breaking news
	
		
	
  hugs
- 
      
                   
                                                       కుప్పకూలిన విదేశాంగ విధానంపట్నా: నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం అత్యంత దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆరోపించింది. విదేశాల అధినేతలకు ప్రధాని మోదీ ఇచ్చిన కౌగిలింతలు మనకే ఎదురు తిరుగుతున్నాయని(బ్యాక్ఫైర్) మండిపడింది. మోదీ నిర్వాకాల వల్ల విదేశాంగ విధానం కుప్పకూలిందని, దౌత్యపరంగా మన దేశం ఒంటరిగా మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేసింది. దేశ ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం కాపాడలేకపోతోందని విమర్శించింది. మరోవైపు ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని, కోట్లాది మంది పేదరికంలోకి జారుకుంటున్నారని, ప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో బుధవారం బిహార్ రాజధాని పట్నాలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో పలు తీర్మానాలు ఆమోదించారు. స్వాతంత్య్రం తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మన దేశ ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేశాయని సీడబ్ల్యూసీ వెల్లడించింది. నరేంద్ర మోదీ మాత్రం మతిలేని చర్యలతో దేశ ప్రయోజనాలను బలి చేస్తున్నారని ఒక తీర్మానంలో ఆక్షేపించింది. ఒకవైపు అమెరికాను బుజ్జగిస్తూ, మరోవైపు చైనాకు దగ్గరవుతూ ఒక స్పష్టమైన విధానం లేకుండా గుడ్డిగా ముందుకెళ్తున్నారని తప్పుపట్టింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా మోదీ ప్రభుత్వం నిజాయితీగా ఖండించడం లేదని పేర్కొంది. భారత ఉత్పత్తులపై ట్రంప్ భారీగా టారిఫ్లు విధించడంతో మన పరిశ్రమలు మూతపడుతున్నాయని, లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారని గుర్తుచేసింది. అమెరికా నుంచి భారతీయులను అవమానకర రీతిలో బయటకు తరిమేసినా మోదీ స్పందించలేదని విమర్శించింది. రాజ్యాంగంపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ దాడి దేశ ఆర్థికవ్యవస్థ అద్భుతంగా ఉందని చెప్పుకోవడానికి మోదీ ప్రభుత్వం తంటాలు పడుతున్నట్లు సీడబ్ల్యూసీ విమర్శించింది. గణాంకాలను తారుమారు చేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోతాయా? అని ప్రశ్నించింది. ఎన్డీయే మినహా ఇతర పారీ్టలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నట్లు ఆరోపించింది. జీఎస్టీ పరిహారం ఇవ్వకుండా నిలిపివేసిందని వెల్లడించింది. రాజ్యాంగంపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయని, ప్రజాస్వామ్యంలో కీలకమైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాన్ని క్రమంగా ధ్వంసం చేస్తున్నాయని ఆక్షేపించింది. అవినీతి, నేరాలే రెండు ఇంజిన్లు బిహార్లో బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వ అసలు రంగు ప్రజలకు తెలిసిపోయిందని సీడబ్ల్యూసీ వెల్లడించింది. అవినీతి, నేరాలే ఆ రెండు ఇంజిన్లు అని ఎద్దేవా చేసింది. రాష్ట్రంలో ఎన్డీయే సర్కార్ ‘నోటు చోరీ’కి పాల్పడుతోందని, జనం సొమ్ము విచ్చలవిడిగా దోచుకుంటోందని ఆరోపించింది. బిహార్ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తుచేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచి్చంది. రెండు తీర్మానాలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించారు. ఒక రాజకీయ తీర్మానం కాగా, మరొకటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని ఓటర్లను కోరుతూ మరో తీర్మానం చేశారు. ఓట్ల చోరీతోపాటు ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న అవకతవకలను రాజకీయ తీర్మానంలో ప్రస్తావించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్ గాంధీని ప్రశంసించారు. ఓట్ల చోరీ అంటే రాజ్యాంగంపై, ఆర్థిక వ్యవస్థపై, సామాజిక న్యాయంపై, దేశ భద్రతపై దాడేనని ఉద్ఘాటించారు. గాజాపై మౌనం సిగ్గుచేటు గాజాలో జరుగుతున్న మారణహోమం పట్ల మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తూ ప్రేక్షక పాత్రకే పరిమితం కావడం సిగ్గుచేటు అని సీడబ్ల్యూసీ మండిపడింది. సాధారణ పాలస్తీనా ప్రజలపై కొనసాగుతున్న దాడులు, మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది.
- 
      
                   
                                                       ఆలిం‘ఘనం’ ఆత్మీయంమనుష్యుల మధ్య మాటల కన్నా స్పర్శ ఎన్నో అనుభూతులను, ఎన్నో సంగతులను చెబుతుంది. భావోద్వేగాలను తెలియజేయడానికి కౌగిలి ఒక శక్తిమంతమైన మాధ్యమంగా పనిచేస్తుంది. ప్రేమ, కృతజ్ఞతల నుంచి కోపం భయం వరకు స్పర్శ ద్వారా వ్యక్తీకరించబడిన భావోద్వేగాలను కౌగిలి, శబ్ద భాషకు మించిన సంబంధాన్ని పెంపొందిస్తుంది, అవగాహనను, సానుభూతిని ప్రోత్సహిస్తుంది.శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకొని రాజ్యానికి వెళ్లిపోతాడు. కణ్వమహర్షి తన కూతురిని, మనుమడిని శిష్యులతో దుష్యంతుని దగ్గరకు పంపిస్తాడు. శకుంతల నిండు కొలువులో తానెవరో చెప్తుంది. కానీ దుష్యంతుడు మాత్రం వారి వివాహాన్ని అంగీకరించడు. ‘నీ కొడుకును పరిష్వంగం చేసుకో... అపుడు నీ కొడుకు అవునో కాదో తెలుస్తుంది’ అని చెప్తుంది. అంటే పరిష్వంగంలోని శక్తి అదన్నమాట. దమయంతిని దూరం చేసుకొని నలుడు మారుపేరుతో, దేశదేశాలు తిరిగి ఋతుపర్ణ మహారాజు దగ్గర కాలం గడుపుతుండేవాడు. దమయంతి బాహుకుని పేరుతో ఉన్న నలుడిని గుర్తించాలని తనకు ద్వితీయ వివాహం జరుగుతున్నట్లు ఋతుపర్ణ మహారాజుకు చెప్పి పంపిస్తుంది. ఆ వివాహానికి ఋతుపర్ణ రాజు నలుడిని అంటే బాహుకుడిని తన రథసారథిగా చేసుకొని దమయంతి దగ్గరకు వస్తారు. బాహుకుని రూపంలో ఉన్న నలుని గుర్తించడానికి తన చెలికత్తె ద్వారా తన కూతురిని, కొడుకును వంటచేసుకొంటున్న బాహుకుడి దగ్గరకు పంపుతుంది. ఆ పిల్లలను చూడగానే బాహుకుడు చేతులు చాపి వారిని అక్కున చేర్చుకుంటాడు. కంటతడి పెడ్తాడు. తండ్రీ పిల్లల ముఖకవళికలను చూసి దమయంతి ఆ వంటవాడే తన భర్త నలుడని గుర్తిస్తుంది. పిల్లల పరిష్వంగంలోని శక్తి అది అన్నమాటే కదా.సీతమ్మ క్షేమవార్త చెప్పిన ఆంజనేయుడికి చేతులు చాపి గాఢ పరిష్వంగాన్ని రాముడు ఇచ్చాడు. లంకలో సీతమ్మను చూసి, రావణునిలో భయం కలిగించి, ధైర్యాన్ని సీతమ్మలో నింపి వచ్చిన హనుమకి ప్రాణ సముడవు అని చెప్పడానికి రెండు చేతులు చాపి కౌగిలించుకున్నాడు రాముడు. పరిష్వంగం ద్వారానే రాముడు తన కుమారులుగా లవకుశులను గుర్తించినట్లు కొన్ని రామాయాణాల్లో కనిపిస్తుంది.– ఆనంద‘మైత్రేయ’మ్
- 
      
                   
                                 Cuddle Therapy: కష్టాలను తీర్చే కౌగిలింత..లండన్: మనసుకు కష్టంగా ఉన్నప్పుడు అక్కున చేర్చుకునే మనిషి, ధైర్యాన్నిచ్చే ఓ భుజం, తలనిమిరి ప్రేమ పంచే స్పర్శ కావాలనిపిస్తుంది. కానీ పెరిగిన ఆధునికత మనిషిని ఒంటరి చేసింది. ఓదార్పునిచ్చేవారు, ప్రేమ పంచేవారు కరువయ్యారు. అలాంటివారికి తానున్నానంటున్నాడు యూకేలోని బ్రిస్టల్కు చెందిన ట్రెవర్ హూటన్ (ట్రెజర్). బాధల్లో ఉన్నవారికి కౌగిలినందిస్తున్నాడు. గంటకు రూ.7 వేల చొప్పున చార్జ్ చేస్తూ ‘కడిల్ థెరపీ’ పేరుతో సేవలందిస్తున్నాడు. ‘బాధను పంచుకునే మనిషిలేక మదనపడే వాళ్లుచాలా మంది ఉంటారు. అలాంటి చోట నా అవసరం ఉంటుంది. హగ్ అంటే.. కేవలం కౌగిలి మాత్రమే కాదు, అంతకుమించిన ఆత్మీయ స్పర్శ. నీకు నేనున్నాననే ధైర్యం, అభిమానం, ఓదార్పును ఓ స్పర్శద్వారా పంచడం’ అని చెబుతున్నాడు ట్రెజర్. పదేళ్ల కిందటినుంచే మానవ అనుబంధాల శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న ట్రెజర్.. ఈ బిజినెస్ను మే 2022 నుంచి ప్రారంభించాడు. కౌగిలింత అనగానే అభద్రతకు లోనయ్యేవాళ్లు, అపార్థం చేసుకున్నవాళ్లూ ఉన్నారు. అందుకే పూర్తిగా నాన్–సెక్సువల్ అని చెబుతున్నాడు. భారమైన మనసుతో తనదగ్గరకు వచ్చినవాళ్లు దాన్ని దించేసుకుని, సంతోషంగా వెళ్లిపోవడమే ట్రెజర్ మోటో అట. అంతేకాదు.. రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరి మధ్య వచ్చిన అపార్థాలను తొలగించి అనుబంధాన్ని పెంచే ‘కనెక్షన్ కోచింగ్’ కూడా ఇస్తానంటున్నాడు. ఇదీ చదవండి: ఐఏఎస్కు సిద్ధమవుతూ.. అజ్ఞాతంలోకి
- 
      
                   
                                 స్టేషన్ బయట ప్రయాణికులకు ఫ్రీ హగ్స్కోల్కతా : ఇద్దరు దంపతులు మెట్రో రైల్లో కౌగిలించుకున్నారని కొంతమంది తోటి ప్రయాణికులు వారిని చితకబాదిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కేవలం కౌగిలించుకుంటేనే దాడి చేస్తారా అని ప్రశ్నిస్తూ.. దాడికి గురైన దంపతులకు మద్దతుగా కొంతమంది యువత బుధవారం కోల్కత్తాలోని దమ్ దమ్ మెట్రో స్టేషన్ బయట ఫ్రీ హగ్స్ పేరిట ప్రయాణికులకు ఆలింగనం చేసుకున్నారు. మెట్రోలో కౌగిలించుకున్నారని దంపతులపై దాడి చేసిన వారిపై నిరసన తెలియజేస్తూ ఈ విధంగా విన్నూత నిరసన చేపట్టారు. కౌగిలింత అనేది తప్పేంకాదని అది ప్రేమానుబంధాలకు ప్రతీక అని నిరసన చేస్తున్న యువత అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా దాడి చేసిన వారిపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఫ్రీ హగ్ హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చదవండి...మెట్రోలో కౌగిలించుకున్నారని.. జంటపై దౌర్జన్యం
- 
      
                   
                                 కౌగిలింతలు.. శాపనార్థాలు!!
 ఒకవైపు కౌగిలింతలు.. మరోవైపు శాపనార్థాలు! ఇదీ ఇద్దరు ముఖ్యమంత్రుల తీరు. బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన అలయ్-బలయ్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కలుసుకున్నారు. పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. కేసీఆర్ కొద్దిగా తటపటాయించినా దత్తాత్రేయ చొరవతో ముఖ్యమంత్రులిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అది చూసినవాళ్లంతా ఇంకేముంది, చంద్రులిద్దరూ కలిసిపోయారు.. ఇక రెండు రాష్ట్రాలకు మధ్య గొడవలు ఏమీ లేవన్నట్లే అనుకున్నారు.
 
 అయితే.. గట్టిగా కొన్ని గంటలు కూడా గడవక ముందే మళ్లీ ముసలం పుట్టింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు కరెంటు రాకుండా అడ్డుకుంటున్న కర్కోటకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో విద్యుత్ ప్లాంట్లు పెట్టని కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ కొరతకు కారణమని విమర్శించారు. మన కరెంటు మనకు రాకుండా చేసిన కర్కోటకుడు చంద్రబాబేనని, కృష్ణపట్నం రాకుండా అడ్డుకున్న చంద్రబాబును ప్రశ్నించకుండా కొందరు ఆ పార్టీ నాయకులు ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
 
 దీంతో మళ్లీ ఇద్దరి మధ్య ఉన్న పొరపొచ్చాలు మరోసారి బయటపడ్డాయి. ఇంతకుముందు కూడా గవర్నర్ సమక్షంలోను, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు చేతులు కలుపుకొన్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. పలు అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని కూడా అంగీకారానికి వచ్చారు. అయినా వ్యవహారం మామూలుగానే ఉంది. ఇద్దరి మధ్య గొడవలు ఏమాత్రం తగ్గలేదన్న విషయం మరోసారి రుజువైపోయింది.


