breaking news
color
-
ఈ సమ్మర్ కలర్ఫుల్ జ్ఞాపకంగా ఉండాలంటే..బొమ్మలు వేయాల్సిందే..!
వేసవి సెలవుల్లో చేయాల్సిన పనులెన్నో చెప్పుకున్నాం. ఇంకా కొన్నే మిగిలాయి. ముఖ్యమైనది పెయింటింగ్. పిల్లలూ... మీరు నేచురల్ పెయింటర్స్. అంటే మీరు బ్రష్ తీసుకుని ఏది గీసినా అందులో అందం ఉంటుంది. బొమ్మలు వేయడంలో చాలా విధానాలున్నాయి. బొమ్మలు వేయకుండా పిల్లలు ఉండకూడదు. ఈ సమ్మర్ను కలర్ఫుల్ జ్ఞాపకంగా మిగుల్చుకోవాలంటే కాసిన్ని బొమ్మలేసి దాచుకోవాల్సిందే.రంగులకు ఏ విలువా లేదు. కాని వాటితో వేసే రూపాలకు విలువ. పిల్లలూ... బొమ్మలు వేయడం మనిషి పుట్టుకతో వచ్చే ఒక కుతూహలం. బొమ్మలు ఎప్పటికీ రాని వాళ్లు కూడా పెన్నూ పేపర్ దొరికితే పిట్ట బొమ్మో పిల్లి బొమ్మో గీస్తారు. మన చేతుల్లో నుంచి ఒక రూపం పుట్టడం మనిషికి ఆనందం. చెట్టు వేసి దాని మీద గూడు వేసి ఆ గూటిలో పిల్లల్ని వేసి ఆ బొమ్మను చూసుకుంటే సంతోషం కలుగుతుంది. మనం బొమ్మలు ఎందుకు వేస్తామంటే మనం చూసింది, ఊహించింది రంగుల్లో నిక్షిప్తం చేసుకోవడానికి. బొమ్మలు వేయడం మంచి హాబీ. కాలక్షేపం. మీరు మంచి పెయింటర్లుగా ఎదిగితే ఆ బొమ్మలను కొనేవాళ్లు కూడా ఉంటారు. నిజం. మన దేశంలో త్యాబ్ మెహతా అనే ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆయన బొమ్మలు ఇప్పటికీ కొంటారు. ఎంతకు తెలుసా? ముప్పై కోట్లు... నలభై కోట్లు... చిన్న బొమ్మ. అంత డబ్బు. అయితే ఆ బొమ్మల్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది. మీ బొమ్మల్లో కూడా ప్రత్యేకత ఉండాలి. అది సాధన చేస్తే వస్తుంది. బొమ్మలు వేయకుండా సెలవుల్ని ముగించకూడదు. అసలు మీ అందరి దగ్గర కలర్స్, కలర్ పెన్సిల్స్, చార్కోల్స్, బ్రష్షులు తప్పకుండా ఉండాలి. వాటర్ కలర్స్తో వండర్స్ సృష్టించొచ్చు తెలుసా?చిత్రలేఖనంలో రకాలు..బొమ్మలు గీయడమంటే మీకు చాలా ఇష్టం. తెల్ల కాగితం, రంగుల పెన్సిళ్లు కనిపిస్తే ఏదో ఒకటి తోచింది గీస్తూ ఉంటారు కదా. దాన్నే మరింత నైపుణ్యంగా గీస్తే చిత్రలేఖనం మీ చేతికి వచ్చేసినట్లే. చిత్రలేఖనంలో అనేక రకాలున్నాయి. ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్, ఫిగరెటివ్ పెయింటింగ్స్, ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్, యానిమల్స్ పెయింటింగ్స్, గాడ్ పెయింటింగ్స్... ఇలా. వాటి గురించి మీరు బొమ్మలు గీసేకొద్దీ తెలుసుకుంటారు. ఇవి కాకుండా కార్టూన్లు, క్యారికేచర్లు... కూడా గీయొచ్చు. లైన్ ఆర్ట్ సాధన చేయొచ్చు. రాజా రవివర్మ, దామెర్ల రామారావు, పాకాల తిరుపతిరెడ్డి, ఎం.ఎఫ్.హుస్సేన్, ఆర్.కె.లక్ష్మణ్, బాపు, మోహన్, బాలి, చంద్ర, ఏలే లక్ష్మణ్ లాంటి అనేక మంది చిత్రకారుల బొమ్మలు మీకు నెట్లో దొరుకుతాయి. వాటిని చూసి వారిలా వేయడానికి సాధన చేస్తూ కూడా బొమ్మలు నేర్చుకోవచ్చు.చిత్రలేఖనం వల్ల లాభాలు..ఏకాగ్రత: చిత్రలేఖనమంటే రంగులతో మాత్రమే పూర్తయ్యే పని కాదు. బొమ్మ గీయాలంటే ఎంతో ఏకాగ్రత కావాలి. మనసులోని భావాలను కాగింతపై బొమ్మగా మారేందుకు ఆలోచించాలి, నిదానం పాటించాలి. అప్పుడే బొమ్మ అందంగా వస్తుంది. చిత్రలేఖనం సాధన చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు చదువు మీద దృష్టి నిలిపేందుకు తోడ్పడుతుంది.మానసికోల్లాసం: రంగులతో బొమ్మలేయడం వల్ల మానసికోల్లాసం లభిస్తుంది. ఖాళీ కాగితం మన చేతిలో రంగులమయం మారుతున్నకొద్దీ మనలో కొత్త ఉత్తేజం కలుగుతుంది. మన చేతివేళ్లు చకచకా కదిలి, బొమ్మగా రూపుదిద్దుకుంటే ఎంతో తృప్తి కలుగుతుంది. ఇదంతా చిత్రలేఖనం వల్ల సాధ్యపడుతుంది.క్రియేటివిటి: సమాజంలో రోజూ మీరు చూసే అంశాలను బొమ్మలుగా గీయాలనుకునే క్రమంలో మీలో క్రియేటివిటి పెరుగుతుంది. బొమ్మల్ని గీసే పద్ధతిలో మీదైన కొత్త విధానం ఒంటబడుతుంది. ఇది మీ మెదడును మరింత చురుగ్గా చేస్తుంది. కొత్త విషయాలు ఆలోచించేందుకు, కొత్తగా నేర్చుకునేందుకు ఉపకరిస్తుంది.గుర్తింపు: చిత్రలేఖనం లలిలకళల్లో ఒకటి. అనేకమంది చిత్రకారులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వారి చిత్రాలు నేటికీ మనకు స్ఫూర్తిని అందిస్తున్నాయి. వారి పేరును చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. మీరు చిత్రలేఖనం సాధన చేయడం ద్వారా అందరిలో గుర్తింపు పొందుతారు. మరింత పట్టు సాధించడం ద్వారా గొప్ప చిత్రకారులుగా పేరు పొందుతారు. అది మంచి భవిష్యత్తుకు తోడ్పడుతుంది. చిత్రలేఖనం ఎక్కడ నేర్చుకోవాలి?పిల్లలకు చిత్రలేఖనం నేర్పడానికి ప్రత్యేకంగా కొన్ని పాఠశాలలు, సంస్థలు ఉన్నాయి. రోజూ కొంత సమయం అక్కడికి వెళ్లి, వారి చెప్పిన పద్ధతిలో బొమ్మలు గీయడం సాధన చేయవచ్చు. చిత్రలేఖనం నేర్పేందుకు ఈ వేసవిలో కొన్ని క్యాంపులు నిర్వహిస్తుంటారు. వాటిలో చేరొచ్చు. ఆన్లైన్ ద్వారా చిత్రలేఖనం నేర్పేవారు కూడా అందుబాటులో ఉంటారు. ఆ పద్ధతిలో రోజూ సాధన చేయవచ్చు. మీకు మరింత ఆసక్తి ఉంటే సెలవుల తర్వాత కూడా దాన్ని కొనసాగించవచ్చు. (చదవండి: ఈతరంలో కొరవడుతున్న కనీస జీవన నైపుణ్యాలివే..!) -
ఈ ముద్దుగుమ్మ చీరకడితే అలా చూస్తూ ఉండాల్సిందే
-
స్టార్ డైరెక్టర్పై కమెడియన్ దారుణ కామెంట్స్.. వాళ్లను ఆ జబ్బు వదలదేమో?
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ మూవీకి ఆయనే కథను అందించారు. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించగా.. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా బేబీ జాన్ టీమ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి హాజరైంది.అయితే ఈ షోలో డైరెక్టర్ అట్లీని ఉద్దేశించిన కపిల్ శర్మ అడిగిన ప్రశ్న వివాదానికి దారితీసింది. అట్లీ కలర్ను ఉద్దేశిస్తూ వ్యంగ్యమైన ప్రశ్న వేశాడు కపిల్. మీరు ఎవరైనా స్టార్ని కలిసినప్పుడు.. మీరు అతనికి కనిపిస్తారా? అంటూ అట్లీ కలర్ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనికి అట్లీ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు.దీనికి అట్లీ మాట్లాడుతూ...'ఒక విధంగా మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా. నా మొదటి సినిమాను నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సర్కి నేను చాలా కృతజ్ఞతలు. అతను నా స్క్రిప్ట్, నా సామర్థ్యం మాత్రమే చూశాడు. అంతేకానీ నేను ఎలా ఉన్నానో ఆయన అడగలేదు. అక్కడ ఆయనకు నా కథ నచ్చింది. ప్రపంచం అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు. మీ హృదయంతో మాత్రమే స్పందించాలి. ' అంటూ కపిల్ శర్మకు ఇచ్చిపడేశాడు.అయితే ఈ ప్రశ్నపై సింగర్ చిన్మయి శ్రీపాద సైతం స్పందించింది. ఈ షో అట్లీ కలర్ గురించి కపిల్ శర్మ జోక్ చేశాడని విమర్శించింది. కామెడీ పేరుతో అతని చర్మం రంగు గురించి మాట్లాడే ఈ విపరీతమైన హేళనలను వాళ్లు ఎప్పటికీ ఆపలేరేమో? అంటూ మండిపడింది. కపిల్ శర్మ లాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను నిరాశకు గురి చేసిందని చిన్మయి ట్వీట్ చేసింది. అయితే కపిల్ కామెంట్స్ తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని పోస్ట్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Will they never stop these crass and racist jibes at his skin color in the name of ‘comedy’?Someone with the amount of influence and clout like Kapil Sharma saying something like this is disappointing and unfortunately, not surprising. https://t.co/63WjcoqHzA— Chinmayi Sripaada (@Chinmayi) December 15, 2024 -
Shehnaaz Gill: అమ్మో అమ్మాయేనా.. ఎల్లోరా శిల్పమా..! (ఫోటోలు)
-
రంగు మారనున్న గరీబ్ రథ్.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు!
అందరికీ ఏసీ కోచ్లలో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో రైల్వేశాఖ గరీబ్ రథ్ రైలును ప్రారంభించింది. ఇప్పుడు ఈ రైలులో పలు మార్పులు సంతరించుకుంటున్నాయి. బోగీల సంఖ్యను పెంచడంతోపాటు, రంగు కూడా మార్చనున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ గరీబ్ రథ్లో చోటుచేసుకోబోయే మార్పులను మీడియాకు తెలియజేశారు. బీహార్కు అనుసంధానమైన అన్ని గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లలో సీట్ల సంఖ్యను పెంచనున్నారు. ముజఫర్పూర్-ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడుస్తున్న రైలు నంబర్ 12211/12 గరీబ్రథ్ ఎక్స్ప్రెస్తో సహా బీహార్ మీదుగా వెళ్లే గరీబ్రథ్ గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లను లింక్ హాఫ్మన్ బుష్గా మార్చనున్నారు. ఈ మార్పుల తరువాత గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ 16 కోచ్లకు బదులుగా 20 కోచ్లతో నడుస్తుంది. దీంతో ఒక్కో గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లో 352 బెర్త్లు పెరగనున్నాయి. ఈ రైళ్లకు కొత్త త్రీ టైర్ ఎకానమీ కోచ్ను అనుసంధానం చేయనున్నారు. దీంతో గతంలో కంటే ఎక్కువ మంది ఒకేసారి ప్రయాణించే అవకాశం ఏర్పాడుతుంది. ఇప్పటివరకూ ఆకుపచ్చ రంగుతో విభిన్నంగా కనిపించిన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇకపై ఎరుపు రంగులో కనిపించనుంది. -
ట్విట్టర్ లో రంగు రంగుల టిక్స్..!
-
పాఠశాలకు విద్యార్థులకు వెరీ ‘గుడ్డు’.. ఇక ప్రతివారం రంగు తప్పనిసరి!
రాయవరం (అంబేడ్కర్ కోనసీమ): జగనన్న గోరుముద్ద పథకం పేరుతో పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పథకాన్ని ఎప్పటికప్పుడు పర్య_వేక్షిస్తూ అవసరమైన మార్పుల్ని చేస్తోంది. ఇపప్పటివరకు కాంట్రాక్టర్లు 10 రోజులకు ఒకసారి చొప్పున నెలకు మూడుసార్లు పాఠశాలలకు కోడి_గుడ్లు సరఫరా చేసేవారు. దీనివల్ల గుడ్ల నాణ్యత దెబ్బతింటుందన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం కోడిగుడ్ల సరఫరాలో తక్షణ మార్పులకు ఆదేశించింది. కోడిగుడ్ల నాణ్యత చెడిపోకుండా, తాజా గుడ్లు అందించేందుకు వారానికి ఒకసారి కోడిగుడ్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: చనిపోయాడనుకుని దహన సంస్కారాలు.. చిన్న కర్మ జరుపుతుండగా సతీష్ ప్రత్యక్షం.. అంతా షాక్!) కోడిగుడ్లపై స్టాంపింగ్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మధ్యాహ్న భోజనంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు ఉడికించిన కోడి_గుడ్లను అందజేస్తున్నారు. కోడిగుడ్లు అక్రమార్కుల పాలవ్వకుండా కోడిగుడ్లపై ప్రతి వారం ఒక్కో రంగు వేసి సరఫరా చేస్తున్నారు. నెలలో మొదటి వారం నీలం, 2వ వారం గులాబీ, 3వ వారం ఆకుపచ్చ, 4వ వారం వంగపువ్వు రంగులో కోడిగుడ్లపై స్టాంపింగ్ చేస్తారు. ఈ విధంగా వచ్చే కోడిగుడ్లను మాత్రమే ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో దిగుమతి చేసుకోవాల్సి ఉంది. గుడ్డు పరిమాణం తగ్గినా పాఠశాలల్లో తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు కలర్ స్టాంపింగ్తో సరఫరా అవుతున్న కోడిగుడ్లు పకడ్బందీ పరిశీలన మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పర్యవేక్షణను పెంచింది. పాఠశాల స్థాయిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీలు, గ్రామ, వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు నిత్యం పర్యవేక్షణ చేస్తారు. కోడి గుడ్ల సరఫరాకు అనుమతి పొందిన కాంట్రాక్ట్ ఏజెన్సీ నుంచి వచ్చిన గుడ్ల సైజు, కలర్ స్టాంపింగ్ ఉన్న గుడ్లు, స్టాంపింగ్ లేని గుడ్లు తదితర వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐఎంఎంస్ యాప్లో నమోదు చేయాలన్న నిబంధన విధించారు. (చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు) నాణ్యతకు పెద్ద పీట ‘విద్యార్థులకు అందించే పౌష్టికాహారం నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టర్లు నాణ్యత ఉన్న కోడిగుడ్లనే సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టింది. పాఠశాల హెచ్ఎంలు కోడిగుడ్ల ఏజెన్సీ నుంచి దిగుమతి చేసుకునే ముందు కచ్చితంగా గుడ్డు సైజు, కలర్ స్టాంపింగ్ చెక్ చేసుకోవాలి. పాడైన గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దిగుమతి చేసుకోకూడదు. – ఎన్వీ రవిసాగర్, డీఈవో, అమలాపురం -
నాణ్యతకు ఇదే సాక్షి
సాక్షి, హైదరాబాద్: సాక్షి దినపత్రిక మరో అరుదైన ఘనత సాధించింది. కలర్ఫుల్గా వెలుగులు విరజిమ్ముతూ రంగుల ముద్రణా నాణ్యతలో తనకు సాటిలేదని నిరూపించుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ కలర్ క్వాలిటీ క్లబ్ (ఐసీక్యూసీ)లో సభ్యత్వాన్ని సాధించింది. 2018–20 సంవత్సరాలకుగాను సాక్షి ఈ ఘనతను సాధిం చినట్లు వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్ (వాన్–ఇఫ్రా) శుక్రవారం ప్రకటించింది. ఐసీక్యూసీలో సభ్యత్వం కోసం సాక్షి మీడియా గ్రూప్ తెలుగు రాష్ట్రాల్లోని 22 ముద్రణా కేంద్రాల తరఫున పోటీలో పాల్గొంది. అన్ని ప్రింట్ సెంటర్లకు ఐసీక్యూసీలో విజయవంతంగా సభ్యత్వాన్ని సాధించి రికార్డు సృష్టించింది. ఒక వార్తా పత్రిక తమ ముద్రణా కేంద్రాల న్నింట్లోనూ అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించడం, ఐసీక్యూసీలో సభ్యత్వం కోసం పోటీ పడి దానిని సాధించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. వాన్–ఇఫ్రా ఐసీక్యూసీ పోటీలో ఏకంగా 22 ఎడిషన్లలో సభ్యత్వాన్ని సాధించిన ప్రపంచంలోని ఏకైక సంస్థ సాక్షి మాత్రమే. వార్తా పత్రికలు, పబ్లిషింగ్ సంస్థలు ముద్రణలో ఎంతవరకు నాణ్యతను పాటిస్తున్నాయో శాస్త్రీయంగా పరిశీలిస్తూ వస్తోంది వాన్ ఇఫ్రా. 1994 నుంచి ముద్రణకు సంబంధించి పోటీలు నిర్వహిస్తూ ముద్రణా ప్రమాణాలకు అనుగుణంగా పాయిం ట్లు ఇస్తోంది. ఈ పోటీలో పాల్గొని ముద్రణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించిన దినపత్రికలకు ఐసీక్యూసీలో సభ్యత్వాన్ని ఇస్తోంది. పాఠకుల్ని, అడ్వర్టయిజర్లను ఆకట్టుకోవాలం టే ముద్రణలో నాణ్యతా ప్రమాణాలు అత్యంత ముఖ్యమని భావించిన ఇఫ్రా ఈ పోటీ ప్రారంభించింది. రంగుల ముద్రణలో నాణ్యతను పరీక్షించేందుకు ఇఫ్రా ప్రతిపాదించిన ‘క్యూబాయిడ్‘ను వార్తాపత్రికలు తమ రెగ్యులర్ ఎడిషన్లలో నెలకు 5 రోజులచొప్పున 3 నెలలపాటు ముద్రించి.. ఆ ప్రతుల్ని వాన్–ఇఫ్రాకు పంపించాలి. ఆ సంస్థ నిపుణులు ముద్రణలో నాణ్యతను అంచనా వేసి సభ్యత్వాన్ని ఇస్తారు. ఈ ఏడాది అక్టోబర్లో జర్మనీలోని బెర్లిన్లో జరిగే కార్యక్రమంలో సాక్షికి సభ్యత్వాన్ని ఇవ్వనున్నారు. -
చాలా చెత్త ఐడియా గురూ!
ఈ ఫొటోలోని వ్యక్తి ఓ దొంగ. కాకపోతే చాలా అమాయకపు దొంగ.. ఓ తెలివి తక్కువ దొంగ.. ఎందుకిలా అంటున్నామంటే దొంగతనం చేసేందుకు అతడు వేసిన ఐడియా తెలిస్తే మీరు నవ్వు ఆపుకోలేరు. ఒక ఐడియా తన జీవితాన్నే మార్చేస్తుందనుకున్నాడు. కానీ ఆ ఐడియానే చెత్త ఐడియాగా మారి ఆఖరికి కటకటాల పాలు చేస్తుందని కనీసం ఊహించనే లేదు. ఇంతకీ మన దొంగగారు ఏం చేశాడంటే.. దొంగతనానికి వెళ్లే ముందు ఎవరూ తనను గుర్తు పట్టకుండా ఉండాలని ముఖానికి మొత్తం ఆకుపచ్చ రంగు పూసుకున్నాడు. అదే అతడి కొంప ముంచింది. రష్యాలోని ఓ పట్టణం రైల్వే స్టేషన్లో ఓ మహిళ పర్సు దొంగతనం చేసి పారిపోయాడు. వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆమె ఫిర్యాదు చేసింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. కొందరు ప్రయాణికులను దొంగ గురించి ఆనవాళ్లు చెప్పమనగానే ఠక్కున ముఖానికి ఆకుపచ్చ రంగు ఉందని చెప్పారు. ఇంకేముంది ఆ పట్టణం మొత్తం పోలీసులు జల్లెడ పట్టేశారు. ఆకుపచ్చ రంగు వేసుకున్న వ్యక్తిని గుర్తించడం వారికి పెద్ద కష్టమేమీ కాలేదు. చివరికి దొంగను అరెస్ట్ చేశారు. -
జాబిల్లి..రంగులు వెదజల్లి
ఈనెల 31న చందమామ పెద్ద పరిమాణంలో.. నీలం, ఎరుపు రంగుల్లో కనిపించనున్నాడు! 150 ఏళ్ల తర్వాత సంభవిస్తున్న ఈ అరుదైన సంఘటన నిజంగానే ఓ భ్రమ.. నిజానికి జాబిల్లి సైజు.. రంగు వీసమెత్తు కూడా మారదు. అయినా సైజు పెరిగినట్లు ఎందుకు కనిపిస్తాడు? రక్తం చిమ్ముతున్నట్లు ఎందుకు భయపెడతాడు? నీలాల జాబిలి ఎందుకైంది? కొన్ని ప్రాంతాల్లోని అరుదైన ధూళి కణాల కారణంగా పున్నమి నాటి చంద్రుడు నీలంగా కనిపిస్తాడు. దీంతో అక్కడి వారు బ్లూమూన్ అని పేరు పెట్టుకున్నారు. ఇదే ప్రపంచం మొత్తం వాడుకలోకి వచ్చింది. ఈ బ్లూమూన్కు రెండు నిర్వచనాలు ఉన్నాయి. ఒక్కో రుతువులోని 4 పున్నమి రాత్రుల్లో మూడోదాన్ని బ్లూమూన్ అంటారని ఒక నిర్వచనం చెబితే.. ఒక నెలలోనే వచ్చే రెండో పున్నమిని బ్లూమూన్ అంటారని ఇంకో నిర్వచనం చెబుతోంది. ఈ నెల 31న కనిపించే జాబిలి రెండో నిర్వచనానికి సరిపోతుంది. సూపర్ ఎలా? భూమి చుట్టూ జాబిల్లి తిరుగుతూ ఉంటుందని మనకు తెలిసిందే. చంద్రుడు గుండ్రంగా కాకుండా గజిబిజిగా (ఆప్సిడల్ ప్రెసెషన్లో) తిరుగుతాడు. దీంతో కొన్నిసార్లు చంద్రుడు భూమికి కొంత దగ్గరగా వస్తాడు. ఇలాంటి సమయాల్లో అంటే పౌర్ణమి రోజున సూర్యుడికి చంద్రుడు అభిముఖంగా వస్తాడు. దీంతో జాబిల్లి పరిమాణం పెరిగినట్లు అనిపిస్తుంది. ఏదైనా పున్నమి రోజున భూమికి అతి దగ్గరగా వస్తే దాన్ని ‘సూపర్ మూన్’ అంటారు. ఎరుపు రంగు ఏమిటి? సంపూర్ణ చంద్రగ్రహణం రోజున చందమామ అరుణవర్ణంలో వెలుగులు వెదజల్లుతుంది. దీన్నే ఇంగ్లిష్లో బ్లడ్మూన్ అంటారు. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు భూమి నీడ మొత్తం జాబిల్లిపై పడుతూ ఉంటుంది. అదే సమయంలో భూమి వెనుక వైపు నుంచి ప్రసారమయ్యే సూర్యుడి కాంతి కొంత జాబిల్లిపై పడుతుంది. ఈ క్రమంలో అది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఫలితంగా ఎక్కువ తరంగ దైర్ఘ్యమున్న ఎరుపు కాంతి జాబిల్లిని చేరుతుంది. దీంతో బ్లడ్మూన్ ఆవిష్కృతమవుతుంది. సూర్యుడు ఉదయిస్తున్న.. అస్తమిస్తున్న వేళల్లో కొంత సమయం ఎరుపు రంగు కనిపిస్తుందే.. అలా అన్నమాట! ఎక్కడ చూడొచ్చు ? సూపర్ బ్లూ, బ్లడ్ మూన్ ప్రపంచం మొత్తమ్మీద చూసే అవకాశాలు తక్కువే. అలాస్కాతోపాటు ఉత్తర అమెరికా, హవాయిలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యోదయానికి ముందు భారీసైజున్న ఎర్రటి జాబిల్లిని చూడొచ్చు. ఆసియాతో పాటు మధ్యప్రాచ్య దేశాలు, రష్యా తూర్పు ప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో రాత్రి సమయంలో చూడొచ్చు. భారత్లో సాయంత్రం 4.21 గంటల సమయంలో పాక్షికంగా, 6.21 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో చూడొచ్చని కోజికోడ్లోని రీజనల్ సైన్స్ సెంటర్ టెక్నికల్ ఆఫీసర్ జయంత్ గంగూలీ తెలిపారు. దాదాపు గంటపాటు ఎర్రటి జాబిల్లిని చూడొచ్చని చెప్పారు. -
రంగులే కీలకం
సాక్షి, హైదరాబాద్: పిల్లలను ఆకట్టుకొనేలా గదిని రూపొందించడంలో రంగుల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సాధారణంగా పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్లు కూడా ఓకే. ఇక వయోలెట్, పింక్లు కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగుని ఇష్టపడుతున్నడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం అంతా ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేదు చోట్ల వేర్వేరు రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. దీనితో పాటు ఒక్కో రంగు ఒక్కో అంశాన్ని బహిర్గత పరచడానికి ప్రేరణ కల్పిస్తుందని కలర్ సైకాలజీ చెబుతోంది. ఎరుపు అధికంగా ప్రభావితం చేసే రంగు, ఇక ఆరెంజ్ స్నేహ స్వభావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆడుకునే చోట, పిల్లలు కూర్చునే చోట ఈ కలర్ ఉంటే బాగుంటుంది. పసుపు ఏకాగ్రతను పెంచేందుకు తోడ్పడుతుంది. అందువల్ల చదువుకునే చోట వేస్తేసరి. పిల్లల కంటూ ప్రత్యేకించి గది చిన్నదైతే బాగా దట్టంగా వేయడం వల్ల మరింత చిన్నదిగా కనిపించే ప్రమాదముంది. కాబటి తేలిక రంగులు వేస్తే మంచిది. పిల్లలకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగచేయవచ్చు. రాత్రిళ్లు నిద్రపోయే ముందు లైట్స్ ఆఫ్ చేస్తే పిల్లలు కొత్తల్లో బయపడే అవకాశం ఉంది. సీలింగ్కు చీకట్లో కూడా మెరిసే మెటాలిక్ రంగులు లేదా స్టెన్సిల్తో పెయింటింగ్లు వేస్తే చీకట్లో కూడా హాయిగా నిద్రపోతారు. కంటికి శ్రమ కలిగించని లైటింగ్.. లైట్ల విషయానికి వస్తే బాగా వెలుతురుని అందించే ఫ్లోరోసెంట్ బల్బులను వాడాలి. లైటింగ్ స్టాండ్లు కూడా వంకీలు లేదా ఇతర డిజైన్లతో ఉంటే పిల్లలను ఆకట్టుకుంటాయి. అయితే కంటిపై ఎలాంటి ప్రభావం చూపకుండానూ, చదువుకొనేటప్పుడు ఇబ్బంది కలగకుండానూ ఉండాలి. పిల్లల గది కదా అని తెగ హంగామా చేసి అన్ని వస్తువులను పేర్చేయకుండా అవసరమైన మేరకు ఉంచాలి. ఈ క్రమంలో వారి అభిరుచులకు ప్రాధాన్యతను ఇస్తూనే ఆకట్టుకొనే విధంగాను రూపొందించాలి. ఎక్కడి బొమ్మలు అక్కడనే.. ఇంట్లో గోడలకు చిత్రాలను వేలాడదీయడం కూడా ఒక కళే. లేకపోతే ‘వీడికి బొత్తిగా కళాభిరుచి లేదే’ అంటూ పెదవి విరుస్తారు. వంట గదిలో తాజా కన్పించే పండ్లు, కూరగాయలు తదితర తినుబండారాల చిత్రాలను వేలాడదీయాలి. ఆహార పదార్థాలకు ఉండాల్సిన తాజాదనాన్ని ఎప్పడూ గుర్తు చేస్తుంటుంది కూడా. కొందరికి జంతువల చిత్రాలు అంతగా నప్పవు. దీనికి తోడు మాంసాహార సంబంధిత బొమ్మలు కూడా కొందరికి రుచించవు. అందుకే చిత్రాల ఎంపిక ఆలోచించి తీసుకోవాలి. అదే ముందు గదిలోనయితే ప్రకృతి చిత్రాలు, పడకగదిలో ఊహా చిత్రాలు, పిల్లల గదుల్లో జంతువుల, పక్షుల చిత్రాలు, వృద్ధు లు ఉండే గదుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడే చిత్రాలు వేలాడదీయవచ్చు. ఇంటి అందం రెట్టింపు సాక్షి, హైదరాబాద్: ఇంటి గుమ్మం ముందు ఆధునిక కార్పెట్ వేస్తే సరిపోదు.. అది ఎంత శుభ్రంగా ఉందో కూడా చూడాలి. లేకపోతే ఇంట్లోకి వచ్చే అతిథుల దృష్టిలో చులకనవ్వడమే కాకుండా అనారోగ్య సమస్యలూ తలెత్తుతాయి. ఎక్కువ కాలం మన్నే విధంగా కార్పెట్ను క్లీన్గా ఉంచుకోవడమెలాగో చూడండి. ♦ ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా ఉండటం కోసం ప్రధాన ద్వారం దగ్గర మ్యాట్ను ఉపయోగించాలి. పాదరక్షలు ఇంటి బయటే విడిచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ♦మరకలు పడిన వెంటనే కార్పెట్ను వాక్యుమ్ క్లీనర్తో శుభ్రపరుచుకోవాలి. లేకపోతే మరకలు ఎండిపోయి తొలగించడం కష్టమవుతుంది. ♦మరకలను తొలగించడానికి ఉపయోగించే యాసిడ్ను ముందుగా పరీక్షించండం మంచిది. కొన్ని రకాల యాసీడ్ల వల్ల కార్పెట్ రంగు పోయే ప్రమాదం ఉంది. ♦డిటర్జెంట్, శ్యాంపోలు ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదు. డిటర్జెంట్ ముక్కలు కార్పెట్లో ఇరుక్కుపోయే ప్రమాదమూ ఉందండోయ్. ♦హాల్లో ఉండే కార్పెట్ను నెలకోసారి, పడక గదిలో ఉండే కార్పెట్ను ఆరు నెలలకోసారి శుభ్రం చేసుకోవడమ ఉత్తమం. ♦స్టీమ్ క్లీనింగ్తో కూడా కార్పెట్ను క్లీన్ చేసుకోవచ్చు. అయితే ముందుగా కార్పెట్ బాగా తడిగా ఉండకుండా చూసుకోవాలి. స్టీమ్ క్లీన్ చేసే ముందు బ్రెష్ చేయడం కూడా మరవద్దండోయ్. -
రంగేస్తే చాలు.. బోలెడంత ఇంధనం!
ఇంటికి రంగేస్తే ఏమవుతుంది? చూసేందుకు ముచ్చటగా ఉంటుంది. అంతేనా? ఇప్పటికైతే ఇది నిజం గానీ.. ఇంకొన్నేళ్లు పోతే మాత్రం ఇంటికేసే రంగు.. మీ పవర్ బిల్లును బోలెడంత తగ్గించవచ్చు. లేదంటే పూర్తిగా లేకుండా కూడా చేయవచ్చు. ఇంటికేసే రంగుకు... కరెంటు బిల్లుకు ఏమిటి సంబంధం అంటే మాత్రం మనం ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల గురించి తెలుసుకోక తప్పదు. అంతకంటే ముందు కొంచెం ప్రాథమిక విషయాలను అర్థం చేసుకుందాం. ఇంట్లో వాడే వంటగ్యాస్ అదేనండీ మీథేన్ వాయువు తెలుసుకదా... దీంట్లో కార్బన్, హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. మీథేన్ కంటే హైడ్రోజన్ చాలా మేలైన ఇంధనం. ఈ కారణంగానే హైడ్రోజన్తో కార్లను నడిపించాలని, విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గాలి కంటే తేలికగా ఉండే ఈ హైడ్రోజన్ను నిల్వ, రవాణా చేయడం సమస్య కావడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఆర్ఎంఐటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ద్వారా ఇళ్లకేసే రంగుల ద్వారానే హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే మార్గాన్ని కనుక్కున్నారు. గాల్లోని తేమను పీల్చుకోగల మాలిబ్డినం సల్ఫైడ్ అనే కృత్రిమ రసాయన పదార్థం సాయంతో ఇది పనిచేస్తుంది. రంగులోకి చేరిపోయే మాలిబ్డినం సల్ఫైడ్ గాల్లోని తేమ అంటే.. హెచ్2ఓను సేకరిస్తే.. టైటానియం డయాక్సైడ్ ద్వారా దీన్ని విడగొట్టి హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తారన్నమాట. ఇలా ఉత్పత్తి అయిన హైడ్రోజన్ను ఒకదగ్గరకు చేర్చేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఒకవైపు హైడ్రోజన్ వంటి స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తి కావడంతోపాటు.. ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది. ఫ్యుయెల్సెల్స్ సాయంతో హైడ్రోజన్ను ఇంధనంగా వాడుకోవచ్చునని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ టోర్బెన్ డానెకే తెలిపారు. ఎర్రటి ఎండలోనైనా.. గట్టకట్టే చలిలోనైనా సరే.. ఈ పెయింట్ భేషుగ్గా పనిచేస్తుందని.. దీనివల్ల మారుమూల గ్రామాల్లోనూ సులువుగా విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతామని, గ్రిడ్ వ్యవస్థ అవసరమూ తప్పుతుందని ఆయన చెప్పారు. –సాక్షి, నాలెడ్జ్ సెంటర్ -
ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్కు ప్రింట్ ఎక్స్ల్ అవార్డ్సు
దానవాయిపేట (రాజమహేంద్రవరం) : ప్రతిష్టాత్మకమైన హెచ్పీ ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ ప్రింట్ ఎక్స్ల్ –2017 అవార్డ్సును ప్రముఖ ప్రింటింగ్ కంపెనీ ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ అందుకుంది. ఈ నెల 8న చైనా రాజధాని బీజింగ్లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ సంస్థల డైరెక్టర్ పులవర్తి విశ్వేశరావు, టెక్నికిల్ హెడ్ ఈలి సతీష్, గ్రాఫిక్స్ డివిజన్ ప్రింట్ టీమ్ ఎంవీ గోపీనాథ్లు హెచ్పీ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు అలెన్బార్ షానీ, హెచ్పీ హెడ్ టీమ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఆసియా పసిఫిక్ దేశాల నుంచి సుమారు 1400 ప్రముఖ ప్రింటింగ్ కంపెనీలు ఈ పోటీల్లో పాల్గొనగా ఫొటో బుక్ , కమర్షియల్ ప్రింటింగ్ కేటగిరీలలో ఇన్నోవేషన్, ప్రెజెంటేషన్, టెక్నాలజీని ఆధారం చేసుకుని ఉత్తమ ఫొటో బుక్ విన్నర్, కమర్షియల్ ప్రింట్ కేటగిరీ విన్నర్, ఓవర్ఆల్ గ్రాండ్ విన్నర్ అవార్డులను సంస్థ కైవసం చేసుకుంది. 2012 నుంచి 2017 వరకు వరుసగా ఇంటర్నేషనల్ ప్రింట్ ఎక్స్ల్ అవార్డులను అందుకున్న ప్రింటోనికా, శివరామ కలర్ ల్యాబ్ సంస్థను హెచ్పీ ఇంటర్నేషనల్, హెచ్పీ భారత్ టీమ్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్యవరపు గోపాలకృష్ణ మాట్లాడుతూ గిగిగి .pటజీn్టౌnజీఛ్చి.ఛిౌఝ ద్వారా జాతీయ, అంతర్జాతీయ ఆన్లైన్ ప్రింటింగ్ సేవలను ప్రపంచ స్థాయిలో తమ వినియోగదారులకు అందజేస్తున్నామన్నారు. అడ్వాన్స్ డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీతో లైఫ్ టైమ్ ప్రింట్ క్వాలిటీతో లైట్ వైట్ వాటర్ ప్రూప్ ఫొటోబుక్స్ భారతదేశంలోని పలు ఫొటోగ్రాఫీ ప్రొఫెషనల్స్కు ,గ్రాఫిక్ డిజైనర్లకు సేవలందిస్తున్నామని తెలిపారు. -
రూ. 2000 నోటు రంగు పోతోంది!
షాజహాన్ పూర్: ఏటీఎంలో వచ్చిన రూ.2,000 నోటు రంగు పోతోందని ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి శనివారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. రితిక్ గుప్తా అనే వ్యక్తి భారతీయ స్టేట్ బ్యాంక్కు చెందిన ఏటీఎంకు వెళ్లి రూ.10 వేలు తీయగా ఐదు రూ.2,000 నోట్లు వచ్చాయి. వాటిలో ఒక దాని రంగు పోతోందని రితిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అది దొంగనోటు కాదనీ, రంగు పోతున్నట్లుగా ఫిర్యాదు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. ఏటీఎంలో దొంగనోట్లు వచ్చే అవకాశం లేదని బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ చెప్పారు. ఇటీవలే రిజర్వు బ్యాంకు బదులు చిల్ర్డన్ బ్యాంకు అని రాసి ఉన్న నాలుగు నోట్లు ఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో రావడం తెలిసిందే. -
కలర్.. ఫుల్
- గోవా నుంచి యథేచ్ఛగా దిగుమతి - స్పిరిట్కు రంగు కలిపి మద్యం కలరింగ్ - ట్యాంకర్ల కొద్దీ కర్నూలు జిల్లాకు తరలింపు - సహకరిస్తున్న అధికార పార్టీ నేతలు - బెల్టు షాపుల ద్వారా భారీగా విక్రయాలు కర్నూలు : మందుబాబుల ఆరోగ్యంతో అధికార పార్టీ దందా చేస్తోంది. కుటుంబాల్లో చీకటి మిగిల్చే నకిలీ మద్యం జిల్లాను ముంచెత్తుతోంది. ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ బాగోతంలో నాయకులు గ్రూపులను కూడా పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. పర్యవేక్షించాల్సిన శాఖ మామూళ్ల మత్తులో జోగుతుండటం.. మొత్తం వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు అధికార టీడీపీ నేతలే కావడం.. ఈ మహమ్మారి ఎప్పుడు ఎవరి ప్రాణం తీస్తుందోననే ఆందోళనకు తావిస్తోంది. జిల్లాలోకి విచ్చలవిడిగా వచ్చిపడుతున్న నకిలీ మద్యం వెనుక అసలు సూత్రధారి కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేగా తెలుస్తోంది. గోవా నుంచి భారీగా నకిలీ మద్యాన్ని కడప జిల్లాలోకి తెచ్చి దర్జాగా కర్నూలుకు ట్యాంకర్ల ద్వారా డంప్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందుకు జిల్లాలోని అధికార పార్టీ నేతలు సహకరిస్తూ బెల్టు షాపుల ద్వారా విక్రయిస్తున్నట్లు సమాచారం. గోవా నుంచి భారీగా నకిలీ మద్యాన్ని తీసుకుని వస్తున్న సదరు ఎమ్మెల్యే.. జిల్లాలోని టీడీపీ నేతలతో సంబంధాలు పెట్టుకుని దర్జాగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా వచ్చిన నకిలీ మద్యాన్ని(స్పిరిట్) ఇక్కడున్న అధికార పార్టీ నేతలు బ్రాండ్ మద్యంగా బెల్టుషాపుల ద్వారా మందుబాబులకు అంటగడుతున్నారు. గోవా టు కర్నూలు వయా కడప గోవా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు నకిలీ మద్యానికి వివిధ రంగులు కలుపుతూ అసలు మద్యానికి దీటుగా తయారు చేస్తున్నారు. ఈ నకిలీ మద్యం ట్యాంకర్లలో దర్జాగా జిల్లాలోకి వస్తోంది. ఇక్కడి అధికార పార్టీ నేతలు ఈ స్పిరిట్ను అసలు మద్యం సీసాలను పోలిన సీసాల్లో నింపి బెల్టు షాపులకు తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రొద్దుటూరు నుంచి ప్రత్యేకంగా టీంలను కూడా రప్పిస్తున్నారు. ప్రధానంగా ఆళ్లగడ్డ కేంద్రంగా సాగుతున్న ఈ దందా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. వాస్తవానికి గతంలో గోవా నుంచి కర్ణాటకకు తెచ్చుకుంటూ అక్కడ కలర్ను కలిపి అసలు మద్యాన్ని తలపించేలా సిద్ధం చేసేవారు. అక్కడి నుంచి సులభంగా కర్ణాటక బోర్డర్లోని గ్రామాలకు సరఫరా అయ్యేది. అయితే, గతంలో ఒకసారి డోన్ సమీపంలో నకిలీ మద్యం దొరకగా అధికార పార్టీ నేతలు ఇరుక్కున్నారు. దీంతో రూటు మార్చి ఇప్పుడు గోవా నుంచి కర్నూలు వయా కడప మీదుగా దందా సాగుతోంది. ఈ మొత్తం దందాలో అధికార పార్టీ నేతలు తమ గ్రూపులను మరిచి మరీ వ్యాపారం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఆళ్లగడ్డలో వరుస ఘటనలు.. వాస్తవానికి ఆళ్లగడ్డలో వరుసగా నకిలీ మద్యం దొరుకుతోంది. కేవలం ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది కూడా ప్రధాన కార్యాలయంలోని రాష్ట్ర టాస్క్ఫోర్స్ వచ్చి దాడులు చేస్తేనే నకిలీ మద్యాన్ని పట్టుకునే పరిస్థితి ఉంది. జిల్లాలోని ఎక్సైజ్ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వీరికి ఈ నకిలీ మద్యం మాఫియా నుంచి భారీగా మామూళ్లు ముడుతుండటమే అందుకు కారణంగా తెలుస్తోంది. గతంలో కూడా ఇదే ఆళ్లగడ్డలో లక్ష్మీ వెంకటేశ్వర వైన్స్లో కల్తీ చేస్తుంటే పట్టుకుని సీజ్ చేశారు. మరోసారి ఇదే ఆళ్లగడ్డలో ఏకంగా నకిలీ మద్యాన్ని తయారుచేస్తుంటే దాడులు చేసి పట్టుకున్నారు. ఇప్పుడు కూడా తాజాగా ఆళ్లగడ్డలోని సూర్యవైన్స్లో కూడా ఈ తరహాలోనే నకిలీ మద్యం విక్రయిస్తూ దొరికిపోయారు. అయినప్పటికీ జిల్లాలోని ఎక్సైజ్ అధికారులకు మాత్రం చీమకుట్టినట్టుగా కూడా ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీలోని నేతలందరూ తమ గ్రూపు తగాదాలను పక్కనపెట్టి మరీ ఇప్పుడు కల్తీ మద్యం తయారీలో బిజీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. -
హైటెక్ పెన్ వచ్చేసింది!
వర్చువల్ రియాల్టీ కెమెరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఉన్నది ఉన్నట్లుగా సహజంగా దృశ్యాలను సాక్షాత్కరింపజేసే ఎన్నో ఆధునిక పరికరాలూ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. అయితే మనం అనుకున్న, కనిపించిన రంగును స్కాన్ చేసి తనలో నింపుకునే ఆధునిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ పెన్ ఇప్పుడు మనముందుకొచ్చేసింది. చిత్రకారులు, డిజైనర్లు తమకు కావలసిన రంగులను ఎలాంటి మిక్సింగ్ లేకుండానే రూపొందించుకొని, కాన్వాస్ పై కళారూపాలను చిత్రించే అవకాశం దగ్గరలోనే ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కలర్ పికింగ్ పెన్ అందుబాటులోకి వచ్చేసింది. కుంచె, రంగుల అవసరం లేకుండానే ప్రకృతి చిత్రాలను, కళారూపాలను ఆవిర్భవింపచేసే అవకాశం కనిపిస్తోంది. మనకు దగ్గరలో కనిపించిన ఏ వస్తువునైనా స్కాన్ చేసి, దాని రంగును తనలోకి తీసుకోగలిగే ఈ హైటెక్ పెన్ ఇప్పుడు కళాకారులకు సైతం ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ పెన్ లో పొందుపరచిన కలర్ సెన్సార్, మైక్రో ప్రాసెసర్లు మనం అనుకున్న రంగులను గుర్తించి స్కాన్ చేస్తాయి. ఆకులు, పూలు, పళ్ళు వంటి రంగురంగుల ప్రకృతి దృశ్యాలతోపాటు ఎటువంటి వస్తువు పైన పెట్టినా.. పెన్ లోని సెన్సార్ ఆ వస్తువులోని రంగును స్కాన్ చేసి, అదే రంగును షేడ్ తో సహా మనకు అందిస్తుంది. చిత్రాన్ని స్కాన్ చేసుకున్న అనంతరం పిక్చర్ లోని కలర్ కు అనుగుణంగా పెన్ లోని స్మార్ట్ ఇంక్ కాట్రిజ్ రంగులను మార్చుకుంటుంది. ఈ కాట్రిజ్ లో ఉండే ఇంకుతో మైళ్ళకొద్దీ రాసేందుకు వీలవుతుందని సృష్టికర్తలు చెప్తున్నారు. అంతేకాదు ఈ స్క్రిబుల్ పెన్ ఇంక్.. నీటిని పీల్చదని, వెలిసిపోదని చెప్తున్నారు. ఈ స్మార్ట్ పెన్ కూడ రెండు రకాలుగా మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని, ఒకటి.. నిజమైన ఇంకుతో పేపర్ మీద రాసుకునేందుకు వీలుగానూ, మరోటి చిత్రాలను స్కాన్ చేసి స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో వాడుకునేందుకు గాను వీలుంటుందంటున్నారు. యూఎస్బీ కేబుల్ తో ఒకసారి ఛార్జింగ్ పెడితే ఏడు గంటల పాటు పని చేస్తుందని చెప్తున్నారు. 249 డాలర్లతో అంటే సుమారు 17 వేల రూపాయలతో ఈ స్మార్ట్ పెన్ ను ఆన్ లైన్లో ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉన్నట్లు వెబ్ సైట్లో వివరించారు. -
ఆస్ట్రేలియాలో కలర్ రన్
-
మచ్చమటలు తుడిచేద్దాం..!
