breaking news
Jamikunta
-
జమ్మికుంటలో ఇక నిత్యం జాతీయ గీతం ఆలాపన
ఆగస్టు 15 నుంచి మొదలు.. ఉదయం 8 గంటలకు షురూ ఇక ఎక్కడివారు అక్కడే సెల్యూట్ జమ్మికుంట(హుజూరాబాద్): స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా జమ్మికుంట దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. పంద్రాగస్టును పురస్కరించుకొని జమ్మికుంట ప్రజలంతా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. అలాగే, ఎక్కడి ప్రజలు అక్కడ సెల్యూట్ చేస్తారు. పట్టణ సీఐ ప్రశాంత్రెడ్డి ఆలోచనల్లోంచి ఈ కొత్త ఒరవడిని మంగళవారం నాటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా జమ్మికుంటలో రోజూ ఉదయం 8 గంటలకు మొత్తం 11 చోట్ల ఏర్పాటు చేసిన మైకుల్లో ‘జనగణమణ’ వినిపిస్తారు. ఈ సమయంలో పట్టణ ప్రజలంతా ఎక్కడి వారు అక్కడే సెల్యూట్ చేస్తూ.. జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. ఇలా రోజూ ప్రజలంతా జాతీయ గీతాన్ని ఆలపించి, సెల్యూట్ చేయడం దేశంలోనే తొలిసారిగా జమ్మికుంట వేదిక కానుంది. -
టీఎస్ఆర్టీసీ లోగో తయార్
జమ్మికుంట టౌన్: జమ్మికుంట పట్టణానికి చెందిన రాంపెల్లి విజయభాస్కర్ టీఎస్ఆర్టీసీ లోగోను రూపొందించారు. కమలాపూర్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విజయభాస్కర్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లోగోను రూపొందించారు. ఈ లోగోను మరి కొద్దిరోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొంతమంది టీజీఆర్టీసీగా రూపొందిస్తున్నారని, తాను రూపొందించిన దానిలో తెలంగాణ ఆర్టీసీ అనే అర్థం వస్తుందని వివరించారు.