కనెక్షన్కు 5 జీబీ డేటా అదనం
ఎయిర్టెల్ కొత్త స్కీమ్
న్యూఢిల్లీ: దిగ్గజ టెలికం కంపెనీ ‘భారతీ ఎయిర్టెల్’ తాజాగా ‘మైహోమ్ రివార్డ్స్’ స్కీమ్ను ప్రకటించింది. దీంతో ప్రతి పోస్ట్-పెయిడ్ బ్రాడ్బాండ్/డిజిటల్ టీవీ (డీటీహెచ్) కస్టమర్ అదనంగా 5 జీబీ డేటాను ఉచితంగా పొందొచ్చని కంపెనీ తెలిపింది. అంటే ఒక ఇంట్లో ఐదు ఎయిర్టెల్ కనెక్షన్లు ఉంటే వారు 25 (5ఁ5) జీబీ డేటాను ప్రతి నెలా ఉచితంగా పొందొచ్చు. అదే కుటుంబంలో రెండు పోస్ట్-పెయిడ్ మొబైల్స్, ఒక ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కనెక్షన్ను ఉంటే వారు అదనంగా 15 (3ఁ5) జీబీ డేటాను పొందొచ్చు. కస్టమర్లు మైఎయిర్టెల్ యాప్/కంపెనీ వెబ్సైట్లోని మైహోమ్ సెక్షన్ ద్వారా వారి కనెక్షన్లను నమోదు చేసుకొని మైహోమ్ రివార్డ్స్ను సొంతం చేసుకోవాలని తెలిపింది.