-
సాయాజి షిండే హెల్త్ అప్డేట్ ప్రకటించిన వైద్యులు
ప్రముఖ నటుడు సాయాజి షిండేకు ఏప్రిల్ 12న ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. మహారాష్ట్రలోని సతారాలో ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారని డాక్టర్ సోమనాథ్ తెలిపారు. అందువల్ల ప్రస్తుతం ఆయనకు ఆంజియోప్లాస్టీ చేశామని ఆయన పేర్కొన్నారు. సాయాజి షిండే హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. దాంతో ఆయనకు వైద్యులు ఆంజియోప్లాస్టీ చేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సాయాజి షిండే కూడా ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు. 'అందరికీ నమస్కారం, నేను చాలా బాగున్నాను. నన్ను ప్రేమించే నా శ్రేయోభిలాషులు చూపిన అభిమానానికి ఫిదా అవుతున్నాను. మీ అందరూ నాతోనే ఉన్నారు. చింతించాల్సిన పని లేదు. త్వరలోనే నేను మీ అందరి ముందుకు వస్తాను.' అని ఆయన అన్నారు. సాయాజి షిండే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశారు. తెలుగులో.. గుడుంబా శంకర్, ఆంధ్రుడు, అతడు, పోకిరి, లక్ష్మి, ఆట, దుబాయ్ శీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్మెన్.. ఇలా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. View this post on Instagram A post shared by Sayaji Shinde (@sayaji_shinde) -
పాక్ క్రికెటర్ ఆబిద్ అలీకి యాంజియో ప్లాస్టీ.. రెండు నెలలు విశ్రాంతి
పాకిస్తాన్ టెస్టు ఓపెనర్ ఆబిద్ అలీ రెండు నెలల పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. గురువారం అతడికి రెండోసారి యాంజియో ప్లాస్టీ నిర్వహించి మరో స్టెంట్ను వైద్యులు అమర్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. 34 ఏళ్ల ఆబిద్ పాక్ తరఫున 16 టెస్టులు ఆడి 1,180 పరుగులు... 6 వన్డేలు ఆడి 234 పరుగులు చేశాడు. -
గంగూలీకి మరో రెండు స్టెంట్లు
కోల్కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి గురువారం వైద్యులు యాంజియోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఛాతీలో అసౌకర్యంతో బుధవారం ఆసుపత్రిలో చేరిన ఆయనకు తాజాగా రెండు స్టెంట్లు అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ‘కరోనరీ ఆర్టినరీ పూడికలను తొలగించేందుకు గంగూలీకి అదనంగా రెండు స్టెంట్లు అమర్చాం. ప్రస్తుతం ఆయనను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాం. ఆపరేషన్కు ముందు పలు వైద్య పరీక్షలు నిర్వహించాం’ అని వారు తెలిపారు. 48 ఏళ్ల గంగూలీ ఈ నెలలో రెండు సార్లు ఆసుపత్రి పాలయ్యారు. జనవరి 2న స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనకు యాంజియోప్లాస్టీ ద్వారా ఒక స్టెంట్ను అమర్చారు. తాజాగా మరోసారి ఛాతీలో అసౌకర్యం ఏర్పడటంతో ఇంకో రెండు స్టెంట్లు వేశారు. -
పగిలిన గుండె రక్తనాళానికి చికిత్స
కర్నూలు(హాస్పిటల్): రక్తనాళంలో రక్తం గడ్డకట్టి రక్తనాళం చిట్లి గుండెపోటు వచ్చిన వ్యక్తికి కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు యాంజియోప్లాస్టీ ద్వారా అరుదైన చికిత్స చేసి ప్రాణం కాపాడారు. ఆదివారం కార్డియాలజిస్టు డాక్టర్ చింతా రాజ్కుమార్ మాట్లాడుతూ.. ‘గిద్దలూరుకు చెందిన నాగార్జునరెడ్డి(32)కి గతేడాది నవంబర్ 12న ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు రక్త పరీక్షల్లో గుండెకు సంబంధించిన సమస్యను గుర్తించారు. దీంతో అతను అదే రోజు కిమ్స్ హాస్పిటల్కు వచ్చాడు. యాంజియోగ్రామ్ చేయగా రక్తనాళం పగిలినట్లు తేలింది. ఇది చాలా అరుదైన కేసు. ప్రపంచంలోనే 20వ కేసుగా పరిగణించవచ్చు. పైగా మిగతా 19 కేసుల కంటే భిన్నమైనది. రక్తనాళం పగలడంతో రక్తం గుండె చుట్టూ చేరుకుని ఒత్తిడికి గురిచేసింది. ఆ సమయంలో రోగి బీపీ తగ్గి వెంటనే మరణించే అవకాశం ఉంది. ఇతనిలో ప్రమాదాన్ని సాధ్యమైనంత తొందరంగా గుర్తించి పెర్క్యుటేనియస్ ట్రాన్స్లూమినల్ కరోనరి యాంజియోప్లాస్టీ చేసి రక్తప్రవాహాన్ని ఆపి ప్రాణాలు కాపాడాం. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడు’ అని వివరించారు. -
గుండెపోటును దాటి గోల్ఫ్కు...
న్యూఢిల్లీ: ఇటీవలే గుండెపోటుకు గురైన భారత విఖ్యాత కెప్టెన్ కపిల్ దేవ్ మళ్లీ మైదానంలోకి దిగారు. తన ఫిట్నెస్ స్థాయి ఏంటో చాటారు. 61 ఏళ్ల కపిల్కు ఇటీవలే యాంజియోప్లాస్టీ చేశారు. కాస్త విశ్రాంతి తీసుకున్న ఆయన వైద్యుల అనుమతితో గురువారం ఢిల్లీ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడారు. భారత్కు తొలి ప్రపంచకప్ (1983) అందించిన ఆయన తదనంతరం తనకెంతో ఇష్టమైన గోల్ఫ్ వైపు మళ్లారు. మళ్లీ మైదానంలోకి దిగడంపై కపిల్ ట్వీట్ చేశారు. ‘ఈ అనుభూతిని మాటల్లో వివరించలేను. గోల్ఫ్ కోర్స్, క్రికెట్ గ్రౌండ్... ఏదైనా సరే మళ్లీ ఆడటమనేది చాలా ఉల్లాసంగా, ఎంతో ఆనందంగా ఉంది. నా మిత్రులతో కలిసి ఇలా సరదాగా ఆడటం నిజంగా తృప్తినిచ్చింది. జీవితమంటే ఇదేనేమో!’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాక 1994 నుంచి కపిల్ దేవ్ రెగ్యులర్గా గోల్ఫ్ ఆడుతున్నారు. పలు ఈవెంట్లలోనూ పోటీపడ్డారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మా గుండెల్లో కొలిచేనేత ఆయన
ఎన్నికల కమిషన్.. చంద్రబాబు జేబు సంస్థా..?
ఆరోగ్యమస్తు
పోస్టల్ బ్యాలెట్ల కొనుగోలు.. ప్రభుత్వ ఉద్యోగిపై కేసు
వడ్డెరల మద్దతు వైఎస్సార్ సీపీకే
No Headline
చంద్రబాబు బూటకపు హామీలు నమ్మొద్దు
ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండండి
సంక్షేమ పథకాలు వైఎస్సార్ సీపీకే సాధ్యం
బాలినేనికి బ్రహ్మరథం
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement