-
నన్ను పీకేస్తున్నారు..!
న్యూఢిల్లీ: ఎన్నివేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా.. ఉద్యోగం అంటే ఎలా ఉంటుందో సైరస్ మిస్త్రీకి టాటాలు బాగానే రుచిచూపించారు. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తనను అర్ధంతరంగా తొలగించడానికి నిమిషాల ముందు భార్య రోహిఖాకు మిస్త్రీ పంపిన సందేశం(ఎస్ఎంఎస్) ఏంటో తెలుసా.. ‘నన్ను పీకేస్తున్నారు’ అని! ఈ విషయాన్ని మిస్త్రీ అనుచరుల్లో ఒకరైన నిర్మల్య కుమార్ బయటపెట్టారు. మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్ పగ్గాలు చేపట్టాక ఏర్పాటు చేసిన కోర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(జీఈసీ)లో కుమార్ కూడా సభ్యుడు కావడం గమనార్హం. టాటా ట్రస్టులకు మిస్త్రీపై నమ్మకం పూర్తిగా పోయిందని పేర్కొంటూ గతేడాది అక్టోబర్ 24న టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డు ఆయనను అకస్మాత్తుగా తొలగించిన సంగతి తెలిసిందే. అప్పుడు బోర్డు సమావేశంలో జరిగిన తతంగాన్ని కుమార్ తన తాజా బ్లాగ్ (హౌ సైరస్ మిస్త్రీ ఫైర్డ్)లో వెల్లడించారు. మీకు నచ్చింది చేసుకోండి...! ‘అక్టోబర్ 24న టాటా సన్స్ బోర్డు సమావేశానికి కొద్ది నిమిషాల ముందు రతన్ టాటా, బోర్డు సభ్యుడు నితిన్ నోహ్రియాలు మిస్త్రీతో భేటీ అయ్యారు. ముందుగా నితిన్ మాట్లాడుతూ.. సైరస్ నీకు తెలుసు.. రతన్ టాటాకు నీతో పొసగడం లేదని. మీ ఇద్దరి మధ్య సంబంధాలు అస్సలు బాగాలేవు. నిన్ను(మిస్త్రీ) చైర్మన్ పదవి నుంచి తొలగించాలని టాటా ట్రస్టులు నిర్ణయించాయి. ఈ బోర్డు సమావేశంలో దీనిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నాయి. నీకు రెండే మార్గాలు ఉన్నాయి. స్వచ్ఛందంగా రాజీనామా చేయడం, లేదంటే బోర్డు భేటీలో తొలగింపు తీర్మానాన్ని ఎదుర్కోవడం అంటూ విషయాన్ని వివరించారు. ఈ సమయంలో రతన్ టాటా జోక్యం చేసుకుంటూ... పరిస్థితి ఇంతవరకూ వచ్చినందుకు చింతిస్తున్నానని అన్నారు’ అని కుమార్ వెల్లడించారు. దీనికి సావధానంగా స్పందించిన మిస్త్రీ.. ‘జెంటిల్మెన్, బోర్డు సమావేశంలో ఏం చేయాలన్నది మీ ఇష్టం. నేను ఏం చేయాలో అది చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చారని కుమార్ పేర్కొన్నారు. ఆ తర్వాత సైరస్ మిస్త్రీ బోర్డు సమావేశానికి వెళ్తూ... తన భార్య రోహిఖాకు ‘నన్ను తొలగిస్తున్నారు(ఐయామ్ బీయింగ్ శాక్డ్) అంటూ ఫోన్లో మెసేజ్ పెట్టారని కుమార్ వివరించారు. బోర్డు సమావేశంలో తనపై వేటు వేసేందుకు తీర్మానాన్ని ఆమోదించాలంటే నిబంధనల ప్రకారం 15 రోజులకు ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని మిస్త్రీ వాదించినట్లు కూడా చెప్పారు. అయితే, ఎలాంటి నోటీసూ అక్కర్లేదంటూ బోర్డుకు టాటా ట్రస్టుల నామినీ డైరెక్టర్ వెల్లడించారని కుమార్ తెలిపారు. బోర్డు సమావేశంలో మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లకు గాను ఆరుగురు.. అమిత్ చం ద్ర, విజయ్ సింగ్, నితిన్ నోహ్రియా(వీళ్లు టాటా టస్టుల నామినీలు), అజయ్ పిరమల్, రోనెన్ సేన్, వేణు శ్రీనివాసన్(వీళ్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లు) మిస్త్రీని తొలగించే తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. ఫరీదా ఖంబాటా, ఇషాత్ హుసేన్లు మాత్రం ఓటింగ్కు గైర్హాజరవడం గమనార్హం. ‘మిస్త్రీకి వివరణ ఇచ్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండానే నిమిషాల్లోనే ఆయనను తక్షణం తొలగిస్తున్నట్లు బోర్డు ప్రకటించేసింది’ అని కుమార్ వ్యాఖ్యానించారు. -
ఒక్క నిమిషంలో అంతా జరిగిపోయింది..
-
ఒక్క నిమిషంలో అంతా జరిగిపోయింది..
ముంబై: టాటా చైర్మన్ సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత జీఈసీ సభ్యుడు ప్రొఫెసర్ నిర్మల్య కుమార్ (56) తొలిసారిగా స్పందించారు. టాటా సన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పదవీచ్యుతుడైన ఆయన తన మనోభావాలను "ఐ జస్ట్ గాట్ ఫైర్డ్ " అనే పేరుతో వ్యక్తిగత వెబ్సైట్ (బ్లాగ్) లో పోస్ట్ చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కుమార్ ముందస్తు సమాచారం ఏమీ లేకుండానే అంతా ఒక నిమిషంలో ముగిసిందని వాపోయారు. కేవలం తాను మిస్త్రీకి సన్నిహితుడిననే కారణంగానే ఈ పరిణామం సంభవించిందని పేర్కొన్నారు. ఎంతపెద్ద సంస్థకు వెళితే మానవ విలువలు అంతగా క్షీణిస్తాయంటూ ఫిలాసఫీ చెప్పుకొచ్చారు. అక్టోబర్ 31 తన జీవితంలో ఒక వింతైన రోజని తన పోస్ట్ లో కుమార్ పేర్కొన్నారు. తనకు ఎంతో సన్నిహితుడు, తరచూ తన వాదనలు బలపరిచే వ్యక్తినుంచి ఇక రేపటి నుంచి విధులకు రావాల్సిన అవసరం లేదనే సమాచారం అందుకోవడం విచారకరమన్నారు. అంతే. ఒక్క నిమిషంలో అంతా జరిగిపోయింది. "ఐ జస్ట్ గాట్ ఫైర్డ్ " అంటూ తనపై వేటు పడిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. కంపెనీనుంచి ఒకసారి తొలగించిన తరువాత మన నిజమైన స్నేహితులు ఎవరో మనకు తెలుస్తుందన్న కుమార్ కానీ తనను గౌరవించిన, ఆప్యాయంగా ఆదరించిన వారిని వీడడం విచారకరమని, వారి హృదయపూర్వక చిరునవ్వులు ఎల్లపుడూ తనతో ఉంటాయన్నారు. ముగ్గురు తప్ప తనతో మూడేళ్లపాటు కలిసి పనిచేసిన సీఈవోలు, ఇతర ఉన్నత అధికారులు మౌనంగా ఉండడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అంతేకాదు కార్పొరేట్ ప్రపంచంలో ఇదంతా మామూలేనని,కానీ ఎవరూ ఇలాంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండరన్నారు. అలాగే 18 సం.రాల వయసు వచ్చిన తరువాత మొదిటిసారి తాను ప్రస్తుతం నిరుద్యోగిగా నిలబడ్డానన్నారు. ఇది టాటాల అమర్యాదకరమైన చర్య తప్ప సంస్థలో 670,000 మంది ఉద్యోగుల తప్పేమీ లేదన్నారు. కేవలం సైరస్ మిస్త్రీతో సన్నిహితం, విస్తృతంగా మెలగడమే దీనికి కారణమన్నారు. -
టాటా జీఈసీలో మరో రాజీనామా
ముంబై: టాటా- మిస్త్రీ వివాదానంతర పరిణామాలలో మరో రాజీనామా చోటు చేసుకుంది. నాన్-ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ నిర్మాలయ కుమార్ తన పదవికి రాజీనామా చేశారని టాటా గ్రూప్ మంగళవారం నివేదించింది. అక్టోబర్ 31, సోమవారం నుంచి ఇది అమల్లోకి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. ఈ సమాచారాన్నిటాటా కెమికల్స్ కంపెనీ కార్యదర్శి రాజీవ్ చందన్ బీఎస్ఈ ఫైలింగ్లో రిపోర్టు చేశారు. కాగా లండన్ బిజినెస్ స్కూల్కు చెందిన ప్రొఫెసర్, నిర్మాలయ కుమార్ మిస్త్రీ ఏర్పాటు చేసిన ఎక్జిక్యూటివ్ కమిటీ (జీఈసీ) సభ్యులు. 2013 లో జీఈసీలో చేరిన టాటా గ్రూపు వ్యూహ రచనలో బాధ్యుడిగా ఉన్నారు. అయితే అక్టోబరు 24 న మిస్త్రీ తొలగించిన మరుక్షణమే ఈ కమిటీని కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement