breaking news
common eamcet
-
గవర్నర్తో చంద్రబాబు సమావేశం
-
గవర్నర్తో చంద్రబాబు సమావేశం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం గవర్నర్ నరసింహన్తో రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంసెట్ వివాదంపై గవర్నర్తో చర్చించనున్నట్లు సమాచారం. వీలైనంత త్వరలో ఉమ్మడి ఎంసెట్ నిర్వహణపై చంద్రబాబు ...గవర్నర్ను స్పష్టత కోరారు. కాగా ఇదే అంశంపై గవర్నర్ నరసింహన్ ...జనవరి 26న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయిన విషయం తెలిసిందే. కాగా గవర్నర్తో భేటీ అనంతరం చంద్రబాబు లేక్వ్యూ అతిథి గృహంలో ప్రజా ప్రతినిధులతో సమావేశం అవుతారు.