-
సేద్య స్వేదంలోనూ ఆమె సగం!
⇒ వ్యవసాయ యంత్ర పరికరాలపై మహిళా రైతులకు ఉచిత శిక్షణ ⇒ రైతులు, సాంకేతిక విద్యార్థులతోపాటు గ్రామీణ ఆవిష్కర్తలకూ అవకాశం ⇒ అనంతపురం జిల్లాలో కేంద్ర వ్యవసాయ శాఖ ప్రాంతీయ శిక్షణా సంస్థ సేవలు విత్తనం దగ్గరి నుంచి పంట కోత వరకు పొలంలో జరిగే ప్రతి పనిలోనూ మహిళా రైతుల చెమట చిందాల్సిందే. బురదలో రోజంతా నాట్లు వేసినా, కలుపు తీసినా, ప్రతి మొక్క పాదులో ఎరువులు వేసినా, ఒడుపుగా కోత కోసినా, నూర్పిడి చేసినా పంట సిరులను బస్తాలకు, గాదెలకు నింపే వరకు.. అంతేనా కోత అనంతర పనుల్లోనూ.. పంట దిగుబడుల నిండా గ్రామీణ మహిళా శ్రామికుల కాయకష్టం దాగి ఉంటుంది. మన దేశంలో ఉత్పత్తయ్యే ప్రతి అన్నం ముద్దలోనూ, ప్రతి పండులోనూ, పితికే పాల చుక్కలోనూ అణువణువునా ఆమె అలుపెరగని శ్రమ నిక్షిప్తమయ్యే ఉంటుంది! ఇంత చేసినా ఆమెకు రైతుగా గుర్తింపే లేదు. అంతెందుకు.. చాకిరీని తగ్గించి, వ్యవసాయ పనిని సులభతరం చేసే పరికరాలు లేకపోలేదు. అయితే, ఆమె కోసమే తయారైన వ్యవసాయ పరికరాలకే కాదు.. అసలు అలాంటి అవసరం ఒకటి ఉందన్న స్పృహ కూడా అంతంత మాత్రంగానే ఉందంటే అతిశయోక్తి కాదు!! గుడ్డిలో మెల్ల ఏమిటంటే.. రైతులకు ఉపకరించే యంత్రాలు, పరికరాల ఎంపిక, వినియోగం, యాజమాన్యంపై శిక్షణనిచ్చే ప్రభుత్వ సంస్థ దక్షిణాదిలో 7 రాష్ట్రాలకు గాను ఒకటి ఉంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె(ట్రాక్టర్ నగర్)లోని 500 ఎకరాల్లో ఏర్పాటైన ఈ సంస్థ పేరు ‘దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రాల శిక్షణ – పరీక్షణ సంస్థ’ (ఎస్.ఆర్.ఎఫ్.ఎం.టి.టి.ఐ.). కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఇది పనిచేస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు తయారు చేసే వ్యవసాయ యంత్రాలు, యంత్ర పరికరాలను పరీక్షించి. వాటి బాగోగులను నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధృవీకరించే అధికారం ఉంది. ధృవీకరణ పొందిన వ్యవసాయ యంత్రాలు, పరికరాలకు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీ వస్తుంది. ఎస్.ఆర్.ఎఫ్.ఎం.టి.టి.ఐ. డైరెక్టర్ డా. పి. పి. రావు ‘సాక్షి’తో చెప్పిన సమాచారం ఇదీ.. యంత్ర పరికరాలపై రైతుల కోసం 10 కోర్సులు.. వ్యవసాయ యంత్రాలు, యంత్ర పరికరాల వినియోగం, నిర్వహణపై మహిళా, పురుష రైతులకు ఉపయోగపడే 10 రకాల కోర్సులను ఎస్.ఆర్.ఎఫ్. ఎం.టి.టి.ఐ. సంస్థ నిర్వహిస్తున్నది. ఇందులో మహిళా రైతులకు వ్యవసాయ పరికరాలపై 3 రోజుల ప్రత్యేక కోర్సు ఉంది. దీనితోపాటు.. పురుషులు లేదా మహిళా రైతులు ఎవరైనా శిక్షణ పొందడానికి అనువైన (వారం నుంచి 6 వారాల) కోర్సులు మరో 9 రకాలు ఉన్నాయి. ఇవి కాకుండా.. ఐటిఐ, ఒకేషనల్, వ్యవసాయ పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివే (మహిళ, పురుష) విద్యార్థులకు శిక్షణా కోర్సులు ఉన్నాయి. మహిళా రైతులకు 3 రోజుల శిక్షణ వ్యవసాయ యంత్రాలు, పరికరాలను భయం లేకుండా, జాగ్రత్తగా వినియోగించడం, వాటి నిర్వహణలో మెళకువలను మహిళా రైతులకు నేర్పించేందుకు గార్లదిన్నెలోని ఎస్.ఆర్.ఎఫ్.ఎం.టి.టి.ఐ. 3 రోజుల ప్రత్యేక ఉచిత శిక్షణా కోర్సును నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఆవరణలోనే ఉన్న హాస్టల్లోనే ఉండి శిక్షణ పొందవచ్చు. కనీసం 8వ తరగతి చదివి, 18 ఏళ్లు నిండిన మహిళా రైతులకు ఉద్దేశించిన శిక్షణా కార్యక్రమం ఇదొక్కటే. మహిళా రైతులకు ఏయే అంశాలపై శిక్షణ ఇస్తారు? నిలబడి సులువుగా కలుపు తీసే యంత్రపరికరాలు, వరినాట్లు వేసే యంత్రం, స్ప్రేయర్లు, వేరుశనగ విత్తనాలు ఒలిచే యంత్రం, విత్తనాన్ని శుద్ధిచేసే జల్లెడను వినియోగించడం, బస్తాలో ధాన్యం నింపేందుకు పట్టి ఉంచే పరికరం, మొక్కజొన్న/పొద్దుతిరుగుడు నూర్పిడి యంత్రాలు, కొబ్బరి చెట్ల పైకి సులభంగా ఎక్కడానికి వీలయ్యే పరికరం, టెంకాయ పీచు ఒలిచే యంత్రం, ఎరువులు చల్లే పరికరం, కాయలు సులువుగా కోసే పరికరం, బెండకాయలను కోసే పరికరం, ఉద్యాన తోటల్లో ఉపయోగించే పరికరాలు.. వంటి వాటిపై మహిళా రైతులకు తెలుగులోనే అనుభవజ్ఞులైన మహిళా ఇన్స్ట్రక్టర్లు శిక్షణ ఇస్తారు. గ్రామీణ ఆవిష్కర్తలకూ అవకాశం.. మహిళా, పురుష రైతులతోపాటు వ్యవసాయ యంత్రాలు కలిగి ఉన్న వారు.. ఎటువంటి సాంకేతిక విద్య లేకపోయినా (కనీసం 8వ తరగతి చదివి) తమకున్న సొంత జ్ఞానంతో వినూత్న వ్యవసాయ యంత్రపరికరాలను ఆవిష్కరిస్తున్న గ్రామీణులు సైతం ఈ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చు. రైతులకు మరో 9 కోర్సులు.. 18 ఏళ్లు నిండి కనీసం 8వ తరగతి చదివిన మహిళా లేదా పురుష రైతులు ఎవరైనా శిక్షణ పొందడానికి వీలున్న 9 కోర్సులు కూడా గార్లదిన్నెలోని ఎస్.ఆర్.ఎఫ్.ఎం.టి.టి.ఐ.లో ఉన్నాయి. అవి: ► వ్యవసాయంలో శక్తి వినియోగం – 4 వారాలు ∙వివిధ వ్యవసాయ యంత్రాల ఎంపిక, వినియోగించే విధానం, జాగ్రత్త చర్యలు, వాటి యాజమాన్యంపై శిక్షణ – 6 వారాలు ∙పవర్ టిల్లర్ను నడపటం, వాటి యాజమాన్యంపై శిక్షణ – 2 వారాలు ∙బిందు – తుంపర్ల సేద్య పరికరాల వినియోగం, యాజమాన్యంపై శిక్షణ – ఒక వారం ∙సస్య రక్షణా పరికరాల ఎంపిక, వాటి వినియోగ విధానంపై శిక్షణ – ఒక వారం ► చేతి పంపుల ఎంపిక, వాటి వినియోగం, యాజమాన్యంపై శిక్షణ– 2 వారాలు ∙మెట్ట సేద్య వ్యవసాయ యంత్రాల ఎంపిక, వాటి నిర్వహణ, యాజమాన్యంపై శిక్షణ – 2 వారాలు ∙పప్పుధాన్యాలు, నూనెగింజ పంటల ఉత్పత్తిలో వినియోగించే యంత్రాలపై శిక్షణ – ఒక వారం ► వరి సాగులో ఉపయోగించే వివిధ రకాల యంత్రాలపై శిక్షణ – ఒక వారం ఉపకార వేతనం, చార్జీలు.. హాస్టల్లో ఉండి శిక్షణ పొందే మహిళా/పురుష రైతులకు రోజుకు ప్రతి ఒక్కరికీ రూ.175 ఉపకార వేతనం, ప్రయాణ చార్జీలు చెల్లిస్తారు. సర్టిఫికెట్లు ఇస్తారు. రైతులు దరఖాస్తు చేసే విధానం : దరఖాస్తు ఫారాలను సంస్థ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని, పూర్తిచేసి ఈ కింద పేర్కొన్న చిరునామాకు పోస్టు ద్వారా పంపవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలకు తగిన ప్రమాణ పత్రాలను జత పరిచి సంస్థ చిరునామాకు పంపాలి. ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారు ఏయే తేదీల్లో శిక్షణకు రావాల్సిందీ సంస్థ తెలియపరుస్తుంది. ఇతర వివరాలకు.. డైరెక్టర్, దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రాల శిక్షణ – పరీక్షణ సంస్థ టాక్టర్ నగర్, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఫోన్ : 08551–286441 E-mail: fmti-sr@nic.in ::: website: www.dacnet.nic.in/srfmtti – జెన్నె ఆదినారాయణ, సాక్షి, గార్లదిన్నె, అనంతపురం జిల్లా మహిళలకు అనుకూలమైన పరికరాలను రూపొందించాలి..! వ్యవసాయంలో స్త్రీ, పురుషుల మధ్య స్పష్టమైన శ్రమ విభజన జరిగిందని ఇప్పటికే అందరూ గుర్తించారు. మహిళలు పంటల సాగు పనుల్లోనూ పంట కోసిన తర్వాతా అనేక అత్యంత శ్రమ భారం గల పనులు చేస్తున్నారు. మహిళలకు అనుకూలంగా వుండి, వారి శ్రమను తగ్గించి, సమయాన్ని ఆదా చేసి వ్యవసాయోత్పత్తిని పెంచే పరికరాలను రూపొందించి ప్రోత్సహించాలి. ఈ పరికరాలను ఉపయోగించటంలో మహిళా రైతులకు నైపుణ్యాన్ని పెంచే శిక్షణ ఇవ్వటంపై దృష్టిని కేంద్రీకరించాలి. మహిళలకు అనుకూలంగా ఉండే యంత్ర పరికరాలను సమకూర్చే కేంద్రాలను నడపడానికి మహిళా శ్రామికులకు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. మహిళా రైతుల గుర్తింపు, సాధికారిత, మద్దతు వ్యవస్థలు కల్పించడం వంటి హక్కుల సాధన ప్రక్రియలో ఈ చర్యలు ఎంతో కీలకమైనవి. – గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ వుమెన్, తార్నాక, సికింద్రాబాద్ www.makaam.in; mahilakisan.makaam@gmail.com మహిళా రైతులంటే ఎవరు? మన దేశంలో మహిళా శ్రామికులు అత్యధికంగా వ్యవసాయ రంగంలోనే పనిచేస్తున్నారు. సాగులో ఉన్న ఏ ఎకరం పొలంలోనైనా పురుషుల కంటే మహిళలు పని చేసే రోజులే ఎక్కువ. వ్యవసాయం గిట్టుబాటు కాక పురుషులు వేరే పనులు వెదుక్కుంటూ వలస పోయినప్పుడు లేదా వ్యవసాయ కుటుంబాల్లో పురుషులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు / చనిపోయినప్పుడు వ్యవసాయ భారాన్ని రైతు కుటుంబాల్లోని మహిళలే పూర్తిగా భుజానికెత్టున్నారు. అందువల్ల మన దేశ వ్యవసాయానికి మహిళా రైతులే వెన్నెముక అంటే అతిశయోక్తి బొత్తిగా లేదు. అయితే, వ్యవసాయ రంగంలో మహిళలు చేస్తున్న అపారమైన కృషికి అటు సమాజం నుంచి కానీ, ఇటు ప్రభుత్వం నుంచి కానీ గుర్తింపు లేకుండా పోతున్నది. వారిని కనీసం రైతులుగా గుర్తించడం లేదు. ఇంతకీ మహిళా రైతులంటే ఎవరు? తమ పేరున రిజిస్టరైన సొంత భూమిలో పంటలు సాగు చేస్తున్న మహిళలు, తమ కుటుంబ పొలాల్లో పనిచేస్తున్న మహిళలు, కౌలు భూమిని సాగు చేస్తున్న మహిళలు, అడవులపై ఆధారపడి జీవిస్తున్న మహిళలు, పశుపోషణతో జీవనం సాగిస్తున్న మహిళలు, వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్న మహిళా కూలీలు.. వీళ్లందరూ మహిళా రైతులేనని జాతీయ రైతుల విధానం (2007) నిర్వచించింది. -
ఫెర్టిలైజర్ షాపులపై విజిలెన్స్ దాడులు
► ఒక షాపుపై 6ఏ కేసు నమోదు ►రూ.21.1 లక్షల బయో అమ్మకాలు నిలిపివేత చీరాల టౌన్ : చీరాల పట్టణం, మండలంలో ఉన్న ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై మంగళవారం ఒంగోలు విజిలెన్స్ డీఎస్పీ ఈ.సుప్రజ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకువిజిలెన్స్, వ్యవసాయశాఖ సహకారంతో నిర్వహించిన ఈ దాడుల్లో పలు లోపాలను గుర్తించామని డీఎస్పీ తెలిపారు. పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర, సుభాషిణి, అన్నపూర్ణ, ఆర్కే, బాలాజీ, వెంకటేశ్వర ఫెర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి అనుమతి పత్రాలు, స్టాక్ రిజిస్టర్లు, ’ఓ’ ఫారం తదితర లావాదేవీలను పరిశీలించారు. పట్టణంలోని బాలాజీ ఫెర్టిలైజర్ దుకాణంలో నిబంధనలకు విరుద్ధంగా రూ.21.1 లక్షల విలువ కలిగిన బయో ఉత్పత్తులు కలిగి ఉండటంతో పాటు వీటి అమ్మకాలను నిలిపివేయడంతో, వాటిని అమ్మకూడదని దుకాణదారుడిని హెచ్చరించారు. అలానే ఆర్కే ఫెర్టిలైజర్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా ఎరువులు కలిగి ఉండటంతో షాపు నిర్వాహకుడిపై 6 ఏ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స డీఎస్పీ సుప్రజ విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున సర్టిఫైడ్ కంపెనీకి చెందిన ఎరువులు, పురుగు మందులే విక్రరుుంచి రైతులకు అన్ని రకాల బిల్లులు ఇవ్వాలన్నారు. అరుుతే, కొందరు పురుగు మందుల విక్రయదారులు నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా, స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకుండా బయో ఉత్పత్తులను అమ్మకాలు చేస్తున్నారని తమ పరిశీలనలో తేలిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తున్న స్టాక్ను సీజ్ చేయడంతో పాటు అమ్మకందార్లపై కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నివేదికలను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఈ తనిఖీల్లో వ్యవసాయశాఖ ఏడీఏ కె.రాజకుమారి, ఏవో ఫాతిమాబేగం, విజిలెన్స సీఐ నాయక్, ఎస్సై సాంబయ్య, డీసీటీవో నవీన్, ఎఫ్ఆర్వో బాబు, వీఆర్వోలు శివారెడ్డి, రాంబాబు ఉన్నారు. -
పాత నోట్లతో అన్నదాతల్లో అయోమయం
► రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవద్దంటూ మళ్లీ ఆదేశాలు ► పాలకుల నిర్ణయాలపై రైతన్నల ఆగ్రహం ఒంగోలు టూటౌన్ : అన్నదాతకు పాత నోట్ల ఇక్కట్లు తప్పేలా లేవు. విత్తన కొనుగోలులో పాత నోట్లు తీసుకోవద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. శుక్రవారం రాత్రే ఈ ఆదేశాలు వ్యవసాయశాఖకు అందారుు. ప్రస్తుతం రబీ సీజన్లో సబ్సిడీ విత్తనాలను వ్యవసాయశాఖ సరఫరా చేస్తోంది. శనగలతో పాటు ఇతర విత్తనాలు రాయితీపై ఇస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్ల ర ద్దు నేపథ్యంలో వాటిని విత్తన సరఫరా కేంద్రాల వద్ద రైతుల నుంచి తీసుకోవడం లేదు. పది రోజులు దాటినా కొత్త నోట్లు, పాతనోట్ల కష్టాలు అందరూ అనుభవిస్తున్నారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద చాంతాడంత క్యూలతో నానాకష్టాలు పడుతున్నారు. అసలే రబీ సీజన్ రబీ సీజన్ కావడంతో పురుగుమందులు, ఎరువులు, విత్తన కొనుగోలులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత పెద్ద నోట్లు తీసుకునేది లేదని వ్యవసాయ శాఖ అధికారులు తేల్చి చెబుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పాలకుల నిర్ణయాలకు వ్యతిరేకంగా పాతనోట్లతో నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ వరకు పాతనోట్లను తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇదే ప్రకటనను వ్యవసాయశాఖ జేడీ జె.మురళీకృష్ణ కూడా పత్రికలకు విడుదల చేశారు. మళ్లీ అంతలోనే పాత నోట్లు తీసుకోవద్దంటూ శుక్రవారం రాత్రే ఉత్తర్వులు వచ్చాయని జేడీ తెలిపారు. అటు బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద కుప్పలు తెప్పలుగా మనీ కోసం పడిగాపులు కాస్తున్న వారితో పాటు అక్షర జ్ఞానం లేని ఎంతో మంది రైతులు ఉన్న పాత నోట్లు మార్చుకునే విషయంలో నానా అవస్థలు పడుతున్నారు. బ్యాంకుల్లో పాతనోట్లు ఎప్పుడు మార్చుకోవాలి? విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేదెట్ల?.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ కొత్త నోట్లు వచ్చినా.. చిల్లర సమస్యతో సతమతమవ్వాల్సి రావడం ఖాయం. కొత్త రూ.2 వేల నోట్లకు చిల్లర దొరకని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పాలకుల నిర్ణయాలపై రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి. -
215 ప్యాకెట్ల పత్తి విత్తనాల సీజ్
ఖమ్మం అర్బన్ మండలం చిమ్మపుడిలో ఎలాంటి అనుమతి లేకుండా కొందరు వ్యాపారులు వీధుల్లో, రైతుల ఇళ్ల వద్ద పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తుండగా, వ్యవసాయ శాఖ ఏడీ కొంగర వెంకటేశ్వరరావు, ఏఓ అరుణ శుక్రవారం అడ్డుకున్నారు. గుంటూరు నుంచి తీసుకొచ్చి బయటి మార్కెట్ కంటే రూ.40 తగ్గించి జాదు, ఏటీఎం, అజిత్, తదితర పేర్లతో ఉన్న 75 ప్యాకెట్లను రైతులకు అమ్మినట్లు గుర్తించారు. అందుబాటులో ఉన్న 215 ప్యాకెట్లను సీజ్ చేశారు. వ్యాపారులు ఉన్నం నాగేశ్వరరావు, కుసు అనిల్, కొంటెముక్కల నిఖిల్లపై కేసు నమోదు చేశారు. ఈ విత్తనాల నాణ్యత పరీక్షించేందుకు ల్యాబ్కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఖరీఫ్కు ఎరువులు, విత్తనాలు సిద్ధం
-వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శిని వెల్లడి నర్సాపూర్ రూరల్ వచ్చే ఖరీఫ్ కోసం ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచామని వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శిని తెలిపారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా నర్సాపూర్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సారి వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఖరీఫ్ నాటికి రైతులను సమాయత్తం చేసేందుకు ‘మన తెలంగాణ- మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మూడు ఎకరాల్లో పాలీహౌస్ ఏర్పాటు చేసుకున్న ఓసీ రైతులకు 80శాతం, బీసీలకు 90శాతం, ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ ఇస్తున్నట్టు తెలిపారు. 12 ఎకరాల వరకు డ్రిప్పై సబ్సిడీ ఇస్తున్నామన్నారు. రైతులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందజేస్తున్నామని తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement