breaking news
Australia series win
-
‘బాగా ఆడింది వారైతే నాకెందుకు ఆ క్రెడిట్’
బెంగళూరు: ఇటీవల ఆసీస్ గడ్డపై టీమిండియా సాధించిన సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాళ్లను భారత జట్టు మాజీ సారధి, ప్రస్తుత భారత అండర్-19, ఇండియా-ఏ జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆకాశానికెత్తాడు. ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్లో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, శుభ్మన్ గిల్ అద్భుతంగా రాణించి టీమిండియాకు చారిత్రక సిరీస్ విజయాన్ని అందించారు. వారి ఆ స్థాయి ప్రదర్శన వెనుక 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ కృషి ఉందన్నది బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. రాహుల్ మాత్రం దాంతో ఏకీభవించడం లేదు. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో కుర్రాళ్లు చేసిన అద్భుత ప్రదర్శనకు క్రెడిట్ మొత్తం వారికే దక్కాలని ఓ స్పోర్ట్స్ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మైదానంలో కుర్రాళ్లు చూపిన తెగువ, ధైర్యం, ఆట పట్ల నిబద్ధత ఎంతో అద్భుతమని, వారి వ్యక్తిగత ప్రతిభ కారణంగానే కుర్రాళ్లు ఈ స్థాయికి చేరారని ద్రవిడ్ ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుత సీనియర్ జట్టులో సభ్యులైన కుర్రాళ్లకు అండర్-19 జట్టు సభ్యులుగా ఉన్నప్పుడు తాను కోచింగ్ ఇచ్చానన్న కారణంగా కుర్రాళ్లు సాధించిన ఘనతను తనకు ఆపాదించడం సమంజసం కాదని అన్నాడు. క్రెడిట్ మొత్తానికి వారు మాత్రమే అర్హులని పేర్కొన్నాడు. కాగా, యువకుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసి, ఆటలో వారికి మెళకువలు నేర్పించి, కుర్రాళ్ల అద్భుత ప్రదర్శనకు కారకుడైన ద్రవిడ్పై యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ద్రవిడ్ పైవిధంగా స్పందించాడు. -
ఒక్కొక్కరికి అర కోటి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాను కంగుతినిపించిన భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రోత్సాహకాలు ప్రకటించింది. కోహ్లి సేన సభ్యులకు రూ. 50 లక్షల చొప్పున నజరానా ఇవ్వనుంది. కోచ్ కుంబ్లేకు రూ. 25 లక్షలు, ఇతర సహాయ సిబ్బందికి రూ. 15 లక్షల చొప్పున పారితోషికాల్ని అందజేయనుంది. ‘టెస్టుల్లో అగ్రస్థానం నిలబెట్టుకున్న టీమిండియాకు బీసీసీఐ అభినందనలు. ఈ సీజన్లో సొంతగడ్డపై అజేయంగా కొనసాగుతోంది. ఇందుకు ప్రోత్సాహకంగా నజరానా అందజేస్తాం’ అని బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. నజరానాను ప్రొ రాటా పద్ధతిలో ఇస్తామని అందులో పేర్కొన్నారు. అంటే ఆడిన మ్యాచ్లను బట్టి ఈ పారితోషికాన్ని అందజేయనున్నారు. పూర్తిగా నాలుగు మ్యాచ్లు ఆడిన ఆటగాడికి రూ. 50 లక్షలు, రెండే మ్యాచ్లు ఆడితే రూ. 25 లక్షలు ఇస్తారు.