-
విదేశాల్లో కుల్దీపే బెస్ట్!
వెల్లింగ్టన్: విదేశీ గడ్డపై భారత జట్టు ప్రధాన స్పిన్నర్గా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కే తన ఓటని జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. కుల్దీప్ ఇప్పటికే అశ్విన్, జడేజాలను దాటి భారత నంబర్వన్ స్పిన్నర్గా ఎదిగాడని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలే సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై కుల్దీప్ ఐదు వికెట్లు తీశాడని కోచ్ గుర్తు చేశారు. ‘విదేశీ గడ్డపై టెస్టు ఆడటమే తరువాయి అతను ఐదు వికెట్లతో చెలరేగాడు. కాబట్టి విదేశాల్లో జట్టు ప్రధాన స్పిన్నర్గా స్థానం ఖాయమైంది. సిడ్నీలో అతని ప్రదర్శన నన్ను ఎంతో ఆకట్టుకుంది. గతంలో అశ్విన్ తదితరులకూ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మా నంబర్వన్ స్పిన్నర్ కుల్దీపే. విదేశాల్లో భారత్ ఒకే స్పిన్నర్తో ఆడాల్సి వస్తే అది కచ్చితంగా కుల్దీపే అవుతాడు’ అని శాస్త్రి ప్రశంసలతో ముంచెత్తారు. మరో వైపు ఇంగ్లండ్తో బర్మింగ్హామ్లో జరిగిన తొలి టెస్టునుంచి పుజారాను తప్పించడం అన్ని విధాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనని కోచ్ స్పష్టం చేశారు. అతను క్రీజ్లో నిలబడే విషయంలో చిన్నపాటి సమస్య కనిపించిందని, దానిని సరిదిద్దకుండా ఆడిస్తే తర్వాత 7–8 టెస్టుల పాటు అదే ఇబ్బందికరంగా మారేదన్న కోచ్... ఆ సమస్యను అధిగమించేందుకు తగిన సమయం ఇవ్వాలని భావించినట్లు చెప్పారు. మరోసారి కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించిన శాస్త్రి...అతడిని నాటి దిగ్గజాలు రిచర్డ్స్, ఇమ్రాన్ ఖాన్లతో పోల్చారు. -
గెలుపు ఘడియ వచ్చేసింది
ఎప్పుడో స్వాతంత్య్రం సాధించిన కొత్తలో 1947లో తొలిసారి ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన... ఆ తర్వాత మరో పదిసార్లు కంగారు గడ్డకు వెళ్లొచ్చాము... మొత్తంగా ఎనిమిది సార్లు ఓడితే, మరో మూడు సార్లు ‘డ్రా’ చేసుకొని రావడం తప్ప ఒక్కసారి కూడా సిరీస్ గెలుపు రుచి చూడలేదు. కానీ గత తరంలో దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను ఇప్పటి టీమిండియా చేసి చూపిస్తోంది. ఆస్ట్రేలియాను వారి వేదికపైనే చిత్తు చేసి తొలిసారి సిరీస్ తమ ఖాతాలో వేసుకోబోతోంది. చివరి టెస్టుకు నేడు చివరి రోజు కాగా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 3–1తో దర్జాగా పోరును ముగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంటే... ఆ 10 వికెట్లు కాపాడుకొని కనీసం ‘డ్రా’తోనైనా పరువు నిలబెట్టుకోవాలనేది ఆసీస్ ఆశ. నాలుగో రోజు వర్షం, వెలుతురులేమి కారణంగా 25.2 ఓవర్ల ఆట మాత్రమే జరగడంతో ఆసీస్ పోరాటం చివరి రోజుకు చేరింది. చచ్చీ చెడి 300 పరుగుల మార్క్ను చేరిన ఆ జట్టు ఏకంగా 322 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయింది. 31 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఫాలోఆన్ ఆడుతూ నాలుగు ఓవర్లే ఎదుర్కొన్న ఆ జట్టు ఆఖరి రోజు మొత్తం నిలబడి పరాజయం తప్పించుకుంటుందా లేక భారత బౌలర్లకు దాసోహమై తలవంచుతుందా చూడాలి. అయితే ‘డ్రా’ కోసం కూడా తమ ఆటతో పాటు నాలుగో రోజు తమను కాపాడిన వరుణుడి సహాయాన్ని కూడా కంగారూలు కోరుకుంటున్నారు. సిడ్నీ: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన భారత జట్టు సిరీస్కు ఘనమైన ముగింపు ఇచ్చేందుకు మరింత చేరువగా నిలిచింది. నాలుగో టెస్టులో కోహ్లి సేన చేతిలో ఓటమిని తప్పించుకునేందుకు పోరాడుతున్న ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆ జట్టు సోమవారం మొత్తం ఆడినా 316 పరుగుల లోటును అధిగమించి భారత్ను బ్యాటింగ్కు దించడం దాదాపుగా అసాధ్యం. కాబట్టి భారత్ సిరీస్ విజయం 2–1తోనా లేక 3–1తోనే అనేదే ఇక తేలాల్సి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 236/6తో ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 300 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ (5/99) ఐదు వికెట్లతో చెలరేగాడు. 322 పరుగుల ఆధిక్యం దక్కడంతో కోహ్లి ఆసీస్కు ‘ఫాలోఆన్’ ఇచ్చాడు. వెలుతురులేమితో నాలుగు ఓవర్లకే ఆట నిలిచిపోయింది. మరో 64 పరుగులు... వర్షం ఆగి ఆట మొదలైన తర్వాత తొలి వికెట్ కోసం భారత్కు ఎక్కువ సమయం పట్టలేదు. నాలుగో రోజు ఆరో బంతికే కమిన్స్ (25)ను షమీ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ బౌలింగ్కు రాగానే తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి హ్యాండ్స్కోంబ్ (111 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేసినా అది ఎంతో సేపు నిలవలేదు. బుమ్రా వేసిన బంతిని అతను వికెట్లపైకి ఆడుకున్నాడు. ఆ వెంటనే లయన్ (0)ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక మరో వికెట్ తీసేందుకు ఎంతో సేపు లేదనిపించింది. అయితే ఆసీస్ చివరి జోడీ స్టార్క్ (55 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు), హాజల్వుడ్ (45 బంతుల్లో 21; 2 ఫోర్లు) భారత్ను కొంత అసహనానికి గురి చేసింది. హాజల్వుడ్ ‘సున్నా’ వద్ద ఉన్నప్పుడు అతను ఇచ్చిన సునాయాస క్యాచ్ను మిడాన్లో విహారి వదిలేయడం కూడా ఆసీస్కు కలిసొచ్చింది. 14 ఓవర్ల పాటు క్రీజ్లో నిలిచిన వీరు పదో వికెట్కు 42 పరుగులు జోడించారు. ఎట్టకేలకు హాజల్వుడ్ ఎల్బీగా ఔట్ చేసి కంగారూ ఇన్నింగ్స్కు తెరదించిన కుల్దీప్ ఐదో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాట్స్మన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. నాలుగో రోజు ఆటలో ఆసీస్ మరో 64 పరుగులు జోడించి చివరి 4 వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్లోనూ ఆసీస్ ఓపెనర్లు తడబడినా... నాలుగు ఓవర్లలో ఎలాంటి ప్రమాదం లేకుండా వారు ఆటను ముగించారు. భారత్ అసంతృప్తి ఆసీస్ రెండో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బుమ్రా వేసిన షార్ట్ పిచ్ బంతి అనూహ్యంగా పైకి లేచింది. దానిని హారిస్ సరిగా ఆడలేకపోవడంతో బంతి అతని వేలికి బలంగా తాకింది. నిజానికి ఇక్కడ బ్యాట్స్మన్ వైఫల్యమే తప్ప బంతి సరిగా కనబడకపోవడం కాదు. ఆ సమయంలో మైదానంలోని ఎనిమిది ఫ్లడ్లైట్లు కూడా పని చేస్తున్నాయి. కానీ అంపైర్లు ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని వెలుతురు తగ్గిందంటూ టీ విరామానికి ముందు మైదానం వీడారు. నాలుగో రోజు భారత్ కెప్టెన్ కోహ్లి దృష్టంతా విజయంపైనే ఉంది. సిరీస్ సాధిస్తున్నా ఈ టెస్టు కూడా గెలవాలని అతను భావించాడు. అందుబాటులో ఉన్న సమయంలో 14 వికెట్లు పడగొట్టడమే టీమిండియా లక్ష్యం. అందుకే తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఆలౌట్ కాగానే మరో ఆలోచన లేకుండా ఫాలోఆన్ ఇచ్చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్ అర్ధాంతరంగా ముగియడం భారత్కు అసంతృప్తిని మిగిల్చింది. ఆట రద్దును అంపైర్లు ప్రకటించడానికి గంట ముందు అంపైర్లతో కోహ్లి, రవిశాస్త్రి సుదీర్ఘంగా దీనిపై చర్చించారు. షెడ్యూల్ సమయం ప్రకారం అప్పటి నుంచి ఇంకా 31 ఓవర్లు మిగిలే ఉన్నాయి. ఆదివారం ఆట చూద్దామని వచ్చిన స్థానిక అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందారు. చిన్న చినుకు పడినా, లైట్లు అందుబాటులో ఉన్నా కూడా లైట్ మీటర్ రీడింగ్ కాస్త తక్కువ చూపించినా సరే ఆటను నిలిపివేయవచ్చనే ఐసీసీ నిబంధనపై కూడా వారు అసహనం వ్యక్తం చేశారు. మైదానంలో తమ మొబైల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి తమ అసంతృప్తిని ప్రదర్శించారు. వాతావరణం ఆడుకుంది... ఊహించినట్లుగానే సిడ్నీ మ్యాచ్కు నాలుగో రోజు వాన అడ్డంకిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం, వెలుతురు లేమి అంతరాయం కలిగించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 21.2 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్లో 4 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. వర్షం తగ్గకపోవడంతో మొదటి సెషన్ ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మూడు గంటల తర్వాత ఎట్టకేలకు రెండో సెషన్లో కూడా నిర్ణీత సమయంకంటే ఆలస్యంగా మొదలు కాగా... టీ విరామానికి ఎనిమిది నిమిషాల ముందే తగిన వెలుతురు లేక ఆటగాళ్లు మైదానం వీడారు. ఆ తర్వాత మరో బంతి పడలేదు. అంపైర్లు సుదీర్ఘ సమయం పాటు వేచి చూస్తూ పదే పదే తనిఖీలు చేసినా లాభం లేకపోయింది. మరోసారి చినుకులు పడటంతో ఆదివారం ఆట రద్దయింది. -
టి20ల్లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకుకు కుల్దీప్
దుబాయ్: తాజాగా వెస్టిండీస్తో ముగిసిన టి20 సిరీస్... భారత ఆటగాళ్ల ర్యాంకులను మెరుగుపర్చింది. ఐసీసీ సోమవారం విడుదల చేసిన జాబితాలో బౌలర్ల విభాగంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కెరీర్ అత్యుత్తమ (23) ర్యాంకులో నిలిచాడు. అతడు 14 స్థానాలు ఎగబాకాడు. పేసర్ భువనేశ్వర్ (19వ ర్యాంకు) టాప్20లోకి వచ్చాడు. బుమ్రాకు 21వ స్థానం దక్కింది. బ్యాట్స్మెన్లో రోహిత్శర్మ మూడు స్థానాలు మెరుగు పర్చుకుని 7వ ర్యాంకులో, ధావన్ ఐదు స్థానాలు దాటుకుని 16వ ర్యాంకుకు చేరుకున్నారు. జట్లలో పాకిస్తాన్ (138), భారత్ (127) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
300 మ్యాచ్లు... 30 మ్యాచ్లు
విశాఖపట్నం: రెండో వన్డే చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఐదు బంతులకు వెస్టిండీస్ 9 పరుగులు రాబట్టింది. అనుకోకుండా వెళ్లిన లెగ్ బై బౌండరీని మినహాయిస్తే ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా ఆ ఐదు బంతులను ఆడటంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ ఓవర్కు వ్యూహ రచన చేసిన ధోని ఆఖరి బంతికి మాత్రం ఫీల్డింగ్ను మార్చేశాడు. థర్డ్మ్యాన్ను మరి కాస్త లోపలకు తీసుకొచ్చి పాయింట్ ఫీల్డర్ను డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ వద్దకు పంపించాడు. స్వీపర్ కవర్, లాంగాఫ్ను కూడా తప్పించాడు. అయితే ఈ వ్యూహం వ్యతిరేకంగా పని చేసి ఆఖరి బంతిని హోప్ ఫోర్ కొట్టి మ్యాచ్ను ‘టై’ చేయగలిగాడు. ఇదే విషయంపై మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో కుల్దీప్ యాదవ్ను ప్రశ్నించగా అతను సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు. ‘ఇది ధోని ప్రణాళిక. దాని గురించి తెలిసేంత పెద్దవాడిని కాను. నేను 30 మ్యాచ్లు మాత్రమే ఆడాను. మహి భాయ్ 300 మ్యాచ్లు ఆడాడు. మా అందరికంటే అతనికి చాలా ఎక్కువ అనుభవం ఉంది. ఆ సమయంలో అతను అనుకున్నది అమలు చేశాడు’ అని కుల్దీప్ జవాబిచ్చాడు. దాదాపు పది నెలల క్రితం జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకొని కుల్దీప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అనిపించింది. ఇండోర్లో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్లో ధోని ఫీల్డింగ్ మార్పులు చేస్తూ కవర్ను తప్పించి పాయింట్ను మరింత ముందుకు తీసుకు రమ్మని బౌలర్ కుల్దీప్కు సూచించాడు. అయితే దీనిని పట్టించుకోని కుల్దీప్ తనకు ఈ ఫీల్డింగ్ బాగుందని చెప్పాడు. దాంతో చిర్రెత్తిన ధోని ‘300 మ్యాచ్లు ఆడిన నేనేమైనా పిచ్చివాడినా’ అంటూ ఏడో మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరో వైపు మంచు కారణంగా బంతిపై పట్టు చిక్కక పోవడం వల్లే గెలుపు చేజారిందని ఈ చైనామన్ బౌలర్ విశ్లేషించాడు. -
భవిష్యత్తు ఆ ముగ్గురిదే!
ఆసక్తికర ఆరంభమే లభించినా... రెండో టెస్టు మ్యాచ్ కూడా మూడు రోజుల్లోనే ముగిసిపోయి భారత్కు మరో సిరీస్ను అందించింది. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచపు రారాజులుగా వెలిగిన జట్టు ఇంత అధమ స్థాయికి దిగజారడం క్రికెట్ అభిమానులను కలతకు గురి చేస్తున్నా... నాడు వారి చేతుల్లో ఇదే తరహాలో చావుదెబ్బ తిన్న మాకు మాత్రం ఈతరం యువ భారత క్రికెటర్లు ఆడుతున్న అద్భుత ఆట చూస్తే సంతృప్తి కలుగుతుంది. వెస్టిండీస్ అగ్రశ్రేణి క్రికెటర్లు కొందరు ప్రపంచవ్యాప్తంగా డబ్బులు బాగా వచ్చే టి20 లీగ్లు ఆడటానికే ఆసక్తి కనబరుస్తుండటంతో విండీస్ బాగా బలహీనంగా మారిందనేది వాస్తవం. గత పదేళ్లుగా ఆ జట్టు పూర్తి స్థాయి బలంతో బరిలోకి దిగడం అరుదుగా మారింది. కరీబియన్ దీవులు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి కానీ అక్కడ బతుకుదెరువు కోసం ఉద్యోగావకాశాలు చాలా తక్కువ. కాబట్టి టెస్టు మ్యాచ్లు ఆడటంకంటే టి20 లీగ్లతో తమ భవిష్యత్తును భద్రం చేసుకోవాలని వారు భావించడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ జట్టులో అత్యుత్తమ బౌలర్లు లేకపోవడం అనూహ్యమేమీ కాదు కానీ మరీ ప్రమాదకరంగా ఏమీ లేని పిచ్లపై కూడా జట్టు బ్యాట్స్మన్ ఆడుతున్న తీరు మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తోంది. కనీసం బ్యాటింగ్ ఆర్డర్ను కూడా మార్చకుండా, ఒకే తరహా మూసలో ఆడటం వల్ల వారికి మరింత నష్టం జరిగింది. ఛేజ్, హోల్డర్ ఇద్దరూ ప్రస్తుతం తాము ఆడుతున్న స్థానాలకంటే మరింత పైన బ్యాటింగ్కు రావాల్సింది. భారత్కు మరో సిరీస్ విజయం పూర్తిగా సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా ముగ్గురు యువ ఆటగాళ్లు తమ సత్తా చాటడం జట్టుకు అదనపు బలంగా మారింది. మరిన్ని పరుగులు సాధించే తపన పృథ్వీ షాలో కనిపించగా... అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్లో రిషభ్ పంత్ ఆకట్టుకున్నాడు. తన లైన్ అండ్ లెంగ్త్పై పట్టు సాధించిన కుల్దీప్ యాదవ్ కూడా తొలిసారి ఐదు వికెట్ల ఘనతను నమోదు చేశాడు. ఈ ముగ్గురిని భారత భవిష్యత్తుగా చెప్పవచ్చు. చాలా మందిలాగే కెరీర్లో మున్ముందు ఎత్తుపల్లాలు వచ్చే అవకాశం ఉన్నా వీరిలో పోరాట తత్వం ఉండటం వల్ల పరుగులు సాధించగలరు, వికెట్లు పడగొట్టగలరు. టెస్టులో పది వికెట్లు సాధించిన ఉమేశ్ యాదవ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. కుడిచేతి వాటం బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేసేటప్పుడు బంతిని అతను అద్భుతంగా రివర్స్ స్వింగ్ చేస్తూ ప్యాడ్, బ్యాట్ మధ్యలోంచి దూసుకుపోయేలా చేశాడు. కొత్త బంతిని అద్భుతంగా ఉపయోగించగల బౌలింగ్ దళం ఇప్పుడు భారత్ వద్ద ఉంది. టెస్టు సిరీస్ను భారత్ అతి సునాయాసంగా గెలుచుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్పై నిలిచింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement