-
భారత్–బంగ్లా ‘కార్పాట్’ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం, బంగ్లాదేశ్ నేవీ సంయుక్తంగా నిర్వహించే కోర్డినేటెడ్ పెట్రోల్ (కార్పాట్) ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ప్రారంభమైంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (ఐఎంబీఎల్) వెంబడి 2018 నుంచి ప్రతి ఏటా ఇరుదేశాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుంటాయి. అక్టోబర్ 2020లో నిర్వహించిన అనంతరం కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు కార్పాట్ జరగలేదు. నాలుగో ఎడిషన్ని భారత్, బంగ్లాదేశ్ నౌకాదళాలు రెండేళ్ల విరామం తర్వాత ప్రారంభించాయి. భారత్ తరఫున గైడెడ్ మిసైల్ షిప్ ఐఎన్ఎస్ కోరా, ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్ ఐఎన్ఎస్ సుమేధతో పాటు మారీటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ గస్తీలో పాల్గొనగా.. బంగ్లాదేశ్ తరఫున బీఎన్ఎస్ అలీ హైదర్, బీఎన్ఎస్ అబూ ఉబైదాలు కార్పాట్లో పాలుపంచుకున్నాయి. సోమవారంతో ఈ గస్తీ కార్యక్రమం ముగియనుంది. -
రన్నరప్ హైదరాబాద్ నవాబ్స్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐఎంబీఎల్)లో హైదరాబాద్ నవాబ్స్ జట్టు రన్నరప్గా నిలిచింది. తమిళనాడులోని తిర్పూర్లో జరిగిన ఈ టోర్నమెంట్లో ఢిల్లీ డెవిల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. దాదాపు 60 మంది జాతీయ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ టోర్నీలో తలపడగా... మనోజ్కుమార్, నీలిమ చౌదరీ, కమలాకర్, రాజు సునీల్, కిషోర్ కుమార్, ఉదయ్ భాస్కర్, మూర్తిలతో కూడిన హైదరాబాద్ నవాబ్స్ జట్టు రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement