breaking news
Cairns
-
కెయిన్స్ కప్ క్వీన్ హంపి...
తెలుగు తేజం, ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి కెరీర్లో మరో గొప్ప విజయం చేరింది. గతేడాది డిసెంబర్ చివరి వారంలో ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్గా అవతరించిన ఈ భారత నంబర్వన్ మహిళా చెస్ స్టార్... తాజాగా అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ అంతర్జాతీయ టోర్నమెంట్లోనూ విజేతగా నిలిచింది. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు క్లాసికల్ ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో 32 ఏళ్ల హంపి ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజా ప్రదర్శనతో హంపి ప్రపంచ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరుకోనుంది. సెయింట్ లూయిస్ (అమెరికా): రెండు నెలల క్రితం ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్గా అవతరించి కొత్త చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి... మళ్లీ అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇద్దరు మాజీ ప్రపంచ చాంపియన్స్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా), మరియా ముజిచుక్ (ఉక్రెయిన్), ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ (చైనా), ప్రపంచ బ్లిట్జ్ మాజీ చాంపియన్ కాటరీనా లాగ్నో (రష్యా), మూడుసార్లు యూరోపియన్ చాంపియన్ వాలెంటినా గునీనా (రష్యా)లాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులు బరిలోకి దిగిన కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో హంపి చాంపియన్గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ టోర్నీలో హంపి ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని అలంకరించింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారికతో పోటీపడిన హంపి నల్లపావులతో ఆడుతూ కేవలం 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి నాలుగు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్లో ఓడిపోయింది. 5.5 పాయింట్లతో జూ వెన్జున్ రన్నరప్గా నిలువగా... 5 పాయింట్లతో మరియా ముజిచుక్ మూడో స్థానాన్ని సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి హారిక 4.5 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. లక్షా 80 వేల డాలర్ల ప్రైజ్మనీతో నిర్వహించిన ఈ టోర్నీలో పాల్గొన్న పది మందికీ ప్రైజ్మనీ ఇచ్చారు. విజేతగా నిలిచిన హంపికి 45 వేల డాలర్లు (రూ. 32 లక్షల 10 వేలు)... రన్నరప్ జూ వెన్జున్కు 35 వేల డాలర్లు (రూ. 24 లక్షల 97 వేలు)... మూడో స్థానంలో నిలిచిన మరియా ముజిచుక్కు 25 వేల డాలర్లు (రూ. 17 లక్షల 83 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. తాజా ఫలితంతో హంపి 2585 ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచ లైవ్ ర్యాంకింగ్స్లో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. చైనా గ్రాండ్మాస్టర్ హు ఇఫాన్ 2658 పాయింట్లతో టాప్ ర్యాంక్లోఉంది. పలువురు మేటి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీ కోసం ప్రత్యేకంగా రెండు వారాలపాటు ప్రాక్టీస్ చేశాను. వివిధ రకాల ఓపెనింగ్స్ సాధన చేశాను. రెండు నెలల క్రితం నేను సాధించిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ గాలివాటంగా వచ్చినదేమీ కాదని తాజా ప్రదర్శనతో నిరూపించాను. కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత స్వదేశంలో నా ఉద్యోగ సంస్థ పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ఇంటర్ యూనిట్ టోర్నమెంట్లో పాల్గొంటాను. ఆ తర్వాత మే నెలలో ఇటలీలో జరిగే గ్రాండ్ప్రి టోర్నీలో బరిలోకి దిగుతాను. ఈ ఏడాది చివర్లో జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించడమే నా తదుపరి లక్ష్యం. –‘సాక్షి’తో కోనేరు హంపి -
కెయిన్స్ ను ఎప్పటికీ క్షమించను: మెకల్లమ్
వెల్లింగ్టన్: తనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి అప్రతిష్టపాలు చేసిన క్రిస్ కెయిన్స్ ను ఎప్పటికీ క్షమించనని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ తేల్చి చెప్పాడు. 2008లో మ్యాచ్ను ఫిక్స్ చేస్తే భారీగా డబ్బులు అందుతాయని మెకల్లమ్కు కెయిన్స్ ఆశ చూపాడు. అరుుతే ఈ ఆఫర్ను తిరస్కరించిన తను 2011లో ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్కు సమాచారమందించాడు. అలాగే గతేడాది లండన్ కోర్టులో కెయిన్స్ పై జరిగిన విచారణలో మెకల్లమ్ సాక్షిగా హాజరయ్యాడు. ‘నేను చాలా జాలిగుణం కలిగిన వ్యక్తిని. నిజానికి తను జైలుకెళ్లవద్దనే కోరుకున్నాను. కానీ మరో రకంగా మాత్రం కెయిన్స్ ను ఎప్పటికీ క్షమించను. నన్ను చెడుగా చిత్రీకరించేందుకు తను పెద్ద ఎత్తున లాబీరుుంగ్ చేసి ఒత్తిడి తీసుకువచ్చాడు. అరుుతే ఇప్పుడు ఎవరి జీవితం వారిది. మేమెప్పుడూ కలుసుకోకూడదనే అనుకుంటున్నాను’ అని మెకల్లమ్ చెప్పాడు. -
ఆస్ట్రేలియాలో మరో దారుణం
-
ఆస్ట్రేలియాలో మరో దారుణం: 8 మంది చిన్నారుల మృతి
మెల్బోర్న్ : సిడ్నీలోని కేఫ్ ఘటన, పాకిస్థాన్ పెషావర్లో చిన్నారుల నరమేధం మనోఫలకంపై నుంచి చెరగక ముందే ఆస్ట్రేలియాలోని సౌత్ క్వీన్స్ ల్యాండ్లో మరో దారుణం చోటు చేసుకుంది. సౌత్ క్వీన్స్ల్యాండ్లోని కెయిర్న్స్ పట్టణంలోని ఓ ఇంటిలో మహిళ (34) తీవ్రంగా గాయపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ ఇంటి ఆవరణలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఎనిమిది మంది చిన్నారులను మృతదేహలను గుర్తించారు. ఆ మృతదేహలన్నీ ఏడాదిన్నర వయస్సు గల చిన్నారుల నుంచి 15 సంవత్సరాల వయస్సు గల వారివి ఉన్నాయని చెప్పారు. పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు ఆ మృతదేహాలపై గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా సోదరులుగా భావిస్తున్నామని చెప్పారు. గాయపడిన మహిళ ఆరోగ్యం పరిస్థతి ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ ఇంటిని అణువణువు తనిఖీ చేస్తున్నారు. అలాగే ఇంటి పరిసరాల్లోని వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉల్కిపడింది. దేశం ప్రస్తుతం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటుందని ప్రధాని టోని అబ్బాట్ తెలిపారు. ఈ దారుణంపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదన్నారు.