breaking news
Creeks
-
తడిసి ముద్దయిన తూర్పు
మొన్నటి వరకూ పగటివేళ నిప్పులు చెరిగిన ఆకాశం.. ఇప్పుడు పగలూరాత్రీ తేడా లేకుండా నీటిధారలు కురిపిస్తోంది. మొన్నటి వరకూ వడగాలి జడిపిస్తే.. ఇప్పుడు జడివాన వణికిస్తోంది. వరుసగా రెండోరోజూ కురిసిన వర్షంతో జిల్లా తడిసి ముద్దవుతోంది. పిఠాపురం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా అంతటా వానలు పడుతూనే ఉన్నారుు. ఓ వైపు కడలి అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండగా, మరోవైపు కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నారుు. పలుచోట్ల జనజీవనానికి అంతరాయం కలిగే స్థారుులో వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ, కోనపాపపేట, సఖినేటిపల్లి మండలం అంతర్వేది తదితర ప్రాంతాల్లో కడలి అలలు విరుచుకుపడడంతో తీరం కోతకు గురవుతోంది. కాకినాడ- ఉప్పాడ బీచ్రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సముద్రంలో చేపల వేటపై తాత్కాలిక నిషేధం విధించిన అధికారులు చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసారు. జిల్లావ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాలలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలతో పాటు పలు పట్టణాల్లో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. డ్రెరుునేజీ వ్యవస్థ లోపభూరుుష్టంగా ఉండడంతో మురుగుకాలువల్లోని రోడ్ల పైకి పొర్లింది. సామర్లకోట, కాకినాడ తదితర ప్రాంతాలలో బస్స్టేషన్లు నీట మునిగాయి. కొత్తపల్లి, పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లలోకి నీరు చేరడంతో రికార్డులు భద్రపరచడానికిపోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఈదురు గాలులకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో అనేక గ్రామాలు శుక్రవారం రాత్రి చీకట్లో మగ్గుతున్నాయి. ఏజెన్సీలో భారీ వర్షం కారణంగా కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తూ రహదారులను ముంచెత్తారుు. ఈ కారణంగా అనేక చోట్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయూరుు. వర్షం కారణంగా కొన్ని చోట్ల అపరాలు, కూరగాయల పంటలు దెబ్బ తిన్నారుు. మొలకెత్తుతూ ఉన్న నారుమడులకు కూడా ఈ వర్షం నష్టమేనని రైతులు అంటున్నారు. కాగా వర్షం కొన్ని రకాల వాణిజ్యపంటలకు మేలేనంటున్నారు. -
కుండపోత
బంగళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లావ్యాప్తంగా వర్షాలు పడుతున్నారుు. శుక్రవారం పలు చోట్ల ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురిసింది. భారీ వర్షాలకు రహదారులు జలమయమయ్యూరుు. ప్రయూణికులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల రాకపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . - భీమవరం అర్బన్/తాడేపల్లిగూడెం పొంగుతున్న వాగులు పోలవరం రూరల్ : పోలవరం మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాపికొండల సమీపంలో కొండలపై కురుస్తున్న వర్షాలకు శుక్రవారం కొండవాగులు పొంగి ప్రవహించాయి. గుంజవరం గ్రామ సమీపంలో కొండకాలువ ఉధృతంగా ప్రవహించడంతో క్రమేపీ చెరువులో నీరు చేరుతుంది. మండలంలో అతిపెద్ద చెరువైన కొత్తూరు చెరువుకు రామన్నపాలెం సమీపంలోని కాలువ ద్వారా నీరు చేరుతోంది. చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో రైతులు ఆకుమడి వేసేందుకు సిద్ధమవుతున్నారు. వాయుగుండంగా మారిన అల్పపీడనం ఏలూరు : జిల్లాలో ఎడతెరిపినివ్వకుండా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం 11 గంటల నుంచి జిల్లావ్యాప్తంగా చిరుజల్లులతో వర్షం ప్రారంభమై మధ్యలో విరామం ఇస్తూ రాత్రి వ రకు చెదురుమదురుగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. మెట్టప్రాంతం అయిన పోలవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలో గురువారం నుంచి వరుణుడి కరుణ మొదలైంది. దీంతో ఇక్కడ కూడా రైతులు పొలాలు దుక్కిదున్నుతూ కనిపించారు. నైరుతీ రుతుపవనాలు పుంజుకున్న నేపథ్యంలో అల్పపీడనం వాయుగుండంగా మారటంతో శనివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తొలకరి జల్లులు ఊపందుకోవడంతో రైతుల పొలాలు దుక్కిదున్నటం ముమ్మరం చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే జిల్లాలో 28.5 మిల్లీమీటర్లు సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వేలేరుపాడులో 56.9 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. సాధారణ వ ర్షపాతం 75.8 మిల్లీమీటర్లు వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 165.8 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. మొత్తం మీద 118.7 మిల్లీమీటర్లు అధికంగా కురిసింది. వ్యవసాయ పరంగా ఈ వర్షం ఎంతో మేలు చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. మండలాల వారీగా వర్షపాతం ఇలా.. జీలుగుమిల్లిలో 24.6, బుట్టాయగూడెంలో 61.2, పోలవరంలో 31.3, తాళ్లపూడిలో 43.8, గోపాలపురంలో 33.5, కొయ్యలగూడెంలో 40.4,జంగారెడ్డిగూడెంలో 41.8, టి నర్సాపురంలో 18.2, చింతలపూడిలో 16.9, లింగపాలెంలో 14.8, కామవరపుకోటలో 27.7, ద్వారకాతిరుమలలో 21.5, నల్లజర్లలో 14.7,దేవరపల్లిలో 9.5, చాగల్లు 37.1, కొవ్వూరులో 35.9,నిడదవోలులో 17.0, తాడేపల్లిగూడెంలో 21.9, ఉంగుటూరులో 19.1, భీమడోలులో 24.2, పెదవేగిలో 7.7, పెదపాడులో 16.6, ఏలూరులో 12.6, దెందులూరులో 23.7, నిడమర్రులో 26.8, గణపవరంలో 19.3, పెంటపాడులో 35.7, తణుకులో 28.7,ఉండ్రాజవరంలో 34.9, పెరవలిలో 33.0, ఇరగవరంలో 34.2, అత్తిలిలో 36.4, ఉండిలో 25.4, ఆకివీడులో 40.2, కాళ్లలో 39.8,భీమవరంలో 26.5, పాలకోడేరులో 24.4, వీరవాసరంలో 26.2, పెనుమంట్రలో 19.6,పెనుగొండలో 31.3, ఆచంటలో 42.4, పోడూరులో 35.4, పాలకొల్లులో 24.7,యలమంచిలిలో 24.6,నర్సాపురంలో 14.1, మొగల్తూరులో 17.1, కుకునూరులో 53.2, వేలేరుపాడు మండలంలో 56.9 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.