breaking news
controversial questions
-
ఇందులో తక్కువ కులం ఏది? ప్రశ్నాపత్రంపై తీవ్ర దుమారం
చెన్నై: తమిళనాడు పెరియార్ యూనివర్సిటీ పరీక్షల్లో ఓ ప్రశ్నాపత్రంలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం తీవ్ర దుమారం రేపింది. ఎంఏ హిస్టరీ మొదటి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్ష గురువారం జరిగింది. అయితే ప్రశ్నాపత్రంలో 'కింది వాటిలో తమిళనాడుకు చెందిన తక్కువ కులం ఏది?' అనే ప్రశ్న వచ్చింది. జవాబు ఎంచుకునేందుకు నాలుగు కులాల పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. 'ఫ్రీడం మూవ్మెంట్ ఆఫ్ తమిళనాడు ఫ్రం 1800-1947' అనే సబ్జెక్టు పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ ప్రశ్న ఎదురైంది. Tamil Nadu | 1st-year MA History students of Periyar University in Salem got asked in the exam, "Which one is the lower caste that belongs to Tamil Nadu?" with 4 options mentioning different castes pic.twitter.com/kdJxQrMo5R — ANI (@ANI) July 15, 2022 అయితే పరీక్షలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం వివాదాస్పదమైంది. దీనిపై పెరియార్ యూనివర్సిటీ ఉప కులపతి జగన్నాథన్ స్పందించారు. సమాజంలో అసమానతలు రూపుమాపే దిశగా విద్యను అందించాల్సిన ప్రొఫెసర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ప్రశ్నాపత్రం తాము తయారు చేయలేదని, వేరే యూనివర్సిటీ సిబ్బంది రూపొందించారని జగన్నాథన్ తెలిపారు. క్వశ్చన్ పేపర్ లీక్ కాకూడదనే ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష జరిగే వరకు ప్రశ్నాపత్రాన్ని ఎవరూ చూడలేదని, అందులోని వివాదాస్పద ప్రశ్న గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. చదవండి: పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు.. పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..? -
అమ్మాయిలకు మంత్రి వివాదాస్పద ప్రశ్నలు
తమిళనాడు క్రీడలు, యవజన సర్వీసుల శాఖ మంత్రి సుందర్ రాజ్.. విద్యార్థినుల పట్ల అగౌరవంగా ప్రవర్తించారు. జవాబులు చెప్పడానికి ఇబ్బందికరమైనటువంటి వివాదాస్పద ప్రశ్నలను మహిళా అథ్లెట్లను అడిగారు. సుందర్ రాజ్ ఇటీవల పుదుకొట్టాయ్లోని పాఠశాలను ఆకస్మింగా సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా అథ్లెట్లతో మంత్రి మాట్లాడారు. హాకీ క్రీడాకారిణులను ఉద్దేశించి మీకు తగినన్ని లోదుస్తులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎన్ని పతకాలు గెలిచారని అడిగిన మంత్రి ఆ తర్వాత ఏ పతకం కూడా గెలవకుంటే భోజనం ఎందుకు పెట్టాలని అన్నారు. మంత్రి మరో విద్యార్థిని.. 'నీవు బరువు పెరిగావా, లేదా? నీకు భోజనం కోసం రోజు 250 రూపాయలు ఇస్తున్నాం. కాలేజీ విద్యార్థులకు నెలకు 200 రూపాయలు మాత్రమే ఇస్తున్నాం. వారి కంటే మీకే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం. మీ భోజనం కోసం మాత్రమే ఇస్తున్నాం' అని అన్నారు. మరో విద్యార్థిని దగ్గరికి వెళ్లి.. హాస్టల్లో చేరిన తర్వాత పెద్దమనిషివి అయ్యావా? అని ప్రశ్నించారు. విద్యార్థులను మంత్రి ఇలా ప్రశ్నించడం దుమారం రేపింది. అయితే తాను ఇలాంటి ప్రశ్నలను విద్యార్థులను అడగలేదని, వారిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించానని మంత్రి చెప్పారు.