breaking news
Modern weapons
-
మావోల సరికొత్త వ్యూహాలు బాణం బాంబులు
-
బాణం బాంబులు
⇒ మావోల చేతుల్లోకి అత్యాధునిక ఆయుధాలు, మోర్టార్లు ⇒ బెజ్జీ దాడిలో వినియోగం.. అడవుల్లో ఆయుధ కార్ఖానాలు చింతూరు(రంపచోడవరం): మావోయిస్టులు అత్యాధునిక మారణాయుధాలను సమకూ ర్చుకుంటున్నారు. ఏకే 47, ఎస్ఎల్ఆర్, యూబీజీ వంటి ఆయుధాలను వినియోగిస్తూ వస్తున్న మావోయిస్టులు ప్రస్తుతం సొంత సాంకేతికత పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయు ధాలను తయారు చేసుకుంటున్నట్లు తాజా సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గతంలో వచ్చిన హాలీవుడ్ హిట్ సినిమా ‘రాంబో’లో నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ తనను పట్టుకునేం దుకు వచ్చిన శత్రువులపై బాంబు బాణాలు, మోర్టార్లతో దాడి చేస్తాడు. అదే సీన్ను మూడు రోజుల క్రితం చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా బెజ్జీ లో జరిగిన మెరుపుదాడిలో మావోయిస్టులు రిపీట్ చేశారు. రాంబో సినిమాలో మాదిరి గానే బాణాలకు బాంబులు (ఐఈడీ) అమర్చి జవాన్లపై ప్రయోగించారు. సంఘటనా స్థలం లో భారీ ఎత్తున ఈ తరహా బాంబు బాణాలు, దేశవాళీ మోర్టార్లు, టిఫిన్ బాంబులు పోలీసులకు లభ్యమయ్యాయి. పక్కా ప్రణాళికతో భారీ దాడికి పాల్ప డేందుకే మావో యిస్టులు అత్యాధునిక ఆయుధాలను వినియో గించారని అధికారులు చెబుతున్నారు. మిలీషియా సభ్యులకు తర్పీదు మావోయిస్టులకు సహకరిస్తున్న మిలీషియా సభ్యులు బాణాలను గురి తప్పకుండా సంధించడంలో నిష్ణాతులని చెప్పవచ్చు. పోలీసులపై దాడి చేసేటప్పుడు కేవలం సాధారణ బాణాలే వినియోగించేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వారికి బాంబులతో కూడిన బాణాల వినియోగంపై పూర్తిస్థాయి తర్పీదు ఇచ్చినట్లు తెలిసింది. దీని కోసం మావోయిస్టులు అడవుల్లోనే కార్ఖానాలు ఏర్పాటు చేసి మోర్టార్లు, బాంబు బాణాలు తయారు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పోలీసులు వచ్చే ప్రదేశాన్ని కచ్చితం గా అంచనా వేస్తున్న మావోయిస్టులు అక్కడే ఎత్తయిన కొండలపై మాటువేస్తున్నారు. పోలీసులు ఆ ప్రదేశానికి రాగానే నలువైపుల నుంచి బాంబు బాణాలతో దాడి చేస్తున్నారు. మోర్టార్లు, మందుపాతరలు పేల్చి పోలీసులను మట్టు బెడుతున్నారు. తాజాగా బెజ్జీ ప్రాంతంలో మావోయిస్టులు ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. ఈ ఘటనలో కోబ్రా బెటాలియన్కు చెందిన 12 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. దాడులకు సరికొత్త వ్యూహాలు మావోయిస్టులు 2010 ఏప్రిల్లో ఇదే జిల్లా చింతల్నార్ వద్ద దేశంలోనే అతిపెద్ద దాడికి పాల్పడ్డారు. అయితే, అప్పుడు బాంబు బాణాలు వినియోగించలేదు. బాణాల బాం బులతో దాడులు చేస్తుండడంపై పోలీసు అధి కారులు సైతం విస్మయం చెందుతు న్నారు. మిలీషియా సభ్యు లు ప్రయోగిస్తున్న బాంబు బాణాలు ఏవైపు నుంచి వస్తాయో తెలియని స్థితిలో ప్రతిదాడి ఎలా చేయాలో ఆలోచిం చుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపో తోందని పోలీసులు ఆందోళన చెందుతున్నా రు. తాజా ఘటనలో పోలీసులకు భారీ నష్టం చేకూర్చాలనే ఉద్దేశంతో మావోయి స్టులు టిఫిన్ బాక్స్ బాంబులను కూడా అమర్చారు. తప్పిన భారీ ముప్పు బెజ్జీ ఘటనకు ముందు పోలీసులు రెండు గ్రూపులుగా విడిపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. గతంలో చింతల్నార్లో జరిగిన దాడిలో 76 మంది పోలీసులు ఒకే బృందంగా వెళ్లి మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో మూకుమ్మడిగా ప్రాణాలు కోల్పోయారు. మరోసారి అదే వ్యూహంతో మావోయిస్టులు మాటు వేశారు. ముందుగా వెళ్లిన బృందంపై దాడికి పాల్పడ్డారు. రెండో బృందం వెనుకనే ఉండిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. -
ఆక్టోపస్కు ఆధునిక ఆయుధాలు
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద వ్యతిరేక దళం ఆక్టోపస్కు అత్యాధునిక ఆయుధాలు సమకూరుతున్నాయి. ఆక్టోపస్ కమాండోలు ప్రధానంగా అర్బన్ వార్ ఫేర్ ఆధారంగానే శత్రువుతో పోరాడాల్సి ఉంటుంది. దీనికి ప్రస్తుత వాటి కంటే ఆధునికమైనవి అవసరమని గుర్తించిన ఉన్నతాధికారులు వీటిని ఆర్డర్ చేశారు. లెన్స్, కెమెరా, టార్గెట్ లేజర్ బీమ్ లాంటి హంగులు ఈ రైఫిళ్లకు ఉంటాయి. ఏపీ, తెలంగాణలకు కలిపి 1500 ఆయుధాలను సమీకరించుకుంటున్నారు. విమానాల ద్వారా 800 వచ్చాయి. అన్నీ వచ్చాక ఇరు రాష్ట్రాల డీజీపీలు వీటిని ఆవిష్కరించనున్నారు. -
అధునాతన ఆయుధాలివ్వాలి
ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: అడవులను కాపాడడంలో ప్రాణాలను పణంగా పెడుతున్న అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం వెంటనే అధునాతన ఆయుధాలు సమకూర్చాలని ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొంపల్లి నాగేంద్రబాబు డిమాండ్ చేశారు. ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో డిప్యూటీ రేంజ్ఆఫీసర్ ఎన్.శ్రీధర్, ఏబీవో కరుణాకర్ డేవిడ్ మరణించడం పట్ల తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. గాయపడిన ఎఫ్ఎస్ఓ రమణ, బీట్ ఆఫీసర్ చంద్రశేఖర్రాజు, ప్రొటెక్షన్ వాచర్ నరేందర్లకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో నిర్మల్లో బీట్ ఆఫీసర్ సత్యనారాయణను టేకు స్మగ్లర్లు గొడ్డళ్లతో నరికేశారని, ఏడాదిక్రితం చిత్తూరులో ఏబీవో శ్రీనివాస్ను ఎర్రచందనం స్మగ్లర్లు పొట్టనపెట్టుకున్నారని, మూడు నెలలక్రితం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంగయ్యను కామారెడ్డిలో అటవీ భూకబ్జాదారులు గొడ్డళ్లతో నరికి చంపారని పేర్కొన్నారు. అటవీ అధికారులపై దాడుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజులు అత్యాధునిక ఆయుధాలు సమకూరుస్తామని గతంలో ప్రకటించినా అమలుకు నోచుకోలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి.. అటవీశాఖ సిబ్బందికి అధునాతన ఆయుధాలు సమకూర్చాలని ఆయన డిమాండ్ చేశారు.