breaking news
Anti-national activities
-
చరిత్రను వక్రీకరిస్తున్న మోదీ
కలబురగి (కర్ణాటక): అస్సాంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కాంగ్రెస్ పారీ్టయే కారణమంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరగనున్న అస్సాంలో మోదీ చేసిన ప్రసంగంపై ఖర్గే ఆదివారం తీవ్రంగా ప్రతిస్పందించారు. స్వాతంత్య్రానికి పూర్వం ముస్లిం లీగ్, బ్రిటిష్ వారు కలిసి దేశ విభజనకు పునాదులు వేస్తున్నప్పుడు, అస్సాంను తూర్పు పాకిస్థాన్లో కలిపేందుకు కుట్ర పన్నారని, ఆ కుట్రలో కాంగ్రెస్ కూడా భాగస్వామి అయిందని మోదీ ఆరోపించారు. కేవలం గోపీనాథ్ బార్డోలోయ్ మాత్రమే సొంత పార్టీని ఎదిరించి అస్సాం అస్తిత్వాన్ని కాపాడారని ప్రధాని స్పష్టం చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే.. దీనిపై ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ‘కేంద్రంలోనూ, అస్సాంలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. మరి రక్షణ కల్పించడంలో విఫలమైతే ప్రతిపక్షాలను ఎలా నిందిస్తారు? మీరు విఫలమైన ప్రతిసారీ విపక్షాలపై బురద చల్లడం తగదు. ఈ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’.. అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం రద్దు చేయడంపై కూడా ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పేదలకు జీవనాడి వంటిదన్నారు. గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, ధనవంతులకు బానిసలుగా మార్చడానికే మోదీ ఈ చట్టాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రతి జిల్లాలోనూ ఆందోళనలు చేపడతామని ఖర్గే హెచ్చరించారు. బంగ్లాదేశ్లో హిందువుపై జరిగిన మూకదాడి ఘటనను ఖర్గే తీవ్రంగా ఖండించారు. ‘అక్కడ హిందువులకు రక్షణ కల్పించాలి. భారత ప్రభుత్వం వెంటనే ఆ దేశంతో మాట్లాడి హిందువుల రక్షణకు చర్యలు చేపట్టాలి’.. అని ఆయన డిమాండ్ చేశారు. -
దేశ వ్యతిరేకి!
నామ్ రూప్: ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆ పార్టీ తలమునకలుగా ఉందని మండిపడ్డారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు అసోంలో స్థిరపడేందుకు అన్నివిధాలా సాయం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘అందుకే ఓటర్ల జాబితా సవరణను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓటు బ్యాంకు తప్ప దానికి మరేమీ పట్టదు.ఎలాగైనా అధికారాన్ని ఒడిసిపట్టడమే ఆ పార్టీ ఏకైక లక్ష్యం‘ అని ఎద్దేవా చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలున్న అసోంలో దిబ్రుగడ్ జిల్లాలోని నామ్ రూప్ లో రూ.10,601 కోట్లతో నిర్మించిన భారీ ఎరువుల కర్మాగారాన్ని ఆదివారం ప్రధాని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ను దునుమాడారు. ‘‘ఆ రాష్ట్రంపై దానిది ఎప్పుడూ సవతి ప్రేమే. అస్సామీల అస్తిత్వం, సంస్కృతి, ప్రతిష్ఠ కాంగ్రెస్కు ఏనాడూ పట్టలేదు. వాటి పరిరక్షణకు పాటుపడుతున్నది బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ అనే విషం బారినుంచి అస్సాంను కాపాడాల్సిన అవసరముంది . ఈ విషయంలో బీజేపీ ఒక కవచంలా నిలుస్తుంది‘ అన్నారు. రాష్ట్రంలో దశాబ్దాల హింసాకాండకు శాశ్వతంగా తెర దించేందుకు బీజేపీ ఎంతో కృషి చేస్తోందన్నారు. నాటి అహోం రాజా వంశ పాలనలో ఉన్నంత శక్తిమంతంగా అసోంను తీర్చిదిద్ది తీరుతామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మోదీ చెప్పారు.ద్రోహాలను కడుగుతున్నాందేశానికి కాంగ్రెస్ ఎన్ని ద్రోహాలు చేసిందో లెక్కే లేదని మోదీ అన్నారు. దాంతో, 12 ఏళ్లుగా తమ సర్కారు ఎంతగా సరిచేస్తున్నా, ఇంకా చక్కదిద్దాల్సిన తప్పిదాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ‘అసోం ఆణిముత్యం భూపేన్ హజారికాకు భారతరత్న ప్రకటిస్తే బాహాటంగా వ్యతిరేకించిన చరిత్ర కాంగ్రెస్ ది! ’ఆడిపాడే వారికి మోదీ భారతరత్న ఇస్తున్నాడు’ అంటూ ఎద్దేవా చేసి అస్సామీల మనసులకు తీరని గాయం చేసింది‘ అని మండిపడ్డారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ విభాగం ఏర్పాటు చేసినా వ్యతిరేకించిన కాంగ్రెస్ ను ఏమనాలో కూడా అర్థం కావడం లేదన్నారు. పారిశ్రామికీకరణ, కనెక్టివిటీ అస్సాం కలలు క్రమంగా సా చేస్తున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. సభకు మహిళలు భారీగా తరలిరావడం హర్షణీయమని మోదీ అన్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తాను భేటీ అయినపుడు ఆయనకు అసోం బ్లాక్ టీ పొడి కానుకగా ఇచ్చినట్టు గుర్తు చేశారు.స్టూడెంట్స్తో బోటు షికారుప్రధాని మోదీ ఆదివారం ఉదయం అసోంలో బ్రహ్మపుత్రా నదిలో బోటు షికారు చేశారు. వినూత్నంగా క్రూయిజ్ షిప్ లో విద్యార్థులతో గంటపాటు పరీక్షా పే చర్చా కార్యక్రమం జరిపారు. పలు స్కూళ్లకు చెందిన 25 మంది స్టూడెంట్లు ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు గువాహ తిలో అసోం ఆందోళన అమర వీరుల స్తూపం వద్ద మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. అసోంలోకి అక్రమ చొరబాట్లను వ్యతిరేకిస్తూ చేపట్టిన స్వహిద్ సమరక్ ఉద్యమంలో 860 మందికి పైగా అసువులు బాశారు. ఇందుకు గుర్తు నిర్మించిన స్వహిద్ సమరక్ క్షేత్ర వద్ద వెలిగే నిత్య ప్రమిదకు మోదీ ప్రణమిల్లారు. ఆయన రెండు రోజుల అసోం పర్యటన ఆదివారంతో ముగిసింది. -
స్థానిక పత్రికా ఆఫీసుపై దాడులు : ఖండించిన కశ్మీర్ టైమ్స్
జాతి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందంటూ జమ్మూ -కాశ్మీర్ పోలీసులకు చెందిన రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) గురువారం జమ్మూలోని కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై దాడి చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలతో ఈ దాడులు చేపట్టింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ప్రారంభమైన సోదాలలో Ak-47 కార్ట్రిడ్జ్లు, పిస్టల్ రౌండ్లు , మూడు గ్రెనేడ్ లివర్లు స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అసంతృప్తిని వ్యాప్తి చేయడం, వేర్పాటువాదాన్ని కీర్తించడం లాంటివి, భారతదేశం, కేంద్రపాలిత ప్రాంతం, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంకరమనే ఆరోపణల కింద కాశ్మీర్ టైమ్స్పై కేసు నమోదు చేశారు. కాశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉందని ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది.ఇదీ చదవండి: Delhi Blast Case : మరో నలుగురు ప్రధాన నిందితులు అరెస్ట్మరోవైపు మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఆరోపణలను కాశ్మీర్ టైమ్స్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులకు సంబంధించిన తమకు అధికారికర సమాచారమేదీ లేదని ఒక ప్రకటనలో తెలిపింది.. రాష్ట్రానికి హానికలిగించే కార్యకలాపాలు అంటూ ఎస్ఐఏ చేసిన ఆరోపణలని నిరాధారమైనవని పేర్కొంది. తమ కార్యాలయంపై దాడి తమ వాయిస్ను అణచివేసేందుకు చేసే మరో ప్రయత్నంలో భాగమేనని ఆరోపించింది. తమ కార్యాలయం గత నాలుగు సంవత్సరాలుగా మూసివేశామని, ప్రింట్ ఎడిషన్ 2021-2022లో నిలిపివేయగా, డిజిటల్గా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నామని వివరించింది. రాష్ట్రానికి తమ కార్యాలయాలపై దాడి చేసే అధికారం ఉండవచ్చు. కానీ నిజాలను మాట్లాడే తమ నిబద్ధతపై దాడి చేయదని పేర్కొంది. జర్నలిజం నేరం కాదు. జవాబుదారీతనం రాజద్రోహం కాదు. తాము తమపై ఆధారపడిన వారికి సమాచారం ఇవ్వడం కొనసాగిస్తామనం ఎడిటర్లుప్రబోధ్ జమ్వాల్, అనురాధ భాసిన్ ప్రకటించారు. -
యువతకు వీర జవాన్ హనుమంతప్ప భార్య విన్నపం
నాగ్పూర్: ఇటీవల దేశ వ్యతిరేక కార్యకలాపాలు చోటుచేసుకోవడం తనను బాధించిందని వీర జవాన్ లాన్స్ నాయక్ హనుమంతప్ప భార్య మహాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మహాదేవి మాట్లాడుతూ.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని యువతకు విన్నవించారు. 'నా భర్త హనుమంతప్పకు ఆర్మీలో చేరాలన్నది ఆశయం. ఆయన పోలీస్ ఉద్యోగానికి ఎంపికైనా, ఆర్మీలో చేరారు. ఇటీవల మన దేశంలో దేశ వ్యతిరేక కార్యకాలాపాలు చోటు చేసుకోవడం నాకు బాధ కలిగించింది. మనం భారత్లో జన్మించాం. మనం జీవించడానికి భరతమాత ఈ దేశాన్ని ఇచ్చింది. మనం దీన్ని దుర్వినియోగం చేస్తున్నాం. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసేందుకు మనం సిద్ధంగా ఉండాలి. నాకు కొడుకు లేడు. దేశానికి సేవ చేయడానికి నా కుమార్తెను పంపిస్తా. ఆమెను ఆర్మీలో చేరుస్తా' అని మహాదేవి చెప్పారు. సియాచిన్ మంచుకొండల్లో చిక్కుకుని, ఆరు రోజుల మృత్యువుతో పోరాడి లాన్స్నాయక్ హనుమంతప్ప వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. -
'జాతి వ్యతిరేక కార్యక్రమాలను సహించేది లేదు'
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ)లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతి వ్యతిరేక కార్యక్రమాలను సహించేది లేదని శుక్రవారం స్పష్టం చేశారు. భారత దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా నినాదాలు, దేశ సమగ్రతను ప్రశ్నించడంలాంటివి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు. జేఎన్యూలో ఘటనలో బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్షకు గురైన అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా, కశ్మీరీ ప్రజల పోరాటానికి మద్దతుగా.. జేఎన్యూలో మంగళవారం సాయంత్రం పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించటంపై వర్సిటీ పాలకవర్గం క్రమశిక్షణా విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం దేశ వ్యతిరేకమైన కార్యక్రమమని..అనుమతి రద్దు చేసినా కార్యక్రమాన్ని నిర్వహించారని, అందుకు బాధ్యులైన విద్యార్థులను బహిష్కరించాలని డిమాండ్ రావడంతో వర్సిటీ పాలకవర్గం విచారణకు ఆదేశించింది.


