breaking news
Josh Tongue
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఆసీస్ గడ్డపై తొలిసారి ఇలా..
ఆస్ట్రేలియా గడ్డపై దాదాపు దశాబ్దన్నరం తర్వాత ఇంగ్లండ్ తొలిసారి టెస్టు మ్యాచ్ గెలిచింది. పదిహేనేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మొదటిసారి గెలుపు జెండా ఎగురవేసింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా బాక్సింగ్ డే టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.గెలుపు బోణీఆతిథ్య ఆసీస్ విధించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించి.. గెలుపు బోణీ కొట్టింది. యాషెస్ సిరీస్లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన ఇంగ్లండ్ హ్యాట్రిక్ పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అయింది. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచిన కంగారూలు యాషెస్ సిరీస్ను మరోసారి కైవసం చేసుకోగా.. స్టోక్స్ బృందం తీవ్ర విమర్శలపాలైంది.ముఖ్యంగా.. బజ్బాల్ అంటూ దూకుడైన ఆటతో మూల్యం చెల్లించేలా చేసిన హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పదవి నుంచి దిగిపోవాలనే డిమాండ్లు పెరిగాయి. ఇలాంటి ఒత్తిళ్ల నడుమ ప్రసిద్ధ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నాలుగో టెస్టులో బరిలో దిగింది ఇంగ్లండ్.బౌలర్లదే పైచేయిశుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, పచ్చటి పిచ్ పేసర్లకు అనుకూలించిన తరుణంలో ఆసీస్ బౌలర్లు సైతం చెలరేగిపోయారు. ఇంగ్లండ్ను 110 పరుగులకే కుప్పకూల్చారు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 42 పరుగుల ఆధిక్యం సంపాదించిన కంగారూలు.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం తేలిపోయారు. ఈసారి 132 పరుగులకే ఆలౌట్ అయ్యారు. తద్వారా ఇంగ్లండ్కు 175 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగారు. అయితే, లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పొరపాట్లకు తావివ్వలేదు.ఆచితూచి ఆడుతూనే తమదైన శైలిలో టార్గెట్ పూర్తి చేసింది. ఆరు వికెట్లు నష్టపోపయి 178 పరుగులు చేసి.. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఇంగ్లండ్ చివరగా 2010లో టెస్టు మ్యాచ్ గెలిచింది. ఆసీస్ గడ్డపై తొలిసారి ఇలా..ఇక ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్కు ఆస్ట్రేలియాలో ఇదే యాషెస్ తొలి టెస్టు విజయం కావడం విశేషం. ఇంతటి ప్రత్యేక మ్యాచ్లో మొత్తంగా ఏడు వికెట్లతో చెలరేగిన జోష్ టంగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: Ro-Ko: అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత? -
చరిత్ర సృష్టించిన జోష్ టంగ్
ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన ఈ కుడిచేతి వాటం బౌలర్.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రసిద్ధ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో 21వ శతాబ్దంలో టెస్టులలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఇంగ్లండ్ తొలి బౌలర్గా 28 ఏళ్ల టంగ్ నిలిచాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2025-26)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.3-0తో సిరీస్ సొంతం చేసుకున్న ఆసీస్ ఇందులో భాగంగా పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. ఇప్పటికే సిరీస్ను కోల్పోయింది. ఈ క్రమంలో శుక్రవారం మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన కంగారూ జట్టు.. తొలి ఇన్నింగ్స్లో 45.2 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఆసీస్ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయడంలో జోష్ టంగ్దే ముఖ్య భూమిక. టాపార్డర్లో ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (10), వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (6) రూపంలో కీలక వికెట్లు తీసిన టంగ్... అద్బుతమైన డెలివరీతో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9) రూపంలో మరో డేంజరస్ బ్యాటర్ను కూడా పెవిలియన్కు పంపాడు.WHAT A DELIVERY!Steve Smith looks on puzzled after this peach from Josh Tongue.#Ashes | #PlayoftheDay | @nrmainsurance pic.twitter.com/NpkEgGxOQR— cricket.com.au (@cricketcomau) December 26, 2025తొలి ఇంగ్లండ్ బౌలర్గా అదే విధంగా లోయర్ ఆర్డర్లో పట్టుదలగా నిలబడ్డ ఆసీస్ పేసర్ మైకేల్ నాసర్ (35)ను కూడా అవుట్ చేసిన టంగ్.. ఆఖరిగా స్కాట్ బోలాండ్ను డకౌట్ చేసి తన ఖాతాలో ఐదో వికెట్ జమచేసుకున్నాడు. తద్వారా ఎంసీజీలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి.. 21వ శతాబ్దంలో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బౌలర్గా చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్ ఇతర బౌలర్లలో గస్ అట్కిన్సన్ రెండు, బ్రైడన్ కార్స్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఫలితంగా 29.5 ఓవర్లలో కేవలం 110 పరుగులు చేసిన ఇంగ్లండ ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో 42 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో నాసర్ నాలుగు, బోలాండ్ మూడు, స్టార్క్ రెండు, గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే.. -
Ashes: కుప్పకూలిన ఆసీస్.. ఆలౌట్
ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి తాళలేక స్వల్ప స్కోరుకే చాపచుట్టేశారు. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను కంగారూలు ఇప్పటికే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐదు టెస్టులలో భాగంగా తొలి మూడు గెలిచి ఆసీస్ 3-0తో ఆధిక్యంలో ఉంది.ఈ క్రమంలో ఆసీస్- ఇంగ్లండ్ (Aus vs Eng) మధ్య మెల్బోర్న్ వేదికగా శుక్రవారం నాలుగో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆతిథ్య జట్టు బ్యాటింగ్కు దిగింది. అయితే, ఆది నుంచే ఇంగ్లండ్ పేసర్లు గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ కంగారూ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లుడేంజరస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ (12)ను అట్కిన్సన్ బౌల్డ్ చేయగా.. మరో ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (10)ను టంగ్ వెనక్కి పంపాడు. ఇక వన్డౌన్లో వచ్చిన మార్నస్ లబుషేన్ (6)తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9) వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్న టంగ్.. ఆసీస్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.ఇక ఉస్మాన్ ఖవాజా (29)ను అట్కిన్సన్ వెనక్కి పంపగా.. అలెక్స్ క్యారీ (20) బెన్ స్టోక్స్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ (17) రనౌట్ కాగా.. టెయిలెండర్లలో మైకేల్ నాసర్ (35) కాసేపు పోరాడగా.. టంగ్ అతడిని బౌల్డ్ చేశాడు. ఐదేసిన టంగ్.. ఆసీస్ ఆలౌట్ఆఖర్లో మిచెల్ స్టార్క్ (1) రూపంలో బ్రైడన్ కార్స్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకోగా.. స్కాట్ బోలాండ్ (0)ను అవుట్ చేసిన టంగ్ ఐదో వికెట్ తీశాడు. జే రిచర్డ్సన్ (0) నాటౌట్గా నిలవగా.. ఆసీస్ 45.2 ఓవర్లలో కేవలం 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లిష్ జట్టు బౌలర్లలో జోష్ టంగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. అట్కిన్సన్కు రెండు, బ్రైడన్ కార్స్, స్టోక్స్లకు చెరో వికెట్ దక్కాయి. చదవండి: టీమిండియా కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా! -
Ashes: మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. పేలవ ప్రదర్శనతో తేలిపోయిన పేసర్ గస్ అట్కిన్సన్ను జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో మరో కుడిచేతి వాటం పేసర్నే ప్లేయింగ్ ఎలెవన్కు ఎంపిక చేసింది.2-0తో ఆధిక్యంలో ఆసీస్కాగా ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆతిథ్య ఆసీస్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2025-26)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు స్టోక్స్ బృందం అక్కడికి వెళ్లింది. ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ప్రస్తుతానికి 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.ఇలా కంగారూలు సొంతగడ్డపై ఆధిపత్యం కొనసాగిస్తుండగా.. ఇంగ్లండ్ మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. ముఖ్యంగా కీలక పేసర్ అయిన గస్ అట్కిన్సన్ (Gus Atkinson) ధారాళంగా పరుగులు (సగటున 78.6) ఇచ్చుకుంటూ.. అదే స్థాయిలో వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో.. నాలుగు ఇన్నింగ్స్లో కలిపి అతడు కేవలం మూడే వికెట్లు పడగొట్టాడు.అతడిపై వేటుఈ నేపథ్యంలో అట్కిన్సన్పై వేటు వేసిన ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం.. అతడి స్థానంలో మరో రైటార్మ్ పేసర్ జోష్ టంగ్ (Josh Tongue)ను తుదిజట్టుకు ఎంపిక చేసింది. దీంతో మాథ్యూ పాట్స్కు మరోసారి నిరాశే మిగిలింది. ఈ ఒక్క మార్పు తప్ప రెండో టెస్టులో ఆడిన జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది.బషీర్కు మరోసారి మొండిచేయిమరోవైపు.. స్పెషలిస్టు స్పిన్నర్ షోయబ్ బషీర్కు మరోసారి మొండిచేయి చూపిన మేనేజ్మెంట్.. స్పిన్ ఆప్షన్ కోటాలో బ్యాటింగ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ను కొనసాగించింది.ఇదిలా ఉంటే.. ఓవైపు ఆసీస్ పేసర్లు విజృంభిస్తున్న పిచ్లపై ఇంగ్లండ్ సీమర్లు మాత్రం తేలిపోతున్నారు. నిజానికి జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (డిసెంబరు 17) నుంచి మూడో టెస్టు మొదలుకానుంది. ఇందుకు అడిలైడ్లోని అడిలైడ్ ఓవల్ మైదానం వేదిక.ఆస్ట్రేలియాతో యాషెస్ మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.చదవండి: అక్కడే లాక్ అయిపోయాం: బాండీ బీచ్ ఘటనపై మైకేల్ వాన్ -
ఐపీఎల్ వేలంలో ఆ నలుగురికి భారీ ధర!.. అతడిని ముంబై కొనొచ్చు!
ఐపీఎల్ మినీ వేలం-2026 నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంపాటలో ఇంగ్లండ్ ఆటగాళ్లకు మంచి ధర దక్కుతుందని అంచనా వేశాడు. ‘ది హండ్రెడ్’ లీగ్ (The Hundred)లో సత్తా చాటిన ‘ఆ నలుగురు’ అధిక ధరకు అమ్ముడుపోతారంటూ జోస్యం చెప్పాడు.ఒంటిచేత్తో మ్యాచ్లు గెలిపించాడుఅయితే, వాళ్లు ఇంత వరకు ఒక్కసారి కూడా క్యాష్ రిచ్ లీగ్లో ఆడకపోవడం విశేషం. ఇంతకీ ఎవరా నలుగురు?!... తన యూట్యూబ్ షో అశ్ కీ బాత్లో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు ఐపీఎల్లో ఆడని ప్లేయర్..కానీ ఈసారి వేలంలో మాత్రం అధిక ధర పలికే అవకాశం ఉంది. అతడు మరెవరో కాదు జోర్డాన్ కాక్స్ (Jordan Cox).ఓవల్ ఇన్విసిబుల్స్ తరఫున అతడు అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. 24 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఒంటిచేత్తో మ్యాచ్లు గెలిపించాడు. ముంబై ఇండియన్స్ అతడపై ఆసక్తి చూపవచ్చు. అతడిని సొంతం చేసుకోవచ్చు కూడా!సోనీ బేకర్ సూపర్ఇక రెండో ఆటగాడు ఎవరంటే.. టీమిండియాతో టెస్టు సిరీస్లో జోష్ టంగ్ మెరుగ్గా ఆడాడు. అయితే, మాంచెస్టర్ ఒరిజినల్స్ తరఫున అతడు బౌలర్గా గొప్పగా రాణించాడు. అదే జట్టు నుంచి మరో ప్లేయర్ కూడా మెరుగ్గా ఆడాడు. అతడే సోనీ బేకర్.అద్భుతమైన ఇన్స్వింగర్లతో ప్రత్యర్థులను భయపెట్టాడు. కొత్త బంతితో మెరుగ్గా రాణించాడు. ఇక రెహాన్ అహ్మద్ .. ఈసారి బౌలింగ్తో కన్నా బ్యాటింగ్తో వార్తల్లో నిలిచాడు. మూడు, నాలుగు స్థానాల్లో వచ్చి రాణించాడు. లెగ్ స్పిన్నర్గానూ సేవలు అందించగలడు’’ అని పేర్కొన్నాడు.నలుగురి ప్రదర్శన ఇలాకాగా ది హండ్రెడ్ లీగ్లో మాంచెస్టర్ ఒరిజినల్స్కు ప్రాతినిథ్యం వహించిన పేసర్ జోష్ టంగ్.. పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. ఓవల్ ఇన్విసిబుల్స్ తరఫున ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్.. 367 పరుగులు సాధించాడు.ఇక మాంచెస్టర్ ఒరిజినల్స్కు ఆడిన యువ పేసర్ సోనీ బేకర్ తొమ్మిది వికెట్లతో సత్తా చాటగా.. ట్రెంట్ రాకెట్స్కు ప్రాతినిథ్యం వహించిన స్పిన్ ఆల్రౌండర్ రెహాన్ అహ్మద్.. 189 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు కూడా తీశాడు. ఇదిలా ఉంటే.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్.. ఇటీవలే ఐపీఎల్కూ కూడా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.చదవండి: ‘భారత క్రికెట్ బాగుండాలంటే.. రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు ఆడాలి’


