సెన్సెక్స్ కు మూడో రోజు కూడా లాభాలే!
నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ఘన విజయ ప్రభావంతో వరుసగా మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో ముగిసాయి. వ్యాపారవర్గాలకు అనుకూలంగా ప్రభుత్వం ఉంటుందనే ఊహాగానాలు, నిధుల ప్రవాహం లాంటి అంశాల ప్రోత్సాహంతో ప్రధాన సూచీ సెన్సెక్స్ 241 పాయింట్ల లాభంతో 24363 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల వృద్దితో 7263 పాయింట్ల వద్ద ముగిశాయి.
సోమవారం నాటి మార్కెట్ లో సూచీ ఆధారి కంపెనీ షేర్లలో అత్యధికంగా భెల్ 15 శాతం లాభపడగా, కోల్ ఇండియా, ఎన్ టీపీసీ, పీఎన్ బీ లు 10 శాతం, ఓన్ జీసీ 8 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. టీసీఎస్, ఐటీసీలు, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ 5 శాతానికి పైగా నష్టపోగా, సన్ ఫార్మా 4.77 శాతం క్షీణించింది.