breaking news
car repairing
-
కారు ధర రూ.51 లక్షలు, రిపేరుకు రూ.50 లక్షల అంచనా..
హైదరాబాద్: అది 2020 అక్టోబర్ నెల.. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలు కురిశాయి. ఓ సర్వీస్ సెంటర్ నిర్లక్ష్యం వల్ల వరదల్లో కారు మునిగిపోయింది. పరిహారం కోసం బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో రూ.31 లక్షల పరిహారం చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సర్వీస్ సెంటర్ను ఆదేశిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. సర్వీస్ కోసం వచ్చిన కారును బయటకు తీయకుండా కారు పూర్తిగా దెబ్బతినడానికి సర్వీస్ సెంటర్ సిబ్బందే కారణమని కమిషన్ తేల్చింది. ఈ పరిహారాన్ని 45 రోజుల్లోపు పిటిషనర్కు చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు సీహెచ్ లతాకుమారి, సభ్యులు పారుపల్లి జవహర్బాబు, శ్యామలతో కూడిన బెంచ్ తీర్పును ఇచ్చింది. కారు ధర రూ.51 లక్షలు, రిపేరుకు రూ.50 లక్షల అంచనా.. హైదరాబాద్లోని బ్లూ ఓషన్ మల్టీ క్టయింట్ ఆఫీస్ వారు 2015లో రూ.51 లక్షలు వెచ్చించి వోల్వో కారును కొనుగోలు చేశారు. 2019లో కారు అకస్మాత్తుగా ఎయిర్ కండీషన్ పనిచేయకుండా ఆగిపోయింది. అంతేగాకుండా ఇంజిన్ వేడెక్కి ప్రమాదకరంగా మారింది. దీంతో వెంటనే పిటిషనర్ తల్వార్ కార్స్ ప్రైవేట్ సర్వీస్ సెంటర్ దగ్గర రూ.83 వేలు వెచ్చించి రిపేరు చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకే కారులో మళ్లీ సమస్యలు వచ్చాయి. కారు ఏసీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పలు రకాల సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో కారు యజమాని 2020లో కృష్ణ ఎక్స్క్లూజీవ్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ సెంటర్ను సంప్రదించగా కారు రిపేరు కోసం రూ.2.73 లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో కారు రిపేరు కోసం సర్వీస్ సెంటర్లోనే పెట్టుకున్నారు. 2020లో భారీ వర్షాలు కురిసి వరదలు రావడంతో సర్వీస్ సెంటర్లోకి నీరు వచి్చ, కారు మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో కారు రిపేరు కోసం రూ.50.45 లక్షల వరకు ఖర్చు అవుతుందని సర్వీస్ సెంటర్ సిబ్బంది అంచనా వేసి చెప్పారు. సరైన సమయానికి కారు రిపేరు చేయకుండా పెట్టి వరదల్లో మునిగిపోవడానికి కారణం అయిన సర్వీస్ సెంటర్ సిబ్బంది దీనికి పూర్తి బాధ్యత వహించాలని పిటిషనర్ సూచించాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో పిటిషనర్ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ను సంప్రదించి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ కారు పూర్తిగా దెబ్బతినడానికి కృష్ణ ఎక్స్క్లూజీవ్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ సెంటర్ కారణమని తేల్చింది. అందుకు పైన తెలిపిన విధంగా పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచి్చంది. -
ఇదేందయ్యా ఇది.. రూ.11 లక్షల కారు రిపేరుకు రూ.22 లక్షలు!
సాక్షి, బెంగళూరు: వరదలతో పాడైపోయిన కారును బాగు చేయించుకుందామనుకున్న ఓ వ్యక్తికి విచిత్రమైన సంఘటన ఎదురైంది. తన కారు రిపేర్ కోసం సర్వీస్ సెంటర్ వాళ్లు ఇచ్చిన ఎస్టిమేట్ స్లిప్ చూసి అవాక్కయ్యాడు. రూ.11 లక్షల విలువైన వోక్స్వాగన్ పోలో హ్యాచ్బ్యాక్ కారును రిపేర్ చేసేందుకు రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేశారు. తనకు ఎదురైన ఈ సంఘటనను లింక్డ్ఇన్లో షేర్ చేశారు అనిరుధ్ గణేశ్. బెంగళూరులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గణేశ్ కారు పాడైపోయింది. పూర్తిగా నీటిలో మునిగిపోవటంతో ఇంజిన్ పనిచేయటం లేదు. దాంతో వోక్స్వాగ్ సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లారు గణేశ్. సుమారు 20 రోజుల తర్వాత కారు సర్వీస్ కోసం రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేసి పంపించారు. దీంతో ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించారు గణేశ్. కారు పూర్తిగా పాడైపోయిందని, దానిని రిపేర్ సెంటర్ నుంచి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. అయితే.. అక్కడి నుంచి తీసుకెళ్లాలంటే రూ.44,840 చెల్లించాలని సర్వీస్ సెంటర్ వాళ్లు చెప్పటంతో మరోమారు అవాక్కవ్వాల్సి వచ్చింది. కారు డ్యామేజ్ అంచనా వేసేందుకు పత్రాలు సిద్ధం చేసినందుకు గానూ ఆ ఫీజు కట్టాలని సూచించారు. ఈ విషయంపై వోక్స్వాగన్ సంస్థకు ఫిర్యాదు చేశారు గణేశ్. చివరకు రూ.5000 వేలు కట్టి కారు తీసుకెళ్లాలని సంస్థ సూచించింది. కారు రిపేరు కోసం ఇచ్చిన ఎస్టిమేషన్ స్లిప్ ఇదీ చదవండి: దసరా ఎఫెక్ట్: హైవేలపై పెరిగిన వాహనాల రద్దీ -
వైరాలో కారు దగ్ధం
ఖమ్మం జిల్లా : ప్రమాదవశాత్తూ ఓ కారు వైరా ప్రభుత్వ పాఠశాల వద్ద ఆదివారం దగ్ధమైంది. కారుకు వెల్డింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పి వేసేందుకు ప్రయత్నించే లోపే మంటలు కారంతా వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గురైన వాహనాన్ని ఇండికా కారు నెంబర్ ఏపీ16టీవీ 8199గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.