-
ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదు
అమరుల స్థూపాల సాక్షిగా వామపక్ష నేతల హెచ్చరిక యడ్లపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలు మార్చుకోకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని పలువురు వామపక్ష నాయకులు హెచ్చరించారు. మండలంలోని తుమ్మలపాలెం వద్ద ఉన్న అమర్నగర్లో అమరవీరుల స్మారక స్థూపం వద్ద బుధవారం సభ జరిగింది. ఈ సందర్భంగా అమరవీరుల సమాధులపై పూలు చల్లి, మృతవీరులకు నివాళులర్పించారు. అనంతరం న్యాయవాది రావిపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ధ్వజం ఎత్తారు. మరోమారు ఉద్యమబాట పట్టక తప్పదంటూ హెచ్చరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ‘మేక్ ఇండియా’ ప్రకటనలకే తప్ప ఆచరణలో ఎలాంటి ప్రయోజనాలను ఇవ్వలేదని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శివర్గ సభ్యుడు వి.కృష్ణయ్య విమర్శించారు. విదేశాల్లోని నల్లధనాన్ని స్వదేశానికి తెస్తానని, లక్షల కోట్లు విదేశీ పెట్టుబడులు పెట్టిస్తానంటూ చెప్పిన మోదీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పాలనను కొనసాగిస్తున్నారన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగాలు ప్రైవేటీకరణకు సిద్ధం అవుతున్నాయన్నారు. దేశాన్ని అమ్మేస్తున్నారు! భారతదేశం ఒకప్పుడు తాకట్టులో ఉండేదని, ఇప్పుటి పాలకులు ఏకంగా అమ్మేస్తున్నారని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకురాలు ఝాన్సీ అన్నారు. చంద్రబాబు దృష్టి బాకై ్సట్ ఖనిజాలున్న విశాఖపట్నం పైనే తప్ప ,దాని చుట్టూ ఉన్న అడవి బిడ్డలపై లేదన్నారు. 270 గిరిజన గ్రామాలు పొలవరంలో ముంపునకు గురైతే వారికి పునరావాసం కల్పించలేదన్నారు. కమ్యూనిస్టులందరూ ఒకే జెండా కిందకు రావాలని సీపీఐ చిలకలూరిపేట డివిజన్ ఏరియా కార్యదర్శి సీఆర్మోహన్ ఆకాంక్షించారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రజలకు కమ్యూనిస్టుల అవసరం ఉందన్నారు.ప్రస్తుత సమాజంలో దోపిడీ తీరు మారిందని, అందుకనుగుణంగా ఉద్యమాల తీరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఎంసీపీఐ రాష్ట్ర నాయకుడు శివయ్య అన్నారు. -
కొన్ని విజయాలు.. కొన్ని వెనుకబాట్లు
రెండేళ్ల మోదీ పాలనపై అమెరికన్ నిపుణుల వ్యాఖ్య వాషింగ్టన్: కొన్ని విజయాలు.. కొన్ని వెనుకబాట్లు... వెరసి భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనలో మిశ్రమ ఫలితాలు సాధించారని అమెరికన్ నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ రెసిడెంట్ ఫెలో, వాల్స్ట్రీట్ జర్నల్ కాలమిస్ట్ అయిన సదానంద్ ధూమే అమెరికా చట్టసభ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ రెండేళ్ల పాలనపై వ్యాఖ్యానిస్తూ.. మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరచడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించిందన్నారు. ప్రతిపక్షం అడ్డం కులు సృష్టించడం వల్లనో లేదా ధైర్యంగా నిర్ణయం తీసుకోలేక పోవడం వల్లనో సమూలంగా సంస్కరణలు చేయలేకపోయిందన్నారు. లోక్సభలో చాలినంత మెజారిటీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వ చట్టాలను మార్చడానికి మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. అయితే మోదీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను సడలించిందని.. రక్షణ, బీమా, ఆహార రంగాల్లో చాలా ప్రగతి సాధించిం దని అన్నారు. బలమైన ప్రజాస్వామ్య దేశమైన భారత్కు అమెరికా ప్రోత్సాహం కొనసాగాలని ఆయన సూచించారు. అమెరికాకు కూడా భారత్ తో వ్యాపార సంబంధాలు అవసరమన్నారు. యూఎస్-భారత్ పాలసీ స్టడీస్ సెంటర్ ఫర్ స్ట్రేటజిక్, ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రతినిధి రిచర్డ్ ఎం రోసో, ఇతర వ్యాఖ్యాతలు మోదీ మరిన్ని సంస్కరణలు చేయాలని చెప్పారు. ఇంటర్నెట్ స్టార్గా ప్రధాని మోదీ న్యూయార్క్: ప్రధాన మంత్రి మోదీ వరుసగా రెండో ఏడాదీ ఇంటర్నెట్ లో అత్యంత ప్రభావవంత వ్యక్తుల్లో ఒకరిగా నిలి చారు. ఈ ఏడాది ఇంట ర్నెట్లో అత్యంత ప్రభావవంతమైన 30 మంది వ్యక్తుల్లో మోదీని ఒకరిగా ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ టైమ్ చేర్చింది. దౌత్య సంబంధాలకు సామాజిక మాధ్యమ వెబ్సైట్లను తరచూ ఉపయోగించే మోదీని ఇంటర్నెట్ స్టార్గా ‘టైమ్’ అభివర్ణించింది. గతేడాది పాకిస్తాన్లో చేపట్టిన ఆకస్మిక పర్యటన గురించి మోదీ అనూహ్యంగా ట్విటర్ ద్వారా ప్రకటించడాన్ని ప్రస్తావించింది. సో షల్ మీడియాపై పోటీదారులు చూపిన ప్రపంచస్థాయి ప్రభా వం, వార్తలను మలచడంలో వారికి ఉన్న సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. జాబితాలో స్థానం సంపాదించిన వారిలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్, టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్, ‘హ్యారీపాటర్’ రచయిత్రి జేకే రౌలింగ్, సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు. మోదీకి 1.8 కోట్ల మంది ట్విటర్ ఫాలోవర్లు ఉన్నారు. -
యే మేరా ఆసియన్..
-
ఐరాస సంస్కరణలపై ఐక్య గళం
ఉగ్రవాదం, వాతావరణ మార్పుపై కలసికట్టుగా పోరాటం * మనది వ్యూహాత్మక ప్రయోజనాలకు మించిన బంధం * ఇండియా- ఆఫ్రికా ఫోరం సదస్సులో మోదీ * ఆఫ్రికాకు రూ. 65.33 వేల కోట్ల రుణం; అభివృద్ధి ప్రాజెక్టుల్లో చేయూత న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితిలోని భద్రతామండలిలో సంస్కరణల కోసం భారత్, ఆఫ్రికాలు ఐక్యంగా గళమెత్తాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మారనట్లయితే ఐరాస అసంబద్ధమైన సంస్థగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదంపైనా భారత్, ఆఫ్రికాలు కలసికట్టుగా పోరాడాలన్నారు. మూడో ఇండియా- ఆఫ్రికా ఫోరం సదస్సులో గురువారం మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఐరాస సంస్కరణల విషయంలో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కూడా మోదీతో జత కలిశారు. భద్రతామండలిలో భారత్తో పాటు ఆఫ్రికాలోని రెండు దేశాలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రతామండలిలోని శాశ్వత దేశాలు ఆఫ్రికా దేశాలను చిన్నచూపు చూస్తున్నాయని, తమను మరుగుజ్జులుగా భావిస్తూ అవమానిస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా భారత్ తరఫున ఆఫ్రికాకు రాను న్న ఐదేళ్లలో రూ. 65.33 వేల కోట్ల మేరకు రాయితీతో కూడిన రుణాన్ని మోదీ ప్రకటించారు. రూ. 3.9 వేల కోట్ల సహాయక నిధిని కూడా ప్రకటించారు. ఇవి భారత్ ఇప్పటికే అందిస్తున్న రుణ సదుపాయాలకు అదనమని పేర్కొన్నారు. భారత్, ఆఫ్రికాలది వ్యూహాత్మక ప్రయోజనాలు, ఆర్థిక లబ్ధికి మించిన భాగస్వామ్య బంధమని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో మూడో వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల స్వప్నాలు ఒక్కటిగా వ్యక్తమవుతున్నసందర్భం ఇదని వ్యాఖ్యానించారు. ‘125 కోట్లమంది భారతీయుల, 125 కోట్లమంది ఆఫ్రికన్ల హృదయ స్పందన ఒక్కటిగా వినిపిస్తోంద’ంటూ అభివర్ణించారు. ఉమ్మడి లక్ష్యాలైన శాంతి, అభివృద్ధి సాధన కోసం భారత్, ఆఫ్రికాలు ఒక్కటిగా సాగుతాయని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ఈ సదస్సు గత మూడు దశాబ్దాల్లో భారత్ నిర్వహిస్తోన్న అతిపెద్ద కార్యక్రమం. ఇందులో 54 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో 41 ఆఫ్రికా దేశాల అధినేతలు ప్రతినిధులుగా హాజరయ్యారు. మోదీ ప్రసంగం లోని ముఖ్యాంశాలు.. * ప్రపంచం గతమెన్నడూ చూడని వేగంతో రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో అత్యంత విస్తృతంగా మార్పు చెందుతోంది. ఐరాస సహా అంతర్జాతీయ సంస్థలు మాత్రం గత శతాబ్ద పరిస్థితులనే ప్రతిబింబిస్తున్నాయి. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మార్పులు చేసుకోలేకపోతే అవి అసంబద్ధ సంస్థలుగా మిగిలిపోతాయి. అందుకే ఆయా సంస్థల్లో సంస్కరణలను భారత్ కోరుకుంటోంది. * ఐరాసలోని మొత్తం దేశాల్లో పాతిక శాతం ఆఫ్రికా దేశాలే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఈ రెండింటి నుంచి సరైన ప్రాతినిధ్యం లేని అంతర్జాతీయ సంస్థలేవైనా.. మొత్తం ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కాదు. * ఉగ్రవాదం, వాతావరణ మార్పు, ఐరాస సంస్కరణలు.. వీటి విషయంలో భారత్- ఆఫ్రికాలు సహకరించుకోవాలి. * ఆఫ్రికా దేశాల్లో శాంతి పరిరక్షణకు ఆఫ్రికా దళాలకు భారత్ తరఫున శిక్షణనిస్తాం. * గత పదేళ్లలో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం రెండింతలయింది. 34 ఆఫ్రికా దేశాలకు భారతీయ మార్కెట్లో పన్ను రహిత ప్రవేశం లభిస్తోంది. ఆఫ్రికా ఇంధనంతోనే భారత ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. * ఆఫ్రికాలో భారత్ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు చేపడ్తోంది. ఆఫ్రికాలో డిజిటల్ విప్లవానికి భారత్ సహకరిస్తుంది. * భారత్, ఆఫ్రికాల్లో రెండొంతుల జనాభా యువతే. ఆ మానవవనరులను సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఈ శతాబ్దం మనదే. * సౌరశక్తి సమృద్ధిగా లభించే దేశాలు కూట మిగా ఏర్పడి, స్వచ్ఛ విద్యుత్ కోసం కృషి చేయాలి. * మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలు కన్న పాన్ ఆఫ్రికా ఈ నెట్వర్క్ను విస్తృతం చేస్తాం. * భవిష్యత్ ప్రగతికి కీలకమైన ‘నీలి ఆర్థిక వ్యవస్థ’ అభివృద్ధికి సహకరిస్తాం. * వచ్చే సంవత్సరం నైరోబీలో జరిగే డబ్ల్యూటీవో భేటీలో ఆహార భద్రత, వ్యవసాయ సబ్సీడీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఒత్తిడి తేవాల్సి ఉంది. -
మోదీ కృషి అద్భుతం: అమెరికా
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎంతో కృషిచేస్తున్నారని అయితే బ్యూరోక్రాట్ల తీరే సరిగా లేదని, వారి రెడ్టేపిజమే పెట్టుబడులు రావడానికి అవరోధంగా మారిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. భారత్లో ఒకవైపు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం, మరోవైపు రెడ్టేపిజం సమాంతరంగా నడుస్తున్నాయని అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక సహాయకుడు, జాతీయ భద్రతా మండలిలో దక్షిణాసియా వ్యవహారాల డెరైక్టర్ పీటర్ లెవోయ్ అన్నారు. కీలకాంశాల్లో గతంలో భారత్లో ఏ ప్రభుత్వం కూడా తీసుకోనంతగా ఇప్పుడు మోదీ సర్కారు సత్వర నిర్ణయాలు తీసుకుంటోందని పీటీఐకి తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement