breaking news
Navrang Studio
-
సూపర్స్టార్ కోసం ఒక సీట్ రిజర్వ్.. నవరంగ్ థియేటర్ ఘననివాళి
సాక్షి, విజయవాడ: సూపర్స్టార్ కృష్ణకు నవరంగ్ థియేటర్ యాజమాన్యం ఘననివాళులు అర్పించింది. విజయవాడలో గల ఈ థియేటర్కు కృష్ణ గతంలో అనేకమార్లు వచ్చారు. ఈనేపథ్యంలో సూపర్స్టార్ కృష్ణ కోసం థియేటర్ యాజమాన్యం రోజు మొత్తం ఒక సీటు రిజర్వ్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంది. సూపర్ కృష్ణ మృతికి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సైతం ఘన నివాళి అర్పించారు. ఆయన అకాల మృతికి సంతాపంగా మంగళవారం(నవంబర్ 15) పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా థియేటర్లో ఉదయం ఆటలను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తెలిపారు. ఇదిలాఉంటే, కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈమేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. చదవండి: (CM Jagan: రేపు హైదరాబాద్కు సీఎం జగన్) -
ముంబై నవరంగ్ స్టూడియోలో అగ్నిప్రమాదం
-
నవరంగ్ స్టూడియోలో అగ్నిప్రమాదం
ముంబై : దేశ వాణిజ్య రాజధాని నగరం ముంబైని అగ్నిప్రమాదాలు వీడటం లేదు. కమలా మిల్స్ దుర్ఘటన మరవకముందే తాజాగా దక్షిణ ముంబైలోని పురాతన నవరంగ్ సినిమా స్టూడియోలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఆర్పుతున్న సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది ఒకరు గాయపడ్డారు. కాగా స్టూడియో ఉన్న ఈ భవనం గత 20 ఏళ్లుగా వాడకంలో లేదని, అగ్నిప్రమాదం అయిదో అంతస్తులో జరిగిందని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఆర్ చౌదరి తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. భవనం శిథిలావస్థలో ఉందని, ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. గత 25 రోజుల్లో నగరంలో ఇది ఆరో అగ్ని ప్రమాదం. డిసెంబర్ 18 న ముంబైలోని సకి నాకా-కుర్లా ప్రాంతంలో ఒక చిరుతిండి దుకాణంలో భారీ అగ్ని ప్రమాద ఘటనలో పన్నెండు మంది మృతి చెందారు. అలాగే డిసెంబరు 29 న కమలా మిల్స్ ఆవరణలో పబ్లో జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటనలో 14 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. జనవరి 4 న జరిగిన మరొక సంఘటనలో, ఇద్దరు పిల్లలు సహా నలుగురు మరణించగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 6న సినీ విస్తా స్టూడియో ప్రమాదంలో టెలివిజన్ సీరియల్ ప్రొడక్షన్ యూనిట్కు చెందిన ఓ వ్యక్తి(20) చనిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ముంబైలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. భవనాలు నిర్మించే సమయంలో సరైన అగ్ని ప్రమాద నివారణ చర్యలను తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విద్యుత్ పరికరాల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వల్ల దేశంలో ఏటా జరుగుతున్న అగ్ని ప్రమాదాల్లో ముంబై రెండో స్థానంలో నిలిచింది.