breaking news
diad
-
కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక..
బయ్యారం: కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక ఒక విద్యార్థి బల వన్మరణానికి పాల్ప డ్డాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని కాకతీయనగర్లో సోమవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. కాకతీయనగర్లో నివసించే అజ్మీరా అనంతరాములు కుమారుడు సాయిమహేశ్(19) సిద్దిపేటలోని ఒక కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజియోథెరపీ చదువుతున్నాడు.హోలీ సందర్భంగా ఇంటికి వచ్చిన సాయిమహేశ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టం లేక.. ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్కర ఘాట్లో వృద్ధురాలి మృతి
కొవ్వూరు: పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు పుణ్యలోకాలకు వెళ్లిన సంఘటన కొవ్వూరులోని గౌతమి ఘాట్ లో శుక్రవారం సంభవించింది. నెల్లూరు జిల్లా మూలపేటకు చెందిన భాగ్యమ్మ (71) అనే వృద్ధురాలు శుక్రవారం పుష్కర స్నానంచేసి బయటికి వస్తుండగా స్పృహ కోల్పోయింది. గమనించి తొటి భక్తులు భాగ్యమ్మను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. పోలీసులు ఆమె బంధువులకు సమాచారం అందించారు.