breaking news
Deewali Celebrations
-
దీపావళి బరిలో డ్రాగన్ హీరో.. మరో హిట్ కొడతాడా?
లవ్టుడే, డ్రాగన్ చిత్రాల విజయంతో క్రేజీ స్టార్గా ఎదిగిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ఎల్ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఒకటి. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేశ్ శివన్ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్తారు. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నటి నయనతార నిర్మిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో ఎస్జే సూర్య, యోగిబాబు, గౌరీకిషన్, షారా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రంలో సీమాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఇందులోని తీమా తీమా అనే పల్లవితో సాగే తొలి పాటను ఇటీవల విడుదల చేయగా విశేష ఆదరణ పొందింది. చిత్రం ఆడియోను వినాయక చవితి పండగ సందర్భంగా ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. అలాగే ఎల్ఐకే చిత్రాన్ని దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా ప్రదీప్ రంగనాథన్, విఘ్నేశ్ శివన్, అనిరుధ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
దీపాల పండగ వేళ.. కాంతులు పంచే తీరొక్క దివ్వెలు!
దీపాల పండగ అనగానే మనకు మట్టి ప్రమిదలే గుర్తుకువస్తాయి. కానీ, ఇప్పుడీ దివ్వెల అలంకరణలో ఎన్నో అందమైన సృజనాత్మక రూపాలు బంగారు కాంతులను విరజిమ్ముతున్నాయి. ఆ కాంతుల వెలుగుల్లో ఆనందాల దీపావళి మరింత అలంకారంగా, రంగుల హరివిల్లుగా మన కళ్లను కట్టిపడేస్తుంది. ప్రమిదలకు ఆభరణాల సొగసును అద్ది, కాంతిని గ్లాసుల్లో నింపి, కుండల్లో మెరిపించి, ఆరోగ్యాన్ని పంచి, రంగులను వెదజల్లేలా ఈ దీపావళిని ఓ అందమైన కథలా మరింత అర్థవంతంగా జరుపుకోవచ్చు. ఆభరణాల వెలుగు: మట్టి ప్రమిదలకు న చ్చిన పెయింట్ వేసి, వాటికి పూసల హారాలను గమ్తో అతికించి జిలుగు పూల కాంతులను పూయించవచ్చు. కొన్నేళ్లుగా వస్తున్న ఈ ప్రమిదల అలంకరణ ప్రతి యేటా కొత్తదనాన్ని నింపుతూనే ఉంది. అలంకరణలో ఎన్నో ప్రయోగాలు చేయిస్తోంది. మగ్గం వర్క్లో ఉపయోగించే మెటీరియల్తో ప్రమిదలను అందంగా అలంకరించవచ్చు. గ్లాస్లో కాంతి: ప్లెయిన్గానూ, క్లాస్గాను ఉండే గ్లాస్ కాంతి ఇంటికి, కంటికి కొత్త వెలుతురును తీసుకువస్తుంది. కొన్ని గులాబీ పూల రేకులను ప్లేట్లో పరిచి, గ్లాస్లో క్యాండిల్ అమర్చి వెలిగిస్తే చాలు కార్నర్ ప్లేస్లు, టేబుల్, టీపాయ్పైన ఈ తరహా అలంకరణ చూపులను ఇట్టే ఆకర్షిస్తుంది. పండగల కళను రెట్టింపు చేస్తుంది. చిట్టి కుండల గట్టి కాంతి: కుండల దొంతర్లు దీపావళి పండగ వేళ ఐశ్వర్యానికి ప్రతీకగా ఉపయోగిస్తారు. ఎక్కువ సేపు దీపాలు వెలగడానికి, డెకొరేటివ్ పాట్ క్యాండిల్స్ను ఉపయోగించవచ్చు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు అనుకునేవారు చిట్టి చిట్టి కుండలు కొనుగోలు చేసి, నచ్చిన అలంకారం చేసుకొని, వాటిలో మైనం నింపి దీపం వత్తితో వెలిగించుకోవచ్చు. లేదంటే కుండల మీద ప్రమిదలు పెట్టి, మరొక అలంకారం చేయచ్చు. ఆరోగ్యకాంతి: ఇది గ్లాస్ అలంకారమే. పానీయాలు సేవించే గాజు గ్లాస్లో నిమ్మ, ఆరెంజ్ తొనలు, పుదీనా ఆకులు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క ముక్కలు వేసి, ఆపైన సగానికి పైగా నీళ్లు పోసి, ఫ్లోటెడ్ క్యాండిల్ను వేసి వెలిగించవచ్చు. ఈ కాంతి చుట్టూ కొన్ని పరిమళలాను వెదజల్లుతుంది. హెర్బల్స్ నుంచి వచ్చే ఆ సువాసన ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. ఇంద్రధనస్సు కాంతి: ఎరుపు, పసుపు, నీలం .. ఇంద్రధనుస్సు కాంతులు ఇంట్లో వెదజల్లాలంటే రంగురంగుల గాజు గ్లాసులను తీసుకోండి. వాటిల్లో ఫ్లోటెడ్ క్యాండిల్స్ అమర్చి, వెలిగించండి. చీకటి వేల వేళ రంగులు పూయిస్తాయి ఈ కాంతులు. కథ చెప్పే కాంతి: దీపావళి వేళ తోరణాలుగా ఎలక్ట్రిక్ దీపాలను చాలా మంది ఉపయోగిస్తుంటారు. వాటిని చాలా మంది గుమ్మాలకు వేలాడదీస్తుంటారు. దీనినే కొంచెం సృజనాత్మకంగా ఆలోచిస్తే ఓ కొత్త దీపాల వెలుగులను ఇంటికి తీసుకురావచ్చు. ఒక గాజు ఫ్లవర్వేజ్ లేదా వెడల్పాటి గాజు పాత్ర తీసుకొని అడుగున పచ్చ రంగు అద్దిన స్పాంజ్ ముక్కలను పరిచి, ఆ పైన ఎలక్ట్రిక్ బల్పులు గొలుసు, మధ్యన పూల కాంబినేషన్తో ఓ అందమైన లోకాన్ని నట్టింట్లో సృష్టించిన అనుభూతిని పొందవచ్చు. చదవండి: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..! -
దీపావళి వేడుకలకు రండి: గవర్నర్ ఆహ్వానం
దీపావళి పండుగ సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు రాజభవన్కు రావాల్సిందిగా పౌరులను గవర్నర్ దంపతులు ఆహ్వానించారు. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రాజభవన్లోని దర్బార్ హాల్లో గవర్నర్ దంపతులు అందుబాటులో ఉంటారు. కేసీఆర్ శుభాకాంక్షలు దీపావళి పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. కారుచీకట్లను తరిమికొట్టి వెలుగులు నింపే దీపావళి లాగానే తెలంగాణ ప్రజల జీవితాల్లో కూడా కొత్త వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల వారికి దీపావళి శుభాలను తీసుకురావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలుగువారి జీవితాల్లో కాంతులు నింపాలి వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు.. పండుగ వ్యయంలో కొంత తుపాను బాధితులకు కేటాయించాలని వినతి వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో కాంతులు నింపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఆయన బుధవారం ఒక ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ దివ్వెల వెలుగుల్లో జరగాలని, అదే సమయంలో.. హుదూద్ తుపాను వల్ల తీవ్ర నష్టానికి గురైన ఉత్తరాంధ్రకు సాయం అందించటానికి పండుగకు చేసే వ్యయంలో కొంత భాగాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీపావళి శుభాకాంక్షలు: కేవీ రమణాచారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి బుధవారం ఒక ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ, తెలంగాణతోపాటు యావత్తు తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.