-
ఈ–టూవీలర్ల కోసం రేస్ఎనర్జీ, హాలా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ సంస్థ రేస్ఎనర్జీ, రైడ్ షేరింగ్ ప్లాట్ఫామ్ హాలా మొబిలిటీ తాజాగా జట్టు కట్టాయి. దేశవ్యాప్తంగా 2,000 పైచిలుకు ఎలక్ట్రిక్ టూ–వీలర్లను డెలివరీ సర్వీసుల కోసం వినియోగంలోకి తేనున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి తొలి దశ కింద కొన్ని వాహనాలు వినియోగంలోకి రానున్నట్లు సంస్థలు తెలిపాయి. విస్తృతమైన రేస్ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ .. తమ మార్కెట్, కస్టమర్ల బేస్ను మరింతగా పెంచుకునేందుకు సహాయకరంగా ఉండగలదని హాలా మొబిలిటీ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ఈ–ఆటో మార్కెట్లో తాము పటిష్టంగా ఉన్నామని, హాలాతో జట్టు కట్టడం ద్వారా మిగతా విభాగాల్లోకి కూడా గణనీయంగా విస్తరించగలమని రేస్ఎనర్జీ సహవ్యవస్థాపకుడు, సీఈవో అరుణ్ శ్రేయాస్ పేర్కొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన కాన్పులు
జూలూరుపాడు: కేసీఆర్ కిట్ల పంపిణీ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని మాతాశిశు సంక్షేమ జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ రామ్కుమార్ అన్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయన్నారు. మంగళవారం స్థానిక పీహెచ్సీని ఆయన సందర్శించారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రిలో జరిగిన కాన్పుల వివరాలను స్థానిక మెడికల్ ఆఫీసర్ ఎస్.గీతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, వైద్యసిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కార్పొరేట్స్థాయి వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూలూరుపాడు పీహెచ్సీకి 35 కేసీఆర్ కిట్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు 25 కిట్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సువర్ణ, మాస్ మీడియా ఆఫీసర్ చంద్రశేఖర్, మెడికల్ ఆఫీసర్ ఎస్.గీత, డాక్టర్ శ్రీధర్, సీహెచ్ఓ పాపయ్య, హెడ్నర్సు శశికళాదేవీ, స్టాఫ్నర్సు సునీత తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు
థియేటర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలు సత్ఫలితాలిస్తున్న జననీ సురక్ష యోజన పెరుగుతున్న ఆపరేషన్లు ఈ ఏడాది జిల్లాలో మొత్తం ప్రసవాలు 5561 ప్రసూతి ఆపరేషన్లు 2891 కరీంనగర్ హెల్త్ : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి ఆపరేషన్ల సంఖ్య పెరుగుతోంది. సాధారణ ప్రసవాలతో సమానంగా ఆపరేషన్ ప్రసవాలు జరుగుతున్నాయి. దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేస్తుండడంతో సాధారణ, ఆపరేషన్ ప్రసవాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కల్పించడంతో ఆపరేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జననీ సురక్ష యోజన ద్వారా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సేవలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా తల్లీశిశువును పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తుండడం సత్ఫలితమిస్తోంది. ఆస్పత్రుల ఆధునీకీకరణతో.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకీకరించడంతో మరింత సత్ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాలతోపాటు ఆపరేషన్లు కూడా చేసేలా సౌకర్యాలు కల్పిస్తే శిశుమరణాలు కూడా తావులేకుండా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రితోపాటు వైద్య విధానపరిషత్ ఆధ్వర్యంలో నడిచే ఏరియా ఆస్పత్రులతోపాటు ఎనిమిది సీహె చ్సీల్లో మాత్రమే ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇతర పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్ హెల్త్సెంటర్లలో సౌకర్యాలు లేవు. జిల్లాలో ప్రధానాస్పత్రితోపాటు గోదావరిఖని, సిరిసిల్ల, జగిత్యాలలో ఏరియా ఆస్పత్రులు ఉండగా.. డీపీహెచ్ ఆధ్వర్యంలో నడిచే హుజూరాబాద్, జమ్మికుంట, సుల్తానాబాద్, కోరుట్ల కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే మెట్పల్లి, మంథని, మహదేవపూర్, పెద్దపల్లి కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో మాత్రమే ప్రసూతి ఆపరేషన్కు థియేటర్ సౌకర్యం ఉంది. జిల్లాలో మొత్తం 71ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా 28 పీహెచ్సీలు 24 గంటలపాటు సేవలు అందిస్తున్నాయి. తాజాగా జిల్లాలోని అర్బన్ హెల్త్సెంటర్లతోపాటు అన్ని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాలు నిర్వహించడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టింది. 24 గంటల పీహెచ్సీల్లో లేబర్రూమ్తోపాటు ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కల్పించి గైనకాలజిస్టును ఏర్పాటుచేస్తే మరింత మెరుగైన ప్రసూతి సేవలందే అవకాశాలున్నాయి. వీటిలో థియేటర్ ఏర్పాటుచేయడంతో ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులపై భారం తగ్గి మాతాశిశు మరణాలు తగ్గుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రసూతి ఆపరేషన్లు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2016–17 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం ప్రసవాలు 5561 జరగగా, సాధారణ ప్రసవాలు 2,670, ఆపరేషన్ ప్రసవాలు 2,891 జరిగాయి. ఏప్రిల్లో 555 ఆపరేషన్లు, మేలో 526, జూన్లో 582, జూలైలో 581, ఆగస్టులో 647 ఆపరేషన్లు జరిగాయి. 2014–15లో 6856 ఆపరేషన్లు, 2015–16లో 7261 ఆపరేషన్లు జరిగాయి. ఏటా ఈ సంఖ్య సాధారణ ప్రసవాలకు దాదాపుగా సమానంగా ఉంటోంది. థియేటర్లు, గైనకాలజిస్టులను ఏర్పాటు చేస్తే ఆపరేషన్ ప్రసవాలు మరింత పెరుగుతాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
ఇంకా తగ్గని లేఆప్స్ బెడద.. నాలుగు నెలల్లో 80 వేలమంది
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement