Four people
-
‘గంగాధర’ మరణాల మిస్టరీ.. ఆ చావులు హత్యలేనా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఇటీవల కలకలం రేపిన అనుమానాస్పద మరణాల మిస్టరీ త్వరలోనే వీడనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేముల శ్రీకాంత్ శనివారం మరణించడంతో అసలేం జరుగుతోందన్న గందరగోళం నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శ్రీకాంత్ విషం తీసుకున్నాక వాంతులయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు విషయం తెలియకుండా వైద్యం చేయడం కష్టమని తేల్చిచెప్పారు. దీంతో తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నానని వెల్లడించాడు. వెంటనే వారు చికిత్స ప్రారంభించినా శ్రీకాంత్ను కాపాడలేకపోయారు. ఈ విషయాన్ని దర్యాప్తు అధికారి ఎస్సై రాజు కూడా ధ్రువీకరించారు. శ్రీకాంత్ భార్యా పిల్లలు కూడా ఇదే లక్షణాలతో మరణించారు. ముగ్గురు కూడా రక్తపు వాంతులు, విరేచనాలతో మరణించడంతో వారి శరీరంలోనూ ఇదే విషం కలిసిందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. శ్రీకాంత్ ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో పీజీ చేశాడు. కరీంనగర్లోని ఓ ప్రముఖ కాలేజీలో ఫుడ్ సైన్స్లో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. రసాయనాల గుణగణాలపై పూర్తి అవగాహన ఉండటంతో తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కానీ.. అతనికి ఇది ఎక్కడ నుంచి వచ్చింది? అన్న ప్రశ్నకు ఇంకా సమాధానాలు దొరకాల్సి ఉంది. విద్యార్థులకు ప్రయోగాలు చేయించే ల్యాబ్ నుంచి తీసుకువచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 33 రోజుల్లో ముగ్గురి ఆకస్మిక మరణాలు..! తొలుత కుమారుడు అద్వైత్ (20నెలలు) బా బు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యాడు. తొలుత కరీంనగర్కు, ఆ తరువాత హైదరాబాద్ తరలించి చికిత్స అందించినా బాబు ప్రాణాలు నిలవలేదు. చివరికి నవంబరు 16న అద్వైత్ కన్నుమూశాడు. అద్వైత్ మరణించాక నవంబరు 29న అవే లక్షణాలతో కూతురు అమూల్య (6) అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ.. డిసెంబరు 1న ప్రాణాలు విడిచింది. ఈ రెండు మరణాలకు వైద్యులు కారణాలు చెప్పలేకపోయారు. ఈ మరణాలపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కుటుంబానికి చేతబడి చేశారని కొందరు, అంతుచిక్కని వ్యాధి వచ్చిందని రకరకాలుగా చెప్పుకున్నారు. తన పేగు తెంచుకుని పుట్టిన ఇద్దరు బిడ్డలు రెండువారాల వ్యవధిలో దూరమై తల్లడిల్లుతున్న శ్రీకాంత్ భార్య మమత (26) కూడా డిసెంబరు 15న ఆసక్మికంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ.. డిసెంబరు 18న మరణించింది. దీంతో మమత కుటుంబ సభ్యుల్లో అనుమానాలు మొదలయ్యాయి. కేవలం 33 రోజుల్లో ఒకే కుటుంబంలో మూడు మరణాలు సంభవించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. తమ మనవలు, కూతురు అనుమానాస్పద మరణాల వెనక అల్లుడి పాత్ర ఉందని మమత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీకాంత్ ఇంటి సమీపంలోని బావి నీళ్లను, బంధువుల రక్త నమూనాలను పరీక్షిస్తే వాటిలో ఏమీ తేలలేదు. పోలీసుల వినతి మేరకు మమత పోస్టుమార్టం సమయంలో వైద్యులు విస్రా (శరీరంలోని కీలక అంతర్భాగాలు)ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఈ వివరాలు వచ్చేందుకు దాదాపు నెలరోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దర్యాప్తు వేగవంతం చేశారు. శ్రీకాంత్ పనిచేస్తున్న కాలేజీకి వెళ్లారు. అతని ప్రవర్తన గురించి స్నేహితులను ఆరా తీశారు. ఇదే క్రమంలో ఆకస్మికంగా డిసెంబరు 30 అర్ధరాత్రి శ్రీకాంత్ విషం తీసుకున్నాడు. ఆసుపత్రిలో తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నానని వైద్యులతో చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో 31 తెల్లవారుజామున చికిత్స పొందుతూ మరణించాడు. అత్తామామ ఆరోపిస్తున్నట్లుగా శ్రీకాంత్ తన భార్యాపిల్లలను ఎందుకు చంపాల్సి వచ్చింది? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆస్తి గొడవలు, వరకట్నం, వివాహేతర సంబంధం కారణాలు అయి ఉ ంటాయా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతో ంది. ప్రస్తుతం పోలీసుల దృష్టి అంతా అసలు శ్రీకాంత్కు సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడిది? ఎలా వచ్చింది? ఎప్పుడు ఇంటికి తె చ్చాడు? అన్న విషయాలపైనే కేంద్రీకతమైంది. ల్యాబ్ నుంచి తెచ్చాడా? బయట కొనుగోలు చేశాడా..? అన్న విషయాలు పోలీసులు తెలుసుకోగలిగితే.. అంతుచిక్కని మరణాల మిస్టరీ వీడినట్లే. సోడియం హైడ్రాక్సైడ్ తీసుకువచ్చిన తేదీకి ముందు వెనకా జరిగిన మరణాలను పోల్చి చూస్తే శ్రీకాంత్ పాత్ర తేటతెల్లమవుతుందని ఓ సీనియర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డాడు. ఫోరెన్సిక్ రిపోర్టు రావాల్సి ఉంది: ఎస్సై రాజు వేముల శ్రీకాంత్ కుటుంబం విషయంలో ప్రస్తుతం దర్యాప్తు నడుస్తోంది. శ్రీకాంత్ ఆసుపత్రిలో వైద్యులకు తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నానని వెల్లడించాడు. పిల్లల ఆకస్మిక మరణాల తరువాత, శ్రీకాంత్ భార్య మమత కూడా మరణించడంతో ఆమె తల్లిదండ్రులు శ్రీకాంత్పై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో మమత పోస్టుమార్టం సమయంలో విస్రా (శరీర అంతర్భాగాలు)ను ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) హైదరాబాద్ పంపాం. ఆ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఏంటి సోడియం హైడ్రాక్సైడ్? స్కూళ్లు, కాలేజీల్లో రసాయన ప్రయోగాలు చేసేందుకు సోడియం హైడ్రాక్సైడ్ (ఎన్ఏఓహెచ్)ను వాడుతారు. దీన్ని కాస్టిక్ సోడా అని కూడా పిలుస్తారు. మామూలుగా ఇండ్లలో జామైన సింకులు, పైపులైన్లు క్లియర్ చేసేందుకు వాడుతుంటారు. స్పటికాల రూపంలో కర్పూరాన్ని తలపించేలా ఉంటుంది. ఇది మనుషులకు చాలా ప్రమాదకరమైన రసాయన సమ్మేళనం. పొరపాటున చేతులపై పడినా.. చర్మం పగిలి రక్తస్రావం జరుగుతుంది. ఇది నీటిలో సులువుగా కరుగుతుంది. కనీసం 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం మనిషి శరీరంలోకి వెళితే.. వెంటనే అది జీర్ణాశయం, కిడ్నీలు, కాలేయం, రక్తం ద్వారా ఊపిరితిత్తులు, మెదడుకు చేరిపోతుంది. శరీర అంతర్భాగాల ఉపరితాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది. అందుకే.. శ్రీకాంత్ కుటుంబంలోని నలుగురు రక్తపు వాంతులు, విరేచనాలు చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీకాంత్ విద్యార్హతలు, ప్రస్తుతం చేస్తున్న పని, అన్నీ వెరసి అతని భార్య మమత, కూతురు అమూల్య, కుమారుడు అద్వైత్ మరణాలు ఒకే విధానంలో సంభవించడంతో అందరి చావుకు ఇదే రసాయనం కారణమన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. అత్తింటి వేధింపులే కారణం..!? మరోవైపు వేముల శ్రీకాంత్ ఆత్మహత్యకు అతని అత్తింటి వేధింపులే కారణమని శ్రీకాంత్ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. మమత మరణానంతరం వివాహం సమయంలో ఇచ్చిన కట్నం ఇవ్వాలని వేధించారని, అతను పనిచేసే కాలేజీకి వెళ్లి నానా యాగీ చేశారని ఆరోపించారు. మరోవైపు ఈ విషయంలో రాజకీయ నేతల వద్ద పంచాయితీ పెట్టడంతో శ్రీకాంత్ మనస్తాపంతోనే విషం తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు. -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం
అనంతపురం క్రైం: నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కనిపించకుండా పోయారు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని మారుతీనగర్కు చెందిన సంగమేష్, సాయిమౌనిక దంపతులు. 2011లో వివాహమైన వీరికి లిఖిత శరణ్య, లిఖిత కార్తికేయన్, మణికృష్ణ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంగమేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చదవండి: పాతిక కోట్లను బాంబులతో పేల్చేశారు! సోమవారం ఉదయం పిల్లలను పాఠశాల వద్దకు వదిలి వస్తానని చెప్పి వెళ్లిన భార్య సాయి మౌనిక తిరిగి రాలేదు. దీంతో పిల్లలు చదువుతున్న పాఠశాల, చుట్టుపక్కల ప్రాంతాల్లో సంగమేష్ గాలించాడు. ఫలితం లేకపోవడంతో సాయంత్రం నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. -
నదీ స్నానాలకు వెళ్లి నలుగురి గల్లంతు
తోట్లవల్లూరు/పద్మనాభం: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు, విశాఖ జిల్లా పాండ్రంగిలో కార్తీక సోమవారం సందర్భంగా నదీస్నానం ఆచరిస్తూ ఓ బాలుడు, ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి యువకుల మృతదేహాలను వెలికితీయగా.. బాలుడు, మరో యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు గ్రామానికి చెందిన సుమారు 10 మంది యువకులు సోమవారం వేకువజామున 4.30 గంటల సమయంలో స్థానిక కృష్ణా నది పాయలో స్నానాలు ఆచరించేందుకు వెళ్లారు. వారిలో ఐటీఐ చదువుతున్న గొరిపర్తి నరేంద్ర (18), గొరిపర్తి పవన్ (18) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న గొరిపర్తి శివనాగరాజు (20) నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. గ్రామస్తులు, మత్స్యకారులు నదీపాయలో గాలించగా.. శివనాగరాజు, పవన్ మృతదేహాలు లభ్యమయ్యాయి. నరేంద్ర ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అతడి ఆచూకీ కనుగొనేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. ఉయ్యూరు సీఐ ముక్తేశ్వరరావు, ఎస్ఐ అర్జున్, అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి సహాయక చర్యలపై అధికారులతో చర్చించారు. కలెక్టర్ జె.నివాస్తో ఫోన్లో చర్చించి తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున ఇచ్చే ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఆశల దీపం గల్లంతు విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో చోటుచేసుకున్న మరో ఘటనలో రేవిడి గ్రామానికి చెందిన మరగడ యశ్వంత్కుమార్రెడ్డి (9) అనే బాలుడు గోస్తనీ నది వద్ద కాజ్వే గట్టున స్నానం చేస్తూ నదిలో కొట్టుకుపోయాడు. యశ్వంత్కుమార్రెడ్డి తల్లి వెంకటలక్ష్మితో కలిసి సోమవారం ఉదయం 5.15 గంటల సమయంలో నదీ స్నానానికి వెళ్లాడు. తల్లి వెంకటలక్ష్మి తోటి మహిళలతో కలిసి నదిలో కాజ్వేపై స్నానం చేస్తుండగా.. యశ్వంత్ మరో బాలుడితో కలిసి కాజ్వే ఒడ్డున స్నానానికి ఉపక్రమించాడు. అక్కడ నాచు పట్టి ఉండటంతో యశ్వంత్ కాలు జారి నదిలో పడిపోయాడు. జాలర్లు, గజ ఈతగాళ్లు నదిలో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అధికారులు 18 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. సాయంత్రం 5.30 గంటల వరకు గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేసి మళ్లీ మంగళవారం కొనసాగించనున్నారు. బాలుడు కృష్ణాపురంలోని ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతుండగా.. తండ్రి గౌరిరెడ్డి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. -
కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలో హెలికాప్టర్ కూలిపోయిన ఘటన విషాదాన్నినింపింది. మారుమూల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేఎస్టీవీ స్టేషన్ డిపార్ట్మెంట్ ధ్రువీకరించింది. ది రాబిన్సన్ ఆర్66 అనే హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం 1.15 సమయంలో శాక్రమెంటోకు ఉత్తరాన కొలూసా కౌంటీలో ప్రాంతంలో కుప్పకూలింది. ఈ మేరకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించిన విషయాన్ని ధృవీకరించినప్పటికీ, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు వ్యక్తులు చనిపోయినట్టుగా తెలుస్తోందని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డులు ప్రకటించాయి. -
మంజీరలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు
సాక్షి, మెదక్: జిల్లాలోని కొల్చారం మండలం పోతాంశెట్టిపల్లి శివారులో మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం మంజీరా ప్రవాహంలో నలుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. చేపలు పట్టడానికి మంజీరా నదిలోకి వెళ్లిన వారంతా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అక్కడే చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఎగువ నుంచి నీళ్లు వదలడంతో ఈ నలుగురు ఉన్న గడ్డ ప్రాంతం చుట్టు పక్కల ఒక్కసారిగా భారీ స్థాయిలో నీరు చేరింది. భారీగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకున్నవారు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందిచారు. దీంతో మెదక్ రూరల్ సీఐ పాలవెల్లి, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వారిని ఒడ్డుకు చేర్చేందుకు మెదక్, కిష్టాపూర్ నుంచి గజ ఈతగాళ్లను పిలిపించారు. సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మంజీర నదిలో చిక్కుకున్న వారిని కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుంపలు ఎల్లం, సాదుల యాదగిరి, మెదక్ పట్టణానికి చెందిన ఆర్నె కైలాఫ్, రాజబోయిన నాగయ్యగా పోలీసులు గుర్తించారు. -
యూపీలో ‘నిర్భయ’
న్యూఢిల్లీ/హాథ్రస్: నిర్భయ ఘటనను తలపించే మరో దారుణం ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. 19 ఏళ్ల దళిత యువతిని నలుగురు అగ్రవర్ణ యువకులు అత్యంత దారుణంగా గాయపర్చి, పాశవికంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ యువతి చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చనిపోయింది. తెగిన నాలుక, విరిగిన ఎముకలు, పూర్తిగా చచ్చుపడిపోయిన కాళ్లు, పాక్షికంగా పక్షవాతానికి గురైన చేతులు, మెడకు, వెన్నెముకకు అయిన తీవ్ర గాయాలు.. ఆ యువతిపై ఆ రాక్షసులు సాగించిన దమనకాండకు సాక్ష్యాలుగా నిలిచాయి. దేశవ్యాప్తంగా నిరసనలకు, నిర్భయ చట్టానికి కారణమైన 8 ఏళ్ల క్రితం నాటి నిర్భయ అత్యాచార ఘటనను ఈ దారుణం గుర్తుకు తెచ్చింది. దళిత యువతి మృతిపై పౌర సమాజ కార్యకర్తలు, దళిత సంఘాలు, భీమ్ ఆర్మీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించాయి. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వెలుపల భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో వేలాది మంది ధర్నాకు దిగారు. ఆ దళిత యువతికి న్యాయం చేయాలని, దోషులను బహిరంగంగా ఉరి తీయాలని నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా దళితులంతా వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఆజాద్ పిలుపునిచ్చారు. ఆటవిక రాజ్యం నడుస్తున్న యూపీలో మరో దళిత యువతి బలి అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలోని విజయ్ చౌక్లో, యూపీలోని హాథ్రస్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని హాథ్రస్ ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. సందీప్, రాము, లవ్కుశ్, రవి తనపై అత్యాచారం చేశారని, వారిని అడ్డుకుంటుండగా, గట్టిగా గొంతు నులిమారని, అప్పుడు నాలుక తెగిందని బాధిత యువతి మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించింది. బాధిత మహిళను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించి మెరుగైన చికిత్స అందించకుండా.. పరిస్థితి పూర్తిగా విషమించిన తరువాత, సోమవారం సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అలాగే, బాధితుల ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించలేదని, నాలుగైదు రోజుల తరువాత కేసు నమోదు చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. అసలేం జరిగింది.. సుమారు రెండు వారాల క్రితం, సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాథ్రస్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం, బాధితురాలి సోదరుడు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఆ రోజు ఉదయం పశువులకు గడ్డి కోసేందుకు తల్లి, అన్నతో కలిసి ఆమె పొలంకు వెళ్లింది. కాసేపయ్యాక గడ్డిమోపుతో ఆమె సోదరుడు ఇంటికి తిరిగి వెళ్లాడు. యువతి తల్లికి కొద్ది దూరంలో ఉండి గడ్డి కోస్తుంది. ఇంతలో, వెనక నుంచి వచ్చిన ముష్కరులు ఆమె నోరు మూసి, చున్నీని మెడకు చుట్టి దూరంగా లాక్కెళ్లారు. కాసేపటికి కూతురు కనిపించడం లేదని గుర్తించిన తల్లి వెతకగా.. దారుణంగా అత్యాచారానికి గురై, రక్తమోడుతూ, ఒళ్లంతా గాయాలతో, అపస్మారక స్థితిలో కనిపించింది. మొదట, ఆమెను అలీçగఢ్లోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చేర్చారు. అయితే, చికిత్సకు స్పందించడం లేదని..మెడకు అయిన గాయం కారణంగా కాళ్లు పూర్తిగా, చేతులు పాక్షికంగా చచ్చుబడిపోయాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దాంతో, ఆమెను సోమవారం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ వైద్యశాలకు తీసుకువచ్చారు. పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందింది. అరెస్ట్ చేశాం.. నిందితులు అగ్రవర్ణాలకు చెందిన వారయినందున, ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదని వచ్చిన ఆరోపణలు సత్యదూరమని ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. ఆ నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని, బాధితురాలు మరణించినందున వారిపై పెట్టిన కేసుల్లో హత్యానేరం కింద ఐపీసీ 302 సెక్షన్ను కూడా చేరుస్తామన్నారు. 8 రోజులు ఏం చేశారు? ‘జవాబుల్లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఘటన జరిగిన తరువాత, ఫిర్యాదు అందిన తరువాత 8 రోజుల పాటు పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు? బాధిత యువతిని వెంటనే మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్కు ఎందుకు తీసుకెళ్లలేదు? ఆ నలుగురు రాక్షసులపై ఎన్ఎస్ఏ(నేషనల్ సెక్యూరిటీ యాక్ట్) కింద కేసు ఎందుకు పెట్టలేదు? ఈ దారుణంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ ష్రినతే ప్రశ్నల వర్షం కురిపించారు. దళిత యువతి మృతికి మొత్తం సమాజం సిగ్గుతో తల దించుకోవాలని ఢిల్లీ సీఎంæ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ హత్యాచార ఘటనపై క్రికెటర్ కోహ్లి, బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, ఫర్హాన్ అఖ్తర్ ఆవేదనను వ్యక్తపరిచారు. వెల్లువెత్తిన నిరసనలు దళిత యువతి హత్యాచారంపై నిరసనలు వెల్లువెత్తాయి. ‘ప్రభుత్వం మా ఓపికను పరీక్షించవద్దు. వారిని ఉరి తీసేవరకు మేం విశ్రమించం’ అని భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ స్పష్టం చేశారు. ఆమెను ఎయిమ్స్కు మార్చి, మరింత మెరుగైన చికిత్స అందించాలన్న తన విజ్ఞప్తిని యూపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆ యువతి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆజాద్ పేర్కొన్నారు. సమాచారం తీసుకున్నాం.. ఈ ఘటనకు సంబంధించి తీసుకున్న చర్యల వివరాలు చెప్పాలని పోలీసులను ఆదేశించామని జాతీయ మహిళాకమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. -
కరోనాతో ఒకేరోజు నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాతో మంగళవారం ఒక్కరోజే నలుగురు మరణించారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశారు. వారిలో బీపీ, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న 75 ఏళ్ల వృద్ధుడు, న్యుమోనియాతో బాధపడుతున్న మరో 70 ఏళ్ల వ్యక్తితోపాటు ఊబకాయం, న్యుమోనియా సమస్యలతో బాధపడుతున్న 38 ఏళ్ల మహిళ, న్యుమోనియాతో బాధపడుతున్న మరో 68 ఏళ్ల స్త్రీ ఉన్నట్లు వివరించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 38కి చేరింది. ఇక రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో 42 కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. ఇందులో జీహెచ్ఎంసీకి చెందిన వారు 34 మంది ఉండగా, వలసదారులు 8 మంది ఉన్నారు. మొత్తం ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1634కి చేరింది. తాజాగా కరోనా నుంచి 9 మంది కోలుకోగా, ఇప్పటివరకు 1011 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 585 మంది చికిత్స పొందుతున్నారు. -
జైపూర్ పేలుళ్ల కేసులో నలుగురికి ఉరి
జైపూర్: 2008 నాటి జైపూర్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆ పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ శర్మ శుక్రవారం తుదితీర్పు వెలువరించారు. దోషులకు రూ.50 వేల జరిమానా విధించారు. ‘వేర్వేరు ప్రాంతాల్లో బాంబులు ఏర్పాటు చేసినందుకు ఐపీసీ 302 సెక్షన్ కింద నలుగురు దోషులకు మరణశిక్ష విధించారు’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీచంద్ తెలిపారు. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళతామని దోషుల తరఫు లాయర్ చెప్పారు. రెండు రోజుల క్రితం మహమ్మద్ సైఫ్, మహమ్మద్ సర్వార్ అజ్మీ, మహమ్మద్ సల్మాన్, సైఫురీష్మన్ అనే నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పునివ్వగా మరో నిందితుడు షాబాజ్ హుస్సేన్ను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషిగా విడుదల చేసింది. నిందితులుగా ఉన్న మరో ఇద్దరు అదే ఏడాది ఢిల్లీల్దో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. -
భూపాలపల్లిలో పెద్దనోట్ల కలకలం
భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో పెద్ద మొత్తంలో కొత్త 2 వేల రూపాయల నోట్లు కలిగి ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు వ్యక్తుల వద్ద మొత్తం కలిపి రూ.19.62 లక్షల విలువైన కొత్త నోట్లను గుర్తించినట్లు సమాచారం. వారిని అదపులోకి తీసుకున్న పోలీసులు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, నలుగురు వ్యక్తులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. -
'రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి'
-
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
తాడేపల్లి(గుంటూరు జిల్లా): తాడేపల్లి మండలం కుంచనపల్లి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు..కుంచనపల్లి వద్ద శుక్రవారం వేకువజామున ప్రమాదవశాత్తూ లారీ, ఆటో ఆటో ఢీకొన్నాయి. ఈ రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో ఒకరు, చికిత్సపొందుతూ మరొకరు మృతిచెందారు. గాయపడిన వారు విజయవాడ ప్రభుత్వాసుపత్రి, ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. ఈ ప్రమాద సమాచారం అందుకొని ఘటనా స్థలానికి వెళ్తున్న పోలీసు వాహనాన్ని మరో జీపు ఢీకొంది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. -
కన్నబిడ్డ బలికి ఓ తల్లి యత్నం!
రాజమహేంద్రవరంలో ‘గుప్త నిధుల’ కలకలం సాక్షి, రాజమహేంద్రవరం: గుప్తనిధుల కోసం కన్నబిడ్డను బలివ్వడానికి ఓ మహిళ ప్రయత్నించిందంటూ వచ్చిన ఆరోపణలు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కలకలం రేపాయి.కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన తడాల గణపతి రాజమహేంద్రవరంలోని నారాయణపురంలో అద్దెకు ఉంటున్నాడు. రంపచోడవరం మండలం బి.వెలమకోటకు చెందిన పార్వతి తన భర్తను వదిలేసి దేవీపట్నం మండలం గంగపాలేనికి చె ందిన కోసు వెంకన్నదొరతో ఉంటోంది. వీరికి అమలాపురానికి చెందిన ఏసీ మెకానిక్ కాళీ రామ్కుమార్, గణపతితో పరిచయముంది. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి పార్వతి తనకు ఒంట్లో బాగోలేదంటూ మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తె పావని(6), వెంకన్నదొర, కాళీ రామ్కుమార్లతో కలసి గణపతి ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి ఇంట్లో ఏవో పూజలు చేశారు. అనంతరం ఇంటి వెనుక ఉన్న ఎఫ్సీఐ గోడౌన్ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఇది గమనించిన స్థానికులు క్షుద్రపూజలు జరుగుతున్నాయని, బాలికను బలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. గణపతి ఇంట్లో తనిఖీలు చేసి పూజా సామగ్రి, కత్తి, పార, గునపం స్వాధీనం చేసుకున్నారు. బాలికను ప్రశ్నించగా తనకేమీ తెలియదని, తల్లితో వచ్చినట్లు తెలిపింది. ఎం.శ్రీనివాస్, మరో ఇద్దరు నిందితులు పరారయ్యారని సీఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు చెప్పారు. -
గుప్త నిధుల కోసం బాలికను బలివ్వబోయారా..?
రాజమండ్రి క్రైమ్: గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్న నలుగురిని రాజమండ్రిలో పోలీసులు శనివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడియం మండలం గుర్లంక గ్రామానికి చెందిన గణపతి రాజమండ్రి నారాయణపురంలో ఎఫ్సీఐ గోదాముల వెనుక ఓ గది అద్దెకు తీసుకుని ఆరు నెలలుగా నివాసం ఉంటున్నాడు. ఇతడి దగ్గరకు వెంకన్నదొర (దేవీపట్నం), అమలాపురం పట్టణానికి చెందిన రామ్కుమార్, రంపచోడవరం మండలానికి చెందిన కాణెం పార్వతీదేవి, ఆమె కుమార్తె పావని (7) శనివారం వచ్చారు. అర్ధరాత్రి వీరి గదిలో క్షుద్ర పూజలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వారు ఆ ప్రాంతానికి చేరుకుని నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బాలిక మగత స్థితిలో ఉండడం, క్షుద్ర పూజలకు సంబంధించిన సామగ్రితోపాటు కత్తి, రెండు గడ్డపారలు కనిపించడంతో బాలికను బలిచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సామానులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. -
చిత్తూరు జిల్లాలో విషాదం..
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. చెన్నమ్మగుడిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి నలుగురు బాలికలు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు బాలికలను ఓ మహిళ కాపాడింది. గల్లంతైన మరో బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
మరో నిర్భయ గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మరో నిర్భయ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నోయిడాకు చెందిన ఓ వివాహిత(35)పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్ ఇస్తామని చెప్పి నమ్మించి అఘాయిత్యానికి ఒడిగట్టిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు కథనం ప్రకారం.. నోయిదాడకు చెందిన ఓ మహిళ తన భర్త దగ్గరకు వెళ్లేందుకు బస్టాప్ లో వేచి వుంది. ఇంతలో స్కార్పియో లో వచ్చిన నలుగురు వ్యక్తులు, లిఫ్ట్ ఇస్తామని, గమ్యానికి చేరుస్తామని ఆమెను నమ్మించి వాహనంలో ఎక్కించుకున్నారు. అనంతరం మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఆఫర్ చేసి ...ఆమె మత్తులోకి జారుకున్నాక సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి పారిపోయారు. అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను పోలీసులు గమనించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు... నిందితులు వీరు, సమీర్ గా గుర్తించారు. మిగిలిన ఇద్దరినీ గుర్తించే ప్రయత్నంలో వున్నామని కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
వరద నీటిలో చిక్కుకున్న ప్రయాణికులు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: అకాలవర్షాలతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలయ్యపల్లి మండలం గొల్లపల్లి సమీపంలో నేరాడ కాలువ పొంగిపొర్లడంతో వరద నీరు భారీగా రోడ్డుపైకి చేరింది. దీంతో ఆ రహదారిలో వెళ్లుతున్న ఓ ఆటో వరదనీటిలో చిక్కుకుంది. అందులో ఓ పాపతో పాటు మరో నలుగురు భయంతో రక్షించమంటూ కేకలు పెట్టారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఆటోలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
మద్యం తాగించి బాలికపై గ్యాంగ్ రేప్
⇒ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి కోసం బయలుదేరిన బాలిక ⇒ రైలు టికెట్ ఇప్పిస్తానని మోసం చేసిన ఉమేశ్ ⇒ మిత్రులతో కలసి గ్యాంగ్రేప్ ముంబై: నలుగురు వ్యక్తులు ఓ 14 ఏళ్ల బాలికను గ్యాంగ్రేప్ చేసిన ఘటన ధార్వానీ ప్రాంతంలో జరిగింది. డిప్యూటీ కమిషనర్ మహేశ్ పాటిల్ వివరాల మేరకు... సబర్బన్ అంథేరీలో ఉండే బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. మే 24న ఫేస్బుక్ ద్వారా తనకు పరిచయమైన వ్యక్తిని కలిసేందుకు జమ్మూ-కశ్మీర్కు వెళ్తానని వాళ్ల బామ్మకు బాలిక చెప్పగా, ఆమె వద్దని వారించింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరగడంతో కోపంలో ఇంట్లోంచి వచ్చేసింది. బాలిక కుర్లా చేరుకున్న తర్వాత నిందితులు ఉమేశ్ కవడే (22), దినేష్ కుమార్ (20) తనకు కశ్మీర్ వెళ్లడానికి టికెటు ఇప్పిస్తామని చెప్పి ఛత్రపతి శివాజీ టర్మినస్ వద్దకు తీసుకెళ్లారు. తర్వాత టెకెట్ దొరకలేదని, తర్వాత రోజు ఇప్పిస్తామని, అప్పటి వరకు తమ ఇంట్లో ఉండమన్నారు. నిందితులు అమ్మాయిని ఓ లెదర్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి, బలవంతంగా మందు తాగించి అత్యాచారం చేశారు. తరువాత సల్మాన్ఖాన్, రాజ్కుమార్ సింగ్కు ఫోన్ చేసి పిలిపించారు. వారు కూడా ఆమెను బలాత్కరించారు. మరుసటి రోజు వారిని గమనించిన జమీర్ఖాన్ అనే వ్యక్తి ఉమేశ్ను పట్టుకుని విషయం చెప్పాలని కొట్టడంతో ఉమేశ్ పరారయ్యాడు. దీంతో బాధితురాలిని బంధువుల వద్దకు జమీర్ఖాన్ చేర్చారు. నిందితుల్లో ముగ్గురిని పోలీ సులు అరెస్టు చేయగా.. ప్రధాన నిందితుడు ఉమేశ్ పరారీలో ఉన్నాడు. -
తీరంలో తీరని శోకం
ఎగసి వచ్చే శోకాన్ని ఉగ్గబట్టుకున్న గుండెలతో, రెప్పల వెనుక మరిగే దుఃఖపు లావాను అదిమిపెట్టుకున్న కన్నులతో నదిలో గాలించిన ఆత్మీయులకు చివరికి తమ వారి కట్టెలే కంటబడ్డాయి. ఆ క్షణంలో వారి క ళ్ల నుంచి అశ్రువులు.. వరదవేళ అఖండ గోదావరి ప్రవాహంలా వెల్లువెత్తాయి. రాళ్లకు సైతం జాలి కలిగేలా వారి రోదన గాలిలో మార్మోగింది. ఆదివారం బడుగువానిలంక, ఆలమూరుల వద్ద గౌతమీపాయలో స్నానం చేయడానికి దిగిన అయిదుగురిపై మాటేసిన మృత్యువు.. జలాన్నే వలగా మార్చి ప్రాణాల్ని కబళించిన విషయం తెలిసిందే. ఈ విషాదం జరిగినప్పటి నుంచీ గాలింపు జరపగా సోమవారం నాలుగు మృతదేహాలు కనిపించాయి. మరొకరి కోసం గాలింపు జరుగుతోంది. గల్లంతైన వారి కుటుంబసభ్యులు, అయినవారు పెద్ద సంఖ్యలో నదీ తీరం చేరుకుని, మృతదేహాలు దొరగ్గానే బావురుమన్నారు. ఆలమూరు / ఆత్రేయపురం :బడుగువాని లంక వద్ద స్నానానికి దిగిన ముగ్గురు విద్యార్థుల్లో నేల వెంకట పవన్ (13) మృతదేహం అక్కడికి సమీపంలోని ఇసుకలో కూరుకుపోయి ఉండగా కనుగొన్నారు. అనుదీప్ (7) మృత దేహం బడుగువాని లంక పుష్కర్ఘాట్ సమీపంలో, సిందుశ్రీ(9) మృతదేహం బడుగువాని లంక శివారు వాడపల్లి లంక వద్ద దొరికారుు. ఈ చిన్నారుల మృతదేహాలను మండపేట సీఐ పుల్లారావు ఆధ్వర్యంలో రామచంద్రపురం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా ఆలమూరు ఇసుక ర్యాంపు వద్ద స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరిలో మట్టా వెంకట రమణ (35) మృతదేహం కపిలేశ్వరపురం మండలం తాతపూడి సమీపంలో లభ్యమైంది. మట్టా సురేంద్ర (15) మృత దేహం కోసం రెండు ఇంజన్ బోట్లతో ముమ్మరంగా గాలిస్తున్నారు. జెడ్పీ చైర్మన్ పరామర్శ ఆదివారం దుర్ఘటనలు జరిగాక బాధిత కుటుంబాలను పరామర్శించిన కొత్తపేట ఎమ్మెల్చే చిర్ల జగ్గిరెడ్డి వారికి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మృతుల్లో పెద్ద వారి కుటుంబానికి రూ.4 లక్షలు, పిల్లల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించిన సంగతీ విదితమే. కాగా జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు బడుగువానిలంక, జొన్నాడ గ్రామాల్లో బాధిత కుటుంబాలను సోమవారం పరామర్శించారు. ప్రభుత్వపరంగా న్యాయం చేయగలమని హామీ ఇచ్చారు. మృతుల దహన కార్యక్రమాల నిమిత్తం రూ.2 వేల చొప్పున అందజేశారు. ఢిల్లీలో ఉన్న అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, హైదరాబాద్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు ఫోన్లో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాల వారికి న్యాయం చేయడానికి ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆకుల రామకృష్ణ బాధిత కుటుంబాల్ని పరామర్శించి కొంతమొత్తం ఆర్థిక సాయం అందజేశారు. ఆదివారం రాత్రి నుంచి మృతదేహాల గాలింపులో పాల్గొన్న ఆలమూరు తహశీల్దార్ పి.రామ్మూర్తి సొంతంగా రూ.5 వేలు అందజేశారు. -
స్నేక్ గ్యాంగ్ కేసులో మరో నలుగురి అరెస్టు
హైదరాబాద్: యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన స్నేక్గ్యాంగ్ వీడియో క్లిప్పింగ్లను మొబైల్ అప్లికేషన్ ‘వాట్సాప్’ ద్వారా షేర్ చేసుకుంటున్న నలుగురు వ్యక్తులను సైబరాబాద్ సీసీఎల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జూలై 31న పహాడీషరీఫ్ షాయిన్ నగర్లో స్నేక్ ముఠా సభ్యులు యువతిపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిందితులు వీడియో తీసుకున్నారు. వాటిని గత నెల 31న ఒక లోకల్ టీవీ చానల్లో ప్రసారం చేయడంతో దానికి అందజేసిన మహ్మద్ అక్బర్ షరీఫ్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఈ నెల 8న వీడియో క్లిప్పింగ్స్ షేర్ చేసినందుకు సయ్యద్ ఇమ్రాన్ అలీ (26), మహ్మద్ అలీముద్దీన్ (45)లను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కింగ్కోఠికి చెందిన సయ్యద్ బిన్ సాలం (34), మహ్మద్ బిన్ ఇబ్రహీం (40), మోసిన్ బిన్ అల్ జాబ్రీ (50), హబీబ్ ఉస్మాన్ అల్కాప్ (45)లను సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.