి ఈ జాబితాలో స్థానం లభించింది. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమితులవగా ఇప్పటివరకూ బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్.విష్ణువర్ధన్రెడ్డికి జాతీయ కార్యవర్గంలో అన్ని విభాగాల సంయుక్త సమన్వయకర్తగా అవకాశం లభించింది. సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు... మహారాష్ట్రకు చెందిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. మాజీ ముఖ్యమంత్రులైన విప్లవ్ కుమార్ దేవ్ (త్రిపుర)కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, తీరత్సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), వసుంధర రాజే సింధియా (రాజస్తాన్)లకు జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ బాధ్యతలు అప్పగించారు. వైజయంత్ జైపాండా (ఒడిశా), రేఖా వర్మ (ఉత్తరప్రదేశ్), తారిఖ్ మన్సూర్ (ఉత్తరప్రదేశ్) తమ జాతీయ ఉపాధ్యక్ష పదవులను నిలుపుకున్నారు. వినోద్ తావ్డే (మహారాష్ట్ర), సునీల్ బన్సల్ (ఢిల్లీ) జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగనున్నారు. కేరళంకు చెందిన అనిల్ ఆంటోని జాతీయ కార్యదర్శిగా, ఉత్తరాఖండ్కు చెందిన అనిల్ బలూని కీలకమైన జాతీయ మీడియా సమన్వయకర్తగా బాధ్యతలను కొనసాగించనున్నారు. మరికొందరు నాయకులకు సైతం పార్టీ జాతీయ కార్యవర్గంలో చోటు లభించింది. నూతనంగా నియమితులైన పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. -
కమిటీ పోయింది.. కేబినెట్ వస్తుందా?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో జరిపిన ఈ మార్పుచేర్పుల్లో జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు చోటు దక్కలేదు. అయితే ఈ ‘విరుగుట’ వెనుక బీజేపీ అధిష్టానం ఒక పెద్ద ‘పెరుగుట’ వ్యూహాన్నే అమలు చేస్తోందన్న విశ్లేషణలు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.ముందే సంకేతాలు అందాయా?ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ తెలంగాణ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో జాతీయ కమిటీ పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ భేటీలోనే కొత్త జాతీయ బృందంలో తెలంగాణ నేతలకు చోటు ఉండకపోవచ్చనే సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై దృష్టి?జాతీయ కమిటీలో తెలంగాణకు పదవులు దక్కకపోవడానికి త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణే ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండు పదవులు నిర్వహించేందుకు వీల్లేదు. జాతీయ కార్యవర్గ పదవుల కంటే కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి సరైన ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. తెలంగాణ నుంచి ఒకరిద్దరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.మంత్రివర్గ రేసులో ఆ ముగ్గురు!కేంద్ర కేబినెట్ రేసులో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటల సీనియర్ నేత కావడం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటంతో ఆయనకు బెర్త్ ఖాయమనే ప్రచారం సాగుతోంది. అలాగే నిజామాబాద్లో వరుసగా రెండోసారి గెలిచి బలమైన నాయకుడిగా ఎదిగిన అర్వింద్కు అవకాశం ఇవ్వడం ద్వారా ఉత్తర తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయొచ్చని అధిష్టానం భావిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ఇక గిరిజన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గోడెం నగేశ్కు అవకాశం ఇస్తే సామాజిక సమీకరణలు కలసి వస్తాయని పార్టీ ఆలోచిస్తోంది. -
బీజేపీ కొత్త టీమ్ ఇదే..! DK అరుణ, లక్ష్మణకు బిగ్ షాక్
-
కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటించిన బీజేపీ
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ తన నూతన జాతీయ కార్యవర్గ బృందాన్ని ప్రకటించింది. సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ప్రకటించిన ఈ కొత్త జాబితాలో అనుభవజ్ఞులతో పాటు యువ నాయకులకు పెద్దపీట వేస్తూ, ప్రాంతీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత కల్పించారు.బీజేపీ నూతన జాతీయ టీమ్ను ప్రకటించింది. సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ప్రకటించిన ఈ కొత్త జాబితాలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 9 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 16 మంది జాతీయ కార్యదర్శులను నియమించింది. జాతీయ ఉపాధ్యక్షులుగా రామ్ మాధవ్, పురందేశ్వరి సహా 13 మందికి అవకాశం కల్పించింది. బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్ను కొనసాగించింది. అలాగే జాతీయ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు మరోసారి బాధ్యతలు అప్పగించింది. సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివ ప్రకాష్, సౌధాన్ సింగ్, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా సునీల్ బన్సల్, వినోద్ తావుడే, విప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పునియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియాలకు చోటు కల్పించింది.పార్టీ సోషల్ మీడియా కన్వీనర్గా దీపక్ను, మీడియా కన్వీనర్గా అనిల్ బలోనిని నియమించింది. బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ హేమంగు జోషికి బాధ్యతలు అప్పగించింది. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రూప్ కుమారి చౌదరిని నియమించింది. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అమరుపాల్ మౌర్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బన్సీలాల్ గుజర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా శివేష్ కుమార్ రామ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా మన్నన్లాల్ రావత్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా కొన్వార్ బాసిత్ అలీలను నియమిస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.నూతన జాతీయ టీమ్లో అనుభవజ్ఞులతో పాటు యువ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కూర్పు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కలేదు. -
ధర్మేంద్ర ప్రధాన్కు కీలక పదవి?
న్యూఢిల్లీ: జెన్ జీ పోరాటంతో కేంద్ర మంత్రి పదవి కోల్పోయిన ధర్మేంద్ర ప్రధాన్కు బీజేపీలో కీలక పదవి దక్కనుందని వార్తలు వస్తున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో ఊహాగానాలు వెలుడుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త టీమ్పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నాయకులకు పార్టీలో కీలక పదవులు దక్కనున్నాయని ప్రచారం జరుగుతోంది.బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సీనియర్ నేతలు సతీష్ పూనియా, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీలకు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ మాజీ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మకు కూడా పెద్ద బాధ్యత దక్కవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అది బీజేపీ సంస్థాగత వ్యవస్థలో కావొచ్చు లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కావొచ్చని సమాచారం. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ దేవ్ పేరు కూడా కీలక పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆ జాబితాపైనే ప్రధాన దృష్టి!నితిన్ నబిన్ కొత్త టీమ్లో అత్యంత కీలకమైన మార్పులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల విషయంలో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీకి ఏడుగురు జాతీయ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. వీరిలో అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాధామోహన్ దాస్ అగర్వాల్, బీఎల్ సంతోష్ ఉన్నారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)గా ఉన్న బీఎల్ సంతోష్ మాత్రం కొనసాగడం దాదాపు ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పదవిని సాధారణంగా ఆర్ఎస్ఎస్కు చెందిన నేతకే కేటాయిస్తారు. అయితే ఆయనకు కొత్త డిప్యూటీలను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దుష్యంత్ గౌతమ్, రాధామోహన్ దాస్ అగర్వాల్లకు విశ్రాంతి ఇవ్వడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.వారిద్దరికి కీలక బాధ్యతలు?ఇదే విభాగంలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, సతీష్ పూనియాలను తీసుకురావచ్చని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యువత, అనుభవజ్ఞుల కలయికతో టీమ్ను ఏర్పాటు చేయాలన్న నితిన్ నబిన్ ఆలోచనలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ పేర్లపై బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఉత్తరాది నుంచి భాటియా పేరు!ఉత్తర భారతదేశం నుంచి హర్యానాలోని కర్నాల్కు చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ భాటియా (Sanjay Bhatia) పేరు కూడా బీజేపీ కొత్త టీమ్లో కీలక బాధ్యత కోసం వినిపిస్తోంది. ఆయనకు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఏదైనా ముఖ్యమైన పదవి దక్కవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.చదవండి: ఇలా అయితే నేనే నిరసనకు దిగుతా.. బాబా రామ్దేవ్మొత్తంగా చూస్తే, నితిన్ నబిన్ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు, పదవులపై ఊహాగానాలే తప్ప, తుది నిర్ణయాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. -
బీజేపీకి టెన్షన్.. బంకీపూర్కు పీకే బంపరాఫర్
బీహార్లో మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ఆ పార్టీకి మరో టెన్షన్ మొదలుపెట్టారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే 10 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానంటూ ప్రకటించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. “మీ పిల్లల సీవీలు, బయోడేటాలు పంపండి.. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తా” అంటూ ఆయన ఇచ్చిన పిలుపు.. ఓవైపు యువతలో కొత్త ఆశలు రేపుతుండగా, మరోవైపు బీజేపీకి ఇది కొత్త రాజకీయ సవాలుగా మారే అవకాశముందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ప్రాంతంలో గెలిచి.. అదే నియోజకవర్గంలో ఉద్యోగాలు, అభివృద్ధిని అజెండాగా ముందుకు తీసుకెళ్లడం కమలనాథులకు టెన్షన్ పెంచే అంశంగా మారింది.బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన ప్రశాంత్ కిషోర్.. ఆగస్టు 3న జరిగిన ఉపఎన్నికలో తనపై నమ్మకం ఉంచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. జన సురాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన.. దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్లో అనూహ్య విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. ఈ ఫలితంతో బంకీపూర్లో బీజేపీకి ఉన్న దాదాపు 30 ఏళ్ల ఆధిపత్యానికి బ్రేక్ పడింది.బయోడేటా పంపండి..విజయం తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్.. తాను ప్రజలకు దూరంగా ఉన్నానంటూ వస్తున్న విమర్శలకు కూడా సమాధానం ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదు, ఆరు రోజులుగా నియోజకవర్గంలో కనిపించలేదని కొందరు విమర్శిస్తున్నారని, కానీ తాను ఎక్కడికీ వెళ్లడం లేదని చెప్పారు. “నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మీ కోసం పనిచేస్తున్నాను” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. బంకీపూర్లో చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేని యువత కుటుంబాలు తమ పిల్లల CVలు, బయోడేటాలను తన కార్యాలయానికి పంపాలని కోరారు. దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలు, వ్యక్తులతో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించి అర్హత ఉన్న యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లభించేలా ప్రయత్నిస్తానని తెలిపారు.జనసూరజ్ ఎజెండా.. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాత్రం తాను హామీ ఇవ్వలేనని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం కొంతమంది యువత ప్రారంభంలో బీహార్ వెలుపలికి వెళ్లాల్సి రావచ్చని కూడా చెప్పారు. అయినప్పటికీ వచ్చే ఒకటి నుంచి రెండేళ్లలో కనీసం 10 వేల కుటుంబాల పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించడం తన లక్ష్యమని ప్రకటించారు. ఇది కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన హామీగా కాకుండా.. భవిష్యత్తులో బీహార్లో జన సురాజ్ పార్టీ రాజకీయ అజెండాకు సంకేతంగా కూడా కనిపిస్తోంది. జన సురాజ్ పార్టీ బీహార్లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలోనే తగినన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించి.. యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు ప్రయత్నిస్తామని కిషోర్ చెప్పారు.బంకీపూర్ అభివృద్ధిపై కూడా ఆయన గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన నియోజకవర్గం ఒక్క రాత్రిలో బెంగళూరుగా మారిపోదని, అయితే రెండు మూడు నెలల్లోనే కనిపించే మార్పులు మొదలవుతాయని చెప్పారు. ఉద్యోగాలతో పాటు విద్య, నెలకు రూ.1,100 పెన్షన్, ఆహార ధాన్యాల పంపిణీ వంటి అంశాలను కూడా నియోజకవర్గంలోని తన ప్రాధాన్యతలుగా పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు అందరి చూపూ 10 వేల ఉద్యోగాల హామీపైనే ఉంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఉద్యోగాల నియామక హామీ కాదు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తన వ్యక్తిగత, రాజకీయ నెట్వర్క్ను ఉపయోగిస్తానన్న హామీ. అందుకే ఆయన కార్యాలయానికి ఎన్ని సీవీలు వస్తాయి? వాటిలో ఎంతమందికి నిజంగా ఉద్యోగాలు దక్కుతాయి? అన్నదే కీలకం. -
మీరు చేస్తారా.. మేము ఎంటర్ కావాలా?
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: ‘తెలంగాణలో పార్టీని అన్ని విధాలా ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యేలా మీరు నడుం బిగిస్తారా? లేక మొత్తం మేమే కంట్రోల్లోకి తీసుకొని నడిపించాలా ? దీనిపై త్వరగా తేల్చుకొని స్పష్టమైన రోడ్మ్యా ప్, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోండి. లేనిపక్షంలో మా పద్ధతిలో పార్టీని ముందుకు నడిపిస్తాం’అని తెలంగాణ ముఖ్య నేతలకు బీజేపీ అధినాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీవర్గాల సమాచారం. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన విపక్షం బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాల్సిందేనని, అందుకు అవసరమైన అన్నిరకాల కార్యక్రమాలను చేపట్టాలని సూచించినట్టు తెలిసింది.మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో బీఆర్ఎస్ నేతలను చేర్చుకునేందుకు వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించి అమలు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయంలో ఎంపీలు ఏమాత్రం క్రియాశీలంగా వ్యవహరించకపోయినా, వెంటనే జాతీయ నాయకత్వం ఎంటరై తమ ప్రతినిధుల ద్వారా చేరికల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొస్తుందని హెచ్చరికలు జారీచేసినట్టు సమాచారం. మరోవైపు బుధవారం నుంచి నాలుగు రోజులుగా రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో వరుస సమావేశాలు జరిగాయి. 3 నెలలకు ఓసారి వస్తా...పరిస్థితి సమీక్షిస్తా ప్రతీ మూడునెలలకు ఒకసారి తెలంగాణకు వచ్చి రాష్ట్రంలో పార్టీ వాస్తవ పరిస్థితి ఏమిటి..వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్ర పార్టీ నేతల వ్యూహాలు, చేస్తున్న కృషిని సమీక్షిస్తానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేసినట్టు తెలిసింది. తెలంగాణలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన రాజకీయ కార్యాచరణపై జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.శుక్రవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ, కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బంyì సంజయ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎంపీలు డీకే అరుణ, అరి్వంద్ ధర్మపురి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎం.రఘునందన్రావు, గోడెం నగేశ్లతో నితిన్ నబీన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఇప్పటికే రాష్ట్రంలోని పార్టీ వ్యవహారాలు, ముఖ్య నేతల మధ్య నెలకొన్న వాతావరణం, సమన్వయం, పార్టీకి ఎదురవుతున్న సమస్యలు తదితరాలపై అభయ్పాటిల్ జాతీయపార్టీకి సవివరమైన నివేదిక సమరి్పంచినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, వైఫల్యాలు, ప్రజల్లో వ్యతిరేకత, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది వంటి అంశాలపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు మరో నివేదికను అందజేసినట్టు సమాచారం. డబుల్ ఇంజిన్ సర్కార్ దిశగా : బండి సంజయ్ రాష్టంలో పార్టీ కార్యకర్తల సమష్టి కృషితో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దిశగా స్థిరంగా అడుగులు వేస్తోందని తాను విశ్వసిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. నితిన్ నబీన్తో సమావేశం అనంతరం ఆయన ఎక్స్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ఎవరితోనూ పొత్తు లేదు’ తెలంగాణలో జనసేన పార్టీతో సహా ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు ఉండబోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు స్పష్టంచేశారు. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికార సాధనే లక్ష్యంగా పార్టీ ముందు కెళుతోందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగిన పార్టీ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజా పోరాటాలు చేయడమే బీజేపీకి నిజమైన రోడ్ మ్యాప్ అని నితిన్ నబీన్ స్పష్టం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కోర్ కమిటీ సభ్యులతో చర్చించి పాదయాత్రలు, బస్సు యాత్రలు వంటి ప్రజా చైతన్య కార్యక్రమాలను రూపొందించి ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్తామని వెల్లడించారు. సెపె్టంబర్ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. -
‘తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం..’
ఢిల్లీ: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తామని పార్టీ అధ్యక్షుడు రాంచందర్రావు స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని, ఒంటరిగానే తెలంగాణలో పోటీకి దిగుతామన్నారు.ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో తెలంగాణ నేతల సమావేశం అనంతరం రాంచందర్రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ‘ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తాం. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో అధికారంలోకి వస్తాం. కీలక నేతలు మా పార్టీలో చేరేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారు. పార్టీ నేతల మధ్య విభేదాలు లేవు... భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు వస్తారు. ప్రజా సమస్యలపై పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. కలిసి పోరాటం చేయాలని నితిన్ నబీన్ నిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలు తర్వాత ఎంపీ , ఎమ్మెల్యేలతో కలిసి మరోసారి సమావేశం అవుతాం. రాష్ట్రంలో అధికారం రావడానికి రోడ్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారు. 937 మండలాలలో పార్టీని బలోపేతం చేస్తున్నాం. చాలా మంది నేతలు మా పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారు’ అని తెలిపారు. -
కమల వ్యూహం బెడిసికొట్టింది అక్కడే..!
బిహార్ రాజకీయాల్లో ఓ చిన్న ఉప ఎన్నిక ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మూడు దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న బంకీపూర్లో జనసూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించారు. ఇది కేవలం ఓ అభ్యర్థి గెలుపు మాత్రమే కాదు.. మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతంగా మారింది. బీజేపీని ఓడించి తీరాలన్న కసి అక్కడి ఓటర్లలో కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కమల వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది? అనేది పరిశీలిస్తే.. పట్నా నగరంలోని బంకీపూర్ నియోజకవర్గం చాలా కాలంగా బీజేపీకి బలమైన అడ్డాగా ఉంది. 1995 నుంచి ఈ స్థానంలో కమలం ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. తొలుత నితిన్ నబీన్ తండ్రి నవీన్ చంద్ర సిన్హా.. ఆ తర్వాత నితిన్ నబీన్ వరుస విజయాలతో ఈ సీటును బీజేపీ తన గుప్పిట్లో ఉంచుకుంది. అలాంటి నియోజకవర్గంలో ఈసారి అనూహ్య ఫలితం వెలువడింది.జనసూరాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పీకేకు 64,151 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 44,827 ఓట్లు వచ్చాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.అక్కడే బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్బంకీపూర్ ఫలితాల్లో బీజేపీ వ్యూహ లోపం ప్రధానంగా అభ్యర్థి ఎంపిక దగ్గరే కనిపించిందనే చర్చ జరుగుతోంది. తొలుత ప్రకటించిన అభ్యర్థి అభిషేక్ ‘బంటీ’ చివరి సమయంలో తప్పుకోవడంతో.. పార్టీ నీరజ్ కుమార్ సిన్హాను రంగంలోకి దించాల్సి వచ్చింది. బీజేపీకి బలమైన పట్టు ఉన్న స్థానంలో చివరి నిమిషంలో మార్పు జరగడం క్యాడర్లో కొంత గందరగోళానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బీజేపీ వ్యతిరేక ఓటును ఒకే వేదికపైకి తీసుకురావడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు సహజంగా ఆర్జేడీ వైపు మొగ్గు చూపేవారు. కానీ ఈసారి “బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయం ఎవరు?” అనే లెక్కలో కొంతమంది ఓటర్లు జనసూరాజ్ వైపు మళ్లినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.సంబంధిత వార్త: పీకే దాడికి ముందే బీజేపీ ప్లాన్ మార్చిందా?పీకే ఎంట్రీతో మారిన బిహార్ లెక్కలుఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. రాజకీయ నాయకుడిగా మాత్రం తొలి ప్రయత్నాల్లో పెద్ద విజయాన్ని అందుకోలేకపోయారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జనసూరాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే బంకీపూర్ ఉప ఎన్నికలో ఆయన వ్యూహం పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఒక్క నియోజకవర్గంపై పూర్తి దృష్టి పెట్టి.. స్థానిక అంశాలు, ప్రత్యామ్నాయ రాజకీయాల నినాదంతో ప్రచారం సాగించారు. ఫలితంగా బీజేపీ కంచుకోటనే బద్దలు కొట్టారు. ఈ విజయం జనసూరాజ్కు అసెంబ్లీలో తొలి అడుగు మాత్రమే కాదు.. బిహార్లో మూడో రాజకీయ శక్తిగా ఎదగాలనే పీకే ప్రయత్నాలకు కొత్త ఊపునిచ్చింది.బీజేపీకి దెబ్బ.. ఆర్జేడీకీ హెచ్చరికబంకీపూర్ ఫలితంలో మరో కీలక అంశం ఆర్జేడీ వెనుకబడటం. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆర్జేడీ.. ఈ ఎన్నికలో మూడో స్థానానికి పడిపోవడం ఆ పార్టీకి కూడా ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ బలంగా నిర్మించిన ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంకు ఆర్జేడీకి ప్రధాన బలం. అయితే బీజేపీ వ్యతిరేక ఓటులో కొంత భాగం ఈసారి జనసూరాజ్ వైపు వెళ్లినట్లు కనిపించింది. ఈ ధోరణి కొనసాగితే.. ఆర్జేడీ రాజకీయ ఆధిపత్యానికి కూడా సవాల్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇద్దరిలో కారకులెవరూ?బంకీపూర్ ఓటమి ఇప్పుడు బీజేపీలో అంతర్గత చర్చకు దారితీసింది. బాధ్యత ఎవరిపై వేయాలన్న ప్రశ్నపై నితిన్ నబీన్, సమ్రాట్ చౌదరీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సొంత కుటుంబానికి మూడు దశాబ్దాలుగా పట్టున్న స్థానాన్ని కోల్పోవడం నితిన్ నబీన్కు వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అభ్యర్థి ఎంపిక, ప్రచార నిర్వహణ, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో లోపాలే ఓటమికి కారణమయ్యాయనే చర్చ సాగుతోంది.మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమ్రాట్ చౌదరీకి ఇది తొలి పెద్ద రాజకీయ పరీక్ష. ప్రశాంత్ కిషోర్ తన ప్రచారంలో చౌదరీ నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఈ ఫలితం రాష్ట్ర నాయకత్వానికి కూడా ఓ హెచ్చరికగా మారింది.అయితే ఒక్కరిని నిందించడం కంటే.. బంకీపూర్ ఓటమి బీజేపీ ఎన్నికల వ్యూహానికి వచ్చిన పరీక్షగా చూడాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.బంకీపూర్ ఇచ్చిన సంకేతం ఏంటి?బంకీపూర్ ఫలితం కేవలం ఓ ఉప ఎన్నిక తీర్పు కాదు.. బిహార్ రాజకీయాల్లో కొత్త పోటీకి సంకేతం. ఇంతకాలం బీజేపీ–ఆర్జేడీ మధ్య సాగిన పోరులోకి ఇప్పుడు జనసూరాజ్ ప్రత్యామ్నాయ శక్తిగా అడుగుపెట్టింది. బీసీ, అగ్రవర్ణాల ఓట్లు ఆ పార్టీకి మళ్లాయి. కమలానికి ఇది కంచుకోట కోల్పోవడమే కాదు.. బలమైన స్థానాల్లో కూడా ఓటర్ల నాడిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ఫలితం. ఆర్జేడీకి తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవాల్సిన సవాలు ఎదురైంది.ప్రశాంత్ కిషోర్ గెలుపు ఒక్క సీటుతో మొదలైనప్పటికీ.. దీని ప్రభావం రాబోయే బిహార్ రాజకీయ సమీకరణాలపై ఎంతవరకు పడుతుంది? బీజేపీ తన కోటను ఎలా తిరిగి నిర్మించుకుంటుంది? జనసూరాజ్ ఈ విజయాన్ని ఎలా విస్తరిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
బీహార్ బంకిపూర్లో బీజేపీ కంచుకోట బద్దలు : మంత్రి పొన్నం ప్రభాకర్
బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామంగా నిలిచిన బంకిపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బంకిపూర్లో ఆ పార్టీ ఓటమిపాలవడం ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పుకు నిదర్శనమని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్కు చెందిన నియోజకవర్గంలోనే జన్ సూరజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ భారీ మెజారిటీతో గెలవడం ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు.అయితే, అధికార బలం, ప్రభుత్వ యంత్రాంగం, విస్తృత ప్రచారం ఉన్నప్పటికీ ప్రజల తీర్పును ఎవరూ మార్చలేరు. దీనికి బంకిపూర్ ఫలితం మరో నిరూపన. ప్రజలు తమ ఓటుతో బీజేపీ అహంకారానికి గట్టి సమాధానం చెప్పారు. ప్రజల సమస్యలను విస్మరించి అహంకారపూరిత పాలన కొనసాగిస్తే తగిన సమయంలో ప్రజలు తీర్పు ఇవ్వడమే కాకుండా, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని మంత్రి గట్టిగా చెప్పుకొచ్చారు.ఇటీవల ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని ప్రస్తావించిన మంత్రి.. దేశవ్యాప్తంగా యువతలో అసంతృప్తి పెరుగుతోందని, అలాగే, విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందనే భావన బలపడుతోందని, అదే భావోద్వేగం బంకిపూర్ ఉపఎన్నిక ఫలితంలో ప్రతిబింబించిందని ఆయన అన్నారు.అలాగే, బంకిపూర్ తీర్పు కేవలం ఒక ఉపఎన్నిక ఫలితం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ప్రజల సంకల్పానికి ప్రతీక. దీంతో ప్రజల గొంతుకను అణచివేయాలని చూసే రాజకీయాలకు దేశ ప్రజలు సరైన సమయంలో సమాధానం చెబుతారని, బంకిపూర్లో బీజేపీ కంచుకోట బద్దలవడం దేశ రాజకీయాల్లో మరింత పెద్ద మార్పులకు నాంది పలుకుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. -
బంకీపూర్ బైపోల్.. బీజేపీ కంచుకోటలో పీకే సవాల్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా నేడు మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఆగస్టు 3న జరగనుంది.అయితే ఈ మూడు ఉపఎన్నికల్లో బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ స్థానం దేశవ్యాప్తంగా అత్యధిక రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా అభ్యర్థిగా బరిలో దిగుతుండటంతో ఈ పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. మరోవైపు ఈ స్థానం బీజేపీకి బలమైన కోటగా ఉండటంతో పార్టీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఆర్జేడీ తన సంప్రదాయ ముస్లిం–యాదవ్ (ఎం-వై) ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహించింది.బంకీపూర్ స్థానం ఖాళీ కావడానికి బీజేపీ సీనియర్ నేత నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడమే కారణం. గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా స్థానాల్లో కూడా ఖాళీలు ఏర్పడటంతో ఎన్నికల సంఘం ఉపఎన్నికలను ప్రకటించింది. ఈ ఉపఎన్నికల ఫలితాలు అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ బలాబలాలను అంచనా వేయడమే కాకుండా, ఆయా రాష్ట్రాల్లో భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.#WATCH | Patna, Bihar: Voting begins for the by-election of Bankipur Assembly constituency.(Visuals from Bihar State Library) pic.twitter.com/wXhhIuUpCJ— ANI (@ANI) July 30, 2026ఇక, బంకీపూర్లో బీజేపీకి పట్టు ఉన్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు సర్వేల ప్రకారం బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇటీవలి పరిణామాలు ప్రశాంత్ కిషోర్ ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జన్ సురాజ్ ఓటు శాతం గణనీయంగా పెరగడం, బీజేపీ ఓటు శాతం తగ్గడం విశేషం. అదే సమయంలో ఆర్జేడీ ఓటు బ్యాంకు కూడా క్షీణించినట్లు పలు సర్వేల్లో వెల్లడైంది.బీజేపీకి ప్రతిష్ఠాత్మక ఎన్నికఈ నియోజకవర్గం దాదాపు రెండు దశాబ్దాలుగా బీజేపీ ఆధీనంలో ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించింది. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ సహా పలువురు సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలో ప్రధాన పోటీ బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా, జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్, ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి గుప్తా మధ్య నెలకొంది. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, పోటీ ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యే కొనసాగుతోంది.యువ ఓటర్లే నిర్ణయాత్మకంబ్యాంకీపూర్లో సుమారు 3.69 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్లు దాదాపు 1.25 లక్షల మంది ఉన్నారు. యువతలో ప్రశాంత్ కిషోర్కు ఎక్కువ మద్దతు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. మరోవైపు మహిళలు, వయోజన ఓటర్లలో బీజేపీకి బలమైన మద్దతు కనిపిస్తోంది. -
అందరిచూపు ‘బాంకీపూర్’ వైపే..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన బిహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ స్థానం నుంచి బీజేపీ తమ యువ నేత అభిషేక్ కుమార్ను అభ్యర్థిగా నిలిబెట్టింది. జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ తన రాజకీయ జీవితంలో తొలి ఎన్నికను ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షం ఉమ్మడి మద్దతు లభిస్తుందన్న ప్రచారానికి చెక్ పెడుతూ ఆర్జేడీ గత ఎన్నికల్లో పోటీ చేసిన రేఖా గుప్తాను మరోసారి అభ్యర్థిగా ప్రకటించడంతో ఇక్కడ త్రిముఖ పోరుకు తెరతీసింది. బాంకీపూర్ బీజేపీకి బలమైన పట్టున్న నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. 1995 నుంచి వరుసగా ఈ స్థానాన్ని బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఈ స్థానం నుంచి నితిన్ నబిన్ ఐదు సార్లు, ఆయన తండ్రి నాలుగుసార్లు గెలిచారు. జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యాక నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అభిషేక్ను ఈసారి బరిలో నిలిపింది. నబీన్ మాదిరే అభిషేక్ సైతం కాయష్థ కులానికి చెందిన నేత. రాజకీయ వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్కు ఇది తొలి ఎన్నిక. బీజేపీ బలమైన కోటలోనే పోటీకి దిగడం ద్వారా తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ ఉపఎన్నికను ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా ఆయన అభివర్ణిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ బరిలోకి దిగిన తర్వాత బీజేపీని ఎదుర్కోవాలంటే మహాఘఠ్బంధన్ ఉమ్మడి అభ్యర్థిగా ఆయనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ వర్గాలు సూచించాయి. అయితే తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అందుకు అంగీకరించకుండా స్వంత అభ్యర్థి రేఖా గుప్తాను ప్రకటించింది. దీంతో విపక్షాల అనైక్యతతో ప్రతిపక్ష ఓట్లు చీలిపోయే అవకాశాలు పెరిగాయి.కుల సమీకరణాలే కీలకం...బాంకీపూర్ నియోజకవర్గంలో 3.91 లక్షల ఓటర్లలో కాయస్థ ఓటర్లు ప్రభావవంతమైన వర్గంగా పరిగణిస్తారు. వారి తర్వాత వైశ్య ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. ఓటర్లలో 14శాతం మంది కాయస్థులేనని, వీరి సంఖ్య దాదాపు 65వేలు ఉంటుందని అంచనా. యాదవ్ ఓటర్లు 12 శాతంతో రెండో స్థానంలో ఉండగా, ముస్లింలు 10 శాతం, చంద్రవంశీయులు 9, వైశ్యులు 9, దళితులు 8, భూమిహార్ 7, బ్రాహ్మణులు 7, రాజపుత్రులు 5, కుర్మీలు 5, కుష్వాహాలు 3 శాతం ఉన్నారు. బీజేపీ సంప్రదాయ కాయస్థ మద్దతును నిలబెట్టుకోవాలని చూస్తుండగా, ఆర్జేడీ వైశ్య, ముస్లిం, యాదవ్ ఓట్ల కలయికపై దృష్టి పెట్టింది. ప్రశాంత్ కిశోర్ అన్ని వర్గాల ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికలో సామాజిక సమీకరణాలే ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఘట్బంధన్లో విభేధాలతో పీకేకు కష్టాలు..బాంకీపూర్ ఉప ఎన్నిక ద్వారా తన రాజకీయ ఆరంగ్రేటాన్ని బలంగా చాటాలనుకున్న ప్రశాంత్ కిషోర్కు ప్రతిపక్షం నుంచే అవరోధాలు ఏర్పడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ భోజ్పూర్ ఎన్కౌంటర్, నీట్ విద్యార్థి కేసు, టెండర్ల కుంభకోణం, నిరుద్యోగం, అవినీతి వంటి తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతున్నారు. ఈ సమస్యలపై ప్రజలు తమ తీర్పును వెలిబుచ్చడానికి ఉప ఎన్నిక ఒక అవకాశమని అంటున్నారు. అయితే ఆయనకు ఉమ్మడి మద్దతివ్వాలన్న ప్రతిపాదనను ఆర్జేడీ పెడచెవిన పెట్టి రేఖా గుప్తాను పోటీలో నిలిపింది. ఆమె వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఈ వర్గం ఓట్లు, సంప్రదాయ ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంక్ కలిస్తే గట్టి పోటీ ఇవ్వవచ్చని ఆర్జేడీ అంచనా వేస్తోంది. ఆమె పోటీతో ఓట్ల చీలిక జరిగి బీజేపీకి లాభించడం ఖాయంగా కనిపిస్తోంది. -
తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ 2028.. అసలు గేమ్ మొదలైందా?
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ఆరంభించింది. ప్రధాని మోదీనే ఇందుకు శ్రీకారం చుట్టారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పర్యటించి వివిధ సభలలో పాల్గొన్నారు. ఆయన చేసిన ప్రసంగాలు గమనిస్తే.. 2028 శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేయాలన్న సంకల్పం కనిపిస్తుంది. ఆయన కొత్తగా అధ్యక్షుడు అయినందున భవిష్యత్తులో వచ్చే ఎన్నికలన్నీ ఆయన సామర్థ్యానికి పరీక్షలు అవుతాయి. జయాపజయాలపై పూర్తిగా ఆయనదే బాధ్యత కాకపోవచ్చు. కాని సహజంగానే ఆయనపై అందరి దృష్టి ఉంటుంది.నితిన్ చేసిన ప్రసంగాలలో కొన్ని కీలక అంశాలు కనిపిస్తాయి. పశ్చిమబెంగాల్లో మాదిరే విజయం సాధించాలని, అందుకోసం ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. తెలంగాణలో గెలుపుపై ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తే తప్పుకాదు. కాని మతపరమైన అంశాలతో ప్రజలను రెచ్చగొట్టడం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో లక్షల ఓట్ల తొలగింపు వంటివి జరుగుతాయా అన్న సందేహం వస్తుంది.బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండవచ్చు. కాని దానికి మించి బీజేపీ కేంద్రంలో తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి మమతను ఉక్కిరిబిక్కిరి చేయడానికి యత్నించింది. తన చేతిలో ఉండే సీబీఐ, ఈడి వంటి సంస్థలను విచ్చలవిడిగా టీఎంసీనేతలపై ప్రయోగించిందన్న విమర్శలు వచ్చాయి. తెలంగాణలో కూడా ఇలాంటి వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందా? అంటే లేదని చెప్పడం కష్టమే.గత పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఎనిమిది సీట్లను సాధించి బీజేపీ సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ బాగా బలహీనపడినట్లు కనిపించినా, తర్వాత యధా ప్రకారం ఆ పార్టీ అగ్రనేతలు బాగా యాక్టివ్ అయి టూర్లు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సాగిస్తున్నారు. అందువల్లే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. మాచ్ పిక్సింగ్ చేసుకుంటే తప్ప బీజేపీ అధికారంలోకి రాలేదని వ్యాఖ్యానించారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా అది బీజేపీకి ప్లస్ అవుతుందన్న నమ్మకం ఇంకా రా లేదు.జనంలో ఉన్న ఒక అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే ప్రధాన పోటీ ఉండవచ్చనిపిస్తుంది. అందుకే ఒక నెల రోజులలో తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు తయారు కావాలని నితిన్ నబీన్ పార్టీ నేతలను ఆదేశించారు. హైదరాబాద్లోని కార్పొరేషన్లకు జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయాలు సాధించాలని ఆయన నిర్దేశించారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు కలిసికట్టుగా ఎంత దూకుడుగా వెళతారు? కేంద్రంలో తమకు ఉన్న అధికారాన్ని ఇక్కడ కూడా ఏ మేరకు ప్రయోగిస్తారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను ఎదగనీయకుండా చేయడానికి ప్రత్యేక ప్రణాళికను ఏమైనా అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది.ఈ క్రమంలో బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధపడవచ్చని ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దికాలం క్రితం ఇదే మాట ఓపెన్గా చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న పొత్తులు కొనసాగిస్తారా? లేక అక్కడ కూడా ఒంటరిగా ఎదగడానికి యత్నిస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా బీజేపీ ఇక్కడ ఒంటరిగా పోటీచేస్తే ఏపీలో దాని మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి అన్న చర్చ వస్తుంది. పెద్దగా బలం లేకపోయినా, ఆ పార్టీలకు ఎంతో కొంతమంది అభిమానులు ఉంటారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు గురుశిష్యులుగా పేరొందారు.కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సభలో కర్నాటక ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్తో కలిసి చంద్రబాబు, రేవంత్లు పాల్గొన్నారు. డీ.కే మాట్లాడుతూ తాము ముగ్గురం కలిసి చరిత్ర సృష్టించబోతున్నామని వ్యాఖ్యానించారు. రేవంత్ను చంద్రబాబు పొగిడారు. తెలంగాణ అభివృద్ది కోసం రేవంత్ బాగా కష్టపడుతున్నారని, తెలంగాణ ప్రాజెక్టుల కోసం రేవంత్ రాజీ పడరని ప్రశంసించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటున్న సమయంలో బీజేపీ మిత్రుడైన చంద్రబాబు ఇలా కాంగ్రెస్ నేతను మెచ్చుకోవడం ఆసక్తికరమైన అంశమే. దీనిపై ఏమి మాట్లాడాలో బీజేపీ తెలంగాణ నేతలకు అర్థం కావడం లేదు. అందుకే ఏపీకే తమ మితృత్వం పరిమితమని, ఇక్కడ టీడీపీ తన సొంత వ్యూహం అమలు చేయవచ్చని వారు చెబుతున్నారు.మరో వైపు రేవంత్ రెడ్డి తనకు టీడీపీతో ఉన్న సంబంధాలను వాడుకుంటూ ఆ పార్టీకి కాస్తో, కూస్తో ఉన్న క్యాడర్ను, అభిమానులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి యత్నిస్తున్నారు. టీడీపీతో పాటు ఒక సామాజికవర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. టీడీపీ వారు కూడా కాంగ్రెస్కే మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ అధికార ప్రతినిదులు బహిరంగంగానే అకనాలెడ్జ్ చేస్తూ, టీడీపీ తమకే మద్దతు ఇస్తుందని టీవీ చర్చలలో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నగరపాలక సంస్థల ఎన్నికలు పలు రాజకీయ పరిణామాలకు కీలకంగా ఉండవచ్చు. ఈ ఫలితాల ప్రభావం భవిష్యత్తులో తెలంగాణ శాసనసభ ఎన్నికలపై పడే అవకాశం ఉంది.చంద్రబాబు వ్యూహాత్మకంగా రేవంత్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో పరోక్ష స్నేహం కొనసాగిస్తున్నారని, అలాగే చంద్రబాబు ద్వారా రేవంత్ బీజేపీ అగ్ర నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారన్న ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది. అయితే దీనికి ఇప్పటికిప్పుడు ఆధారాలు కనిపించకపోవచ్చు. కాకపోతే ప్రధాని మోదీ తన సభలో రేవంత్ను ఉద్దేశించి తమతో కలిసి పనిచేయాలని అంటూ చేసిన వ్యాఖ్యలను కొందరు ఉదహరిస్తుంటారు. అంతేకాక రేవంత్కు మోదీ అప్పాయింట్మెంట్ ఇచ్చే విధానాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తుంటారు.కాగా ఇటీవల మెట్రో రైల్ వివాదంలో రేవంత్ కోరిక మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చలు జరిగేలా చూశారు. అయినా మెట్రో రుణం విషయం కాని, రెండో దశ గురించి కాని స్పష్టత రాలేదు. రేవంత్కు సహకరిస్తున్నట్లు కనిపిస్తూనే బహుశా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బీజేపీ ఈ వ్యూహం అమలు చేస్తోందా అన్న అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని నితిన్ మండిపడ్డారట. ఒకవైపు అలాంటి ప్రాంతీయ పార్టీలతో జతకడుతూ, మరోవైపు ఇలా ఉపన్యాసాలు ఇస్తే వినే జనం ఆశ్చర్యపోవల్సిందే.వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని వీరు చెబుతారు. కాని అదే వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలతో మితృత్వం చేస్తుంటారు. అవకాశవాద రాజకీయాలకు బీజేపీ అతీతం కాదని చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ఏది ఏమైనా తన అధికారాన్ని అడ్డు పెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై వేదింపులు, అక్రమ కేసులు, సీబీఐ, ఈడి సంస్థల దాడులు వంటివి చేయకుండా ఫెయిర్ రాజకీయం చేసి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాని ప్రస్తుత బీజేపీ నాయకత్వం అలాంటి నిబద్దత కలిగిన రాజకీయం చేస్తోందా అన్నదే ప్రశ్న.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బీజేపీకి బిగ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో బీజేపీకి మరో శత్రువు లేడు. పార్టీలోనే ఒకరికి ఒకరు శత్రువులు ఉన్నారు. ఇదే పెద్ద సమస్య. ప్రధానమైన ఈ సమస్యను అధిగమిస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. పార్టీ అధికారంలోకి రావడం ఖాయం’అని రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అభయ్ పాటిల్ ఇటీవలి సమావేశంలో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అధినాయకత్వం చేసిన సీరియస్ హెచ్చరికలను రాష్ట్ర నేతలు సీరియస్గా తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో హాట్టాపిక్గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో వెనుకడుగుపై నిర్దిష్ట కార్యాచరణ రూపకల్పనలో రాష్ట్ర బీజేపీ విఫలమవుతున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నా యి. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను ఎండగట్టే విషయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైనా స్పష్టత కొరవడిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ముగ్గురు ముఖ్య నేతలు పర్యటించినా.... దాదాపు 40 రోజుల వ్యవధిలోనే బీజేపీకి చెందిన అగ్ర నాయకత్వ త్రయం తెలంగాణలో పర్యటించింది. మే 10న సికింద్రాబద్ పరేడ్గ్రౌండ్స్లో ప్రధాని మోదీ, జూన్ 12న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, జూన్ 28–30 తేదీల మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబిన్ పర్యటించారు. రాష్ట్ర పర్యటనల విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నా.. రాష్ట్ర బీజేపీ మొక్కుబడిగా అప్పుడప్పుడు క్షేత్రస్థాయి పోరాటాలు తప్ప ఓ స్పష్టమైన దీర్ఘకాలిక కార్యాచరణతో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయడంలో వెనుకడుగు తప్పడం లేదంటున్నారు. తెలంగాణలో పార్టీ పూర్తిస్థాయిలో పుంజుకొని, ప్రజల ఆదరణతో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు దశాబ్దాలుగా పార్టీ పుంజుకోవడం మళ్లీ ఎన్నికల ముందు చతికిలబడడం ఓ ప్రహసనంగా మారడంతో అధినాయకత్వం తలపట్టుకుంటోంది. అధిష్టానం ‘మందు బిళ్ల’పనిచేస్తుందా ? బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబిన్ మూడురోజుల పర్యటన సందర్భంగా రాష్ట్ర పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోవడం, సమన్వయ లేమి సమస్యలుండడాన్ని సహించబోమని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యనేతలు మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గ్రూపులుగా విడిపోవడం, పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడంపై పద్ధతి మార్చుకోవాలని మందలించినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రూపులను టాలరేట్ చేసే పరిస్థితి లేదని నితిన్నబిన్ స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంత పెద్ద నేతనైనా ఉపక్షించే పరిస్థితి లేదని గట్టి వార్నింగే ఇచ్చారు. బెంగాల్ కేడర్ కసి ఇక్కడెందుకు లేదు ? తాజాగా జరిగిన రాష్ట్ర కార్యవర్గభేటీలో పదేళ్లలో తృణముల్ కాంగ్రెస్ పాలనలో పశ్చిమబెంగాల్లో బీజేపీ కార్యకర్తలు ఎంతటి పీడన, అణచివేత, హత్యలు, అత్యాచారాలకు గురయ్యారో ఆ రాష్ట్ర ఇన్చార్జ్గా పనిచేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బన్సల్ వివరించారు. అక్కడ తృణమూల్ అరాచకాలను ఎదుర్కోవడంతోపాటు, 15 వేల మంది కార్యకర్తలు తప్పుడు కేసులతో జైళ్లకు వెళ్లినా వెనుకడుగు వేయకుండా పోరాడారని, అలాంటి నిబద్ధత, కచ్చితంగా ఫలితాలు సాధించాలనే కసి రాష్ట్ర పార్టీలో ఎందుకు కరువైందని ప్రశ్నించారు. రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గసభ్యుల్లో ఎవరు పని చేస్తున్నారు? ఎవరు టైంపాస్ చేస్తున్నారో అధిష్టానం దగ్గర పూర్తి సమాచారం ఉందని బన్సల్ హెచ్చరిచ్చినట్టు తెలిసింది. బెంగాల్లో కార్యకర్తల మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసు కేసులకు సైతం వెరవకుండా రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. -
త్రిలింగ భూమిపై కమలం వికసించాలి
సాక్షి, హైదరాబాద్/ఘట్కేసర్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు కౌంట్డౌన్ ప్రారంభమైందని.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కల సాకారం చేయాలని పార్టీ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం వెంటనే సడక్ సే సన్సద్ తక్ (గల్లీ నుంచి చట్టసభల దాకా) పోరుబాటకు శ్రీకారం చుట్టాలన్నారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ లక్ష్యాలను వివరించాలని సూచించారు. తెలంగాణలో పరివర్తన, ప్రజల గొంతుకగా వారి సమస్యలపై రోడ్లపైకి వచ్చి పోరాడితేనే అధికారం సాధ్యమని.. ఈ త్రిలింగ భూమిపై కమలం వికసించేలా పోరాడాలని కోరారు. మంగళవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అవుషాపూర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన నితిన్ నబీన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ల పాలనను తూర్పారబట్టడంతోపాటు తెలంగాణలో అధికారం చేపట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సొమ్ము రాహుల్ యాత్రలకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ పూర్తి చేయలేదని నితిన్ నబీన్ విమర్శించారు. మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు పేరిట లూటీకి తలుపులు తెరిచిందని దుయ్యబట్టారు. అవినీతి, నేరమయ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పర్యాయపదంగా మారిందని.. దేశంలోని తుక్డే తుక్డే గ్యాంగ్లతో చేతులు కలిపి పనిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రజల శ్రమతో సంపాదించిన డబ్బును ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ఢిల్లీకి తరలిస్తోందని.. ప్రజల డబ్బును, రైతులకు ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సొమ్మును రాహుల్ గాంధీ విదేశీ యాత్రలకు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.బీఆర్ఎస్ హయాంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదే అవినీతి, అక్రమాలను కొనసాగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ లెక్కలన్నీ తేలుస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామని ప్రకటించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎం.రఘునందన్రావు, గోడెం నగేశ్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమరయ్య, పార్టీ నేతలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్, రేఖా శర్మ, పొంగులేటి సుధాకర్రెడ్డి, చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. విభేదాలు వీడండి: సునీల్ బన్సల్ ‘తెలంగాణలో ఫైర్ ఉన్నా దానిని ఎలా ఉపయోగించుకోవడమే సమస్యగా మారుతోంది. మీలో మీరు కొట్టుకుంటున్నారు. దీంతో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితిని పక్కనపెట్టి అన్ని శక్తులను ఒకే దిశలో పెట్టే ప్రక్రియ అవసరం ’అని రాష్ట్ర కార్యవర్గ భేటీ ముగింపు సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ పేర్కొన్నట్లు సమాచారం. నేతలంతా టార్గెట్ తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ‘రాష్ట్రంలో బీజేపీకి మరో శుత్రువు లేదు. పార్టీలోనే ఒకరికొకరు శత్రువులు ఉన్నారు. ఇదే పెద్ద సమస్య. దీన్ని అధిగమిస్తే పార్టీ అధికారంలోకి రావడం ఖాయం’అని పార్టీ రాష్ట్ర ఇన్చార్జి అభయ్ పాటిల్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.తీర్మానాలు ఇవే...» కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కోసం రాష్ట్ర పార్టీ కృషి చేయాలని, ప్రభుత్వాన్ని గద్దె దించేలా పోరాడాలని రాష్ట్ర కార్యవర్గం రాజకీయ తీర్మానం ఆమోదించింది. » నిరుద్యోగ భృతి చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మరో తీర్మానం. » రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న రైతుల పక్షాన పోరాడాలని వ్యవసాయ రంగ తీర్మానం ఆమోదం. » ప్రధాని మోదీ పన్నెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలను ప్రశంసిస్తూ మరో తీర్మానం. » తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి ఎంతో సహకరిస్తోందని ఇంకో తీర్మానానికి ఆమోదముద్ర. గ్రూపులను సహించం.. కలిసి పనిచేయాల్సిందే పార్టీ ముఖ్య నేతలతో భేటీలో నితిన్ నబీన్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోవడాన్ని, సమన్వయ లేమి వల్ల పార్టీలో సమస్యలు తలెత్తడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంత పెద్ద నేతనైనా ఉపక్షించే పరిస్థితి లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇప్పటికైనా కొందరు నేతలు పద్ధతి మార్చుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలని ఆయన సూచించారని తెలిసింది. మంగళవారం రాష్ట్ర కార్యవర్గ భేటీ సందర్భంగా విడిగా ముఖ్య నేతలతో నితిన్ నబీన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, వైఫల్యాలు ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉన్నందున పార్టీ నేతలంతా కలిసిమెలిసి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పినట్లు తెలిసింది.రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకుప్రజలు సిద్ధంగా ఉన్నారు: రాంచందర్రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా పేరిట కూల్చివేతలతో సర్కార్ను ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. మూసీ ప్రక్షాళనపై బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే గాంధీ సరోవర్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రకటించి లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజలను నిర్వాసితులను చేయడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. బీజేపీకి అధికారం కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మంగళవారం ఘట్కేసర్ సమీపంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ మనలో మనం పోరాడకుండా, విభేదించుకోకుండా ‘టీమ్ బీజేపీ’గా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తిచేసుకుంటున్న సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి, ప్రతి అడుగులోనూ సహకరించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు రాంచందర్రావు కృతజ్ఞతలు తెలియజేశారు. నితిన్ నబీన్ నాయకత్వంలో తెలంగాణలో కూడా బీజేపీ విజయపతాకాన్ని ఎగురవేస్తుందనే పూర్తి విశ్వాసం ఉందన్నారు. -
తెలంగాణపై కాషాయ జెండా
సాక్షి ప్రతినిధి, వరంగల్: 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణపై కాషాయ జెండా ఎగురుతుందని.. బీజేపీ అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా జోస్యం చెప్పారు. ఆ లక్ష్య సాధన కోసం ప్రతి బూత్లో పార్టీని బలోపేతం చేయాలని.. కార్యకర్తలంతా ప్రజల్లో నిరంతరం ఉండాలని పిలుపునిచ్చారు.సోమవారం మధ్యాహ్నం హనుమకొండలో వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం గిరిజన నేతలతో సమావేశమైన ఆయన.. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన పార్టీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో మాట్లాడారు. బీజేపీ విజయానికి బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీలను వెన్నముకగా అభివర్ణించారు. వారి కృషి వల్లే దేశవ్యాప్తంగా కమలం వికసిస్తోందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర కీలకమన్నారు.తెలంగాణతో బీజేపీది పోరాటాల బంధంతెలంగాణతో బీజేపీకి కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదని.. అది పోరాటాల ద్వారా ఏర్పడిన బంధమని నితిన్ నబీన్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో బీజేపీ రాజకీయ లాభనష్టాలు చూడకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు మద్దతిచ్చిందని చెప్పారు. దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చారని గుర్తుచేశారు.బీజేపీ తెలంగాణకు కొత్త పార్టీ కాదన్న ఆయన.. 1980లో పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా గెలిచిన రెండు స్థానాల్లో ఒకటి తెలంగాణ నుంచే రావడం చారిత్రక విషయమన్నారు. అధికారం కోసం కాకుండా ప్రజాసేవ కోసం బీజేపీ పనిచేస్తోందని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గొంతుకగా, అధికారంలో ఉన్నప్పుడు మరింత సమర్థంగా ప్రజలకు సేవ చేయాలన్నదే పార్టీ సిద్ధాంతమని చెప్పారు.బీజేపీ కార్యకర్తలంతా పూర్తిస్థాయి ప్రజాసేవకులుగత ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను విస్మరించి రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని నితిన్ నబీన్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని కుటుంబ ప్రయోజనాల కోసం వినియోగించిందని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనలో ప్రజల ఆశలు నెరవేరలేదని, తెలంగాణకు నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల్లో కనిపించే పార్ట్టైమ్ రాజకీయ నాయకుడు అని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు మాత్రం 24 గంటలూ ప్రజల కోసం పనిచేసే ఫుల్టైమ్ ప్రజాసేవకులని కొనియాడారు.వరంగల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం: జి. కిషన్రెడ్డితెలంగాణలో బీజేపీ అధికారంలో లేకపోయినా వరంగల్ అభివద్ధికి కేంద్రం గణనీయమైన నిధులు కేటాయించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీకి వరంగల్పై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. కేంద్రం చేసిన అభివృద్ధిపై నివేదికతో సహా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వరంగల్కు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏం చేసిందని విమర్శించే వారికి పూర్తి వివరాలతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని... కేసీఆర్, రాహుల్ గాంధీ విమర్శలు వాస్తవాలకు విరుద్ధంగా ఉందని విమర్శించారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అత్యధికంగా కేంద్ర నిధులు వరంగల్కే వచ్చాయని.. కానీ వాటిని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. స్మార్ట్ సిటీ నిధులతో కరీంనగర్ అభివృద్ధి చెందగా వరంగల్లో అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురుతుందని.. బీజేపీ గెలిస్తేనే వరంగల్ సుందర నగరంగా మారుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్, జాతీయ, రాష్ట్ర నాయకులు రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, టి.రాజేశ్వర్రావు, దొంతి దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఆ మూడు వర్గాల సాధికారతతోనే రాష్ట్రాభివృద్ధియువత, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని నితిన్ నబీన్ చెప్పారు. ఆ మూడు వర్గాల సాధికారత ద్వారానే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ సిద్ధాంతంతో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రతి కుటుంబానికీ తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. -
ఫీజు బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
సాక్షి, హైదరాబాద్/ఘట్కేసర్: ‘తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను గాలికొదిలేసిందని విమర్శించారు. సోమవారం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఘట్కేసర్ వీబీఐటీ క్యాంపస్లో ‘వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాన్క్లేవ్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత్–భవిష్యత్ సవాళ్లు, 2047 వికసిత్ భారత్ లక్ష్యం, 12 ఏళ్ల మోదీ పాలన తదితర అంశాలపై పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నితిన్ నబీన్ సమాధానమిచ్చారు. మన యువతది తుక్డే తుక్డే మైండ్సెట్ కాదు‘ఇతర దేశాల్లో సాగుతున్న జెన్–జీ ఉద్యమాలను అందిపుచ్చుకోవాలంటూ కొన్ని రాజకీయశక్తులు మన దేశంలోని యువతను రెచ్చగొడుతున్నాయి. కానీ భారత్లోని జెన్–జీ ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కాదు. మన యువత అరాచకాలను విశ్వసించదు. ఇది రాళ్లు విసిరే తరం కాదు... జాతిని నిర్మించే తరం.. వారిది తుక్డే తుక్డే మైండ్సెట్ కాదు. యువ భారతీయులు దేశాభివృద్ధికి, నూతన ఆవిష్కరణలు, భవిష్యత్ భారతానికి వారి వంతు కృషి చేస్తున్నారు’ అని నితిన్ నబీన్ పేర్కొన్నారు. ‘జీవితానికి అడ్డదారులు ఉండవు...యువత, విద్యార్థులు ఏ విషయంలోనూ సత్వర మార్గాలు ఎంచుకోవద్దని.. జీవితానికి అడ్డదారులు ఉండవని నితిన్ నబీన్ సూచించారు. ‘జీవితం అనేది ఒక సుదీర్ఘ పరుగు. ఇది 100 మీటర్ల పరుగుపందెం కాదు. ఇది ఓపికకు పరీక్ష’ అని వివరించారు. జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సినంత సమయం తీసుకోవాలని.. కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి ఆ నిర్ణయం సరైనదా కాదా అనే చర్చ జోలికి వెళ్లరాదని సూచించారు. విద్యార్థులు వాస్తవికత ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని.. అప్పుడే వారిలోని అసలైన సామర్థ్యం బయటపడుతుందన్నారు.తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని.. అలా తొలినాళ్లలో తన భవిష్యత్తు ఏమవుతుందోనని గందరగోళానికి గురైనట్లు చెప్పారు. ఈ క్రమంలో తనకు లభించిన ఎలాంటి పనినైనా నిబద్ధతతో పూర్తి చేస్తూ అందులో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశానన్నారు. ఈ కాన్క్లేవ్లో నల్సార్, ఐఎస్బీ, హెచ్సీయూ, కేయూ, ఓయూ, ఐఐటీ, ఐఐఐటీ, హార్వార్డ్, ఎన్ఐటీ, ఇఫ్లూ, బిట్స్ తదితర విద్యాసంస్థల నుంచి దాదాపు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ఇన్చార్జి అభయ్ పాటిల్, మహారాష్ట్ర మంత్రి ఆశిష్ సెల్లార్, ఎంపీ రేఖా శర్మ, బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బీజేవైఎం అధ్యక్షుడు గణేశ్ కుండె, మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి, టెన్నిస్ క్రీడాకారిణి రష్మిక శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. -
నితిన్ నబీన్ పర్యటన పూర్తిగా ఫ్లాప్ షో: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన పూర్తిగా ఫ్లాప్ షోగా ముగిసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులు చిన్న సమావేశాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని, అలాంటి పరిస్థితిలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటనపై తాజాగా మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ..‘అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ విభజన రాజకీయాలను ఇప్పటికే తిరస్కరించారు. జీహెచ్ఎంసీ గురించి మాట్లాడే ముందు హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధించిన అన్ని అడ్డంకులను తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు బీజేపీ సిద్ధంగా ఉందా?. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నా సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో నితిన్ నబీన్ సమాధానం చెప్పాలి.తెలంగాణలో బూత్లు గెలుస్తాం, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుస్తాం అని ప్రగల్భాలు పలికే ముందు గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలి. తెలంగాణలో బెంగాల్ తరహా విభజన రాజకీయాలు సాగవని హెచ్చరించిన ఆయన, నగరాల పేర్లు మార్చడంపైనే బీజేపీ దృష్టి ఉందని, ప్రజల జీవితాలను మార్చే అభివృద్ధి ప్రణాళిక మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. సుష్మా స్వరాజ్పై తమకు గౌరవం ఉన్నప్పటికీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని అన్నారు. వారసత్వ రాజకీయాలను విమర్శించే బీజేపీ, ఎన్నికల అవసరాల కోసం వారసత్వ నాయకులను పార్టీలో చేర్చుకుంటోందని ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రాజెక్టుల వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ జాతీయవాదం పేరును ఉపయోగిస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. -
కార్పొరేషన్లు గెలవాలి.. కాంగ్రెస్ను దించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ను గద్దె దించడమే ధ్యేయంగా వచ్చే రెండున్నరేళ్లపాటు యావత్పార్టీ ముందుకు సాగాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబిన్ పిలుపునిచ్చారు. అధికార కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా ఎంపీలు మొదలు అన్ని స్థాయిల వారు తమ పరిధులు, క్షేత్రాల్లో పోరాడి, ఎక్కడికక్కడ ప్రజల మద్దతును కూడగట్టాలన్నారు. ఆదివారం రాత్రి బీజేపీ కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో జరగబోయే ప్రతీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని దిశానిర్దేశం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలోని ప్రతి గడపకు తీసుకెళ్లి రాష్ట్రాభివృద్ధి, ప్రజల పురోగతి కోసం అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనిపై వెంటనే యువమోర్చా ఆధ్వర్యంలో రోడ్డెక్కి విద్యార్థి, యువత మద్దతును కూడగట్టే దిశలో కార్యాచరణను ప్రారంభిస్తుందని ప్రకటించారు.రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ పూర్తిస్థాయిలో సహకరిస్తే..తెలంగాణ ఏర్పడ్డాక గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా చిదిమేశాయని మండిపడ్డారు. ప్రధానంగా నీటిపారుదల రంగంలో భారీ అవినీతికి తెరతీసి తెలంగాణలోని బీడుబారిన పొలాలకు సాగునీరు చేరకుండా అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. నెల రోజుల్లో వాతావరణం మారాలి: ‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యం. నెల రోజుల్లో ఆ వాతావరణం క్రియేట్ చేయాలి. ఎవరో వస్తారు కాదు. మీరు ఒక నేరేటివ్ క్రియేటివ్ చేయాలి. మీరు అది క్రియేట్ చేశాక అప్పుడు హైకమాండ్ నుంచి ఏం చేయాలో అది చేస్తాం. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి స్కోప్ ఉంది. కులపిచ్చి బంద్ చేయండి..మీరు ఇలాగే ఉంటే పార్టీ ముందుకు పోదు. ఇకనైనా మారండి. పార్టీ ఫస్ట్..లీడర్ నెక్టŠస్. ఎవరు ఏం చేస్తున్నారో నాకు ఐడియా ఉంది. కష్టపడి పని చేయండి. ఐక్యంగా ముందుకు సాగాలి. నేను గతంలో తెలంగాణలో పర్యటించాను. నాకు కొంత ఐడియా ఉంది. ఇవాళ తేదీ గుర్తు పెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇది గుర్తు చేసుకోవాలి’ అని నితిన్నబిన్ చెప్పారు. ఆదివారం ఆయన పాల్గొన్న మూడు సమావేశాల్లోనూ దశాబ్దాలుగా తెలంగాణతో బీజేపీకున్న అనుబంధం, కార్యకర్తల త్యాగం, బలమైన కేడర్ తదితరాలను ప్రస్తావించారు. మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని, అక్కడి నుంచి ఊట్పల్లిలో రంగారెడ్డి రూరల్ జిల్లా కార్యాలయం, మరో 8 జిల్లాల ఆఫీస్లను వర్చువల్గా ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలోని పోలింగ్ బూత్ల అధ్యక్షులను ఉద్దేశించి ప్రసంగించారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఘట్కేసర్లోని వీబీఐటీ క్యాంపస్లో ‘స్టూడెంట్స్ అండ్ యూత్ కాన్క్లేవ్’లో యువత, విద్యార్థులతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి భువనగిరి మీదుగా వరంగల్కు చేరుఒని, మధ్యాహ్నం 2 గంటలకు హనుమకొండలోని అశోక కన్వెన్షన్లో గిరిజన, ఆదివాసీ నాయకులతో, సాయంత్రం 4 గంటలకు వరంగల్లోని ఆర్ట్స్కాలేజీ గ్రౌండ్స్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో భేటీ జరగనుంది. రాత్రికి హైదరాబాద్కు చేరుకుంటారు. -
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే జరగనుందంటూ మరోసారి వార్తలు షికారు చేస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కంటే ముందుగానే భారీగా మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మార్పుల ప్రక్రియ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించనున్న కొత్త కార్యవర్గం ప్రకటనతో పాటే ఉండొచ్చని కూడా ఊహాగానాలు వినవస్తున్నాయి. త్వరలో నబీన్ ప్రకటించే జాబితాలో సంస్థాగతమైన కీలక బాధ్యతల్లో యువ నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే, నితిన్ గత వారం కొందరు కేంద్ర సహాయ మంత్రులతో చర్చలు జరిపినట్లు సమాచారం. వీరిని పార్టీ సంస్థాగత బాధ్యతల్లోకి తీసుకుని, చురుగ్గా వ్యవహరించే కొందరు పదాధికారులను ప్రధాని మోదీ కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో, కొందరు మంత్రుల శాఖలు కూడా మారే అవకాశం ఉంది. మంత్రివర్గంలో మార్పులు జూలైలో, అదీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కంటే ముందే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ తేదీని ఖరారు చేయనున్నారు. కీలక మంత్రిత్వ శాఖల్లో కొత్త రక్తాన్ని నింపాలనే ఆలోచనతో పాటు ప్రాంతీయ, సామాజిక సమీకరణాలు, విధేయత వంటి వాటికి కూడా సమతూకం పాటించాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రాలకు వరుసగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. బీజేపీ ’ఒక వ్యక్తి –ఒకే పదవి’ విధానం కారణంగా, వీరు కేబినెట్ నుంచి తప్పుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది. తిరుగుబాటు వర్గాలకు చోటు.. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), శివసేన (యూబీటీ) తిరుగుబాటు వర్గాలకు చెందిన ఎంపీలకు మంత్రి పదవులు దక్కవచ్చని చెబుతున్నారు. ఆప్ని వీడి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీల్లోకి ఒకరిద్దరికి కూడా అవకాశం లభించవచ్చు. ఆ ముగ్గురు గవర్నర్ల స్థానంలో.. ప్రస్తుత కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, బీఎల్ వర్మల రాజ్యసభ పదవీకాలం నవంబర్తో ముగియనుంది. వీరిని తిరిగి నామినేట్ చేయడంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అలాగే, కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్), మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, ఉత్తరాఖండ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ల పదవీకాలం మరికొద్ది నెలల్లో ముగియనుంది. వీరి స్థానాల్లో మంత్రివర్గంలోని కొందరిని పంపే అవకాశమూ ఉంది. ఏదేమైనా, ప్రధాని మోదీ తన కీలక నిర్ణయాలను చివరి నిమిషం వరకు అత్యంత గోప్యంగా ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. -
‘బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణ’
హైదరాబాద్: బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణలో విజయ ఢంకా మోగించడమేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచే తెలంగాణలో విజయానికి నాంది పలుకుతామన్నారాయన. వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి బీజేపీ సత్తా చూపెడతామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు కలిసినా బీజేపీని ఓడించలేవన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేపు(ఆదివారం) హైదరాబాద్కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వస్తున్నారని రాంచందర్ రావు తెలిపారు.తెలంగాణ వైపు బీజేపీ జాతీయ నాయకత్వం చూస్తుందివరంగల్ : తెలంగాణ వైపు బీజేపీ జాతీయ నాయకత్వం చూస్తుందన్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్,. పశ్చిమ బెంగాల్లో గెలిచి మొదటి మాసంలో చెప్పిన మాటలను నిలబెట్టుకున్నామన్నారు. 29వ తేదీన నితిన్ నబీన్ వరంగల్లో పర్యటించనున్నారని, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బూత్ లెవెల్ కార్యకర్తల సదస్సులో నితిన్ నబీన్ పాల్గొంటారని లక్ష్మణ్ తెలిపారు. జాతీయ అధ్యక్షుడి పర్యటనలో అన్ని వర్గాలను కలుస్తారని, గిరిజన నాయకులతో సమావేశం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆస్తులను వేలం వేసి దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో బీజేపీని కాదని కాంగ్రెస్ని గెలిపిస్తే.. పెనం మీద నుండి పొయ్యిలో పడ్టడ్లు అయ్యిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను పారిశ్రామిక అభివృద్ధి, ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. -
బీజేపీ కొత్త జట్టు రెడీ..!
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు ము హూర్తం దగ్గరపడింది. ఈ నెల 15తో అధిక మాసం ముగియనుండటంతో కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటన ఎప్పుడైనా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రాల స్థాయిలో సంస్థాగత ఎన్నికలు, అధ్యక్షుల నియామకాలు దాదాపు పూర్తి కావడంతో కేంద్ర సంస్థాగత నిర్మాణంపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో జరిగిన వరస సంప్రదింపులు, సంఘ్ పెద్దలతో చర్చలు కూడా ముగింపు దశకు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతుండటంతో వచ్చే వారం దీనిపై కలక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. యువత.. దక్షిణాది రాష్ట్రాలు.. ఓబీసీలు..కొత్త జాతీయ జట్టు కూర్పులో ప్రధానంగా యువత, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం, ఓబీసీలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక వేదికలైన పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ), జాతీయ మండలిలో ఈసారి గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గత దశాబ్దంలో పార్టీ విస్తరణకు సేవలందించిన సీనియర్లకు గౌరవప్రద స్థానం కొనసాగిస్తూనే, ఎన్నికల రాజకీయాల్లో చురుకుగా పనిచేసే కొత్త తరం నాయకులకు బాధ్యతలు అప్పగించే దిశగా కసరత్తు జరిగినట్లు సమాచారం.ముఖ్యంగా ఇటీవలి బెంగాల్, బిహార్, హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ విజయాలకు బాటలు వేసిన నేతలకు ప్రాధాన్యం ఇస్తూనే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జట్టు రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలు, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచే అంశంపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.తెలంగాణకు చెందిన కిషన్రెడ్డి, బండి సంజయ్, కర్ణాటకకు చెందిన విజయేంద్ర, ప్రహ్లాద్ జోషి, తమిళనాడు నుంచి ఎల్. మురుగన్, కేరళ నుంచి రాజీవ్ చంద్రశేఖర్, ఏపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి వంటి నేతలకు జాతీయ టీమ్లో ప్రాధాన్యం పెరిగే అవకాశాలపై ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇప్పటికే రాష్ట్ర విభాగాల నుంచి అభిప్రాయాలు సేకరించి, సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతౌల్యం, ఎన్నికల సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా తుది జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.కొత్త కార్యవర్గంలో 40–50 ఏళ్ల నాయకులకు ప్రాధాన్యం దక్కవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణలో చురుకుగా పనిచేసిన నేతలకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓబీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వడం దాదాపు ఖాయమనే అభిప్రాయం ఉంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా నాయకులకు కూడా కార్యవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.ఎన్నికల వ్యూహంలో కీలక పాత్ర పోషించిన కొంతమంది కేంద్ర మంత్రులు, సంస్థాగత నేతలకు అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. -
బీజేపీకి అన్నామలై రాజీనామా
సాక్షి,ఢిల్లీ: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు ఐదు పేజీల రాజీనామా లేఖ ఇచ్చారు. ఆ లేఖలో తమిళనాడులో బీజేపీ ఫెయిల్యూర్ గల కారణాల్ని వివరించారు. దీంతో పాటు ఐపీఎస్ పదవిని వదులుకొని బీజేపీలో చేరిన పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.మంగళవారం న్యూఢిల్లీలో అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అన్నామలై తన రాజీనామా లేఖ అందించారు. రాజీనామాతో అన్నామలై బీజేపీ, ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సెక్యులర్, తమిళ్ ఫస్ట్ అనే నినాదంతో వచ్చే వారంలో పార్టీ ప్రకటన ఉండొచ్చని తమిళ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ప్రస్తుతం బీజేపీలో భవిష్యత్తు కనిపించడం లేదనే వాదన ఆయన సన్నిహితుల ద్వారా బయటకొచ్చింది. ఈ క్రమంలో ఆయన అధిష్టానం ఇచ్చిన పలు ఆఫర్లను తిరస్కరించినట్లు సమాచారం. మొదట ఒక సామాజిక-రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి.. అనంతరం కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమాన భావజాలం కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలమైన వాలంటీర్ నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ‘వీ ది లీడర్స్’ సంస్థే భవిష్యత్ రాజకీయ ప్రాజెక్టుకు పునాదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అసలు కారణం చెప్పేసిన అన్నామలై!
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం మరింత బలపడుతోంది. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్తో ఆయన భేటీ కావడం.. ఆ భేటీ సారాంశం బయటకు రావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.ఇకపై తాను సొంత రాజకీయ మార్గంలో ముందుకు సాగాలనుకుంటున్నట్లు అన్నామలై పార్టీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీతో స్నేహపూర్వకంగానే విడిపోవాలని కోరుకున్నప్పటికీ, ఆయనను బీజేపీలోనే కొనసాగించాలని అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నామలై మాత్రం తన నిర్ణయంపై దృఢంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ప్రస్తుతం బీజేపీలో భవిష్యత్తు కనిపించడం లేదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన అధిష్టానం ఇచ్చిన పలు ఆఫర్లను తిరస్కరించినట్లు సమాచారం. మొదట ఒక సామాజిక-రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి.. అనంతరం కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమాన భావజాలం కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలమైన వాలంటీర్ నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ‘వీ ది లీడర్స్’ సంస్థే భవిష్యత్ రాజకీయ ప్రాజెక్టుకు పునాదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత జరగబోయే ఉపఎన్నికల్లోనే అన్నామలై తన రాజకీయ బలాన్ని పరీక్షించుకునే అవకాశం ఉందని తమిళనాట జోరుగా చర్చ మొదలైంది. ముఖ్యంగా.. తమిళగ వెట్రి కగళం అధినేత, సీఎం విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చిలోనే అన్నామలై పోటీ చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ.. తిరుచ్చిలో వీలు కాకుంటే అన్నాడీఎంకే నుంచి టీవీకేలో చేరిన ఎమ్మెల్యేల ప్లేస్లో ఉప ఎన్నికలు గనుక వస్తే.. ఏదో ఒక స్థానం నుంచి కూడా పోటీ చేయొచ్చని చర్చించుకుంటున్నారు.అన్నామలై నిష్క్రమణకు ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకోవడం కూడా ఈ పరిణామాలకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అన్నామలై దూకుడు ప్రచారాలు, పాదయాత్రలు, సోషల్ మీడియా వ్యూహాలతో బీజేపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. తమిళనాడులో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపారు.అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని అన్నామలై భావించారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఈ పొత్తు నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో మార్పులు కోరడంతో అన్నామలై అధ్యక్ష పదవి కోల్పోయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ విషయంలోనే ఆయన డీప్గా హర్టయినట్లు అధిష్టానానికి ఇచ్చిన తాజా వివరణతో స్పష్టమవుతోంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయకపోవడం, ప్రచారంలోనూ పెద్దగా కనిపించకపోవడం ఆయనను పార్టీ పక్కన పెట్టిందనే ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. బీజేపీకి గుడ్బై చెప్పి అన్నామలై తన దారి తాను చూసుకుంటారా? లేదంటే బుజ్జిగింపులకు లొంగిపోయి ఏదైనా ట్విస్ట్ ఇస్తూ బీజేపీతోనే కొనసాగుతారా?? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెర పడనుంది. -
బీజేపీలో భారీ ప్రక్షాళన.. కీలక మార్పులు!
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కాషాయ దళం సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో విస్తృత మార్పులకు శ్రీకారం చుట్టేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది. యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ పార్టీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించనుంది. ఈ నెలాఖరులోగా లేదా జూన్ మొదటి వారంలో ఇందుకు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని పార్టీ వర్గాలంటున్నాయి. 2029 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా సామాజిక సమీకరణాలు, యువత, మహిళలకు ప్రాధాన్యం అనే మూడు ప్రధాన అజెండాలతో ఈ ప్రక్షాళన చేపడతారని విశ్వసనీయంగా తెలుస్తోంది.నితిన్ నబీన్ నుంచే మొదలు బీజేపీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుల్లో ఒకరిగా నితిన్ నబీన్ ఇటీవలే నియమితులైన విషయం తెల్సిందే. ఆయన దగ్గర్నుంచే సంస్థాగత ప్రక్షాళన దిశగా పార్టీ ముందుకు సాగుతోంది. అయితే, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను పార్టీ సీరియస్గా తీసుకోవడంతో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ కాస్తంత వాయిదాపడింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తిరిగి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ జాతీయ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో సహా రాష్ట్ర ఇన్చార్జిలు, మోర్చాల బాధ్యతల్లో పెద్దఎత్తున మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా మోర్చా, యువమోర్చా విభాగాల్లో సమగ్రంగా మార్పులు చేపట్టనున్నట్లు సమాచారం.కొత్తగా నియమితులయ్యే నాయకుల్లో 55 ఏళ్లలోపు వారే అత్యధికంగా ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఇటీవలి కాలంలో పార్టీ 45–56 ఏళ్ల వయస్సున్న నాయకులను ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఎంపిక చేస్తోంది. బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి వయస్సు 56, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావ్కు 56 ఏళ్లు, విజయ్ శర్మకు 52 సంవత్సరాలు. ఇక బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి వయస్సు 55. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వయస్సు 50, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వయస్సు 53 ఏళ్లు. గుజరాత్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం కేబినెట్ సగటు వయస్సు 59 నుంచి 52కి తగ్గింది. అదే మాదిరిగా పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా కీలక మార్పులు ఉంటాయి’ అని పార్టీ జాతీయ నేత ఒకరు తెలిపారు.రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పనిచేసిన యువ నేతలకు జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం. సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారం, బూత్ స్థాయి నిర్వహణలో నైపుణ్యం ఉన్న నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో కొత్తగా చోటుచేసుకునే మార్పుల్లో భావజాలానికి కట్టుబడి పనిచేసిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల నేపథ్యం ఉన్న నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు చర్చలు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.కేంద్ర కేబినెట్లోనూ మార్పులు? పార్టీ నిర్మాణంతో పాటే కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ సైతం చేపట్టే అవకాశమున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీలోని యువత తో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తూ కొత్త వారిని కొందరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో 2021 నుంచి పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు.చదవండి: ఏడాది పాటు పసిడి కొనొద్దు.. పరిష్కారం ఇదిగో!మోదీ 2.0 రెండో దఫా ప్రభుత్వంలో చేరిన 34 మంది మంత్రుల్లో 19 మంది కేబినెట్ హోదాతో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు, శాఖల పనిభారం, రాజకీయ సమీకరణలపై సమీక్ష చేపట్టి, తదనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తారని అంటున్నారు. దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, సామాజిక వర్గాల సమీకరణ, యువతను ఆకర్షించడం, మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచడం వంటి లక్ష్యాలతోనే ఈ ప్రక్షాళన జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2029 లోక్సభ ఎన్నికలకు ముందుగానే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే కాషాయ దళ నేతల ప్రధాన వ్యూహంగా ఉంటుందని అంటున్నారు. -
నితిన్ నబిన్ (బీజేపీ అధ్యక్షుడు) రాయని డైరీ
పనంటే పూర్తయ్యేది కాదు. మొదలయ్యేది! ఇది మానవజన్మ సుకృతమా, లేక, మోదీజీ నాయకత్వానికి మాత్రమే పరిమితమైన శ్రమైక జీవన సౌందర్యమా?! ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్లో చివరి విడత పోలింగ్. ఆ రోజుతో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికలూ పూర్తయినట్లు. ఎన్నికలు ‘పూర్తవడం’ అన్నది చీఫ్ ఎలక్షన్ కమిషనర్కే గానీ, భారతీయ జనతా పార్టీ చీఫ్కి కాదు. పనితో మొదలై, మళ్లీ పనితోనే మొదలయ్యే ఆదీ అంతమూ లేని పదవీ కాలం బీజేపీ అధ్యక్షుడిది. అధ్యక్షుడిదే కాదు, పైనుంచి కింది వరకు పార్టీలోని ప్రతి కార్యకర్తదీ. జనవరిలో నేను జాతీయ అధ్యక్షుడిగా పనిలో పడ్డాక తొలిసారి జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలివి. ఉన్నచోట ఉన్నట్లు లేదు. తిన్న చోట తిన్నట్లు లేదు. పనే, నా కాలమూ దూరము, వేగము.మొత్తం 34 రోజులు, 65 రోడ్ షోలు! పశ్చిమ బెంగాల్లో 11 రోజులు, 22 రోడ్ షోలు; అస్సాంలో 9 రోజులు, 18 రోడ్ షోలు; కేరళలో 7 రోజులు; 12 రోడ్ షోలు; తమిళనాడులో 5 రోజులు; 8 రోడ్ షోలు; పుదుచ్చేరిలో 2 రోజులు, 5 రోడ్ షోలు. పనిలో ఉన్నవారికి అలసట ఉండదు. ప్రజల మధ్య ఉన్నవారికి భూమీ, ఆకాశం; బిహార్, ఢిల్లీ ఉండవు. బాలుర్ఘాట్లో ప్రచారం చేస్తున్నప్పుడు బాలకృష్ణుడి చేతి నిండా వెన్న ముద్ద పెట్టినట్లుగా, బెంగాల్ ప్రజలు ప్రతిచోటా నాకు తియ్యటి ‘మిష్టీదోయి’ తినిపించారు. నా గుండె నిండింది కానీ... గొంతు గడ్డ పెరుగు అయింది. 24 పరగణాల జిల్లాలోని నైహతిలో కూడా మిష్టీదోయిని నా నోటికి అందివ్వ బోయిన వారిని ఆత్మీయంగా ప్రతిఘటించి, ‘‘ఈ పెరుగుకు బదులుగా ఒక గ్లాసు మామూలు నీళ్లు ఇవ్వగలరా?’’ అని వేడుకున్నాను. మదురై రోడ్ షోలో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం రెండూ కలిసి ఉప్పొంగినట్లుగా జనం! నాలోంచీ భావావేశం ఉబికి వచ్చింది! తమిళంలో ‘‘వణక్కం’’ అంటూ చేతులు జోడించాను. ‘‘ఓ..’’ అంటూ ప్రజా హోరు! ఆ ఉద్వేగంలో పొరపాటున ‘‘భయ్యా..’’ అనేశాను. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. ఆ వెంటనే కేరింతలు కొడుతూ నవ్వులు. ‘‘నన్బా’’ అనబోయి అలవాటుగా ‘‘భయ్యా’’ అని అన్నానని తమిళ ప్రజలు నన్ను సరిగ్గానే అర్థం చేసుకున్నారు. ‘‘నా హృదయం బిహార్దే కావచ్చు. అంతకన్నా విశాలమైన సముద్రం మీ హృదయం..’’ అని వారికి ధన్యవాదాలు తెలిపాను. అస్సాంలోని కమల్పుర్ సమీపంలో ఒక ఏనుగు నెమ్మదిగా రోడ్డు దాటుతుండటంతో నా కాన్వాయ్ 15 నిముషాలు ఆగిపోవటం నాకొక ఆహ్లాదకరమైన జ్ఞాపకం. ఆ ‘వీఐపీ’ని ఫొటో తియ్యటం కోసం కారు దిగి వెళ్లాను. వన్యప్రాణుల రాజసానికి మోదీజీ ఒక్కరే దీటైనవారు అని ఆ క్షణాలలో నాకు అనిపించింది! ఆయనలో గర్జించే సింహమూ కనిపిస్తుంది, మనసుకు హాయినిచ్చే మయూరమూ పురి విప్పుతుంది. కేరళలో నిమ్మరసం, ఘాటైన మసాలాలు కలిపి తయారు చేసే అక్కడి సంప్రదాయ ‘సులేమానీ’ బ్లాక్ టీని గుటకేయటం కాస్త కష్టంగానే ఉన్నా, అందులో వారు జోడించిన ఆతిథ్య భావన పచ్చని కొబ్బరి చెట్ల వంటి ఆ రాష్ట్ర ప్రజలకు నన్ను కట్టిపడేసింది.పుదుచ్చేరిలో పార్టీ మండల అధ్యక్షులతో అర్ధరాత్రి జరిగిన సమావేశమైతే నాకొక ‘అత్యున్నత’ స్థాయి!! నాలోని జాతీయ అధ్యక్షుడు, పార్టీ మండల అధ్యక్షుడిగా మారిపోయాడు. పనినే మోదీజీగా భావించే వారికి పదవుల పట్టింపులు ఉంటాయా? మే 4న కౌంటింగ్. ఆ రోజున వచ్చేవి ఎన్నికల ఫలితాలు కావు. ఆ ఐదు రాష్ట్రాల ప్రజలు మోదీజీకి చేతి నిండా కల్పించే పనులు. ఆయన చేతుల మీదుగా పార్టీ కార్యకర్తల దోసిళ్లలోకి కురిసే బాధ్యతల బంగారు నాణేలు! -
‘ఆపరేషన్ లోటస్’.. బీజేపీలో చేరిన నలుగురు ఆప్ ఎంపీలు
ఢిల్లీ: బీజేపీ తలపెట్టిన ఆపరేషన్ లోటస్ సక్సెస్ అయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పది మంది రాజ్యసభ ఎంపీలలో ఏడుగురుని బీజేపీ ఆకర్షించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమక్షంలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా,అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ బీజేపీలో చేరారు. ఏడుగురు ఎంపీలు వీడడంతో ఆప్ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది.ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా ప్రకటించిన రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్లు శుక్రవారం ఢిల్లీలో పార్టీ అధినేత నితిన్ నబిన్ సమక్షంలో బీజేపీలో చేరారు. మిగిలిన నలుగురు ఎంపీలు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీలు ఉన్నారు. వారి ఏ పార్టీలో చేరుతారనేది స్పష్టత లేదు. అయితే, ఆ నలుగురు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆప్కు రాజీనామా వార్తలతో ఆ నలుగురు ఎంపీలతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ వారు అందుబాటులోకి రాలేదని సమాచారం.మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్లో అధికారంలో ఉన్న ఆప్ లక్ష్యంగా బీజేపీ భారీ ‘ఆపరేషన్ లోటస్’కు శ్రీకారం చుట్టింది. గతంలో పంజాబ్ ఇంఛార్జిగా పని చేసిన రాఘవ్ చద్దాను ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ పక్కన బెట్టారు. ఈ అసంతృప్తితో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.అదే సమయంలో కమలం నేతలు రాఘవ్ చద్దా ద్వారా ఆప్లో చీలిక తెచ్చింది.పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పంజాబ్లో బీజేపీ అధికారంలోకి రావాలని పార్టీ అధిష్టానం ఆశిస్తోంది. మొన్నటి దాకా అకాలీ దళపై ఆధారపడ్డ బీజేపీ..ఇక నుంచి పంజాబ్లో సొంతంగా ఎదగాలని దూకుడుగా వెళ్తోంది. Today, exercising the provisions of the Constitution of India, more than two-thirds of the AAP MPs in the Rajya Sabha have merged with the BJP.Seven MPs have signed the document, which was submitted to the Hon’ble Chairman of the Rajya Sabha.I, along with two other MPs,…— Raghav Chadha (@raghav_chadha) April 24, 2026 -
రాజ్యసభకు నితీశ్, నితిన్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. బిహార్లోని ఐదు, ఒడిశాలో నాలుగు, హరియాణాలో రెండు సీట్లకు సోమవారం జరిగిన పోలింగ్లో బీజేపీ అత్యధిక సీట్లను దక్కించుకుంది. 11 సీట్లకు గాను బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. ఒకటి బీజేడీకి, మరోటి బీజేపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థికి దక్కింది.హరియాణాలో కౌంటింగ్ నిలిచిపోవడంతో ఫలితం వెల్లడి కాలేదు. బిహార్ నుంచి ఖాళీ అవనున్న మొత్తం ఐదు స్థానాలను ఎన్డీయే క్లీన్స్వీప్ చేసింది. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్, నితిన్ నబీన్లతోపాటు జేడీయూ నేత, కేంద్ర మంత్రి రాంనాథ్ ఠాకూర్, బీజేపీ నేత శివేశ్ కుమార్, రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా ఎన్నికయ్యారు.ఐదు సీట్లకుగాను ఆర్జేడీకి చెందిన అమరేంద్ర ధారి సింగ్ సహా ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, వరుసగా రెండో విడత గెలవాలన్న అమరేంద్రకు మహాగఠ్బంధన్ నుంచి సహకారం కరువైంది. దీంతో, ఆయన ఓడిపోయారు. కాగా, బిహార్కు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన నితీశ్ కుమార్ ఇటీవల రాజ్యసభకు వెళ్లనున్నట్లు చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్య పర్చింది. రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆయన త్వరలోనే రాజీనామా చేస్తారని భావిస్తున్నారు.ఒడిశాలో బీజేపీకి రెండు సీట్లుఒడిశాలో అధికార బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్, పార్టీ ఎంపీ సుజీత్ కుమార్ 35 చొప్పున ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అధికార అభ్యర్థి సంతృప్త్ మిశ్రా 31 ఓట్లతో గెలిచారు. బీజేపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే కూడా గెలిచారు. తమ 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులకు ఓటేశారని బీజేడీ ఆరోపించింది. కాంగ్రెస్ కూడా తమ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసినట్లు పేర్కొంది. -
రాజ్యసభకు నితిన్ నబీన్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు సన్నాహాలను వేగవంతం చేసింది. మంగళవారం 9 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ను బిహార్ నుంచి బరిలోకి దించనుంది.తొలివిడతగా మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఖాళీ అయ్యే స్థానాలకు బీజేపీ ప్రకటించిన పేర్లు ఇవే..బిహార్ నుంచి నితిన్ నబీన్, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి శివేష్ కుమార్, అసోంనుంచిఎమ్మెల్యే తెరాష్ గోవాలా, రాష్ట్ర మంత్రి జోగెన్ మోహన్, ఛత్తీస్గఢ్ నుంచి పార్టీ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షురాలు లక్ష్మీ వర్మ, హరియాణా నుంచి లోక్సభ మాజీ ఎంపీ సంజయ్ భాటియా, ఒడిశా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, రాజ్యసభ ఎంపీగా ఉన్న సుజీత్ కుమార్, పశ్చిమ బెంగాల్ నుంచి పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్ రాహుల్ సిన్హా ఉన్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలకు ఈనెల 16వ తేదీన పోలింగ్ జరగనుంది. -
రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎంపిక
ఢిల్లీ: ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన నితిన్ నబీన్ను రాజ్యసభకు పంపనుంది పార్టీ అధిష్టానం. ఈ మేరకు 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. బిహార్ నుంచి నితీన్ నబీన్తో పాటు శివేష్ కుమార్లను రాజ్యసభకు ఎంపిక చేసింది. వీరిద్దరితో పాటు మిగతా వారి వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం నుంచి తేరాష్ గోవాలా,జోగెన్ మోహన్ఛత్తీసగఢ్ నుంచి లక్ష్మి వర్మహర్యానా సంజయ్ భాటియాఒడిశా నుంచి నుంచిమన్మోహన్ సామల్, సుజిత్ కుమార్పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాసొంత రాష్ట్రమైన బిహార్ నుంచి నితిన్ నబీన్..ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్ నబీన్ ఇన్నాళ్లూ బిహార్లో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన్ను కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ బంకీపూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ముందున్న 5 రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే అత్యంత కీలకమైన ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ, అసెంబ్లీకి హాజరవ్వడం అంత సులభమేమీ కాదు. అటు ఎమ్మెల్యేగా, ఇటు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ద్వంద్వ పాత్రలు పోషించడం కష్టమని అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే ఆయనను ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే మాదిరిగా మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాజ్యసభకు పంపారు. వచ్చే ఏప్రిల్లో బిహార్లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనిలో భాగంగానే రాజ్యసభ సభ్యుల ఎంపికను షురూ చేసింది బీజేపీ. -
నేటి నుంచి బెంగాల్లో బీజేపీ ‘పరివర్తన్ యాత్ర’
సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాషాయదళం ముందుకు సాగుతోంది. పోలింగ్కు ముందు పార్టీ శ్రేణులను సన్న ద్ధం చేసేలా బృహత్ కార్యాచరణతో ముందుకెళుతోంది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేలా ఆదివారం నుంచి వారం పాటు ‘పరివర్తన్ యాత్ర’కు శ్రీకారం చుట్టింది. 260 భారీ సభలు..2021 అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ బీజేపీ 77 సీట్లు గెలుచుకుంది. ఈసారి 160 స్థానాలు లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో తృణముల్ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాత్రను మొదలు పెట్టనుంది. రాష్ట్రంలో రాజ్యాంగం అమలుకావడం లేదని, మహిళలపై నేరాలు పెరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తోంది. ముఖ్యంగా రైతులకు లబ్ధి చేకూర్చే పీఎం కిసాన్ వంటి పథకాలు రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదని చెబుతోంది. అక్రమ ఓటర్లు, చొరబాటుదారుల అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ జాతీయ భద్రతపై టీఎంసీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. వీటన్నింటినీ తమ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇందుకుగాను 260 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు, 250 చిన్నచిన్న సమావేశాలు ఏర్పాటు చేస్తూ మొత్తంగా 5 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేలా యాత్రను డిజైన్ చేశారు. దీనిద్వారా ప్రత్యక్షంగా కోటిన్నర మంది ప్రజలను కలవాలన్నది లక్ష్యంగా ఉంది. ఆదివారం ప్రారంభం కానున్న ఈ యాత్రలో తొలిరోజు కూచ్బెహర్ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరు కానుండగా, నదియా ఉత్తర్లో మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఘార్గ్రామ్లో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పురులియాలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి పాల్గొననున్నారు. 2వ తేదీన దక్షిణ 24 పరగణాలు, మథురాపూర్, రాయదిఘి సభలకు హోంమంత్రి అమిత్ షా, హౌరా, హూగ్లీ జిల్లాల సభలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాద్వాన్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు సభలకు హాజరు కానున్నారు. ఈ యాత్ర చివరి రోజు నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా ఈ యాత్ర ముందుకు సాగనుంది. -
రాజ్యసభ సీట్లపై బీజేపీ వ్యూహాం.. 21 టార్గెట్!
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకునేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 37 స్థానాల్లో కనీసంగా 21 స్థానాలను తన ఖాతాలో వేసుకునే దిశగా కసరత్తులు మొదలుపెట్టింది. మొత్తం సీట్లలో 19 స్థానాలు కచ్చితంగా ఎన్డీఏ పక్షాలకు దక్కుతాయని రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి. మరో రెండు సీట్లను కొద్దిపాటి సర్దుబాట్లతో దక్కించుకోవచ్చన్న అంచనాతో ఆ దిశగా రాష్ట్రాల నేతలతో బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు మొదలుపెట్టింది. మెజార్టీ సీట్లే లక్ష్యంగా కసరత్తు..ప్రస్తుతం 245 సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీయేకు 133 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి సొంతంగా 103 సీట్లున్నాయి. మెజారిటీకి అవసరమైన 123 సీట్లకు ఇంకా కొంత దూరంలోనే ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అధికార బీజేపీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో 10 రాష్ట్రాల ముఖ్య నేతలతో ఇప్పటికే బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబిన్, అగ్ర నేతలు చర్చలు మొదలుపెట్టారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. 288 మంది ఎమ్మెల్యేలున్న మహారాష్ట్రలో ఎన్డీయేకు 235 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఖాళీ అయిన 7 స్థానాల్లో కనీసం 6 స్థానాలు ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉంది.బీహార్లో ఎన్డీఏ పక్షాలకు ఉన్న బలం ఆధారంగా 5 స్థానాలకుగాను 4 స్థానాలు గెలుచుకోవడం ఖాయంగా కని్పస్తోంది. ఐదో స్థానంపై ఎన్డీఏ కూటమి ఆశలు పెట్టుకుంది. ఐదో స్థానం గెలిచేందుకు ప్రతిపక్ష శిబిరం నుంచి ముగ్గురు శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఎన్డీఏకు దొరకడం అంత కష్టమేమీ కాదనేది పార్టీ వర్గాల అంచనా. ఒడిశాలో 4 స్థానాలకు గానూ రెండింటిలో ఎన్డీఏ, మరొక సీటును ప్రతిపక్ష పార్టీలు గెలుచుకునే అవకాశం ఉంది. మరో సీటును ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే బీజేడీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం.హరియాణాలో రెండు సీట్లకుగాను ఒక సీటు బీజేపీ ఖాతాలో పడగా మరో సీటుకు ఏ పారీ్టకి తగినంత బలం లేదు. దీంతో ఆ సీటుపైనా బీజేపీ కన్నేసింది. వరుసగా రెండు పర్యాయాలు పూర్తిచేసిన వారిని పక్కనపెట్టడం, పార్టీ జాతీయస్థాయి పదవుల్లో ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, వయోపరిమితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ మార్చినెల తొలివారంలో అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ఆరంభించింది.బీహార్ నుంచి నితిన్ నబిన్.. ప్రస్తుతం బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు బిహార్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీయూకి చెందిన కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్లకు తిరిగి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ను బిహార్ రాష్ట్రం నుంచే రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. కొత్తగా పార్టీ తీర్థం పుచ్చుకున్న భోజ్పురి నటుడు పవన్ సింగ్కు ఇదే రాష్ట్రం నుంచి సభ్యత్వం దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్దాస్ అథావాలేకు తిరిగి రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయి. ఒడిశా లేదా హరియాణా రాష్ట్రం నుంచి మాజీ కేంద్ర మహిళా మంత్రి స్మృతీ ఇరానీని రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
కమీషన్ల సర్కార్.. వసూళ్ల రాజ్యం!
మహబూబ్నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధితెలంగాణలో కమీషన్ల సర్కార్ నడుస్తోందని, వసూళ్ల రాజ్యం కొనసాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాహుల్గాం«దీ–రేవంత్రెడ్డి (ఆర్ఆర్) ట్యాక్స్, హఫ్తా, కమీషన్లు వసూలు అవుతున్నాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రజల్లోకి వెళతామని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేసేలా కార్యాచరణకు రూపకల్పన చేస్తామని తెలిపారు. బుధవారం మహబూబ్నగర్లో బీజేపీ బూత్స్థాయి కార్యకర్తల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇలాగైతే ఎక్కువ కాలం అధికారంలో ఉండలేరు.. ‘తెలంగాణలో కొన్ని నెలలుగా వరసగా దేవాలయాలు, గుళ్లపై దాడులు, కూల్చివేతల ఘటనలు జరుగుతున్నాయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇదే పద్ధతి కొనసాగిస్తే ఎక్కువకాలం అధికారంలో ఉండలేరు. సనాతన, హైందవ ధర్మంపై దాడులను బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. వాటిని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడే ప్రసక్తే లేదు’ అని నితిన్ నబీన్ అన్నారు.హామీలు నెరవేర్చకుండా మోసం ‘ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలను నారీశక్తిగా మార్చేందుకు, స్వశక్తితో నిలిపేందుకు కృషి చేస్తుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారికిచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తోంది. ప్రతి మహిళకు నెలకు రూ.రెండున్నర వేలు, కళ్యాణలక్ష్మీ కింద తులం బంగారం వంటి వాగ్దానాలను ఎప్పుడో మరిచిపోయింది. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఎలాంటి తేడా లేదు. కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి మహిళలకు ఈ విషయాలన్నీ వివరించాలి. ప్రస్తుతం జరుగుతున్న మోసం, దగాపై పోరాడాలి. కాంగ్రెస్ రైతులు, రైతుకూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన ఒక్కహామీని కూడా నెరవేర్చలేదు. ఈ వర్గాలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో ఈ సర్కార్కు తగిన బుద్ధి చెప్పాలి..’అని నితిన్ నబీన్ విజ్ఞప్తి చేశారు. రేవంత్ సర్కార్వి సంతుషీ్టకరణ రాజకీయాలు ‘రాష్ట్రంలో రేవంత్ సర్కార్ సంతుïÙ్టకరణ రాజకీయాలు చేస్తూ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కించపరుస్తోంది. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెబుతూ నిస్సిగ్గుగా ముస్లిం ఓట్బ్యాంక్ కోసమే పనిచేస్తూ కాంగ్రెస్ చరిత్రను చాటుతోంది. అల్పసంఖ్యాక వర్గాల ఓట్ల కోసం వక్ఫ్ భూముల్లో అక్రమాలకు వంత పాడుతున్నారు. దీనికి ధీటైన జవాబు ఇవ్వాల్సిన అవసరముంది. బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు (8 శాతం ఓటింగ్), 2024 లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు (35 శాతం ఓటింగ్) గెలిచేలా ప్రజలు మద్దతు పలికారు. ఈ ఎన్నికల తర్వాత ఏ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీ గెలుపొందుతోంది. మహారాష్ట్ర, బిహార్, చండీగఢ్, కేరళ, గోవా తదితర రాష్ట్రాల్లో జరిగిన వివిధ ఎన్నికల్లో పార్టీ విజయదుందుభి మోగించింది. ప్రతి బూత్లో 50% పైగా ఓటింగ్ సాధించాలి రాష్ట్రంలో కూడా బీజేపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నందున రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లో 50 శాతానికి పైగా ఓటింగ్ సాధన లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వ విజయాలు, ప్రజలకు వివిధ పథకాల ద్వారా అందిస్తున్న ప్రయోజనాల గురించి ప్రజలకు కార్యకర్తలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనూ కమలం వికసించేలా..యువ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా, అన్నివర్గాల ప్రజల్లో సంతోషం వెల్లివిరిసేలా చేయాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం. ఆ తర్వాత 2028లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం కూడా ఖాయం. అయితే బీజేపీ అధికారం కోసం ప్రాకులాడడం లేదు. రాష్ట్ర భవిష్యత్, ఇక్కడి ప్రజల క్షేమం, అభ్యున్నతే లక్ష్యం. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రోడ్డు, రైల్వే కారిడార్లు, రెండు ఇండ్రస్టియల్ కారిడార్లు, మరెన్నో ప్రయోజనాలు చేకూరేలా చేశారు. రాష్ట్ర ప్రజల పట్ల మోదీకున్న ప్రేమాభిమానాలను ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం తెలంగాణ ప్రజల పక్షానే ఉందని చెప్పడానికి ఇదే తార్కాణం..’అని బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. అంతకుముందు శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాం అమ్మవారికి, మైసిగండి ఉమామహేశ్వర అమ్మవారికి, తెలంగాణ విమోచన పోరాట యోధులకు, సర్దార్ వల్లభాయ్పటేల్కు నమస్సుమాంజలి ఘటించారు. తాజాగా పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారికి అభినందనలు తెలియజేశారు. మళ్లీ ఏప్రిల్లో వస్తా.. ‘మున్సిపల్ ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేయండి...మంచి ఫలితాలు సాధించండి... జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తా.. ఈ సారి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలి..మళ్లీ ఏప్రిల్లో వస్తా..’ అని నితిన్ నబీన్ మహబూబ్నగర్ నుంచి తిరుగు ప్రయాణంలో రాష్ట్ర పార్టీ నేతలకు చెప్పినట్లు రాంచందర్రావు ‘సాక్షి’ కి తెలిపారు. ఘన స్వాగతం శంషాబాద్: నితిన్ నబీన్ తొలిసారి తెలంగాణ పర్యటన సందర్భంగా బీజేపీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, రాజసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. -
రాజ్యసభకు నితిన్ నబీన్?
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నూతన అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ మరికొద్ది నెలల్లో రాజ్యసభ సభ్యత్వం తీసుకోబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం బిహార్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నబీన్ను ఏప్రిల్లోనే రాజ్యసభకు ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన సొంత రాష్ట్రమైన బిహార్ నుంచే ఆయన ఎంపిక ఉండవచ్చని తెలుస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్ నబీన్ ఇన్నాళ్లూ బిహార్లో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన్ను కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ బంకీపూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ముందున్న 5 రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే అత్యంత కీలకమైన ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ, అసెంబ్లీకి హాజరవ్వడం అంత సులభమేమీ కాదు. అటు ఎమ్మెల్యేగా, ఇటు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ద్వంద్వ పాత్రలు పోషించడం కష్టమని భావిస్తున్నారు. ఆయనను రాజ్యసభకు పంపడం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో ఇదే మాదిరిగా మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాజ్యసభకు పంపిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నాయి. వచ్చే ఏప్రిల్లో బిహార్లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఖాళీ అవుతున్న స్థానాల్లో రెండింటిని బీజేపీ తీసుకొని, మిగతా మూడింటిని కూటమి పార్టీలకు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. తమ రెండింటిలో ఒక స్థానం నుంచి నబీన్ను రాజ్యసభకు పంపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో స్థానం నుంచి భోజ్పురి నటుడు పవన్ సింగ్కు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
బీజేపీ నూతన సారథికి ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల’ సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళపతిగా బాధ్యతలు చేపట్టిన నలభై ఐదేళ్ల నితిన్ నిబీన్కు తొలి అడుగులే అగ్నిపరీక్షగా నిలవనున్నాయి. కొద్ది నెలల్లో జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల రూపంలో ఆయన తక్షణ సవాలు ఎదురుకానుంది. ముఖ్యంగా బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణముల్కు ఎదురొడ్డి పార్టీని అధికారంలోకి తేవడం కత్తిమీద సామే కానుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించే ప్రణాళిక ఏ మేరకు ఫలించేదీ తమిళనాడు, కేరళ ఎన్నికలు తేల్చనున్నాయి. వీటికి తోడు పార్టీపరమైన సమన్వయం, ఎన్డీఏ భాగస్వాములు, ఇతర మిత్రపక్షాలతో సమన్వయం, పంచాయతీ నుంచి పార్లమెంట్ స్థాయి దాకా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత నబీన్ భుజస్కంధాలపై ఉంది.ఆ మూడు రాష్ట్రాలే అసలు సవాలు కొద్ది నెలల్లో జరగనున్న బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలు నబీన్కు అత్యంత కీలకం కానున్నాయి. వాటిలో బెంగాల్ను బీజేపీ అత్యంత సీరియస్గా తీసుకుంటోంది. పదిహేనేళ్లుగా అప్రతిహాతంగా సాగుతున్న తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అధికారానికి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. బెంగాల్ అసెంబ్లీలో 294 సీట్లకు గాను మమత పార్టీకి 223, బీజేపీకి కేవలం 65 సీట్లున్నాయి. ఈ పరిస్థితుల్లో 150 సీట్ల మెజారిటీ మార్కును చేరుకోవడం బీజేపీకి గట్టి సవాలేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.2024 లోక్సభ ఎన్నికల్లోనూ బెంగాల్లో బీజేపీ గ్రాఫ్ దిగజారింది. 2019లో 18 సీట్లు నెగ్గగా పోయినసారి ఆరింటిని కోల్పోయి 12 స్థానాలతో సరిపెట్టుకుంది. తృణముల్ ఎంపీ స్థానాలు 22 నుంచి 27 స్థానాలకు పెరిగాయి. కోల్కతాతో పాటు చాలా నగర ప్రాంతాల్లో బిహారీ వలసదారులు ఎక్కువ. కనుక అటు నుంచే నరుక్కు రావాలన్నది నబిన్ యోచన. జాతీయ భద్రత, జీవనోపాధి, శాంతిభద్రతలు, వలసలు తదితరాలపై విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు తృణమూల్కు బలమున్న చోట బీజేపీ ఓటు శాతం పెంచే, గ్రామీణ ఓటర్లతో బీజేపీకి అనుబంధం పెంచే చర్యలపై కొత్త అధ్యక్షుడు దృష్టి పెట్టే అవకాశముంది. ప్రజల్లో గుర్తింపున్న నేతలకే టికెట్లని నబీన్ ఇప్పటికే శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు పంపారు.తమిళనాట... ఇక దక్షిణాదిలో కీలకమైన తమిళనాడులో ఈసారైనా పట్టు సాధించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. డీఎంకే ప్రభుత్వ అవినీతి, విద్య, ఉద్యోగ రంగాల్లో వైఫల్యాలు, వాగ్దానాల అమలులో వైఫల్యాల వంటి అంశాల్లో ప్రజల్లోకి వెళ్లేలా కొత్త అధ్యక్షుడు ప్రణాళిక రచించారు. రాష్ట్రంలో సొంతంగా విజయం సాధించే పరిస్థితులు లేనందున అన్నాడీఎంకేతో (AIDMK) పొత్తు, ఇతర చిన్న పార్టీల మద్దతు ద్వారా ఓటు బ్యాంకును విస్తరించాలని భావిస్తున్నారు. ఓబీసీ, దళిత వర్గాలతో పాటు యువత, మహిళలను ఆకర్షించేలా కార్యక్రమాల నిర్వహణ, బూత్ స్థాయిలో బలహీనంగా ఉన్న కేడర్ను బలోపేతం చేయడం, స్థానిక భాషలో సోషల్ మీడియా ప్రచారానికి ప్రాధాన్యతపై నబీన్ ఫోకస్ చేసే అవకాశముంది.234 అసెంబ్లీ స్థానాలకు గాను పార్టీ గెలవగలిగే అవకాశామున్న 65 స్థానాలను ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తోంది. ఎన్నికల పొత్తు దిశగా అన్నాడీఎంకేతో వారంలో చర్చలు మొదలవనున్నాయి. కేరళలో బీజేపీ ఇప్పటికే ‘మిషన్–2026’పేరుతో భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు దీటుగా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా దూకుడు పెంచింది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో సాధించిన చరిత్రాత్మక విజయం బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అక్కడ 45 ఏళ్ల తర్వాత ఎల్ల్డీఎఫ్కు కమలం పార్టీ చెక్ పెట్టడం తెలిసిందే. ఈ విజయాన్ని అసెంబ్లీ ఎన్నికలకు పునాదిగా మార్చుకోవాలని చూస్తోంది.చదవండి: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, కార్యకర్తల శిక్షణ, ముందస్తుగా అభ్యర్థుల ఎంపిక వంటివి మొదలయ్యాయి. గ్రామాల నుంచి నగరాల దాకా ఓటర్లను నేరుగా కలిసే ప్రచారానికి ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర నేతలకు కొత్త అధ్యక్షుడు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అయితే కేరళలో దశాబ్దాలుగా బలంగా ఉన్న వామపక్ష రాజకీయాలు, జాతీయ పార్టీల పట్ల సంప్రదాయ వ్యతిరేకత బీజేపీకి పెద్ద సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో తొలిసారి ఓటేసే నవ యువతను తమ వైపు తిప్పుకోవడంతో పాటు కీలకమైన విద్య, ఉద్యోగాలపై ప్రచారం చేయాలన్నది కొత్త అధ్యక్షుని వ్యూహమని బీజేపీ నేతలు చెబుతున్నారు. -
పార్టీ వ్యవహారాల్లో... నబీన్ నా బాస్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రస్థానంలో నూతన శకానికి తెర లేచింది. బిహార్కు చెందిన యువ నాయకుడు నితిన్ నబీన్ సిన్హా పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమం ఇందుకు వేదికైంది. బీజేపీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో 45 ఏళ్ల నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు.ఈ మేరకు సర్టిఫికెట్ను ఆయనకు అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఐదో అంతస్తులోని చాంబర్లో ప్రస్తుత అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా నుంచి నబీన్ లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అతిరథ మహారథులంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, పుష్కర్ సింగ్ ధామి, నయాబ్ సింగ్ సైనీ, ప్రమోద్ సావంత్, ముఖ్యమంత్రి పేమా ఖండు తదితరులు వీరిలో ఉన్నారు. మోదీతో పాటు వారంతా నబీన్ను స్వయంగా అధ్యక్ష చాంబర్లోకి తోడ్కొని వెళ్లారు.బీజేపీ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన అధ్యక్షునిగా, బిహార్ నుంచి వచ్చిన తొలి సారథిగా నబీన్ నిలిచారు. బీజేపీకి ఆయన 12వ అధ్యక్షుడు. నబీన్ ఎన్నికను చరిత్రాత్మక ఘట్టంగా నడ్డా అభివర్ణించారు. ఇంతకాలం తనకు అన్నివిధాలా సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.నితిన్ వెన్నంటి సాగుతాం: మోదీబీజేపీ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన నబీన్కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను నవతరానికి ప్రతినిధి (మిలీనియల్)గా అభివర్ణించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ నేతగా, ప్రధానిగా ఎంత అనుభవమున్నా అన్నింటికంటే ముందు నేను బీజేపీ కార్యకర్తను. ఇకపై పార్టీపరమైన వ్యవహారాల్లో నితిన్ నాకు బాస్’’ అని చెప్పారు. ఆయన్ను పదేపదే ‘గౌరవనీ యులైన’ అంటూ సంబోధించారు.‘‘యువకుడైన నబీన్ శక్తియుక్తులు, వ్యవస్థాగత వ్యవహారాల్లో ఆయనకున్న అపార అనుభవం పార్టీకి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇకపై ఆయన నోట వచ్చే ప్రతి మాటా మాకందరికీ నూతన దిశానిర్దేశం చేస్తుంది. పార్టీ భావి కార్యాచరణకు నబీన్ మార్గదర్శకత్వం వెలకట్టలేని ఆస్తి కానుంది’’ అన్నారు. ‘‘పార్టీ కార్యకర్తగా నేను కూడా నా పనితీరును ఎప్పటికప్పుడు నూతన అధ్యక్షునికే నివేదిస్తాను. నా పనితీరుకు సంబంధించిన రహస్య నివేదికను రాసేది ఆయనే. కనుక నబీన్ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నా’’ అని మోదీ చెప్పుకొచ్చారు. బీజేపీ వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు ఎన్డీఏ భాగస్వాముల నడుమ సమన్వయం సజావుగా కొనసాగేలా చూ డాల్సిన బాధ్యత కూడా నబీన్దేనని గుర్తు చేశారు.కాంగ్రెస్ తప్పిదాలు మనం చేయొద్దుకాంగ్రెస్ తప్పిదాల నుంచి నేర్చుకోవాలని బీజేపీ నేతలు, కార్యకర్తలకు మోదీ సూచించారు. ‘‘1984 లో 50 శాతం పై చిలుకు ఓట్లతో 400కు పైగా లోక్సభ స్థానాలు సాధించిన కాంగ్రెస్ నేడు 100 సీట్లు కూడా నెగ్గలేక ఆపసోపాలు పడుతోంది. కనుక ఆ పార్టీ దుర్లక్షణాలన్నింటినీ నిశితంగా గమనించి మనం వాటికి దూరంగా ఉందాం. అప్పుడిక మనల్ని ఎవరూ ఓడించలేరు’’ అన్నారు. నిష్పాక్షిక ఆత్మవిమర్శే బీజేపీ బలమని గుర్తు చేశారు.‘‘బీజేపీ ఒక సంప్రదాయం. అది ఒక కుటుంబం. సభ్యత్వం కంటే సంబంధాలకు విలువనిచ్చే పార్టీ. పదవుల ద్వారా కాకుండా ప్రక్రియ ద్వారా పనిచేసే పార్టీ బీజేపీ. ఇక్కడ అధ్యక్షులు మారినా ఆదర్శాలు, దిశానిర్దేశాలు మారవు. వాజపేయీ, అడ్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి దిగ్గజాల సారథ్యంలో బీజేపీ సున్నా నుంచి శిఖరస్థాయికి ఎదిగింది. వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా సారథ్యంలో మరింత ఎదిగింది’’ అని గుర్తు చేసుకున్నారు.చొరబాట్లు, అర్బన్ నక్సల్స్తో... దేశ భద్రతకే ప్రమాదం!చొరబాటుదారులు, అర్బన్ నక్సల్స్ దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారారని మోదీ ఆందోళన వెలిబుచ్చారు. చొరబాటుదారులను గుర్తించి తిప్పి పంపడం చాలా ముఖ్యమన్నారు. అక్రమ వలసలతో సంపన్న దేశాలు కూడా సతమతమవు తున్నాయి. వారిని వెళ్లగొడుతున్నాయి. వారు ప్రజలను కొల్లగొట్టడాన్ని భారత్ ఎప్పటికీ అనుమతించబోదు. కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు దన్నుగా నిలుస్తున్నాయి. వాటి ముసుగు తొలగించి ప్రజల ముందు నిలబెడదాం’’ అని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.‘‘దేశం ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య అర్బన్ నక్సలిజం. ‘‘నా గురించి, ఎన్డీఏ ప్రభుత్వం గురించి సానుకూలంగా ఎవరు మాట్లాడినా లక్ష్యం చేసుకుని నోరు మూయించే కార్యక్రమం జరుగుతోంది. కొందరు జర్నలిస్టులు కూడా వారిని దారుణంగా హేళన చేసి అవమా నిస్తున్నారు. అంటరానివాళ్లుగా ముద్ర వేస్తున్నారు. ఇదంతా అర్బన్ నక్సల్స్ నూతన శైలి. వీరంతా కలిసి దేశానికి చేటు చేసేందుకు నిత్యం ప్రయత్ని స్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. వీరికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయడం చాలా అవసరమన్నారు.అట్టహాసంగా కార్యక్రమంనబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆయనను మోదీ పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యాలయం కోలాహలంగా మారింది. జై శ్రీరాం, జై నితిన్ నబీన్ నినాదాలతో మార్మోగింది. ఆయన భార్య, పిల్లలు, కుటుంబీకులు, సన్నిహితులు కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలుగు నేతల సందడినబీన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షులు ఎన్.రాంచందర్రావు, పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, శ్రీనివాసవర్మ, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, అంజిరెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. వారంతా నబీన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.రాజకీయాల్లోకి యువతబీజేపీ నూతన సారథి నబీన్ పిలుపున్యూఢిల్లీ: రాజకీయాల్లోకి ప్రజలు మరింత చురుగ్గా రావాల్సిన అవస రముందని బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా అభిప్రా యపడ్డారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తద్వారా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని కలసికట్టుగా సాకారం చేసుకుందామని పేర్కొ న్నారు. ‘‘అయితే రాజకీయాలు 100 మీటర్ల రేసు కాదు. సుదీర్ఘంగా సాగే మారథాన్. అక్కడ పరీక్ష వేగానికి కాదని, శారీరక సామర్థ్యానికి. యువత దీన్ని గుర్తించాల్సిన అవసరముంది’’ అన్నారు.బీజేపీ సారథిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం పార్టీ ప్రధాన కార్యాల యంలో ఆయన నేతలు, కార్యక ర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీలో ప్రతి కార్యకర్తకూ పనికి తగిన గుర్తింపు ఎప్పుడూ లభిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరి కృషినీ గుర్తించేంత శక్తియుక్తులు బీజేపీ ‘వాచ్టవర్’కు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. కీలకమైన పశ్చిమ బెంగాల్తో పాటు రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బూత్ నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి దాకా పూర్తి చిత్తశుద్ధి, అంకితభావంతో పని చేయాలని సూచించారు. విపక్ష ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, డీఎంకేలపై నబీన్ ఈ సందర్భంగా ఘాటు విమర్శలు చేశారు. కార్తీక దీప సంప్రదాయాన్ని కూడా అడ్డుకునే కుయుక్తులకు డీఎంకే సర్కారు దిగిందన్నారు. ఇలాంటి శక్తులను ఓడించి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు. -
కమల దళపతిగా నితిన్ నబీన్
ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్.. జెపీ నడ్డా నుంచి బాధ్యతలు స్పీకరించారు. ఇవాళ(జనవరి 20, మంగళవారం) ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజానాథ్ సింగ్, పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలడని.. ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు. ‘‘నేను బీజేపీ కార్యకర్త.. నితిన్ నాకు బాస్. బీజేపీలో నిర్ణయాలు, ఎంపికలు అన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయి. దేశసేవ, ప్రజాసేవే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది’’ అని మోదీ పేర్కొన్నారు.‘‘ప్రభుత్వానికి అధిపతి అయినా... బీజేపీ కార్యకర్త కావడమే నాకు గర్వ కారణం. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నితిన్ నబీన్ విజయవంతంగా నిర్వహించారు. తనను తాను రుజువు చేసుకున్నారు. పార్టీ కంటే, దేశం ముఖ్యమనే నినాదంతో పనిచేస్తున్నాం. కుటుంబ రాజకీయ పార్టీలు యువకులకు తలుపులు మూసేస్తున్నాయి. ఇలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువకులను రాజకీయ నాయకులను తయారు చేయాలనుకుంటున్నాను..బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం పనిచేస్తుంది. మోదీకి అనుకూలంగా వార్తలు రాసినా, చెప్పినా వారిని అర్బన్ నక్సల్స్ టార్గెట్ చేస్తున్నారు. అర్బన్ నక్సలైట్ల ఆగడాలను అరికట్టాలి. కాంగ్రెస్ పార్టీ అధోగతికి ఆ పార్టీ విధానాలు కారణం. కుటుంబ రాజకీయాలే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచాయి. కాంగ్రెస్ లక్షణాలు మన పార్టీకి అంటకుండా జాగ్రత్తపడాలి’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు.కాగా, 26 ఏళ్లకే ఎమ్మెల్యే. 45వ ఏటే బీజేపీ వంటి అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కునిగా రికార్డు. నితిన్ నబీన్ రాజకీయ ప్రస్థానం తొలినుంచీ ఆసక్తికరమే. ఆయన ఎన్నికతో బీజేపీ పగ్గాలు రెండో తరం చేతికి అందినట్టయింది.నిజానికి బీజేపీలో జాతీయ స్థాయి ప్రముఖ నేతల జాబితాలో నబీన్ పేరు ఎప్పుడూ పెద్దగా లేదు. అలాంటి నేతలకు ఏకంగా అధ్యక్ష పగ్గాలు అందడం అనూహ్యమనే చెప్పాలి. నబీన్ జన్మించింది బీజేపీ పురుడు పోసుకున్న 1980లోనే కావడం విశేషం. ఆయన జార్ఖండ్లోని రాంచీలో జన్మించారు. ఆయన కాయస్థ కులస్తుడు.యువకుడే అయినా పాలన, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు తదితరాల్లో అపార అనుభవం ఆయన సొంతం. నబీన్ రాజకీయ ప్రస్థానం బీజేపీ యువజన విభాగమైన యువమోర్చాతో మొదలైంది. నబీన్ కుటుంబానికి ఆరెస్సెస్తో సన్నిహిత బంధముంది. ఆయన తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కూడా బీజేపీ నాయకుడే. పట్నా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉంటూ 2006లో మరణించారు. దాంతో జరిగిన ఉప ఎన్నికలో నబీన్ ఏకంగా 60 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అప్పటినుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు! 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ ఇన్చార్జిగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపి జాతీయ నాయకత్వాన్ని మెప్పించారు.తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ఛత్తీస్గఢ్లో 11 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లు నెగ్గేలా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి నడ్డా వారసునిగా పలువురు ప్రముఖుల పేర్లు విన్పించినా, పార్టీ నాయకత్వం మాత్రం అనూహ్యంగా నబీన్ వైపు మొగ్గింది. గత డిసెంబర్ 16న ఆయనను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించింది. మంగళవారం ఆయన నుంచి నబీన్ లాంఛనంగా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్నారు. ఆయనకు భార్య దీప్మాలా శ్రీవాత్సవ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కీలకమైన పశ్చిమబెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపాల్సిన గురుతర బాధ్యత నబీన్ భుజస్కంధాలపై ఉంది. -
కమల దళపతి నితిన్ నబీన్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నూతన అధ్యక్షునిగా బిహార్కు చెందిన పార్టీ యువ నేత నితిన్ నబీన్ సిన్హా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవి చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కునిగా 45 ఏళ్ల నబీన్ రికార్డు సృష్టించారు. అంతేగాక బిహార్ నుంచి వచి్చన తొలి బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయనే కావడం విశేషం! మంగళవారం ఉదయం 11 గంటలకు బీజేపీ 12వ అధ్యక్షునిగా నబీన్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జగత్ప్రకాశ్ నడ్డా పదవీకాలం ముగియడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియలో భాగంగా కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ముగిసింది. నబీన్ ఒక్కరి తరఫునే నామినేషన్లు దాఖలవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. మంగళవారం ఈ మేరకు లాంఛనంగా ప్రకటన వెలువడనుంది. నబీన్ ప్రస్తుతం బీజేపీ తాత్కాలిక అధ్యక్షునిగా ఉండటం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ సంతకంతో కూడిన నబీన్ నామినేషన్ సెట్టును నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తదితరులు రిటరి్నంగ్ అధికారి కె.లక్ష్మణ్కు సమర్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, నయాబ్సింగ్ సైనీ, ప్రమోద్ సావంత్, పెమా ఖండు, పుష్కర్సింగ్ ధామి, బీజేపీ అగ్ర నేతలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నబీన్ తరఫున బీజేపీ రాష్ట్ర శాఖలు కూడా ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశాయి. అలా మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలైనట్టు లక్ష్మణ్ వివరించారు. నబీన్కు శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నబీన్కు రానున్న పశి్చమబెంగాల్ సహా పలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపడం అగి్నపరీక్షగా నిలవనుంది. తొలిసారి అడ్వాణీ, జోషీ లేకుండా! బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు పార్టీ కురువృద్ధులు లాల్కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ గైర్హాజరయ్యారు. అధ్యక్ష ఎన్నికల ఓటర్ల జాబతాలో కూడా వారి పేర్లు లేవు. ఇలా జరగడం బీజేపీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1980 నుంచీ ఇప్పటిదాకా జరిగిన 11 మంది అధ్యక్షుల ఎన్నికల్లో వారు భాగస్వాములుగా ఉంటూ వచ్చారు. అయితే అడ్వాణీ, జోషీ ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ శాఖ నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ శాఖకు సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉంది. దాంతో అధ్యక్ష ఎన్నికల ఓటర్ల జాబితాలో వారి పేర్లు చేర్చేందుకు వీల్లేకుండా పోయిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. యంగెస్ట్ ప్రెసిడెంట్గా!న్యూఢిల్లీ: 26 ఏళ్లకే ఎమ్మెల్యే. 45వ ఏటే బీజేపీ వంటి అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కునిగా రికార్డు. నితిన్ నబీన్ రాజకీయ ప్రస్థానం తొలినుంచీ ఆసక్తికరమే. ఆయన ఎన్నికతో బీజేపీ పగ్గాలు రెండో తరం చేతికి అందినట్టయింది.నిజానికి బీజేపీలో జాతీయ స్థాయి ప్రముఖ నేతల జాబితాలో నబీన్ పేరు ఎప్పుడూ పెద్దగా లేదు. అలాంటి నేతలకు ఏకంగా అధ్యక్ష పగ్గాలు అందడం అనూహ్యమనే చెప్పాలి. నబీన్ జన్మించింది బీజేపీ పురుడు పోసుకున్న 1980లోనే కావడం విశేషం. ఆయన జార్ఖండ్లోని రాంచీలో జన్మించారు. ఆయన కాయస్థ కులస్తుడు. యువకుడే అయినా పాలన, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు తదితరాల్లో అపార అనుభవం ఆయన సొంతం. నబీన్ రాజకీయ ప్రస్థానం బీజేపీ యువజన విభాగమైన యువమోర్చాతో మొదలైంది. నబీన్ కుటుంబానికి ఆరెస్సెస్తో సన్నిహిత బంధముంది. ఆయన తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కూడా బీజేపీ నాయకుడే. పట్నా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉంటూ 2006లో మరణించారు. దాంతో జరిగిన ఉప ఎన్నికలో నబీన్ ఏకంగా 60 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అప్పటినుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు! 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ ఇన్చార్జిగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపి జాతీయ నాయకత్వాన్ని మెప్పించారు. తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ఛత్తీస్గఢ్లో 11 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లు నెగ్గేలా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి నడ్డా వారసునిగా పలువురు ప్రముఖుల పేర్లు విన్పించినా, పార్టీ నాయకత్వం మాత్రం అనూహ్యంగా నబీన్ వైపు మొగ్గింది. గత డిసెంబర్ 16న ఆయనను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించింది. మంగళవారం ఆయన నుంచి నబీన్ లాంఛనంగా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్నారు. ఆయనకు భార్య దీప్మాలా శ్రీవాత్సవ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కీలకమైన పశ్చిమబెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపాల్సిన గురుతర బాధ్యత నబీన్ భుజస్కంధాలపై ఉంది.


