breaking news
Dr. Prabhakar Rao
-
లోకాస్ట్ పాలీహౌజ్లో లోపాల్లేవు
హైదరాబాద్: ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఖరీదైన పాలీహౌజ్లో డిజైన్పరమైన లోపాలున్నాయని శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ ట్రస్టీ, లోకాస్ట్ పాలీహౌజ్ నమూనా రూపశిల్పి డా. బండి ప్రభాకర్రావు స్పష్టం చేశారు. అయితే తాము స్థిరీకరించిన లోకాస్ట్ పాలీహౌజ్ నమూనా లోపరహితమైనదన్నారు. తెలంగాణ ఉద్యాన శాఖ తోడ్పాటుతో రెడ్హిల్స్లోని ఉద్యాన శిక్షణ సంస్థలో శుక్రవారం నిర్వహించిన రైతుల శిక్షణా శిబిరంలో పాల్గొని దీనిపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన ప్లాస్టిక్, నెట్, నట్లు, బోల్టుల కొనుగోలుకు చదరపు మీటరుకు రూ. 55 లేదా చదరపు అడుగుకు రూ. 5.35 మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఈ పద్ధతిలో పాలీహౌజ్ను నిర్మించుకుని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటల సాగు దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. లోకాస్ట్ పాలీహౌజ్లలో ప్రకృతి వ్యవసాయంపై తెలంగాణ ఉద్యాన శాఖతో అవగాహన ఒప్పందం కుదిరిందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు పి. రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏపీ ఉద్యాన శాఖ కూడా దీనిపై ఆసక్తి కనబరుస్తోందన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రైతులు, నగరాల్లో ఇంటిపంటల సాగుదారులకు విస్తృత స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇందుకోసం జూలైలో మాస్టర్ ట్రైనర్లకు 15 రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో శిక్షణ శిబిరం నిర్వాహకురాలు సీహెచ్ ఉమామహేశ్వరి, ఉద్యాన అధికారులు అరుణ, పద్మనాభ తదితరులు పాల్గొన్నారు. -
బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు
హుజూర్నగర్ : సారా విక్రయించినా, బెల్టు షాపులు నడిపినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ ప్రభాకర్రావు హెచ్చరించారు. ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న మద్యం విక్రయాలు ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయన్నారు. అందుకే వాటిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధి లో సారా తయారీ కేంద్రాలపై, బెల్టు షాపులపై దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్న ట్లు తెలిపారు. కొందరు జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నారని.. ఇటీవల గుర్రంబోడు పోలీస్స్టేషన్ పరిధిలో 55 బైక్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. గత ఏడాది మంజూరైన నిధులతో దేవరకొండ, నల్లగొండలోని పోలీస్ క్వార్టర్సకు మరమ్మతులు చేయిం చామని, హుజూర్నగర్, గరిడేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో గృహ సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వివరించారు. 2012 సంవత్సరం కంటే 2013 లో 1000 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు. వాటిలో భూ తగాదాలు, భార్యా భర్తలకు సంబంధించిన కేసులు అధికంగా ఉన్నాయన్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన హత్యలన్నీ వివాహేతర సంబంధాలు, భూతగాదాలకు సంబంధించినవని, ముఠాకక్షలు, రాజకీయ గొడవలు లేవని చెప్పారు. విధానపరమైన నిర్ణయాల వల్ల ఎస్ఐ, సీఐల బదిలీల ప్రక్రియలో జాప్యం జరిగిందని, వారం రోజు ల్లో బదిలీలు నిర్వహిస్తామని తెలిపారు. పోలీసులకు ఇస్తున్న వారాంతపు సెలవుల వల్ల వారు మానసికంగా ప్రశాంతత పొంది విధులను సక్రమంగా నిర్వహించేందుకు దోహద పడు తున్నాయని పేర్కొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లోని సిబ్బంది ఎస్పీని శాలువాలు, పూల మాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కె.మోహన్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వెంకటశివరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.