breaking news
DMK leader Karunanidhi
-
కరుణకు కేంద్రం ఝలక్
సాక్షి ప్రతినిధి, చెన్నై : కాంగ్రెస్తో భాయ్ భాయ్గా మెలుగుతున్న డీఎంకే అధినేత కరుణానిధికి కేంద్రప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. అసెంబ్లీలో ఇదివరకు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు బ్లాక్ కమెండోస్ భద్రతను ఉపసంహరించుకుంది. దేశంలోని అత్యంత ప్రముఖ నేతలకు కేంద్ర ప్రభుత్వం బ్లాక్ కమెండోస్ భదత్రను కల్పించడం అనవాయితీగా వస్తోంది. ఇలాంటి భద్రతా చర్యల్లో నాలుగు కేటగిరిలు ఉన్నాయి. జెడ్ ప్లస్, జెడ్, వై, ఎక్స్ పేర్లతో నేతలకు భద్రత కల్పిస్తున్నారు. ప్రధాని, మాజీ ప్రధానులకు, వారి కుటుంబ సభ్యులకు జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తారు. ఇతరులకు అప్పటి పరిస్థితులను బట్టి జెడ్ ప్లస్ కేటాయిస్తారు. ప్రస్తుతం దేశంలో మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ వారి కుటుంబసభ్యులకు మరి కొంతమందితో కలుపుకుని మొత్తం 15 మంది నేతలకు బ్లాక్ కమెండోస్తో కూడిన జెడ్ ప్లస్ భద్రతను కల్పించారు. డీఎంకే అధ్యక్షులుగా, ముఖ్యమంత్రిగా కరుణానిధికి బ్లాక్ కమెండోస్ భద్రత కల్పించారు. ఆ తరువాత ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ భద్రతా కొనసాగుతోంది. కాగా, దేశంలోని పలువురు నేతలకు జెడ్ప్లస్ భద్రతను ఉపసంహరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా ఆ జాబితాలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరు చోటుచేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారాన్ని చేజిక్కించుకోగా మిత్రపక్ష డీఎండీకేకు డీఎంకే కంటే ఎక్కువ సీట్లు రావడంతో విజయకాంత్ ప్రతిపక్ష నేతగా మారారు. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. అయితే డీఎంకే ఆరంభం నుండి అసెంబ్లీలో అధికార పక్షం లేదా ప్రతిపక్ష హోదాను అందుకున్న కరుణానిధి ఈసారి ఆ హోదా నుండి తప్పుకున్నారు. వృద్ధ్దాప్యం లేదా భావివారసుడు అనే కారణంతో స్టాలిన్కు ప్రతిపక్షనేత హోదాను కరుణ కట్టబెట్టారు. అసెంబ్లీకి వచ్చినా రాకున్నా ఇటీవలి వరకు కరుణానిధినే ప్రతిపక్ష నేతగా చలామణి కాగా స్టాలిన్ ప్రవేశంతో బ్లాక్ కమెండోస్ భద్రత కూడా చేజారిపోయింది. రాష్ట్రంలోనే సీనియర్ నేతైన కరుణానిధికి బ్లాక్ కమెండోస్ భద్రతను ఉపసంహరించడం వెనుక రాజకీయం ఉందేమోనని కాంగ్రెస్, డీఎంకేలు కారణాలు వెతుకుతున్నాయి. అసెంబ్లీలో సీటేదీ : సీఎంను ప్రశ్నించిన కరుణ అసెంబ్లీ హాజరయ్యేందుకు అనువుగా అక్కడ సీటేదని డీఎంకే అధ్యక్షులు కరుణానిధి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అన్నాడీఎంకే పాలన, కచ్చదీవుల అప్పగింత, స్వాధీనం తదితర అంశాలపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడిగా చర్చ సాగింది. ప్రతిపక్ష నేతగా స్టాలిన్ సహా తదితర డీఎంకే సభ్యులు అధికార పార్టీ విమర్శలను సాధ్యమైన మేరకు అడ్డుకున్నారు. అదే సమయంలో కరుణానిధి అనేక పత్రికా ప్రకటనలతో జయలలితను నిలదీశారు. ఇందుకు తీవ్రంగా స్పందించిన జయలలిత...బైట నుంచి ప్రకటనలు గుప్పించడం కాదు, అసెంబ్లీలో మాట్లాడాలని సీఎం సవాలు విసిరారు. జయ సవాల్కు స్పందించిన కరుణానిధి, చక్రాల కుర్చీతో లోనికి వచ్చేందుకు అసెంబ్లీలో వసతి ఏదీ అని ఆమెను ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత కాదన్న కారణంగా వెనుక వరుసలో సీటు కేటాయించడం ద్వారా అసెంబ్లీకి రాకుండా చేశారని ఆయన విమర్శించారు. -
కరుణా.. స్టాలినా?
సాక్షి, చెన్నై : ప్రధాన ప్రతిపక్ష నేత కుర్చీలో కూర్చోనున్నది డీఎంకే అధినేత కరుణానిధా లేదా దళపతి ఎంకే స్టాలినా అన్న ప్రశ్న బయలు దేరింది. మెజారిటీ శాతం మంది స్టాలిన్ అంటున్నా, ఈ సారి కరుణానిధి అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం మంగళవారం తేలనుంది. ఆ రోజున డీఎంకే ఎమ్మెల్యేలు, పార్టీ వర్గాలతో సమాలోచనా సమావేశానికి కరుణానిధి పిలుపునిచ్చారు. రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా బలమైన ప్రతిపక్షం అధికార పక్షానికి ఎదురుగా కూర్చోబోతున్నది. అధికార అన్నాడీఎంకే పక్షాన్ని ఢీకొట్టేందుకు తగ్గ బలంతో ప్రధాన ప్రతి పక్షంగా డీఎంకే అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇది వరకు పరిమిత సంఖ్యలో సభ్యుల్ని కల్గిన డీఎంకే ఈ సారి తమ గళం గంభీరంగా ఉంటుందని, ప్రధాన ప్రతిపక్షం అంటే ఏమిటో చూపిస్తామన్న వ్యాఖ్యలు చేస్తుండడంతో ఇక, అసెంబ్లీలో ప్రతిరోజూ సమరమేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ సమరంలో అధికార పక్షానికి నేతృత్వం వహించేందుకు సీఎం జయలలిత సిద్ధమయ్యారు. ఇక, ప్రధాన ప్రతిపక్షానికి నేతృత్వం వహించే నేత డీఎంకేలో ఎవరన్న ప్రశ్న బయలు దేరింది. 2011లో కరుణానిధి అసెంబ్లీకి ఎన్నికైనా సమావేశ మందిరంలో మాత్రం అడుగు పెట్టలేదు. తాను కూర్చునేందుకు తగ్గ వసతి కల్పిస్తే, సభకు వస్తానని ఆయన వ్యాఖ్యలు చేసినా లేఖలు పంపినా పాలకులు మాత్రం పట్టించుకోలేదు. ఇందుకు కారణం డీఎంకే సభ్యులు సభలో పరిమితంగా ఉండడమే. అయితే, ఈసారి ఎక్కువ సంఖ్యలో సభ్యులతో డీఎంకే ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న దృష్ట్యా, కేబినెట్ హోదా కల్గిన ప్రధాన ప్రతిపక్ష నేతకు సౌకర్యాల్ని కల్పించాల్సిన అవసరం తప్పనిసరి. ఈ దృష్ట్యా, కరుణానిధి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారా.. అన్న ప్రశ్న బయలుదేరింది. కరుణానిధి ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టిన పక్షంలో ఆయనకు కావాల్సిన వసతులు కల్పించాల్సిందే. ఇందులోనూ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అనుసరించిన పక్షంలో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ప్రధాన ప్రతిపక్ష నేతగా తన సేనలతో కలిసి అధికార పక్షాన్ని ఢీకొట్టడం ఖాయం. ఒక వేళ ప్రధాన ప్రతిపక్ష నేతగా కరుణానిధి ఉంటే, డీఎంకే శాసన సభా పక్ష ఉప నేతగా స్టాలిన్ వ్యవహరించేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందుకు తగ్గ నిర్ణయాలు మంగళవారం అధికార పూర్వకంగా వెలువడనున్నది. పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లాల కార్యదర్శులు, సర్వ సభ్య సభ్యులతో మంగళవారం సమావేశానికి కరుణానిధి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రధాన ప్రతి పక్ష నేతను, శాసన సభా పక్ష ఉప నేత, పార్టీ విప్లను ఎంపిక చేయనున్నారు. శుభాకాంక్షల..ఆశీస్సులు : ప్రధాన ప్రతి పక్ష నేత ఎంపిక కసరత్తులు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ తరఫున టీకేఎస్ ఇళంగోవన్, ఆర్ఎస్ భారతీల పేర్లను అధికార పూర్వకంగా కరుణానిధి ప్రకటించారు. తమకు అవకాశం కల్పించడంతో ఆ అభ్యర్థులు ఆదివారం గోపాలపురంలో కరుణానిధి ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా చిరునవ్వులు చిందిస్తూ కరుణానిధి ఫొటోకు ఫోజు ఇవ్వడం విశేషం. తదుపరి మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కరుణానిధి వేర్వేరుగా లేఖలు రాశారు. ఇందులో పశ్చిమ బెంగాళ్ సీఎం మమత బెనర్జీ, కేరళ సీఎం. పినరాయ్ విజయన్, అసోం సీఎం సర్బంధ సోనోవాల్ ఉన్నారు. వారికి తన శుభాకాం క్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరునల్వేలి జిల్లా కడయనల్లూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యుడు అబూబక్కర్, ఆ పార్టీ నేత ఖాదర్ మొహిద్దీన్ కరుణానిధిని కలుసుకున్నారు. అనంతరం కరుణానిధి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఎన్నికల యంత్రాంగం తీరుపై అనుమానాల్ని వ్యక్తం చేశారు. తమ బాధ్యత పెరిగిందని, బాధ్యత గల ప్రతిపక్షంగా అసెంబ్లీలో వ్యవహరిస్తామని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు డీఎంకే దళపతి స్టాలిన్ నిర్ణయించారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి కృతజ్ఞతలు తెలుపుకోనున్నారు. ఓటమి చవిచూసిన డీఎంకే కార్యదర్శులు, జిల్లాలో ఓటమికి బాధ్యత వహిస్తూ మరికొందరు పార్టీ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డట్టుంది. ఇందుకు అద్దం పట్టే రీతిలో తిరుప్పూర్ ఉత్తరం జిల్లా కార్యదర్శి సెల్వరాజ్ పదవికి రాజీనామా చేశారు. -
టీవీ సీరియల్కు స్క్రిప్టు రాస్తున్న కరుణ
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి 92 ఏళ్ల వయసులోనూ తన కలానికి పదును పెడుతున్నారు. ఆయన 11వ శతాబ్దికి చెందిన వైష్టవభక్తుడు రామానుజాచార్యుల జీవితంపై ప్రసారమవుతున్న మెగా టీవీ సీరియల్కు స్క్రిప్టు రాస్తున్నారు. ఈ సీరియల్ ఈ నెల 3నుంచి కలైంజర్ టీవీ చానల్లో ప్రారంభమైంది. 75 ఏళ్లుగా తమిళ సినిమాలకు, నాటకాలకు స్క్రిప్టులు సమకూరుస్తున్న కరుణ తన రచనా వ్యాసంగంపై తన అనుభవాలను ఇటీవల ఓ వ్యాసంలో వెల్లడించారు. ‘‘1942లో ద్రవిడనాడు అనే పత్రికలో నా తొలి వ్యాసం అచ్చయింది. డీకెంకే వ్యవస్థాపకుడు అన్నాదురై దీన్ని చదవి నన్ను చూడాలనుకున్నారు. నన్ను చూశాక రచయిత ఇంత చిన్న కుర్రాడా?’ అని ఆశ్చర్యపోయారు’’ అని తెలిపారు.