breaking news
mumbai jail video
-
మాల్యా కేసు : ముంబై జైలు ఓకేనా? కాదా?
లండన్ : బ్యాంక్లకు వేలకోట్లు కొల్లగట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, భారత్కు అప్పగింత కేసు నేడు విచారణకు వచ్చింది. ఈ విచారణలో భాగంగా విజయ్ మాల్యా మధ్యాహ్నం వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా విజయ్ మాల్యాను ఉంచేందుకు భారత అథారిటీలు సమర్పించిన ముంబై జైలు సెల్ వీడియోను జడ్జి సమీక్షించారు. విజయ్ మాల్యాను ఉంచే ముంబై ఆర్థూర్ రోడ్డు జైలు బ్యారెక్ 12కు సంబంధించి ప్రతీది స్టెప్-బై-స్టెప్ వీడియో తీసి తమకు సమర్పించాలని గత విచారణ సందర్భంగా జూలైలో వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు జడ్జి ఎమ్మా అర్బుత్నోట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోతో అన్ని అనుమానాలను నివృతి చేయాలని పేర్కొంది. భారత్లో జైళ్లు దారుణంగా ఉన్నాయంటూ విజయ్ మాల్యా ఆరోపించారు. సరైన సదుపాయాలు ఉండవని, గాలి, వెలుతురు సైతం సరిగ్గా ఉండవని విజయ్ మాల్యా పేర్కొన్నారు. దీంతో మాల్యాను ఉంచే జైలుకు సంబంధించిన 10 నిమిషాల నిడివి గల వీడియోను తీసి భారత అధికారులు లండన్ కోర్టుకు సమర్పించారు. బ్యారెక్-12లో మాల్యా కోసం ప్రత్యేకంగా సెల్ను ఏర్పాటు చేశామని, ఆ సెల్లో మాల్యా కోసం ప్రత్యేకంగా ఎల్సీడీ టీవీ, కొత్త పరుపులు, తల్లగడ్లు, దుప్పట్లు, వాష్ ఏరియా, వెస్ట్రన్ స్టయిల్లో టాయిలెట్, లైబ్రరీ, మంచి వెలుతురు వచ్చేలా తూర్పు వైపు గది కల్పిస్తామని చెప్పారు. ఈ వీడియోను నేడు లండన్ కోర్టు పరిశీలిస్తోంది. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు, భారత ప్రభుత్వం తరుఫున వాదిస్తున్నారు. అప్పగింత ప్రొసీడింగ్స్కు సంబంధించి యూకే మానవ హక్కుల బాధ్యతల్లో భాగంగా సెల్ను తనిఖీ చేయాలని విజయ్ మాల్యా డిఫెన్స్ టీమ్ వాదిస్తోంది. విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన విజయ్ మాల్యాను మీడియా పలు ప్రశ్నలు వేసింది. ‘ముందు నుంచి నేను చెబుతున్న మాదిరి, కర్నాటక హైకోర్టు ముందు నేను సమగ్ర పరిష్కార ఆఫర్ను ఉంచాను. గౌరవనీయులైన జడ్జీలను దీనిపై సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని మాల్యా అన్నారు. కాగా, దేశీయ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన విజయ్ మాల్యా, ఆ రుణాలను కట్టలేక చేతులెత్తేసి, చెప్పాపెట్టకుండా విదేశాలకు పారిపోయారు. -
మాల్యా జైలు, ఎన్ని సౌకర్యాలో చూడండి..
న్యూఢిల్లీ : టీవీ, పర్సనల్ టాయిలెట్, బెడ్, వాష్ చేసుకునే ఏరియా, ఎల్లప్పుడూ సూర్యుని కాంతి పడేలా వెంటిలేషన్.. ఇదిగో చూడండి.. జైలు ఎంత బాగా రూపుదిద్దుకుందో... ఇంతకుమించిన సౌకర్యాలు కావాలా? అంటూ సీబీఐ, యూకే కోర్టుకు ఓ వీడియో డాక్యుమెంటరీ సమర్పించింది. ఇంతకీ ఈ వీడియో ఏంటి, దీని కథేంటి, అనుకుంటున్నారా? విజయ్మాల్యాను భారత్కు అప్పగించాలనే కేసుపై యూకే కోర్టులో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే భారత్లో జైళ్లు బాగుండవని బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో నక్కిన విజయ్ మాల్యా, యూకే కోర్టులో వాదించారు. మాల్యా వాదనల మేరకు ఆయన్ను భారత్కు అప్పగిస్తే, ఆయనను ఎక్కడ ఉంచుతారు? జైలులో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? నిందితుడి సెల్ ఏ విధంగా ఉంటుందో చూపుతూ ముంబై జైలు వీడియోను తమకు సమర్పించాలని సీబీఐను యూకే కోర్టు ఆదేశించింది. యూకే కోర్టు ఆదేశాల మేరకు మాల్యాను ఉంచే ముంబై ఆర్థుర్ రోడ్ జైలులోని బరాక్ నెంబర్ 12ను, అక్కడ ఉండే సౌకర్యాలను చూపిస్తూ.. 6 నుంచి 8 నిమిషాల నిడివి గల వీడియోను తీసిన సీబీఐ డాక్యుమెంటరీ రూపంలో యూకే కోర్టుకు సమర్పించింది. ఇదే మాల్యా నివాసం అని పేర్కొంది. కాగ, భారత జైళ్లలో తాజా గాలి, సహజ సిద్ధమైన కాంతి ఉండవని విజయ్మాల్యా ఆరోపించారు. మాల్యాను ఉంచబోయే సెల్ ముఖద్వారం తూర్పువైపు ఉంటుంది. అంటే సూర్యకాంతి మంచిగా పడుతుంది అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. కిటికి తలుపులు, ఇరువైపుల బార్లతో మాల్యాను ఉంచబోయే సెల్ మంచి వెంటిలేషన్ను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. విజయ్మాల్యాకు లైబ్రరీ యాక్సస్ కూడా కల్పిస్తామని ఈ వీడియో తీసిన సీనియర్ అధికారి చెప్పారు. ఇక భద్రతాపరంగా చూసుకుంటే, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల భద్రతాపరమైన వసతులున్నాయని తెలిపారు. విచారణ సమయాల్లో పలుసార్లు ఇదే విషయాన్ని తాము కోర్టుకు వెల్లడించామని కూడా చెప్పారు. కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లో ఎలాంటి లోపాలు లేవని, హోం మంత్రిత్వ శాఖ కూడా దీనిపై సెక్యురిటీ ఆడిట్ చేపట్టిందని తెలిపారు. జైలులోని సెల్లన్నింటినీ సీసీటీవీ కెమెరా నిఘాలో ఉంటాయని, బరాక్ వెలుపల, లోపల అదనపు గార్డులు ఉంటారని, వారు 24 గంటల పాటు బరాక్కు కాపాలాగా ఉంటారని అధికారులు చెప్పారు. రోజులో నాలుగు సార్లు భోజనం అందిస్తామని, ఆర్థూర్ రోడ్డు జైలులోని బరాక్ 12 ఎక్కువగా హై-ప్రొఫైల్ ఖైదీలకు మాత్రమే వాడనున్నట్టు తెలిపారు. ఎవరికైతే భద్రతాపరమైన ముప్పు ఎక్కువగా ఉంటుందో, వారు ఎవరికైనా ముప్పు కలిగిస్తారని అనుమానం ఉన్నా.. వారిని బరాక్లోనే ఉంచనున్నట్టు చెప్పారు. బ్యాంక్లకు దాదాపు రూ.9వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టి, యూకేకు పారిపోయిన మాల్యాను కూడా భారత్కు రప్పిస్తే ఇక్కడే ఉంచనున్నారు. ఆయన్ను భారత్కు అప్పగించే వ్యవహారంపై తదుపరి విచారణ సెప్టెంబర్ 12న జరుగనుంది. -
లండన్ కోర్టుకు హాజరైన మాల్యా