breaking news
college anniversary
-
మహిళల భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్
కొచ్చి: 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్(వికసిత్ భారత్) కల సాకారం అవ్వాలంటే మహిళల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. కేరళ రాష్ట్రం కొచ్చిలోని సెయింట్ తెరిసా కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో శుక్రవారం ఆమె మాట్లాడారు. మహిళా నేతలు ముందుండి నడిపే సమాజం మరింత మానవీయంగా కాదు, సమర్థంగానూ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. దశాబ్ద కాలంలో మహిళలకు సంబంధించిన కేటాయింపులు నాలుగున్నర రెట్లు పెరిగాయన్నారు. 2011–2014 మధ్య కాలంలో పరిశ్రమల్లో మహిళల ప్రాతినిథ్యం రెట్టింపయిందన్నారు. వివిధ సామాజిక ఆర్థిక రంగాలకు చెందిన మహిళలు నేడు దేశ పురోగతిలో భాగస్వాములుగా మారారన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే కేరళ ముందంజలో ఉందని రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు. రాజ్యాంగ సభలోని 15 మంది మహిళా సభ్యుల్లో కేరళకు చెందిన అమ్ము స్వామినాథన్, అన్నీ మస్కరెనె, దాక్షాయణీ వేలాయుధన్ ఉండటం విశేషమన్నారు. వీరు సామాజిక న్యాయం, లింగ సమానత్వం, ప్రాథమిక హక్కులపై జరిగిన సంప్రదింపులు చురుగ్గా పాలుపంచుకున్నారని రాష్ట్రపతి గుర్తు చేశారు. కేరళకు చెందిన పలువురు మహిళలు వివిధ రంగాల్లో విశేష ప్రతిష్టను గడించారని అంటూ ఆమె..జస్టిస్ అన్నా చాందీ ఒక హైకోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జిగా పనిచేయగా, జస్టిస్ ఫాతిమా బీబీ 1989లో సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జిగా నియమితులయ్యారన్నారు. సెయింట్ తెరిసా కాలేజీలో చదువుకున్న ఎందరో దేశ అభివృద్ధి, పురోగతిలో తమ వంతు భాగస్వాములుగా కీలకంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్రపతి తెలిపారు. నిరుపేదలకు సేవ చేస్తూ నిరాడంబర జీవనశైలిని అనుసరిస్తున్న కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు. వరద బాధితుల కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసి, విద్యార్థులు నిస్వార్థంగా సేవలందిస్తుండటం ఎంతో సంతోషకరమైన విషయమని ముర్ము తెలిపారు. సెయింట్ తెరిసా కళాశాల వంటి ఉన్నత విద్యాసంస్థల కృషితో భారత్ నాలెడ్జి సూపర్ పవర్గా మారనుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉత్సాహంగా కళాశాల వార్షికోత్సవం..డ్యాన్స్ లతో అదరగొట్టిన యవత (ఫొటోలు)
-
College Annual Day Photos: ఉత్సాహంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు (ఫొటోలు)
-
విజయవాడ : తెలుగమ్మాయి ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
తమ్ముడు నేను సీనియర్నే.. సీఎం చమత్కారం!
సాక్షి, చెన్నై: రాజధాని కళాశాలలో తాను సీనియర్ అని, ప్రస్తుత విద్యార్థులను ఉద్దేశించి సీఎం అన్నారు. చెన్నైలోని రాజధాని కళాశాలలో డిగ్రీల ప్రదానోత్సవం మంగళవారం నిర్వహించారు. విద్యార్థులకు సీఎం స్టాలిన్, ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ గత స్మృతులను నెమర వేసుకున్నారు. తాను కూడా ఇదే కళాశాలలో చదువుకున్నట్లు నాటి రోజులను విద్యార్థుల దృష్టికి తెచ్చారు. పొలిటికల్ సైన్స్ తాను ఇక్కడే చదువుకున్నట్లు వివరించారు. అప్పటి మిత్రులను గుర్తు చేసుకుంటూ, ఆ కాలంలో విధించిన ఎమర్జనీ కారణంగా తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తాను ఈ కళాశాలలో సీనియర్ అని, అందుకే ఇక్కడున్న విద్యార్థులను సీనియర్గా అభినందించి, శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినట్టు వ్యాఖ్యానించారు. ఇక, ఈ కళాశాలల్లో రెండు వేల మంది విద్యార్థులు కూర్చునేందుక వీలుగా,అ న్ని సౌకర్యాలతో కలైంజర్ కరుణానిధి పేరిట ఆడిటోరియం నిర్మించనున్నామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ దయానిధి మారన్, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: Tamil Nadu Crime: ఓటీపీ చెప్పలేదని భార్య, పిల్లల ఎదుటే.. -
రాశీ అందం.. గీతా గీతం
సినీనటి రాశీఖన్నా అందాల మెరుపులు.. సింగర్ గీతామాధురి మధురమైన గీతాలతో కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం మారుమోగింది. కళాశాల వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ భూపాల్రెడ్డి, సెక్రటరీ, కరస్పాండెంట్ శ్రీశైలంరెడ్డి, సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ చైర్మన్ సీహెచ్ గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - సాక్షి, హైదరాబాద్