ఒక వ్యక్తి మేనికి రంగును ఇచ్చేది మెలనిన్ అనే పిగ్మెంట్. దాని పైనే శరీర వర్ణం ఆధారపడి ఉంటుంది. మేనిలో మెలనిన్ పెరుగుతున్న కొద్దీ వాళ్లలో నలుపుదనం పెరుగుతుంటుంది. అలాగే మెలనిన్ తక్కువ ఉన్న కొద్దీ వారు తెల్లబడుతూ ఉంటారు. మెలనిన్ మేనంతా సమానంగా పరుచుకుంటుంది కాబట్టి ఒంటి రంగంతా ఒకేలా ఉంటుంది. అయితే కొందరిలో మెలనిన్ అంతా ఒకేచోట పోగుబడటంతో ఆ ప్రాంతం నల్లబారుతుంటుంది. నల్లమచ్చల్లా కనిపిస్తుంటుంది. మన ఒంటిపై వచ్చే నల్లమచ్చలకు కారణాలు, నివారణ, చికిత్స వంటి అనేక అంశాలను తెలుసుకుందాం. ముచ్చెమటలు పోయించే ఆ మచ్చెమటలు తుడిచేద్దాం. ముఖంపైనా, మేనిపైనా వేర్వేరు కారణాలతో నల్లమచ్చలు రావచ్చు. మచ్చలు వచ్చేందుకు కారణాలు ఇవి... ఎండలో ఎక్కువగా తిరగడం: నేరుగా ఒంటి మీద సూర్యకాంతి పడేలా ఎండలో తిరగడం వల్ల మన చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతో ఈ మెలనిన్ మేని భాగంలో ఒకేచోట పోగుపడితే అక్కడ చర్మం నల్లగా మారుతుంది. సాధారణంగా నుదుటిపైనా, కణతల వద్ద, మెడకు ఇరువైపులా, మెడదగ్గర ఇంగ్లిష్ అక్షరం వి ఆకృతిలో, చెవులు... ఈ భాగాలు నల్లబారుతాయి. సూర్యుడి ప్రభావం వల్ల కనిపించే దుష్పరిణామాలు ఈ కింది విధంగా ఉంటాయి. ట్యాన్ : పిగ్మెంటేషన్ పొర ఉన్న చోట చర్మం... మిగతా దాని కంటే కాస్త ఉబ్బెత్తుగా ఉంటుంది. చికిత్స : సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్పీఎఫ్) ఎక్కువగా... అంటే 50 వరకు ఉండే సన్స్క్రీన్ లోషన్లను ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాసుకోవడం చర్మం రంగును తేలిక పరిచే క్రీములు: యాస్కార్బిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, ఆర్బుటిన్ వంటి క్రీములతో ఇవి తగ్గుతాయి. కెమికల్ పీలింగ్: ఈ తరహా చికిత్స ఒకేసారి కాకుండా కొన్ని విడతల్లో చేయాల్సి ఉంటుంది. ఇందులో నల్లమచ్చ ఉన్నచోట కొన్ని మందులు పూస్తారు. ఆ తర్వాత మృతచర్మం దానంతట అదే ఒలిచినట్లుగా (పీలింగ్) తొలగిపోతుంది. దాంతో మచ్చలోని నల్లదనం తగ్గుతంది. యాంటీఆక్సిడెంట్స్: శరీరంలోకి విడుదలయ్యే అపాయకరమైన విషపదార్థాలను హరించే పోషకాలను యాంటీఆక్సిడెంట్స్ అంటారు. ఈ విషాలు చర్మాన్ని ఉన్న వయసు కంటే ఎక్కువగా కనిపించేలా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ అనే పోషకాలు ఈ విషాలను హరించి, చర్మం వయసును తగ్గించి చూపుతాయి. అందుకే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను క్రమం తప్పక తీసుకుంటూ ఉంటే మేనిలో నిగారింపు వస్తుంది. లేజర్ : కొన్ని సందర్భాలలో నల్లమచ్చపై లేజర్ కిరణాలను ప్రసరింపజేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ప్రికిల్స్ : ఇవి సాధారణంగా చెంపలపైనా, ముక్కుకు ఇరువైపులా చుక్కలు చుక్కలుగా కనిపించే ముదురు గోధుమరంగు మచ్చలు. కొన్నిసార్లు ఇవి మెడకింది భాగంలోని ఛాతీ మీద కూడా చుక్కలుగా కనిపిస్తాయి. కొందరిలో ఇవి భుజాలు, వీపు మీద కూడా రావచ్చు. చికిత్స : క్రమం తప్పకుండా సన్స్క్రీన్ లోషన్ రాయడం. కెమికల్ పీలింగ్ ప్రక్రియలు చేయించుకోవడం. చర్మపు రంగును తేలికపరిచే స్కిన్ లెటైనింగ్ క్రీమ్స్ రాయడం. లేజర్ చికిత్స చేయించుకోవడం లెంటిజిన్స్ : ఇవి కూడా సూర్యుడి వల్ల వచ్చే మచ్చలు కాబట్టి వీటిని ‘సన్స్పాట్స్’ అని అంటారు. అయితే ఇవి వయసు పెరుగుతున్నకొద్దీ వృద్ధుల చర్మంపై చుక్కలుచుక్కలుగా కనిపిస్తుంటాయి. చికిత్స : ముందు పేర్కొన్న చికిత్సలే వీటికీ పనికివస్తాయి. యాక్టినిక్ కెరటోసిస్ : ఇవి తేనెరంగులోనూ, గోధుమరంగులోనూ ఉండే మచ్చలు. సాధారణంగా ఇవి నుదురు, కణతల వద్ద కొంతమందిలో వస్తుంటాయి. ఇలాంటి మచ్చలు ఒక్కోసారి క్యాన్సర్కు ముందుదశగా కనిపించవచ్చు. చికిత్స : వీటిని ఎంత త్వరగా గుర్తించి, తగిన చికిత్స తీసుకుంటే అంత మేలు. సాధారణంగా ప్రికిల్స్కు చేసే చికిత్సే దీనికీ ఉపకరిస్తుంది. ఎఫ్డీఈ : ‘ఫిక్స్డ్ డ్రగ్ ఎరప్షన్’ అనే ఈ సమస్య కొన్ని మందులు తీసుకున్నప్పుడు, అవి వారికి సరిపడకపోవడం మచ్చల రూపంలో వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఈ మచ్చలు ముఖంపైనా, పెదవులపైనా కనిపించవచ్చు. ఫలానా మందు సరిపడకపోవడం వల్ల ఇవి వస్తున్నాయని గుర్తించి... ఆ మందు ఆపేసిన రెండుమూడు వారాల్లో ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. ఇలాంటి మచ్చలకు కారణమయ్యే మందులివి... నిమెల్యుసైడ్, ప్రిమాక్విన్, సల్ఫర్ ఉన్న మందులతో ఈ సమస్య వస్తుంది. చికిత్స : ప్రికిల్స్కు చేసే చికిత్సే దీనికీ పనిచేస్తుంది. ఎకాంథోసిస్ నెగ్రిక్యాన్స్ : మన శరీరం ఇన్సులిన్కు ప్రతికూలంగా పనిచేయడం (ఇన్సులిన్ రెసిస్టెన్స్) వల్ల లేదా స్థూలకాయం వచ్చినప్పుడు ఈ తరహా మచ్చలు వస్తాయి. సాధారణంగా ఇవి నుదురు, గదమ (చుబుకం), మెడ వెనక భాగంలో నల్లగా దళసరిగా ఏర్పడతాయి. చికిత్స : ఇన్సులిన్ రెసిస్టెన్స్ను సరిచేయడం శరీర బరువును తగ్గించుకోవడం పై రెండు సూచనలను అనుసరిస్తూ, ప్రికిల్స్కు తీసుకునే చికిత్సనే కొనసాగిస్తే మంచిది. ఆ సూచనలను పాటించకుండా కేవలం చికిత్స మాత్రమే ఇస్తే తగిన గుణం కనిపించకపోవచ్చు. పీడీఎల్ : పిగ్మెంటరీ డిమార్కెటింగ్ లైన్స్ అనే ఈ కండీషన్ దక్షిణ ఆసియా దేశాల వారిలో చాలా ఎక్కువ. ఇవి కంటి చుట్టూ, చెంపలపైనా, పెదవుల చుట్టూ వస్తాయి మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యత ఉన్నవారిలో ఇవి మరింత ఎక్కువగా కనిపిస్తుంటాయి. గర్భందాల్చిన వారిలో చాలా సాధారణం. ఎండలో తిరిగినా కనిపిస్తాయి. చికిత్స : ప్రికిల్స్కు తీసుకునే చికిత్సే దీనికీ పనిచేస్తుంది. అయితే ఇవి చికిత్సకు అంతగా లొంగవు. ఇవి తగ్గాలంటే నిరవధికంగా మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అవసరం. డర్మటోసెస్ పాప్యులోజా నిగ్రా : ఇవి ముఖంపై ఉబికినట్లుగా కనిపించే చిన్న మచ్చలు. వీటిని వదిలేస్తే పులిపిరి కాయలుగా మారే అవకాశం ఉంది. ఇవి మెడ, లేదా శరీరంలోని పైభాగంలో ఎక్కడైనా రావచ్చు. ముఖంపైన కూడా రావచ్చు. ఇవి సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంటాయి. చికిత్స : అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ చికిత్స లేదా ఎలక్ట్రో కాటరీ చికిత్స. ఇలా రకరకాల మచ్చలకు తగిన చికిత్స తీసుకోవడం ద్వారా వాటిని తొలగించుకోవచ్చు. పుట్టుమచ్చలు, సెబోరిక్ కెరటోసిస్కు వచ్చే మచ్చలకూ ఇదే చికిత్స పనికివస్తుంది. మెలాస్మా : ఇది ఆసియా ఖండానికి చెందినవారిలో కనిపించే చాలా సాధారణమైన సమస్య. వాడుక భాషలో దీన్ని ‘మంగు’ అని అంటారు. ముఖంపై ముక్కుకు ఇరువైపులా సీతాకోకచిలుక ఆకృతిలో నల్లమచ్చ వచ్చి కనిపిస్తుంది. ఇది సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంటుంది. మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వారిలో వచ్చే హార్మోన్ల అసమతౌల్యత, సూర్యకాంతిలో ఎక్కువగా తిరగడం మెలాస్మా సమస్యకు దోహదం చేస్తుంది. కొంతమందిలో గర్భందాల్చినప్పుడు ఇది కనిపిస్తుంది. అప్పుడు దీన్ని క్లొయాస్మా అంటారు. చికిత్స : ప్రికిల్స్కు చేసే చికిత్స దీనికీ పనిచేస్తుంది. కొన్నిసార్లు చికిత్స తీసుకుంటున్నా ఇది మళ్లీ తిరగబెడుతూ ఉండవచ్చు. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలీ, హైదరాబాద్ -
కంటిలో రంగులను గుర్తించేవి?
మాదిరి ప్రశ్నలు (కాంతి) 1. కిందివాటిలో పరావర్తన సూత్రానికి సంబం ధించి సరైంది ఏది? ఎ) పతనకోణం, పరావర్తన కోణం సమానం బి) పతన కిరణం, పతన బిందువు వద్ద గీసిన లంబం, పరావర్తన కిరణం, ఒకే తలంలో ఉంటాయి సి) ఎ, బి డి) ఏదీకాదు 2. కాంతి ఒక తలంలో ప్రయాణించేటప్పుడు పాటించే నియమం? ఎ) న్యూటన్ నియమం బి) ద్రవ్యనిత్యత్వ నియమం సి) ఫెర్మాట్ నియమం డి) శక్తినిత్యత్వ నియమం 3. కిందివాటిలో సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం ఏది? ఎ) నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది బి) మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది సి) ప్రతిబింబ దూరం, వస్తుదూరం సమానం డి) పైవన్నీ 4. సమతల దర్పణంలో ప్రతిబింబం కుడి, ఎడ మలుగా తారుమారవడాన్ని ఏమంటారు? ఎ) పార్శ్వ విలోమం బి) తలకిందులవడం సి) ప్రతిబింబ విలోమం డి) నిజ ప్రతిబింబం 5. సమతల దర్పణం ఉపరితలం నుంచి వస్తువును మన కంటి వైపుగా కదిలించినప్పుడు ఆ ప్రతిబింబ పరిమాణం? ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది సి) మారదు డి) అసలు ప్రతిబింబం ఏర్పడదు 6. గోళాకార దర్పణంలో దర్పణ ధ్రువానికి, వక్రతా కేంద్రానికి మధ్య ఉన్న దూరాన్ని ఏమంటారు? ఎ) నాభ్యంతరం బి) వక్రతా వ్యాసార్ధం సి) నాభి డి) ప్రతిబింబ దూరం 7. నాభ్యంతరం (జ) వక్రతా వ్యాసార్ధం (ట) ల మధ్య సంబంధం? ఎ) ట = జ/2 బి) జ = 2ట సి) ట = జ డి) ట = 2జ 8. పుటాకార దర్పణంలో మిథ్యా ప్రతిబింబం ఏర్పడాలంటే వస్తువును ఏ స్థానంలో ఉంచాలి? ఎ) జ వద్ద బి) ఇ వద్ద సి) జ, ఇ ల మధ్య డి) ఇ కి ఆవల 9. నీటిలోని గాలి బుడగ ఏ కటకంలా పనిచేస్తుంది? ఎ) వికేంద్రీకరణ బి) కేంద్రీకరణ సి) ద్వినాభ్యంతర డి) సమతల 10. కిందివాటిలో పుటాకార దర్పణాల ఉపయోగం ఏమిటి? ఎ) దంత వైద్యులు ఉపయోగిస్తారు బి) వాహన చోదకులు వాడతారు సి) వెల్డింగ్ చేసేవారికి అవసరం డి) క్షౌరశాలల్లో వాడతారు 11. వాహన చోదకులు వెనుక నుంచి వచ్చే వాహనాలను చూడటానికి వినియోగించే దర్పణం? ఎ) సమతల దర్పణం బి) పుటాకార దర్పణం సి) కుంభాకార దర్పణం డి) ద్విపుటాకార దర్పణం 12. దర్పణ సూత్రం? ఎ) బి) జ = ఠ+ఠి సి) డి) 13. {పకాశవంతమైన ఇంద్రధనుస్సును చూడాలంటే నీటిబిందువులోకి ప్రవేశించే కిరణాలు బయటకు వెళ్లే కిరణాల మధ్య కోణం ఎంత ఉండాలి? ఎ) 0ని బి) 30ని సి) 45ని డి) 42ని 14. సోలార్ కుక్కర్ తయారీకి అనువైన దర్పణం ఏది? ఎ) కుంభాకార దర్పణం బి) పుటాకార దర్పణం సి) సమతల దర్పణం డి) దేన్నయినా వాడవచ్చు 15. {పతిబింబదూరం, వస్తుదూరానికి మధ్య నిష్పత్తిని ఏమంటారు? ఎ) నాభ్యంతరం బి) వక్రతావ్యాసార్ధం సి) ఆవర్తనం డి) ప్రతిబింబ పరిమాణం 16. పుటాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే తక్కు వగా ఉండే సందర్భం? ఎ) దర్పణ నాభి వద్ద వస్తువు ఉన్నప్పుడు బి) దర్పణ ధ్రువం, నాభికి మధ్య వస్తువు ఉన్నప్పుడు సి) వక్రతాకేంద్రం వద్ద వస్తువు ఉన్నప్పుడు డి) వక్రతా కేంద్రానికి ఆవల వస్తువు ఉన్నప్పుడు 17. కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం? ఎ) చిన్నది బి) నిటారైంది సి) మిథ్యాప్రతిబింబం డి) పైవన్నీ 18. గాలిలో/శూన్యంలో కాంతి వేగం ఇ=? ఎ) 3ప10ృ8 మీ/సె బి) 3ప106 మీ/సె సి) 3ప108 మీ/సె డి) 3ప10ృ6 మీ/సె 19. కిందివాటిలో కాంతివేగం దేంట్లో తక్కువ? ఎ) గాలి బి) బెంజీన్ సి) గాజు డి) వజ్రం 20. యానకం వక్రీభవన గుణకం ఎక్కువైతే, ఆ యానకంలో కాంతి వేగం? ఎ) తగ్గుతుంది బి) పెరుగుతుంది సి) మారదు డి) వక్రీభవన గుణకానికి కాంతివేగానికి సంబంధం లేదు 21. కిందివాటిలో వక్రీభవన గుణకం ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది? 1. పదార్థ స్వభావం 2. కాంతి తరంగదైర్ఘ్యం 3. కాంతి వేగం 4. కాంతిరంగు ఎ) 1, 2 బి) 2, 3 సి) 3, 4 డి) ఏదీకాదు 22. ఒక గదిలోని మాటలు మరో గదిలోకి వినిపించడానికి కారణమైన ధర్మం? ఎ) పరావర్తనం బి) వక్రీభవనం సి) వ్యతికరణం డి) వివర్తనం 23. వక్రీభవన కోణం 90 అయినప్పుడు పతన కోణాన్ని ఏమంటారు? ఎ) కనిష్ఠ కోణం బి) సందిగ్ధ కోణం సి) గరిష్ఠ కోణం డి) గట్టు కోణం 24. ఎండమావులు ఏర్పడటానికి కారణమైన కాంతి దృగ్విషయం? ఎ) కాంతి పరావర్తనం బి) కాంతి వక్రీభవనం సి) సంపూర్ణాంతర పరావర్తనం డి) సందిగ్ధ కోణం ఏర్పడటం 25. కిందివాటిలో సంపూర్ణాంతర పరావర్తన అనువర్తనం ఏది? ఎ) వజ్రాలు ప్రకాశించడం బి) ఆప్టికల్ ఫైబర్లు పనిచేయడం సి) ఎండమావులు ఏర్పడటం డి) పైవన్నీ 26. కుంభాకార కటకాన్ని భూతద్దంగా వాడే సందర్భంలో వస్తువు స్థానం? ఎ) జ, ఞ ల మధ్య బి) జ, ఇ ల మధ్య సి) ఇ వద్ద డి) జ వద్ద 27. నిజ, మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరిచే కటకం? ఎ) పుటాకార కటకం బి) కుంభాకార కటకం సి) సమతల కుంభాకార కటకం డి) సమతల పుటాకార కటకం 28. స్పష్టదృష్టి కనిష్ఠ దూరం? ఎ) 20 ఛిఝ బి) 30 ఛిఝ సి) 25 ఛిఝ డి) 35 ఛిఝ 29. ఆరోగ్యవంతుడైన మానవుని దృష్టికోణం? ఎ) 30ని బి) 60ని సి) 45ని డి) 90ని 30. కంటిలో రంగులను గుర్తించేవి? ఎ) దండాలు బి) శంకువులు సి) సిలియారి కండరాలు డి) కంటినాడులు 31. కంటి కటక నాభ్యంతరాన్ని సర్దుబాటు చేయడంలో ఉపకరించేవి? ఎ) నేత్రోదక ద్రవం బి) దండాలు సి) శంకువులు డి) సిలియారి కండరాలు 32. {హస్వదృష్టి దోష నివారణకు వాడేది? ఎ) కుంభాకార కటకం బి) కుంభాకార దర్పణం సి) పుటాకార కటకం డి) పుటాకార దర్పణం 33. కంటికటకం కనిష్ఠ నాభ్యంతరం విలువ? ఎ) 2.5 ఛిఝ బి) 2 ఛిఝ సి) 2.27 ఛిఝ డి) 1.5 ఛిఝ 34. ఏ దృష్టిదోషం ఉన్నవారు ద్వినాభ్యంతర కటకాన్ని వాడతారు? ఎ) హ్రస్వదృష్టి బి) దీర్ఘదృష్టి సి) చత్వారం డి) వర్ణ అంధత్వం 35. కంటివైద్యుడు ఒక వ్యక్తికి 2ఈ కటకాన్ని వాడాలని సూచించాడు. ఆ కటక నాభ్యంతరం? ఎ) 20 ఛిఝ బి) 100 ఛిఝ సి) 200 ఛిఝ డి) 50 ఛిఝ 36. పట్టకం ద్వారా ప్రయాణించిన తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? ఎ) కాంతి పరావర్తనం బి) కాంతి వక్రీభవనం సి) కాంతి విక్షేపణం డి) కాంతి పరిక్షేపణం 37. కాంతివేగం ఎక్కువగా ఉండే యానకం? ఎ) విరళ యానకం బి) సాంద్రతర యానకం సి) విశ్వవ్యాప్త యానకం డి) ఈథర్ 38. ఇంద్రధనుస్సు ఏర్పడటంలో ఇమిడి ఉన్న కాంతి దృగ్విషయం? ఎ) పరిక్షేపణం బి) వక్రీభవనం సి) పరావర్తనం డి) విక్షేపణం 39. ఇంద్రధనుస్సు ఆకారం? ఎ) వృత్తాకారం బి) అర్ధవృత్తాకారం సి) త్రిమితీయ శంకువు డి) రేఖీయం 40. సూర్యోదయం, సూర్యాస్తమయ సమ యాల్లో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం? ఎ) కాంతి పరిక్షేపణం బి) కాంతి విక్షేపణం సి) కాంతి పరావర్తనం డి) కాంతి వక్రీభవనం 41. ద్రవాలు, వాయువుల్లో జరిగే కాంతి పరిక్షేపణాన్ని వివరించిన శాస్త్రవేత్త? ఎ) న్యూటన్ బి) సి.వి. రామన్ సి) హైగెన్స డి) మాక్స్ప్లాంక్ 42. కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందెవరు? ఎ) న్యూటన్ బి) హైగెన్స సి) మాక్స్వెల్ డి) మాక్స్ప్లాంక్ 43. హైగెన్స సిద్ధాంతం ప్రకారం బిందు కాంతి జనకం నుంచి వెలువడే తరంగాగ్రాల ఆకారం? ఎ) రేఖీయం బి) దీర్ఘఘనాకారం సి) గోళాకారం డి) శంకువు ఆకారం 44. కాంతి ధర్మాలన్నింటినీ వివరించిన సిద్ధాంతం? ఎ) కణ సిద్ధాంతం బి) తరంగ సిద్ధాంతం సి) విద్యుదయస్కాంత సిద్ధాంతం డి) వికిరణ క్వాంటం సిద్ధాంతం 45. సంపూర్ణ గోళానికి ఘనకోణం విలువ? ఎ) ఞ స్టెరేడియన్లు బి) 2ఞ స్టెరేడియన్లు సి) 3ఞ స్టెరేడియన్లు డి) 4ఞ స్టెరేడియన్లు 46. కాంతి తరంగాగ్రాల అంచుల వెంబడి వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు? ఎ) వక్రీభవనం బి) వివర్తనం సి) వ్యతికరణం డి) పరావర్తనం 47. లేజరులను ఉపయోగించే ప్రత్యేక త్రిమి తీయ ఫొటోగ్రఫీని ఏమంటారు? ఎ) క్రొమటోగ్రఫీ బి) రేడియోగ్రఫీ సి) హాలోగ్రఫీ డి) ఓషనోగ్రఫీ 48. లేజర్లకు సంబంధించిన శాస్త్ర విజ్ఞానాన్ని అందించినవారు? ఎ) ఛార్లెస్ హెచ్ టౌన్స బి) క్రిస్టియన్ హైగెన్ సి) ఐజాక్ న్యూటన్ డి) మాక్స్ప్లాంక్ 49. లేజర్ కిరణాల ఏకవర్ణీయతకు కారణం? ఎ) అధిక పట్టీ వెడల్పు బి) అతిస్వల్ప పట్టీ వెడల్పు సి) దిశనీయత డి) తీవ్రత 50. కాంతి అభివాహానికి ప్రమాణం? ఎ) ల్యూమెన్ బి) కాండెలా సి) స్టెరేడియన్ డి) ల్యూమోన్/సెకను 51. తరంగాల అధ్యయనం ద్వారా కాంతి లక్షణాలను తెలుసుకోవడానికి తోడ్పడేది? ఎ) కుంభాకార కటకం బి) లేసర్ సి) రిపిల్ టాంక్ డి) పట్టకం 52. కాంతి వివిధ రంగులకు కారణం? ఎ) కాంతి వేగంలో మార్పు బి) కాంతి తరంగదైర్ఘ్యంలో మార్పు సి) కాంతి పౌనఃపున్యంలో మార్పు డి) కాంతి జనకాల్లో మార్పు 53. జ = ృ20 ఛిఝ అయితే ఆ కటకం? ఎ) కుంభాకార కటకం బి) పుటాకార కటకం సి) సమతల కుంభాకార కటకం డి) సమతల పుటాకార కటకం 54. పుటాకార దర్పణం ద్వారా వస్తు పరిమాణానికి సమాన పరిమాణం ఉన్న ప్రతిబింబం ఏర్ప డాలంటే వస్తువును ఉంచాల్సిన ప్రదేశం? ఎ) జ వద్ద బి) ఇ వద్ద సి) జ, ఇ ల మధ్య డి) ఇ కి ఆవల 55. ఇంద్రధనుస్సులో ఏర్పడే రంగుల్లో అధిక తరంగదైర్ఘ్యం దేనికి ఉంటుంది? ఎ) ఆకుపచ్చ బి) నీలం సి) నారింజ డి) ఎరుపు 56. ఒక పుటాకార దర్పణం ద్వారా ఏర్పడిన ప్రతిబింబ ఆవర్తనం -6 అయితే ఆ ప్రతి బింబ లక్షణం? ఎ) తలకిందులుగా ఏర్పడుతుంది బి) నిజ ప్రతిబింబం సి) వస్తువు కంటే పెద్ద ప్రతిబింబం డి) పైవన్నీ సమాధానాలు 1) సి; 2) సి; 3) డి; 4) ఎ; 5) బి; 6) బి; 7) డి; 8) ఎ; 9) ఎ; 10) ఎ; 11) సి; 12) డి; 13) డి; 14) బి; 15) సి; 16) డి; 17) డి; 18) సి; 19) డి; 20) ఎ; 21) ఎ; 22) డి; 23) బి; 24) సి; 25) డి; 26) ఎ; 27) బి; 28) సి; 29) బి; 30) ఎ; 31) డి; 32) సి; 33) సి; 34) సి; 35) డి; 36) సి; 37) ఎ; 38) డి; 39) సి; 40) ఎ; 41) బి; 42) బి; 43) సి; 44) బి; 45) డి; 46) బి; 47) సి; 48) ఎ; 49) బి; 50) ఎ; 51) సి; 52) సి; 53) బి; 54) బి. 55) డి; 56) డి. -
పర్యాటక ఆహారం
ప్రపంచంలో... రకరకాల మనుషులు... రకరకాల మనస్తత్వాలు... రకరకాల ప్రదేశాలు... రకరకాల వాతావరణాలు... అవే కూరలకు ఒక్కో చోట ఒక్కో పేరు... ఒక్కో చోట ఒక్కో రకమైన వంట... ఊరు పేరు మారినా... రంగు, రుచి మారినా... అందరి లక్ష్యం... వండి తినడమే... ఆహారాన్ని ఆస్వాదించడమే! నేడు ప్రపంచ పర్యాటక దినం... ఈ సందర్భంగా ప్రపంచ దేశాలలో దొరికే పలురకాల వంటలు... మీరూ ప్రయత్నించండి.... కాదేదేశమూ రుచికి అనర్హం అనుకోండి... చైనా - కుంగ్ పావో చికెన్ కావలసినవి: స్కిన్లెస్, బోన్లెస్ చికెన్ - కప్పు (ముక్కలు చేయాలి); సాయ్ సాస్ - 2 టేబుల్ స్పూన్లు; నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు; కార్న్ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు (2 టేబుల్ స్పూన్ల నీళ్లలో కలపాలి); ఎండు మిర్చి ముద్ద - టేబుల్ స్పూను; వైట్ వెనిగర్ - టీ స్పూను; బ్రౌన్ సుగర్ - 2 టీ స్పూన్లు; ఉల్లికాడల తరుగు - అర కప్పు; వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూను; వాటర్ చెస్ట్నట్స్- 2 టేబుల్ స్పూన్లు; పల్లీ తురుము- టేబుల్ స్పూను. తయారీ: ఊరబెట్టడానికి: ఒక పాత్రలో టేబుల్ స్పూను సాయ్ సాస్, టేబుల్ స్పూను నూనె, టేబుల్ స్పూను నీళ్లలో కలిపిన కార్న్ఫ్లోర్ వేసి కలిపి, అందులో చికెన్ ముక్కలు వేసి సుమారు గంటసేపు ఊరనిచ్చాక, కింద నుంచి పైకి బాగా కలిపి, మూత పెట్టి ఫ్రిజ్లో అర గంటసేపు ఉంచాలి సాస్ తయారీ: చిన్న పాత్రలో టేబుల్ స్పూన్ సాయ్ సాస్, టేబుల్ స్పూను నూనె, టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ కలిపిన నీళ్లు, ఎండు మిర్చి ముద్ద, వెనిగర్, పంచదార వేసి బాగా కలిపి ఉల్లికాడల తరుగు, వెల్లుల్లి తరుగు, నీళ్లు, చెస్ట్నట్స్ తురుము, పల్లీల తురుము వేసి బాగా కలిపి, బాణలిలో వేసి స్టౌ మీద ఉంచి చిక్కగా అయ్యేవరకు కలుపుతుండాలి ఫ్రిజ్లో నుంచి చికెన్ మిశ్రమం తీసి, వేరే పాన్లో వేసి స్టౌ మీద ఉంచి, చికెన్ తెల్లగా మారేవరకు బాగా కలిపి, సాస్ తయారవుతున్న పాత్రలో వేసి కలపాలి అన్ని పదార్థాలు ఉడికి, కూర బాగా దగ్గర పడ్డాక దించేయాలి. ఎగ్లెస్ మార్బుల్ కేక్ కావలసినవి: బటర్ - 150 గ్రా; మెత్తగా చేసిన పంచదార పొడి - 150 గ్రా; పాలు - ముప్పావు కప్పు; వెనిగర్ - 3 టీ స్పూన్లు; మైదా పిండి - 150 గ్రా; వెనిలా ఎసెన్స్ - టీ స్పూను; కోకో పొడి - టేబుల్ స్పూను; బేకింగ్ పౌడర్ - ఒకటిన్నర టీ స్పూను; ఐసింగ్ కోసం... బటర్ - 50 గ్రా; ఐసింగ్ సుగర్ - 100 గ్రా; కరిగించిన చాకొలేట్ - 50 గ్రా.; కోకో - 2 టీ స్పూన్లు; అలంకరించడానికి స్వీట్లు - తగినన్ని. తయారీ: ఒక పాత్రలో పంచదార, బటర్ వేసి గిలక్కొట్టాలి పాలు, వెనిగర్ జత చేసి మరోమారు గిలక్కొట్టి, మిశ్రమాన్ని రెండు భాగాలు చేయాలి (టేబుల్ స్పూను మిశ్రమాన్ని పక్కన ఉంచాలి) ఒక సగంలో టేబుల్ స్పూను మైదా పిండి, ఒక సగంలో కోకో వేయాలి కేక్ ప్లేట్లో ఈ మిశ్రమాలను ఒక దాని మీద ఒకటి ఉంచాలి 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసిన అవెన్లో ఈ ట్రే ఉంచి, సుమారు 25 నిమిషాలు బేక్ చేసి, బయటకు తీసి చల్లారనివ్వాలి ఐసింగ్ కోసం ఇచ్చిన పదార్థాలను బాగా గిలక్కొట్టి, కేక్ మీద వేయాలి పండ్ల ముక్కలతో అలంకరించాలి. మొఘలాయీ బిర్యానీ బాద్షాహీ కావలసినవి: మటన్ - అర కేజీ; బాస్మతి బియ్యం - పావు కేజీ; నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు; బాదం పప్పుల తరుగు - 2 టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు - 10; బటర్ - కప్పు; కొత్తిమీర - కొద్దిగా; జీలకర్ర - అర టేబుల్ స్పూను; ఉల్లి తరుగు - అర కప్పు; ఏలకులు - 2; నూనె - టేబుల్ స్పూను; వెల్లుల్లి రేకలు - 2; అల్లం ముక్క - చిన్నది; కుంకుమ పువ్వు - అర టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు - అర టేబుల్ స్పూను; కారం - అర టేబుల్ స్పూను; దాల్చిన చెక్క - చిన్న ముక్క; పెరుగు - అర కేజీ; పాలు - 125 మి.లీ; నీళ్లు - 3 కప్పులు తయారీ: బియ్యం కడిగి నానబెట్టాలి బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి కొద్దిగా నీళ్లలో కుంకుమ పువ్వు వేసి కలపాలి అల్లం, ఎండు మిర్చి, వెల్లుల్లి, బాదంపప్పులను మిక్సీలో వేసి ముద్ద చేయాలి బాణలిలో బటర్ వేసి కరిగాక తయారుచేసి ఉంచుకున్న ఈ ముద్ద వేసి వేయించాలి మటన్, ఉప్పు జత చేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉంచాలి నీళ్లు పోసి బాగా ఉడికించాలి. (సుమారు ఒక కప్పు గ్రేవీ ఉండేవరకు ఉడికించాలి) ఒక పెద్ద పాత్రలో నీళ్లలో ఉప్పు, బియ్యం వేసి ఉడికించాలి పెరుగును ఒక వస్త్రంలో గట్టిగా కట్టి ఉన్న నీరంతా పోయేలా పిండేయాలి లవంగాలు, ఏలకులు, జీలకర్ర, పుదీనా, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర పెరుగులో వేసి కలపాలి కుంకుమ పువ్వు నీరు, నిమ్మరసం రెండింటినీ మటన్లో వేసి కలపాలి సగం అన్నాన్ని మటన్ మీద వేసి, వేయించి ఉంచుకున్న ఉల్లి తరుగు వేసి మళ్లీ పైన అన్నం వేయాలి పాలు, కొద్దిగా పెరుగు వేసి మూత ఉంచాలి సుమారు గంటసేపు స్టౌ మీద ఉంచి దించేయాలి వేడివేడిగా వడ్డించాలి. సేకరణ: డా. వైజయంతి -
ఏ రంగంటే ఇష్టమంటే.. నీలమంటున్నారంతా(టా)!!
-
నేత్రపటలంలో రంగులను గుర్తించే కణాలు?
DEECET - 2014 బయాలజీ 1. ధాన్యాలు, చిరుధాన్యాలు ఏ మొక్కల వంశానికి చెందుతాయి? 1) లిలియేసి 2) ఆస్టరేసి 3) గడ్డిజాతి 4) అన్నీ 2. ఫలాల నుంచి నారనిచ్చే మొక్క? 1) పత్తి 2) గోగు 3) కొబ్బరి 4)జనుము 3. అతి పురాతనమైన నార ఏ మొక్కకు చెందింది? 1) కోకస్ 2) హైబిస్కస్ 3) క్రొటలేరియా 4) గాసిపియం 4. జియామేజ్ దేని శాస్త్రీయ నామం? 1) వరి 2) గోధుమ 3) మొక్కజొన్న 4) సజ్జ 5. కాలికో ముద్రణలో దేని పిండిని వినియో గిస్తారు? 1) సజ్జ 2) రాగి 3) గోధుమ 4) వరి 6. పంటను అభివృద్ధి చేయడానికి ఉపయో గించే సామాన్య పద్ధతి? 1) నేలదున్నడం 2) కలుపు తీయడం 3) సంకరణ పద్ధతి 4) నీరు పెట్టడం 7. ‘లైవ్స్టాక్’ కింద ఏ జంతువులు వస్తాయి? 1) ఆవులు 2) గేదెలు 3) పశువులు 4) అన్నీ 8. రోడ్ ఐలాండ్ అనే జాతి దేనికి సంబంధిం చింది? 1) మేకలు 2) గొర్రెలు 3) కోళ్లు 4) గుర్రాలు 9. ఏ జాతి గొర్రె తోలుకి ప్రసిద్ధం? 1) అంగోరా 2) మెరినో 3) కొరిడేల్ 4) కారాకుల్ 10. మగ గాడిద, ఆడ గుర్రానికి పుట్టిన జీవిని ఏమంటారు? 1) ల్యాంబ్ 2) మ్యూల్ 3) బక్ 4) హిన్నీ 11. ప్లీస్ అని ఏ రోమాలను పిలుస్తారు? 1) ప్రాథమిక 2) ద్వితీయ 3) తృతీయ 4) బిరుసు 12. పామ్ మొక్క శాస్త్రీయ నామం? 1) సిసామమ్ ఇండికమ్ 2) ఎల్యుసిన్ కొరకానా 3) ఇలుసిస్ గెనైసిస్ 4) బ్రాసికా 13. ఇండియన్ రోజ్వుడ్ అని దేన్ని పిలుస్తారు? 1) సాలు 2) టేకు 3) వేప 4) డాల్బర్జియా 14. చెవిపోటు, చర్మవ్యాధుల నివారణలో వాడే కేంఫర్ అనే ఔషధం ఏ మొక్క నుంచి లభిస్తుంది? 1) యూకలిప్టస్ 2) డిజిటాలిస్ 3) ఆసిమమ్ 4) నక్స్వామికా 15. మలేరియా వ్యాధి నివారణలో వాడే ఔషధం? 1) అట్రోవిన్ 2) బ్రూసిన్ 3) క్వినైన్ 4) డిజిటాలిన్ 16. థార్న ఆపిల్గా ఏ మొక్కను పిలుస్తారు? 1) దతూరా 2) సింకోనా 3) నల్లమందు 4) ఆట్రోపా బెలడోనా 17. టస్సార్ పట్టు దేని నుంచి లభిస్తుంది? 1) బాంబిక్స్ మోరి 2) థియోపిలా 3) అట్టాకస్ సింధియా 4) ఆంధీరియా పాంపియా 18. పట్టులోని ప్రోటీన్? 1) కెరాటిన్ 2) ఆల్బుమిన్ 3) ఫైబ్రోయిన్ 4) సిలికాన్ 19. తేనె పట్టులో రాణి ఈగల సంఖ్య? 1) 200 - 300 2) 20,000-60,000 3) 1 4) 2 20. లక్క ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం? 1) శ్రీలంక 2) పాకిస్తాన్ 3) ఇండియా 4) నేపాల్ 21. డీడీటీ ఒక? 1) శిలీంద్ర నాశకం 2) కలుపు మొక్కల నాశకం 3) క్రిమిసంహారకం 4) ఎరువు 22. ఫిరమోనులు ఏ క్రియలో ఉపయోగ పడతాయి? 1) శ్వాసక్రియ 2) విసర్జన 3) ప్రత్యుత్పత్తి 4) జీర్ణక్రియ 23. సర్పాల పార్కు ఉన్న ప్రదేశం? 1) హైదరాబాద్ 2) గిండి 3) ఢిల్లీ 4) విజయవాడ 24. ముత్యం ఏ పదార్థంతో తయారవుతుంది? 1) సోడియం కార్బోనేట్ 2) కాల్షియం కార్బోనేట్ 3) కాల్షియం సిలికేట్ 4) మెగ్నీషియం కార్బోనేట్ 25. యూజీ ఈగలు ఏ పరిశ్రమను ప్రభావితం చేస్తాయి? 1) తేనె 2) లక్క 3) పట్టు 4) చేపలు 26. పట్టుపురుగు జీవిత చరిత్రలో ఉండే నిర్మోచ నాల సంఖ్య? 1) 3 2) 4 3) 2 4) లేవు 27. మూన్ జెల్లి ఏ వర్గానికి చెందుతుంది? 1) నిమటోడ 2) పొరిఫెరా 3) టినోఫోరా 4) కార్డేటా 28. జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం? 1) మొలస్కా 2) అనెలిడ 3) ఆర్థ్రోపొడ 4) ఇఖైనోడెర్మట 29. ఏ రాజ్యాన్ని మెటాఫైటా అంటారు? 1) ఫంజి 2) ప్లాంటే 3) ప్రొటిస్టా 4) ఎనిమేలియా 30. ఏ రాజ్యానికి చెందిన జీవులను ‘భూమిని శుభ్రపరిచే తోటీలు’ అంటారు? 1) మొనీరా 2) ప్రొటిస్టా 3) ఫంజి 4) ఎనిమేలియా 31. అతిపురాతన జీవులు ఏ రాజ్యానికి చెందు తాయి? 1) మొనీరా 2) ప్రొటిస్టా 3) ఫంజి 4) ఎనిమేలియా 32. ‘సముద్రంలో తేలియాడే పచ్చికబయళ్లు’ అని వేటికి పేరు? 1) బ్యాక్టీరియా 2) డయాటమ్స్ 3) స్మట్లు 4) మౌల్డ్లు 33. ‘జాతి’ పదాన్ని మొదటిసారిగా ఉపయో గించింది? 1) లిన్నయస్ 2) చరకుడు 3) జాన్రే 4) అరిస్టాటిల్ 34. జీర్ణక్రియ, శ్వాసక్రియకు సంబంధించిన జీవశాస్త్ర శాఖ? 1) పిండోత్పత్తి శాస్త్రం 2) శరీర ధర్మ శాస్త్రం 3) సూక్ష్మజీవ శాస్త్రం 4) పరిణామ శాస్త్రం 35. సముద్ర జంతువులపై శాస్త్రీయ అన్వేషణ జరిపే సంస్థ ఎక్కడుంది? 1) నాగ్పూర్ 2) గోవా 3) ఢిల్లీ 4) పుణే 36. లక్నోలో ఏ శాస్త్రీయ సంస్థలు ఉన్నాయి? 1) ఎన్బీఆర్ఐ, ఐఏఆర్ఐ 2) ఐఏఆర్ఐ, ఐఐఎస్ఆర్ 3) ఎన్బీఆర్ఐ, ఐఐఎస్ఆర్ 4) సీఐసీఆర్, సీఆర్ఆర్ఐ 37. ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్నవారు? 1) లూయిపాశ్చర్ 2) రాబర్టహుక్ 3) సలీం అలీ 4) సి.వి.రామన్ 38. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైకాలజీ? 1) అయ్యంగార్ 2) వెంకట్రామన్ 3) బీర్బల్ సహానీ 4) పంచానన్ మహేశ్వరి 39. పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికింది ఎవరు? 1) వాట్సన్, క్రిక్ 2) రొనాల్డ్ రాస్ 3) అరిస్టాటిల్ 4) విలియం హార్వే 40. ఖండాల కదలిక సిద్ధాంతాన్ని ప్రతి పాదించింది? 1) పంచానన్ మహేశ్వరి 2) బీర్బల్ సహానీ 3) ఎం.ఎస్. స్వామినాథన్ 4) లీవెన్హుక్ 41. వర్గీకరణలో ప్రాథమిక ప్రమాణం? 1) ప్రజాతి 2) జాతి 3) కుటుంబం 4) తరగతి 42. {పతిరక్షకాలు దేన్ని సంహరిస్తాయి? 1) బ్యాక్టీరియా 2) మాస్ 3) జంతువులు 4) వృక్షాలు 43. రొనాల్డ్రాస్కు నోబెల్ బహుమతి లభించిన సంవత్సరం? 1) 1962 2) 1902 3) 1898 4) 1885 44. కిందివాటిలో రసాయన గ్రాహకాలు? 1) ఘ్రాణ, చర్మ 2) ఘ్రాణ, కాంతి 3) శ్రవణ, కాంతి 4) ఘ్రాణ, రుచి 45. ‘ఎల్లోస్పాట్’ని ఏమని పిలుస్తారు? 1) నేత్రచుక్క 2) అంధచుక్క 3) ఫోవియా 4) రాడ్యులా 46. నేత్రపటంలోని దండాలు, కోనుల నిష్పత్తి? 1) 1 : 1 2) 15 : 2 3) 15 : 1 4) 1 : 15 47. డెర్మటాలజీ ఏ జ్ఞానేంద్రియ అధ్యయనం? 1) కన్ను 2) చెవి 3) ముక్కు 4) చర్మం 48. మధ్య చెవిని, గ్రసనితో కలిపే నిర్మాణం? 1) అర్ధవర్తులకుల్య 2) యుస్టాచియన్ నాళం 3) కర్ణావర్తనం 4) కర్ణాంతరాస్థి 49. ఇచ్మైట్ శరీరంలో ఏర్పర్చే బొరియల ఆకారం? 1) a 2) 3) b 4) c 50. చర్మంలోని నాసిసెప్టారులు దేనికి సంబం ధించినవి? 1) పీడనం 2) స్పర్శ 3) నొప్పి 4) ఉష్ణోగ్రత 51. కెరాటిన్ దేనిలో ఉంటుంది? 1) గోళ్లు 2) రోమాలు 3) గిట్టలు 4) అన్నీ 52. ఏ జ్ఞానేంద్రియం ఉష్ణోగ్రతను క్రమ పరుస్తుంది? 1) ముక్కు 2) నాలుక 3) చర్మం 4) చెవి 53. నాలుకపై చేదు గ్రాహకాలు ఏ భాగంలో అమరి ఉంటాయి? 1) ముందరి 2) వెనుక 3) పార్శ్వ 4) మధ్య 54. మానవుని చెవిలోని అర్ధ్దవర్తుల కుల్యల సంఖ్య? 1) 2 2) 3 3) 5 4) 6 55. శిశు పక్షవాతాన్ని కలిగించే సూక్ష్మజీవి? 1) వైరస్ 2) ప్రోటోజోవన్ 3) బ్యాక్టీరియా 4) కీటకం 56. సజలీకరణ ద్రావణాన్ని ఏ బ్యాక్టీరియల్ వ్యాధి నివారణలో వాడతారు? 1) టైఫాయిడ్ 2) కలరా 3) క్షయ 4) కోరింత దగ్గు 57. బీసీజీ టీకాను ఏ వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు? 1) గవద బిళ్లలు 2) పోలియో 3) కుష్ఠు 4) క్షయ 58. ‘రూబియోలా’ అని పిలిచే వైరల్ వ్యాధి? 1) గవద బిళ్లలు 2) ఆటలమ్మ 3) పొంగు 4) పోలియో 59. ‘ఆపరేషన్ ఫ్లడ్’ వేటి ఉత్పత్తికి సంబం ధించింది? 1) పాలు 2) మాంసం 3) కోడి గుడ్లు 4) కోళ్లు 60. చేపకుంటను ఏ రుతువులో నిర్మించాలి? 1) వేసవి కాలం 2) వర్షాకాలం 3) శీతాకాలం 4) నిర్దిష్ట సమయం లేదు 61. కొబ్బరిలో వేరువిల్డ్ వ్యాధిని కలిగించేది? 1) బ్యాక్టీరియా 2) వైరస్ 3) శిలీంద్రం 4) కీటకం 62. మొక్కల్లో వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు? 1) పైటో జాగ్రఫీ 2) పైటో పాథాలజీ 3) పైటోనిక్స్ 4) క్రయోజనిక్స్ 63. వైటిస్ వినిఫెరా ఏ మొక్క శాస్త్రీయ నామం? 1) నిమ్మ 2) ద్రాక్ష 3) బత్తాయి 4) నారింజ 64. చినీ, నిమ్మతోటల్లో వ్యాపించే వైరల్ వ్యాధి కానిది? 1) ట్రిస్టిజె 2) సిట్రస్ కాంకర్ 3) మొజాయిక్ 4) ఎల్లోకార్కీ వీన్ 65. హెర్బిసైడ్స వేటిని సంహరిస్తుంది? 1) ఎలుకలు 2) దోమలు 3) కలుపు మొక్కలు 4) సర్పాలు 66. వ్యాక్సినేషన్ను కనుగొన్న సంవత్సరం? 1) 1786 2) 1756 3) 1776 4) 1886 67. నీలి ఆకుపచ్చ శైవలాలు వేటిని పోలి ఉంటాయి? 1) వైరస్ 2) బ్యాక్టీరియా 3) శిలీంద్రాలు 4) జంతువులు 68. ఏ వ్యాధి తీవ్రతలో వరిపంట కాలిన మాదిరిగా కన్పిస్తుంది? 1) ఎండు తెగులు 2) అగ్గితెగులు 3) తెగులు బ్లాస్ట్ 4) కుంకుమ తెగులు 69. పెన్సిలిన్ను ఏ జీవుల నుంచి తయారు చేస్తారు? 1) శైవలాలు 2) శిలీంద్రాలు 3) కీటకాలు 4) వైరస్లు 70. గొంతుకు సంబంధించిన తీవ్రమైన బ్యాక్టీరి యల్ వ్యాధి? 1) కోరింత దగ్గు 2) క్షయ 3) డిప్తీరియా 4) హెపటైటిస్ 71. కిందివాటిలో ఎలుకల సంహారిణి? 1) డీడీటీ 2) జింక్ ఫాైస్ఫైడ్ 3) మలాథియాన్ 4) ఇథిలిన్ డైబ్రోమైడ్ 72. నేత్రపటలంలో రంగులను గుర్తించే కణాలు? 1) రాడ్స 2) కోన్స 3) 1, 2 4) అంధ చుక్క 73. అన్ని రకాల వాతావరణంలో నివసించే సూక్ష్మజీవులు? 1) ప్రోటోజోవా 2) శిలీంద్రాలు 3) బ్యాక్టీరియా 4) వైరస్ 74. బాహ్యచెవికి సంబంధించింది? 1) చెవిదొప్ప 2) కర్ణభేరి 3) బాహ్యశ్రవణ కుహరం 4) కర్ణాంతరాస్థి సమాధానాలు 1) 3; 2) 3; 3) 4; 4) 3; 5) 4; 6) 3; 7) 4; 8) 3; 9) 4; 10) 2; 11) 2; 12) 3; 13) 4; 14) 3; 15) 3; 16)1; 17) 4; 18) 3; 19) 3; 20) 3; 21) 3; 22) 3; 23) 2; 24) 2; 25) 3; 26) 2; 27) 3; 28) 3; 29) 2; 30) 3; 31) 1; 32)2; 33) 3; 34) 2; 35) 2; 36) 3; 37) 1; 38) 1; 39) 3; 40) 2; 41) 2; 42) 1; 43) 2; 44) 4; 45) 3; 46) 3; 47) 4; 48) 2; 49) 2; 50) 3; 51) 4; 52) 3; 53) 2; 54) 2; 55) 1; 56) 2; 57) 4; 58) 3; 59) 1; 60) 1; 61) 2; 62) 2; 63) 2; 64) 2; 65) 3; 66) 3; 67) 2; 68) 1; 69) 2; 70) 3; 71) 2; 72) 2; 73) 3; 74) 4; ఉద్యోగాలు డీఆర్డీవోలో సైంటిస్ట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో), ఢిల్లీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: ఏ సైంటిస్ట్ ‘ఎఫ్’ ఏ సైంటిస్ట్ ‘ఈ’ ఏ సైంటిస్ట్ ‘డి’ ఏ సైంటిస్ట్ ‘సి’ ఏ సెంటిస్ట్ ‘బి’ అర్హతలు: మొదటి శ్రేణిలో ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. లేదా సంబంధిత సబ్జెక్టుతో మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్. సైంటిస్ట్ ‘ఎఫ్’ 15 ఏళ్లు, సైంటిస్ట్ ‘ఈ’కు 10, సైంటిస్ట్ ‘డి’కు 7, సైంటిస్ట్ ‘సి’కు మూడేళ్ల అనుభవం ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేది: జూలై 20 వెబ్సైట్: www.rac.gov.in మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు.