breaking news
Internet services disrupted
-
ఎర్ర సముద్రం అడుగున తెగిన కేబుళ్లు
దుబాయ్: ఎర్ర సముద్రం అడుగున్న కేబుళ్లు తెగడంతో భారత్ సహా పలు ఆసియా దేశాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో ఎస్ఎండబ్ల్యూ4, ఐఎంఈడబ్లూఈ కేబుల్ వ్యవస్థలు స్తంభించాయని ఇంటర్నెట్ పర్యవేక్షక సంస్థ నెట్బ్లాక్స్ తెలిపింది. గాజా యుద్ధాన్ని ఆపేసేలా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచేందుకే కేబుళ్లకు నష్టం కలిగించి ఉండొచ్చంటున్నారు. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, పశ్చిమ ఐరోపా4 కేబుల్ను టాటా కమ్యూనికేషన్స్.. భారత్, పశ్చిమాసియా, పశ్చిమ యూరప్ కేబుళ్లను అల్కాటెల్ లూసెంట్ నిర్వహిసతఉన్నాయి. ఈ పరిణామంపై సౌదీ మౌనం వహించగా, నెట్ వేగం తగ్గిందని యూఈఏ తెలిపింది. -
చెలరేగిన హింస, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో బుధవారం ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలివేశారు. బదూరియా ప్రాంతంతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దులో మత ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఓ మతానికి చెందిన పుణ్యక్షేత్రాన్న్న అగౌరపరుస్తూ అభ్యంతరకరంగా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్తో రెండు రోజుల క్రితం గొడవలు మొదలయ్యాయి. శాంతి భద్రతల కోసం రాష్ట్ర పోలీసులకు తోడుగా 400మంది బీఎస్ఎఫ్ జవాన్లను ప్రభుత్వం మోహరించింది. మరోవైపు ఫేస్బుక్లో ఆ పోస్ట్ పెట్టిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా బదూరియా ప్రాంతంలో ఘర్షణలు చెలరేగినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. మత ఘర్షణలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి తనను బెదరించారనీ, అవమానపరిచారని ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే మమత ఆరోపణలను గవర్నర్ ఖండించారు. తాను సీఎంను అవమానపరచలేదని, ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని కేసరీనాథ్ పేర్కొన్నారు.