-
25 లక్షలు వద్దు.. కోటి పరిహారం కావాలి..!
లక్నో : ఉత్తర ప్రదేశ్లో శనివారం జరిగిన యాపిల్ సంస్థ మేనేజర్ వివేక్ తివారి ఎన్కౌంటర్పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లకు బాధ్యత వహిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్ రాజీనామా చేయాలని సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వానికి వారి కుటుంబం నుంచి ఊహించని షాక్ తగిలింది. పోలీసుల కాల్పుల్లో మరణించిన వివేక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రులు బ్రజేష్ పాఠక్, అశుతోష్ టాండన్లు ఆదివారం వారి ఇంటికి వెళ్లారు. ప్రభుత్వం తరుఫున నుంచి రూ. 25 లక్షల నష్టపరిహరం అందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి వివేక్ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు 25 లక్షలు అవసరం లేదని.. కోటి పరిహారం కావాలని అతని భార్య కల్పన డిమాండ్ చేశారు. తమ కుటుంబమంతా వివేక్పైనే అధారపడి ఉందని.. పోలీసులు అక్రమంగా కాల్చి చంపారని, తమ పిల్లల భవిష్యత్తు ఏంటని ఆమె ప్రశ్నించారు. సీఎం యోగి ఆదిత్యా ఇక్కడి వచ్చి తమకు సమాధానం చెప్పే వరకు మృత దేహానికి దహన సంస్కారాలు నిర్వహించమని ఆమె తేల్చి చెప్పారు. ఆమెను కాసేపు మంత్రులు సముదాయించే ప్రయత్నం చేసిన వారి మాట వినకపోవడంతో మంత్రులు తిరిగి వెళ్లి పోయారు. తనంతరం ఆప్ నేత ఢిల్లీ మంత్రి సంజయ్ సింగ్ మృతుడి కుంటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ వారితో ఫోన్లో మాట్లాడి వివేక్ కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాడతమని హామీ ఇచ్చారు. చదవండి : కారు ఆపనందుకు కాల్చేశారు -
మాయావతికి మరోషాక్
ఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో పార్టీ ఫిరాయింపులు జోరందుకున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ముఖ్య అనుచరుడు మరొకరు పార్టీని వీడారు. బీఎస్పీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు బ్రజేష్ పాఠక్ బీజేపీ గూటికి చేరారు. సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. అమిత్ షా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఎస్పీకి చెందిన మరో ముఖ్యనేత, సీనియర్ ఎమ్మెల్యే స్వామిప్రసాద్ మౌర్య ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీఎస్పీ జనరల్ సెక్రెటరీగా, మంత్రిగా, విపక్షనేతగా పనిచేసిన మౌర్య బీజేపీలో చేరారు. కాగా ఇతర పార్టీలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఇటీవల బీఎస్పీలో చేరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement