breaking news
Free goods
-
డబ్బులు ఊరికే వస్తాయి!
డబ్బులు ఊరకే రావు... బాగా పాపులర్ అయిన ఓ వాణిజ్య ప్రకటన. కానీ ప్రస్తుతం డబ్బులు ఊరకే వస్తున్నాయి! ప్రతి ఊరికీ వెళ్తున్నాయి!!రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దాదాపు రెండు వారాల్లోనే కట్టలకు కట్టలు డబ్బు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. ఇంకా నామినేషన్లు కూడా మొదలు కాకముందే ఓట్ల కొనుగోలు కోసం ప్రజలకు పంపిణీ చేయడానికి డబ్బు పంపిణీ మొదలైంది. డబ్బుతోపాటు ఫ్రీబీస్ (ఉచిత బహుమతులు) సైతం పంపిణీ అవుతున్నాయి. దీంతో వాటిని అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. డబ్బు మాదిరిగా ఇవి భారీ మొత్తాల్లో పట్టుబడకపోవడానికి ఏవి ఫ్రీబీస్.. ఏవి కావు అనే సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏవి ఉచితాలో పేర్కొంటూ వాణిజ్య పన్నుల శాఖ 26 అంశాలతో కూడిన జాబితాను జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, ఎన్నికల అధికారులకు పంపింది. తనిఖీల్లో పట్టుబడే ఉచితాలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆయా వస్తువులు రవాణా అవుతున్నా లేదా భారీ స్థాయిలో గోదాముల్లో నిల్వ ఉన్నా తమకు తెలియజేయాలని పేర్కొంది. యూపీఐ పేమెంట్లపైనా నిఘా.. డబ్బు పంపిణీ సైతం గతంలోలా నగదు రూపేణానే కాకుండా యూపీఐ (గూగుల్పే/ఫోన్పే/పేటీఎం) చెల్లింపుల ద్వారా కూడా భారీగా జరుగుతుండటంతో వాటిపైనా ఎన్నికల అధికారులు నిఘా వేశారు. ఆయా వివరాల కోసం ఆర్బీఐ, బ్యాంకు మేనేజర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకే ఖాతా నుంచి ఎక్కువ లావాదేవీలు జరిగితే వివరాలు అందజేయాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పటివరకు రూ.307 కోట్లు స్వాదీనం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 21వ తేదీ వరకు పట్టుకున్న నగదు, మద్యం, సరుకులు, ఫ్రీబీస్, తదితరాల మొత్తం విలువ రూ. 307 కోట్లు కాగా, వీటిల్లో ఫ్రీబీస్ విలువ రూ.26.93 కోట్లు. వివిధ మార్గాల ద్వారా నిఘా.. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆన్లైన్ ద్వారా డబ్బు పంపిణీ చేపట్టినా అడ్డుకొనేందుకు నిఘా పెట్టాం. ఒకే ఖాతా నుంచి వందల మందికి ఒకే మొత్తంలో (ఉదాహరణకు రూ.500, 2,000, 5,000,10,000 చొç³్పున) గూగుల్పే/ఫోన్పే/పేటీఎం ద్వారా ట్రాన్స్ఫర్ జరుగుతోందో లేదో పరిశీలిస్తాం. ఒకే బ్యాంకు ఖాతాలో భారీగా నగదు జమ చేసినా పరిశీలిస్తాం. అనుమానాస్పద లావాదేవీలపై విచారణ చేపడతాం. – రోనాల్డ్రాస్, హైదరాబాద్ ఎన్నికల అధికారి జాబితాలోని ఫ్రీబీస్ ఇవే.. 1.సీలింగ్ ఫ్యాన్లు 2.ప్రెషర్ కుక్కర్లు 3. మిక్సర్లు, గ్రైండర్లు 4.చీరలు 5.కుట్టు మిషన్లు 6.స్టెయిన్లెస్ స్టీలు పాత్రలు 7.ఎల్రక్టానిక్ వస్తువులు/టీవీ సెట్స్ 8. గోడ గడియారాలు 9.క్రికెట్ కిట్స్ 10. జ్యువెలరీ ఐటమ్స్ 11.ఇతర క్రీడాపరికరాలు 12.బెడ్షీట్స్/టవల్స్ 13.గడియారాలు 14.సైకిళ్లు, బైక్లు 15.కాస్మెటిక్స్ 16. జిమ్ పరికరాలు 17. బంగారం లేదా వెండి పూత వస్తువులు (ఇమిటేషన్ జ్యువెలరీ) 18. కుంకుమ భరిణెలు 19. మొబైల్ ఫోన్లు 20. రెడీమేడ్ గార్మెంట్స్ 21.స్కూల్ బ్యాగ్స్ 22. టీషర్ట్స్ 23. టార్చిలైట్లు 24. టాయ్స్ 25. ట్రావెల్ బ్యాగ్స్/సూట్కేస్లు 26. గొడుగులు - చెరుపల్లి వెంకటేశ్ -
15వ విడత ఉచిత సరుకులు 5 నుంచి పంపిణీ
సాక్షి, అమరావతి: 15వ విడత ఉచిత సరుకుల పంపిణీ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఉచిత సరుకుల పంపిణీ అక్టోబర్ 31 వరకు 14 విడతల్లో కార్డులో పేరు నమోదైన ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం, కార్డుకు కిలో కందిపప్పు/కిలో శనగలను లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. బియ్యానికి ఒకసారి పప్పుకు మరోసారి బయోమెట్రిక్ వేస్తే మోసాలను అరికట్టవచ్చని భావించి అక్టోబర్లో రెండవ విడత పంపిణీ నుంచి అధికారులు ఈ విధానాన్ని అమలు చేశారు. దీంతో పక్కాగా లబ్ధిదారులకు సరుకులు అందాయి. 2సార్లు బయోమెట్రిక్ వేయడం వల్ల సరుకుల పంపిణీ ఆలస్యమైనట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. 14వ విడతలో 1.19 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. ఆయా కుటుంబాలకు 18.80 కోట్ల కిలోల బియ్యం, 1.19 కోట్ల కిలోల శనగలు పంపిణీ చేశారు. -
ఆంధ్రాలో ‘అమ్మ’ వస్తువులు
తాడేపల్లి రూరల్: తమిళనాడు ప్రభుత్వం పేద ప్రజలకు అందించే ఉచిత వస్తువులు రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దర్శనమిస్తున్నాయి. ఆ వస్తువుల అమ్మకాలతో రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇంత జరుగుతున్నా ఆదాయ పన్ను శాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇంటింటికీ మిక్సీ, ఫ్యాన్లు, గ్రైండర్లను అందజేస్తోంది. ఆ రాష్ట్రంలో ప్రజలకు అందకుండానే తమిళనాడు-ఆంధ్రా సరిహద్దు దాటి నెల్లూరుకు చేరుతున్నాయి. అక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ పట్టణాలకు చేరుకుంటున్నాయి. రోజువారీ కూలీల తో ఆ వస్తువులను విక్రయింపజేస్తున్నారు. జాతీయ రహదారుల వెంట ముఖ్యంగా తాడేపల్లి పాత టోల్గేట్, మంగళగిరి-తెనాలి, గుంటూరు-పొన్నూరు, విజయవాడ-హైదరాబాద్, విజయవాడ-ఏలూరు, విజయవాడ-బందరు రహదారుల్లో అమ్మకాలు సాగిస్తున్నారు. ఆ వస్తువులను నెల్లూరుకు చెందిన చందు అనే వ్యక్తి లారీల ద్వారా ఇక్కడికి చేరవేస్తున్నట్లు తెలిసింది. తమకు గ్రైండర్ను రూ.1,100కు అందజేస్తే రూ.1,300కు, మిక్సీ రూ.600కు ఇస్తే రూ.700కు విక్రయిస్తున్నట్లు కూలీలు తెలిపారు. బుధవారం సేల్స్ టాక్స్ అధికారులమంటూ కొందరు తమ దగ్గరికి వచ్చారని, చందుకు ఫోన్ చేయగా రూ. 5 వేలు వారికి ఇవ్వమని చెప్పాడన్నారు. ఇంత వ్యవహారం జరుగుతున్నా ఆదాయ పన్ను శాఖాధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.