-
స్వల్ప దూర అగ్ని–1 ప్రయోగ పరీక్ష సక్సెస్
బాలాసోర్(ఒడిశా): స్వల్ప దూరాలను ఛేదించగల, ప్రయోగ దశలో ఉన్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని–1ను విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ శాఖ గురువారం ప్రకటించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపంలో ఈ పరీక్షకు వేదికైంది. ‘అగ్ని–1 అద్భుతమైన సత్తా ఉన్న క్షిపణి వ్యవస్థ. ఇప్పుడు దీనిని స్వల్ప దూర లక్ష్యాలకు పరీక్షించి చూస్తున్నాం. గురువారం నాటి ప్రయోగంలో ఇది అన్ని క్షేత్రస్థాయి, సాంకేతిక పరామితులను అందుకుంది. రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో–ఆప్టికల్ సిస్టమ్ వంటి అన్ని ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా దీని పనితీరును పరిశీలించాం. రెండు నౌకల ద్వారా క్షిపణి ఖచి్చతత్వాన్ని పర్యవేక్షించాం. ఇది చక్కగా పనిచేస్తోంది’’ అని రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో చెప్పారు. ఈ రకం క్షిపణిని చివరిసారిగా జూన్ ఒకటో తేదీన ఇదే వేదికపై విజయవంతంగా పరీక్షించారు. -
రోల్స్ రాయిస్ ఒప్పందంపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో విమాన ఇంజిన్ల సరఫరా ఒప్పందం కుదుర్చుకోవడం కోసం బ్రిటన్కు చెందిన రోల్స్ రాయిస్ కంపెనీ రూ.600 కోట్ల ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలపై రక్షణ శాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇందులో నగదు లావాదేవీలన్నీ తవ్వి తీయాలని సీబీఐను కోరినట్లు రక్షణ శాఖ అధికారులు మంగళవారమిక్కడ తెలిపారు. 2007-11 మధ్య హాక్ శిక్షణ విమానాలు (ఏజేటీ), జాగ్వార్ యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజిన్ల సరఫరాకు ఉద్దేశించిన ఈ ఒప్పదంపై అంతర్గతంగా విచారించిన హాల్ నిఘా విభాగం... కొన్ని ఆరోపణలను ధ్రువీకరించింది. ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకునేందుకు హాల్, ఇతర విభాగాల్లోని అధికారులకు ముడుపులు ముట్టాయని రూఢీ చేసింది. ఈ నేపథ్యంలో రోల్స్ రాయిస్తో కుదిరిన గత ఒప్పందాలు, భవిష్యత్తు ఒప్పందాలపై, దళారుల ప్రమేయంపై సీబీఐ దర్యాప్తునకు రక్షణ మంత్రి ఆంటోనీ ఆదేశించారు. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు రోల్స్ రాయిస్తో ప్రస్తుత, భవిష్యత్ ఒప్పందాలన్నీ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కొలతల ప్రకారం‘ఉపాధి’ పనులు చేపట్టాలి
మూడో దశలో 63.53% పోలింగ్
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
నల్లమలలోగుప్తనిధుల వేట
10న ప్రధాని మోదీ రాక
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
లక్ష్యం.. బహుదూరం
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
జూనియర్ ఏషియన్విజేతకు సన్మానం
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement