-
సక్సెస్ మంత్ర: రైతు బిడ్డ నుంచి ఇస్రో శాస్త్రవేత్తగా..
సూళ్లూరుపేట: కేరళలోని కన్నూరు జిల్లా పయ్యనూర్ అనే మారుమూల గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జని్మంచిన కున్హికృష్ణన్ ఇస్రో శాస్త్రవేత్త, ప్రొఫెసర్ యూఆర్రావు స్పేస్ సెంటర్ (బెంగళూరు) డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించారు. పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి సక్సెస్ను అందించిన ఘనత ఆయనదే. 1986లో ఇస్రోలో ప్రవేశం కేరళలోని పయ్యనూరులోనే కున్హికృష్ణన్ ప్రాథమిక విద్యాభాసం. 1981లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. త్రివేండ్రం యూనివర్సిటీలో ఎల్రక్టానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో 1986లో పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం కేరళలోని త్రివేండ్రం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ)లో మెకానిజం వెహికల్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్లో ఇంజినీర్గా ఉద్యోగంలో చేరారు. ఈ విభాగంలో మంచి పరి«ణితి సాధించిన తర్వాత 2009లో పీఎస్ఎల్వీ సీ12, పీఎస్ఎల్వీ సీ13 , పీఎస్ఎల్వీ సీ15 ప్రయోగాలకు అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పని చేస్తూ వీఎస్ఎస్సీ నుంచి షార్కి వచ్చి ప్రయోగాలు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి విజయవంతం చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్ ఇంటిగ్రేషన్ విషయంలో మంచి ఫలితాలు చూపించడంతో పీఎస్ఎల్వీ సీ 15 ప్రయోగం నుంచి పీఎస్ఎల్వీ సీ 27 వరకు 13 పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్లకు ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసి అన్ని ప్రయోగాలను విజయవంతం చేశారు. ఆ తర్వాత ఆయన షార్ డైరెక్టర్గా పదోన్నతి కలి్పంచి షార్ డైరెక్టర్గా 2015 నుంచి 2018 దాకా సక్సెస్ పుల్ డైరెక్టర్గా పేరు గడించారు. ఆయన డైరెక్టర్గా పని చేసిన కాలంలో 17 పీఎస్ఎల్వీ ప్రయోగాలు, ఐదు జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేశారు. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళ్యాన్–1 ప్రయోగానికి ప్రాజెక్టు డైరెక్టర్గా వ్యవహరించింది కూడా పి కున్హికృష్ణన్ కావడం విశేషం. ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ ఇతని ప్రతిభను గుర్తించి బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్రావు స్పేస్ సెంటర్ డైరెక్టర్ (ఉపగ్రహాల తయారీ కేంద్రం)కు బదిలీ చేశారు. ఇస్రోలో అన్ని రకాలుగా సేవల అందించి దేశానికి ఉపయోగపడిన కున్హికృష్ణన్ సోమవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఎన్నో అవార్డులు ►2010 : మొట్టమొదటగా ఇస్రో ఇండిజువల్ మెరిట్ ఆవార్డును అందుకున్నారు. ►2011 : ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డు ►2013 : పీఎఫ్ఎల్వీ సీ25–మంగళ్యాన్–1 ప్రయోగాన్ని సక్సెస్ పుల్గా నిర్వహించినందుకు ఇస్రో టీమ్ ఎక్స్లెన్స్ అవార్డు టీమ్ లీడర్గా అందుకున్నారు. ►2013 : ఇస్రో ఫెర్ఫార్మెన్స్ ఎక్స్లెన్స్ అవార్డు. ►2015 : స్వదేశీ శాస్త్ర పురస్కార్ ►2017 : మధ్యప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞాన్ ప్రతిభా సమ్మాన్ అవార్డు. ►2018 : ఇస్రో అవుట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఆవార్డు. ►2020 : తమిళనాడు స్టేట్ సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా)వారు ఎమినెంట్ ఇంజినీర్ అవార్డులను అందుకున్నారు. చదవండి: నైపుణ్య కళాశాలలు: ఏపీ సర్కార్ కీలక ముందడుగు.. వారెప్పటికీ అనాథలు కారు..! -
రామయ్యను దర్శించుకున్న ఇస్రో డైరెక్టర్
భద్రాచలం : శ్రీ సీతారామచంద్రస్వామి వారిని హైదరాబాద్కు చెందిన ఎన్ఆర్ఎస్సీ అండ్ ఇస్రో డైరెక్టర్ డాక్టర్ వైవీఎన్ కృష్ణమూర్తి శుక్రవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం ప్రాంగణంలోని లక్ష్మీ తాయారమ్మ, అభయాంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
హెచ్చరించినా... నిర్లక్ష్యం చేశారు
ముందే సమాచారం అందించాం : స్పష్టం చేసిన ఇస్రో డెరైక్టర్ శివన్ చెన్నై: పదిహేను రోజుల ముందే వర్షాలపై ప్రభుత్వాన్ని ఇస్రో హెచ్చరించి ఉంది. అయినా పాలకులు ఖాతరు చేయని దృష్ట్యా, పెను వరదల్ని చవి చూడాల్సి వచ్చింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో నాగర్కోయిల్లో ఇస్రో డెరైక్టర్ శివన్ వ్యాఖ్యలు చేశారు. వరదలు ప్రజా జీవితాన్ని పిప్పి చేసిన విషయం తెలిసిందే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం తాజాగా వ్యవహరిస్తోంది. అయితే, ప్రభుత్వానికి పదిహేను రోజుల క్రితమే ఇస్రో సమాచారాన్ని అందించి ఉంది. వర్ష ప్రభావం ఏ మేరకు ఉండబోతోందోనని నివేదిక రూపంలో సమాచారం ఇచ్చినా , పాలకులు ఖాతరు చేయక పోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సోమవారం నాగుర్కోయిల్లో ఓ మీడియాతో ఇస్రో డెరైక్టర్ శివన్ మాట్లాడుతూ భారీ వర్షాలను ముందే గుర్తించి తమిళనాడు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వివరించారు. పదిహేను రోజులక్రితం సమాచారం ఇచ్చినా అందుకు తగిన చర్యలు తీసుకోని దృష్ట్యా, పెను విలయం ఏర్పడిందని పేర్కొన్నారు. వాతావరణ సంబంధిత అన్ని వివరాలను తెలుసుకునేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు ఇస్రో వద్ద ఉన్నాయని వివరించారు. ఇస్రో హెచ్చరించినా, పాలకులు ఖాతరు చేయక పోవడంపై ప్రజల్లో అసహనం బయల్దేరుతోంది. తమ జీవితాల మీద ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా అని పెదవి విప్పే వాళ్లు అధికం అయ్యారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement