-
బ్రాండెడ్ చాక్లెట్స్కు నకిలీ సరుకు తయారు చేస్తున్న ముఠా
-
చిన్నపిల్లలు తినే చాక్లేట్లను కల్తీ చేస్తున్న ముఠా
-
చాక్లెట్లతో పర్యావరణానికి హాని!
లండన్: మనం ఎంతో ఇష్టపడే చాక్లెట్ల వల్ల పర్యావరణానికి అపారమైన హాని కలుగుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్కు చెందిన పరిశోధకులు చాక్లెట్ల తయారీలో వాడే పదార్థాలు, తయారీ విధానం, ప్యాకింగ్ వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఇందులో బ్రిటన్లోని చాక్లెట్ల పరిశ్రమ ఏటా 20 లక్షల టన్నుల గ్రీన్ హౌన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా చాక్లెట్లు, ప్యాకింగ్ వాడే ముడి పదార్థాల వల్ల ఎక్కువ హాని కలుగుతోందని గుర్తించారు. -
చాకొలేట్ ధరలకు రెక్కలు..!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చాకొలేట్ ప్రియులకు చేదువార్త. చాకొలేట్ తయారీలో వినియోగించే ప్రధాన ముడిసరుకు కోకో సరఫరాలకు విఘాతం ఏర్పడటంతో సమీప భవిష్యత్తులో చాకొలేట్ ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలో కోకోను అధికంగా ఉత్పత్తిచేసే ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాపించిన కారణంగా చాకొలేట్ ముడి సరుకు సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో కోకో ధర ఇటీవలకాలంలో రికార్డు గరిష్టస్థాయికి చేరింది. కోకో ఉత్పత్తి పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్, ఘనా దేశాల నుండే వస్తోంది. ప్రపంచంలోని మొత్తం కోకో ఉత్పత్తిలో 70 శాతం వాటా ఈ రెండు దేశాలదే. ఈ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాపించినందున, ఉత్పత్తి క్షీణిస్తుందని, ఆ ప్రభావం చాకొలేట్ ధరలపై పడుతుందని శాంప్రే న్యూట్రిషన్ చైర్మన్ గుర్బానీ సాక్షి ప్రతినిధికి చెప్పారు. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో కోకో టన్ను ధర దాదాపు రికార్డు గరిష్టస్థాయి 3,723 డాలర్లకు (రూ. 2, 23,380) చేరింది. ఎబోలా వైరస్ ప్రభావంతో కోకో సరఫరా సమస్యలు ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకు ధరలు 100 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐవరీ కోస్ట్, ఘనా దేశాల నుండి సరఫరా అయ్యే కోకో నాణ్యతలో ఎంతో మెరుగైనదని, మిగతా ఏ దేశాల నుండీ ఆ స్థాయి నాణ్యతకల ఉత్పత్తి దిగుమతి చేసుకోవడం సాధ్యపడదని గుర్బానీ చెప్పారు. అంతర్జాతీయ సంస్థలైన క్యాడ్బరీ, నెస్లే, పర్ఫెట్టీలాంటి సంస్థలకు కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా చాకొలేట్లు ఉత్పత్తి చేస్తున్న శాంప్రే సంస్థ జస్ట్కాఫీ, క్యాండీ న్యూట్రీ, ఎక్లైర్స్ లాంటి స్వంత బ్రాండులనూ మార్కెట్ చేస్తోంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా చేతినిండా ఆర్డర్లున్నాయని, మూడు షిప్టుల్లో ఉత్పత్తి చేస్తున్నామని గుర్బానీ చెప్పారు. 2014 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సారానికి సంస్థ రూ. 3.76 కోట్ల విలువైన ముడిసరుకు వినియోగించింది. అంత క్రితం సంవత్సరం ముడి సరుకు వినియోగం రూ. 1. 1 కోటిగా నమోదైంది. తాజా పరిణామాలతో ముడి సరుకు ధరలు పెరిగితే శాంప్రే లాంటి సంస్థలు ముడి సరుకు కొనుగోలుపై అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుంది. కోకో ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడ్డ హైదరాబాద్కు చెందిన మరో చాక్లెట్ తయారీ సంస్థ లోటస్ చాక్లెట్ లిమిటెడ్. కోకోను పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు చాకొలేట్ తయారీలోనూ వినియోగిస్తోంది. కోకో మాస్, పౌడర్, బట్టర్, చాక్లెట్, ప్లైన్ చాకోపేస్ట్, క్రీం కవరింగ్స్, డ్రింకింగ్ చాక్లెట్, సాస్ లాంటి ఉత్పత్తులను తయారుచేస్తోంది. 2012-13లో సంస్థ రూ 33 కోట్లు ముడిసరుకును వినియోగించగా 2013-13 ఆర్థిక సంవత్సరానికి అది రూ. 43 కోట్లుకు పెరిగింది. కోకో ఉత్పిత్తి -సరఫరా.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 3.5 మిలియన్ టన్నుల కోకో ఉత్పత్తి అవుతోంది. చైనా, ఇండియా, అమెరికా దేశాల్లో సంపన్న వర్గాల ఆదాయం పెరుగుతుండటంతో కోకో వినియోగం 2020 నాటికి 4.5 మిలియన్ టన్నులకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోకో ధరలపై వాతావరణం, చీడపీడలు, ఉత్పాదక దేశాల్లో రాజ కీయ స్థిరత్వం వంటి అంశాలు ప్రభావం చూపుతుంటాయి. ఐవ రీ కోస్ట్లో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా 2011లో కోకో టన్ను ధర అత్యధికంగా 3,775 డాలర్లు (రూ. 1, 88, 750) పలికింది. డాలర్ల రూపేణా అప్పటి ధరకు మరో 50 డాలర్ల తక్కువగా ఇప్పటి ధర వున్నప్పటికీ, రూపాయి క్షీణించిన ప్రభావంతో భారత్ దిగుమతిదారులు ప్రస్తుతం టన్నుకు రూ. 2.23 లక్షలు వెచ్చించాల్సివస్తోంది. అధిక బరువు కోకోవాదే... చాకొలేట్ తయారీలో కోకోవాతో పాటు నట్స్, జామ్, ప్రూట్లను వాడుతారు. అయితో చాక్లెట్ మొత్తం బరువులో 25 శాతం బరువు కోకోదే. ఇక డార్క్ చాకొలెట్లయితే70 నుండి 80 శాతం చాక్లెట్ బరువు కోకోదే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డార్క్ చాకొలేట్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement