breaking news
Glass bottles
-
ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం
న్యూఢిల్లీ: వదంతులు షికార్లు చేయడంతో భూముల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కాస్తా హఠాత్తుగా మసీదు కూల్చివేత రంగు పులుముకుని ఢిల్లీలోని రామ్లీలా మైదాన సమీప ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఫయీజ్ ఇలాహీ మసీదులోని ఆక్రమణలను తొలగించేందుకు మంగళవారం అర్ధరాత్రి దాటాక 12.30 గంటల ప్రాంతంలో ఘటనాస్థలికి చేరుకున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికా రులు, పోలీసులుపైకి స్థానికులు రాళ్లు, ఇటుకలు, గాజుసీసాలను రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు లోకి తెచ్చేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. జనాన్ని చెదరగొట్టే ప్రయత్నంచేశారు. రాళ్లు, గ్లాస్ బాటిళ్లను రువ్విన ఘటనలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. దీంతో ఘటనకు కారకులైన మైనర్సహా ఐదుగురిని పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. రామ్లీలా మైదాన్ సమీపంలోని ఫయీజ్ ఇలాహీ మసీదు, తుర్క్మన్ గేటు సమీప స్మశానవాటిక దగ్గర్లోని భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఆక్రమణలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగడంతో చివరకు అది ఉద్రిక్తతలకు దారితీసింది. ఆక్రమణల తొలగింపులో భాగంగా అక్కడి మసీదును నేలకూలుస్తున్నారని ఒక ఆకతాయి పెట్టిన సోషల్మీడియా పోస్ట్తో పుట్టగొడుగుల్లా పుకార్లు పుట్టుకొచ్చి చివరకు ఘర్షణకు దారితీసింది. ఢిల్లీ సెంట్రల్ పోలీస్ కమీషనరేట్కు సంబంధించిన ఈ స్థలంలో అక్రమంగా వెలసిన డయాగ్నస్టిక్ సెంటర్, ఫంక్షన్ హాల్ను తొలగించామని అక్కడి మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వివేక్ స్పష్టంచేశారు. తప్పుడు వీడియోతో అలజడిఅక్రమ కట్టడాలను కూల్చేందుకు కూలిన భవన శిథిలాలు, చెత్తను తొలగించేందుకు 30 బుల్డోజర్లు, 50 డంపింగ్ ట్రక్కులను తీసుకురావడంతో స్థానికులు ఇదంతా చూసి గుమిగూడారు. 300 మంది పౌరకార్మికులను శిథిలాలను తొలగించేందుకు అధికారులు వెంట తీసుకొచ్చారు. స్థానికులు సమీపంలోకి రాకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచారు. మంగళవారం అర్ధరాత్రిదాటాక ఆక్రమించిన స్థలంలోని వాణిజ్యసముదాయాలను కూల్చేస్తున్న వీడియోను ఒక వ్యక్తి వీడియో తీసి ‘‘మసీదును కూల్చేస్తున్నారు. అందరూ వెంటనే ఇళ్ల నుంచి బయటికొచ్చి ఉద్య మాన్ని ఉధృతం చేయండి’’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో పెద్దసంఖ్యలో స్థానికులు రాళ్లు పట్టుకుని రావడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తర్వాత పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాళ్లు, సీసాలు విసిరేస్తూ దాడికి దిగారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా తప్పుడు వీడియోలు పోస్ట్చేసినందుకు, ఉద్రిక్తపరిస్థితులు సృష్టించినందుకు 17 ఏళ్ల బాలుడుసహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. -
నిలబడడమే ఆమెకు శాపం.. సంబంధం లేని గొడవ ప్రాణం తీసింది
ఫుట్బాల్ మ్యాచ్ విషాదాన్ని నింపింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక మహిళా అభిమాని అక్కడ జరిగే గొడవతో ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికి ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. ఈ విషాదకర ఘటన బ్రెజిల్లోని సావో పాలోలో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శనివారం బ్రెజిలియన్ ఫుట్బాల్ క్లబ్స్ అయిన పాల్మీరాస్, రైవల్స్ ఫ్లెమింగోల మధ్య అలియాంజ్ పార్క్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు పాల్మీరాస్కు మద్దతుగా గాబ్రిలా అనెల్లి హాజరైంది. కాగా అలియాంజ్ పార్క్ స్టేడియం బయట ఉన్న పాల్మీరాస్ ఫ్యాన్ జోన్కు దగ్గర్లో నిలబడడమే గాబ్రిలా చేసిన పాపం. ఏదో విషయమై ఇరుజట్ల మధ్య అభిమానుల మధ్య గొడవ మొదలైంది. కాసేపటికి రైవల్స్ ఫ్లెమింగో ఫ్యాన్స్ రాళ్లు, గ్లాస్ బాటిల్స్తో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఒక గ్లాస్ బాటిల్ గాబ్రిలా దిశవైపుగా దూసుకొచ్చింది. ఆ గ్లాస్ బాటిల్ నేరుగా గాబ్రిలా మెడ నరాన్ని కట్ చేసుకుంటూ వెళ్లింది. దీంతో అపస్మారక స్థితిలో అక్కడికక్కడే కుప్పకూలింది గాబ్రిలా. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆమె ఆసుపత్రికి తరలించారు. కాగా రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం ఆసుపత్రిలో మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇక గాబ్రిలా మరణాన్ని ఆమె సోదరుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించడం అందరిని కలచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాబ్రిలా మృతికి కారణమైన రైవల్స్ ఫ్లెమింగో అభిమానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తన చర్య ఒకరి ప్రాణం తీస్తుందని ఊహించలేదని.. బాధితురాలి కుటుంబసభ్యులను క్షమాపణ కోరినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా పాల్మీరాస్ క్లబ్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. అభిమాని మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఇక గొడవ పడిన అభిమానులను వేరు చేయడానికి పెప్పర్ స్ప్రే ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇక మ్యాచ్ మాత్రం 1-1తో డ్రాగా ముగిసింది. చదవండి: WI Vs IND: జైశ్వాల్ ఆడడం ఖాయమా? రోహిత్ ప్రశ్నకు రహానే స్పందన #NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్ను కూడా వదలడం లేదు! -
గాజు సీసాల్లోనే నీళ్లు!
పర్యావరణ పరిరక్షణతో పాటూ ప్లాస్టిక్ ద్వారా కలుగుతున్న కాలుష్యాన్ని నివారించే దిశగా నగరంలోని హోటల్స్లో పలు మార్పు చేర్పులు చేపట్టారు. ఇందులో భాగంగా హోటల్లో తాగునీటిని అందించడానికి వినియోగిస్తున్న ప్లాస్టిక్ సీసాలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో గాజు సీసాలను వినియోగించాలని నిర్ణయించారు. నగరంలోని ఆతిథ్యరంగంలో మంచి మార్పునకు ఇది దోహదం చేయనుంది. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం హోటళ్లలో అతిథులకు ప్లాస్టిక్ సీసాల్లో నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఒకసారి వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను తిరిగి కొత్తగా మార్చి వినియోగించలేక పోవడం ఒక ఎత్తయితే మరోవైపు వినియోగించిన వాటిని ధ్వంసం చేయడం కూడా ఎంతో క్లిష్టమైన, కష్టసాధ్యమైన పని. దీంతో ఇవి తీవ్రస్థాయి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. వీటిని నియంత్రించడానికి గాజు బాటిళ్లు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ గ్లాస్ బాటిళ్లను వాడేసినప్పటికీ తిరిగి మళ్లీ వినియోగించడం సాధ్యమవుతుండడంతో సిటీలోని కొన్ని హోటల్స్ వీటినే ఎంచుకుంటున్నాయి. ఆటోమేటిక్గా.. ఆరోగ్యకరంగా.. దీని కోసం తక్కువ మానవ ప్రమేయంతో పూర్తిగా ఆటోమేటిక్గా నడిచే ఓ అత్యాధునిక వాటర్ ప్లాంట్ను హోటల్స్లో అమర్చుకుంటున్నారు. తద్వారా హోటల్ అవసరాలకు సరిపడా పూర్తిగా శుభ్రపరచబడిన ఆల్కలైన్ మినరల్ వాటర్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఆల్కలైన్ మినరల్ వాటర్ మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వీరు చెబుతున్నారు. పూర్తి ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ యంత్రం తన ఫిల్టర్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రిస్తూ అత్యంత శుభ్రమైన తాగు నీటిని అందిస్తుంది. ఇలా తయారు చేసిన తాగు నీటిని మళ్లీ తిరిగి వినియోగించే వీలున్న రీ యూజబుల్ గాజు సీసాల ద్వారా అతిథులకు అందజేస్తున్నారు. నాలుగు దశలలో ఈ వాటర్ ప్లాంట్ పని చేస్తుంది. ముందుగా సాధారణ తాగు నీటిని పూర్తిగా శుభ్రపరచి సురక్షితమైన ఆల్కలైన్ మినరల్ వాటర్గా తయారు చేస్తుంది. అనంతరం యంత్రంలో ప్రవేశ పెట్టిన తాగునీటి గాజు సీసాలను పరిశుభ్రపరచి, పూర్తిగా పొడిగా మార్చిన తర్వాత వాటిలో ఈ ఆల్కలైన్ మినరల్ వాటర్ను నింపుతారు. ఇలా నింపిన గ్లాసు బాటిల్స్ను హోటల్లోని గెస్ట్ రూమ్లు ఇతరత్రా ప్రదేశాలలో తాగు నీటిగా వినియోగించడానికి అందిస్తారు. రోజుకు 1500 బాటిళ్ల నీరు ఉత్పత్తి... ఆకార్ హోటల్స్ గ్రూప్ పూర్తి పర్యావరణ హితంగా హోటల్స్ను మార్చాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ప్లాస్టిక్ బాటిళ్ల నివారణకు గాను మా హోటల్లో సరికొత్త వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. దీని ద్వారా రోజూ 1500 గ్లాసు బాటిళ్ల నీటిని అంటే సుమారు 300 లీటర్లను అతిథులకు సరఫరా చేయవచ్చు. అలానే కాలం చెల్లిన వాటిని రీ సైకిల్ చేసి సరికొత్త బాటిళ్ల తయారీలో వినియోగించవచ్చు. –సౌమిత్రి పహారి, జీఎం, హోటల్ మెర్క్యుర్ హైదరాబాద్ కెసీపీ (చదవండి: రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే కఠిన చర్యలు) -
భువనగిరి వద్ద ఏజీఐ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటెయినర్ గ్లాస్ బాటిళ్ల తయారీ సంస్థ ఏజీఐ గ్లాస్ప్యాక్ హైదరాబాద్ సమీపంలోని భువనగిరి వద్ద కొత్త ప్లాంటును నెలకొల్పుతోంది. ఇందుకోసం కంపెనీ మాతృ సంస్థ అయిన హెచ్ఎస్ఐఎల్ రూ.220 కోట్లు పెట్టుబడి చేస్తోంది. 15 ఎకరాల్లో స్థాపిస్తున్న ఈ నూతన కేంద్రం 2022 సెప్టెంబర్ చివరికి కార్యరూపం దాల్చనుందని హెచ్ఎస్ఐఎల్ వైస్ చైర్మన్ సందీప్ సొమానీ తెలిపారు. రోజుకు 150 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. ఔషధాలు, సుగంధ పరిమళాలు, సౌందర్య సాధనాలు, ఖరీదైన మద్యం ప్యాకింగ్ కోసం హై ఎండ్ స్పెషాలిటీ గ్లాస్ బాటిళ్లను ఇక్కడ తయారు చేస్తారు. ఫర్నేస్తోపాటు అయిదు తయారీ లైన్లు ఏర్పాటు కానున్నాయి. యూఎస్ఏ, ఆ స్ట్రేలియా, యూరప్ దేశాలకు సైతం ఎగుమతి చేయ నున్నారు. 1972లో ప్రారంభమైన ఏజీఐ గ్లాస్ప్యాక్.. ముడి సరుకు లభ్యత దృష్ట్యా హైదరాబాద్లోని సనత్నగర్తోపాటు భవనగిరిలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. వీటి సామర్థ్యం రోజుకు 1,600 టన్నులు. కంపెనీ వార్షికాదాయం రూ.1,300 కోట్లు. సుమారు 3,000 మంది ఉద్యోగులున్నారు. 5 నుంచి 4,000 మిల్లీలీటర్ల సామర్థ్యం గల బాటిళ్లను ఉత్పత్తి చేస్తోంది. -
ఇంటిప్స్
అలా చేయడం వల్ల అందు లో నీళ్లన్నీ ఎండిపోయి పచ్చళ్ళు బూజుపట్టకుండా ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా కిరోసిన్ వేస్తే ఈగలు, దోమలు రావు.ఉడెన్ ఫర్నిచర్ను పేపర్తో తుడిస్తే పాలిష్ చేసినట్లు మెరుస్తాయి. పేపర్తో తుడవడం వల్ల సందుల్లోని దుమ్ము పూర్తిగా వదలదు కాబట్టి ముందుగా మెత్తటి క్లాత్తో తుడిచి, తర్వాత పేపర్తో తుడవాలి.పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకుంటే మండకుండా ఉంటాయి. వంటగదిలో అలోవెరా మొక్కను పెట్టుకుంటే మంచిది. చిన్న చిన్న గాయాలు తగిలినపుడు అలోవెరా ఆకును తెంపి ఆ జెల్ను గాయమైన చోట రుద్దితే ఉపశమనం కలుగుతుంది. -
బాటిల్స్ విత్ థీమ్స్
కళాత్మక దృష్టి ఉంటే కనిపించే ప్రతి వస్తువును కళాకృతిగా మార్చేయవచ్చు. సుద్దముక్కతో కళాఖండాలు తీర్చిదిద్దవచ్చు. సబ్బుబిళ్లలతో అబ్బురపరిచే అందాలను తయారు చేయవచ్చు. సునిశిత పనితనంతో సున్నితత్వంలోనే మెరుపులు సృష్టించవచ్చు. అలాంటి జిజ్ఞాసతోనే ఓ వనిత గాజుసీసాలను మణిరత్నాల్లా మార్చేసింది. కొత్తదనం కోరుకునే వారికి అంతే కొత్తగా ఏదైనా చేయాలనే తపన ఉంటుంది. ఆ తపనే సునందను హ్యాండ్మేడ్ కళాకారిణిగా తీర్చిదిద్దింది. చిన్న చిన్న సీసాలు, వాటర్ బాటిల్స్, ల్యాంప్స్.. ఇవే ఆమె ముడిసరుకు. వేళ్లు కూడా సరిగా దూరని సీసాల్లోనికి ఆమె సృజన ప్రవేశిస్తుంది. అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. మెరిసే సీసాలు.. రకరకాల గాజు సీసాలు సునంద చేతిలో పడితే చాలు వెలిగిపోతాయి. ఆ సీసాల లోపలి అంచులు ఆమెకు కాన్వాస్లా మారిపోతాయి. కుంచె నుంచి జాలువారిన రంగులు గాజుపై నాట్యం చేస్తాయి. క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్లు, హాలీవుడ్ హీరోలు.. ఒకరేమిటి ఫేమస్ పర్సనాలిటీలంతా అందులో బందీలు కావాల్సిందే. రంగులద్దడం పూర్తయిన తర్వాత లోపల ఎల్ఈడీ లైట్లు అమర్చి వాటిని మెరిపిస్తుంది. ఫైర్ఫ్లై ఆర్టికల్స్ తయారు చేయడం హాబీగా ఉన్న సునంద మొదట్లో తన దగ్గరి వాళ్లకు ఇవి ప్రజెంట్ చేసేది. స్నేహితుల ప్రోత్సహంతో.. 2013లో హ్యాండ్మేడ్ ఆర్టికల్స్తో బిజినెస్ మొదలు పెట్టింది. డిఫరెంట్ థీమ్స్తో పాటు సునంద తీర్చిదిద్దిన కళాకృతులు ఇప్పుడు ఆన్లైన్లో కూడా హాట్హాట్గా అమ్ముడవుతున్నాయి.


