breaking news
AI Video
-
సుధామూర్తిని వదలని డీప్ఫేక్
ప్రస్తుత ఏఐ కాలంలో నిజమైన సమాచారం ఏదో.. అసత్యమో ఏదో.. తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. డీప్ఫేక్ పుణ్యమా అని సెలబ్రేటీల మార్ఫింగ్ వీడియోలు చాలా వస్తున్నాయి. అయితే రాజ్యసభ ఎంపీ సుధామూర్తి సైతం డీప్ ఫేక్ బాధితురాలిగా మారింది. వివిధ ఈ కామర్స్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా తాను చెబుతున్నట్లు వీడియోలు సర్క్యూలేట్ అవుతున్నాయని అవి నమ్మద్దని తెలిపింది.సుధామూర్తి మాట్లాడుతూ "నేను మిమ్మల్ని అలర్ట్ చేద్దామనుకుంటున్నాను ఆన్లైన్లో నా ముఖచిత్రంతో ఫేక్ వీడియోస్ సర్యూలేట్ అవుతున్నాయి. వివిధ ఆర్థిక సంబంధమైన వ్యవహరాల్లో నేను పెట్టుబడి పెట్టమన్నట్లు ప్రచారం జరుగుతుంది. 200 డాలర్లు లేదా 20 వేల రుపాయలు పెట్టుబడి పెడితే 10 రెట్లు డబ్బు తిరిగి వస్తుందని అందులో ఉంది. అది నేను ప్రచారం చేసిన వీడియో కాదు పూర్తిగా అబద్ధం" అని సుధామూర్తి అన్నారు.తన పేరుతో ప్రచారం జరగడంతో చాలా మంది పెట్టుబడి పెట్డి నష్టపోయినట్లు తెలిపారు. తానేప్పుడు ఆర్థిక వ్యవహారాల గురించి మాట్లడలేదని కేవలం పని గురించి మాత్రమే మాట్లాడానని సుధామూర్తి అన్నారు. కనుక దయచేసి ఆ ప్రకటనను నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సుధామూర్తి సంఘ సేవకురాలిగా అందరికీ సుపరిచితమే. ఆమె ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రముఖ సాప్టేవేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఛైర్మన్గా ఆమె పనిచేశారు. 2023లో భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.I want to alert you to fake videos circulating online that falsely use my image and voice to promote financial schemes and investments. These are deepfakes created without my knowledge or consent.Please do not make any financial decisions based on these fraudulent videos. I urge… pic.twitter.com/JyJTIR78wQ— Smt. Sudha Murty (@SmtSudhaMurty) January 21, 2026 -
కోతి పనులకు కోట్లు!
అల్లరి పనులు చేసేవారిని ‘కోతి పనులు చేయకండి’ అని పెద్దలు విసుక్కోవడాన్ని చూస్తుంటాం. ఈ మందలింపుల సంగతేమిటోగానీ ‘కోతి పనులు చేస్తే కోట్ల రూపాయలు వస్తాయా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని జవాబు ఇస్తోంది ఏఐ స్లాప్ యూట్యూబ్ చానల్ ‘బందర్ ఆ దోస్త్’ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో అసంబద్ధమైన చిన్న చిన్న వీడియోలను రూపోందిస్తుంటుంది బందర్ ఆప్నా దోస్త్. ఈ వీడియోలలో ప్రధాన రాత్ర ఒక కోతి. ఈ వీడియోలలో మాట్లాడే భాష ఉండదు. అర్థమయ్యే కథ ఉండదు. అయితే ఆసక్తికరంగా ఉంటుంది. అదే దాని అసలు సిçసలు బలం. ఆ ఆసక్తే ‘బందర్ ఆప్నా దోస్త్’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడేలా చేసింది.ఈ వీడియోలను చూసి ఎంజాయ్ చేయడానికి భాష అవరోధం కాబోదు. ప్రపంచవ్యాప్తంగా ఏ భాష మాట్లాడే వారికైనా ఇట్టే అర్థమైపోతుంది.వీడియో ఎడిటింగ్ ప్లాట్ఫామ్ ‘కాష్వింగ్’ నిర్వహించిన సర్వేలో ‘బందర్ ఆప్నా దోస్త్’ సంవత్సరానికి సగటున 35 నుంచి 36 కోట్లు సంపాదిస్తున్నట్లు అంచనా. ప్రారంభమైన కొద్ది నెలల్లోనే ఈ ఛానల్ రెండు బిలియన్లకు పైగా వ్యూస్, సన్స్ స్క్రైబర్లను సాధించింది.ఏఐతో రూపోందించిన కంటెంట్ కాబట్టి ప్రోడక్షన్ ఖర్చు శూన్యం. దీంతో వచ్చిన డబ్బంతా లాభమే!ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘ఏఐ స్లాప్’ హవాకు ‘బందర్ ఆప్నా దోస్త్’ పెద్ద ఉదాహరణ. ఇలాంటి చానల్స్ ప్రపంచవ్యాప్తంగా 278 వరకు ఉన్నాయి. వీటికి దాదాపు 20 కోట్లమందికి పైగా సబ్స్రైబర్లు ఉన్నారు. -
పనికిరాని వీడియోలకు వ్యూస్
ప్రపంచంలో అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్లో విలువ లేని, పనికి రాని వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా బిలియన్ల కొద్దీ మొబైల్ స్క్రీన్పై దర్శనమిస్తున్నాయి. నూతన యూజర్ల స్క్రీన్పై వచ్చే షార్ట్స్లో ఏఐతో తయారైన బ్రెయిన్ రాట్ వీడియోలు అయిదింట ఒక వంతు కైవసం చేసుకున్నాయి. వీటితో వీక్షకులకు సమయం వృథా తప్ప ఎటువంటి ప్రయోజనంచేకూర్చకపోవడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్క్యాప్వింగ్ నివేదిక ప్రకారం... క్లౌడ్ ఆధారిత ఆన్లైన్ వీడియో ఎడిటర్ క్యాప్వింగ్ రూపొందించిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన 15,000 యూట్యూబ్ చానెళ్లను కంపెనీ అధ్యయనం చేసింది. ప్రతి దేశం నుంచి టాప్–100 చానెళ్లు వీటిలో ఉన్నాయి. 278 చానెళ్లు పూర్తిగా ఏఐ స్లాప్ కంటెంట్ను మాత్రమే ప్రసారం చేస్తున్నాయి. ఏఐ స్లాప్ చానెళ్లు 2025 అక్టోబర్ నాటికి 6,300 కోట్లకుపైగా వ్యూస్, 22.1 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ను సంపాదించాయి. ఏటా ఇవి సుమారు రూ.1,050 కోట్లు ఆర్జిస్తున్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఏఐ స్లాప్ యూట్యూబ్ చానెళ్లలో మన దేశానికి చెందిన ‘బందర్ అప్నా దోస్త్’అత్యధిక వ్యూస్తో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఈ విభాగంలో ఏటా రూ.38 కోట్లకుపైగా ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్లో నిలిచింది. నివేదిక హైలైట్స్.. ⇒ 207 కోట్లకుపైగా వ్యూస్తో భారత్కు చెందిన ‘బందర్ అప్నా దోస్త్’ఏఐ స్లాప్ చానెల్ అంతర్జాతీయంగా టాప్లో నిలిచింది. ⇒ ప్రపంచంలో అత్యధికంగా స్పెయిన్కు చెందిన ట్రెండింగ్ ఏఐ స్లాప్ చానెల్స్కు 2 కోట్ల మందికిపైగా సబ్స్రై్కబర్స్ ఉన్నారు. ⇒ దక్షిణ కొరియాలో ప్రముఖ ఏఐ స్లాప్ చానెల్స్ 845 కోట్ల పైచిలుకు వ్యూస్ నమోదు చేశాయి. ⇒ యూఎస్లోని స్లాప్ చానెల్ క్యూంటోస్ ఫాసినాంటెస్ (సిక్) 59.5 లక్షల మంది సబ్స్రై్కబర్స్ కలిగి ఉంది. ⇒ కొత్త యూజర్లకు వచ్చే ఫీడ్లో తొలి 500 యూట్యూబ్ షార్ట్స్లో బ్రెయిన్రాట్ వీడియోలు దాదాపు 33% ఉన్నాయి. ⇒ నూతన యూజర్ల స్క్రీన్పై వచ్చే మొదటి 500 షార్ట్స్లో ఏఐ స్లాప్ వీడియోలు 21% కైవసం చేసుకున్నాయి.ఏఐ స్లాప్ తగినంత శ్రద్ధ, కచ్చితత్వం, ఆలోచన లేకుండా సబ్స్క్రిప్షన్స్, వ్యూస్ కోసమే ఆటోమేటిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉపయోగించి రూపొందించి, పంపిణీ చేసిన విలువ లేని, పనికిరాని ఏఐ వీడియోలు. కంటెంట్లో లోపాలకుతోడు ప్రతికూల ప్రభావాలకు ఇవి దారితీస్తాయి.బ్రెయిన్రాట్నియంత్రణ, అర్థం లేని, తక్కువ నాణ్యత గల ఏఐ, ఏఐ రహిత వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు వీక్షకుడి మానసిక, మేధోస్థితిని క్షీణింపజేసే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. -
వాట్ యాన్ ఐడియా..! యువతకు సాంకేతికతో భావోద్వేగ సందేశం..
ఏఐ సాంకేతికతను ఎన్ని రకాలుగా వాడేస్తున్నారంటే..ఇలా కూడా ఉపయోగించొచ్చా అనేలా అబ్బురపరుస్తున్నాయి ఆ ఆలోచనలు. టెక్నాలజీతో మంచి సందేశాన్నిస్తూ ప్రభావితం చేయడం గురించి విన్నారా. అదే నేర్పిస్తుంది చైనా. టెక్నాలజీని విపరీతంగా వాడే డ్రాగన్ దేశం ఓ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి.. అందర్నీ తనవైపుకి తిప్పుకుంది. ప్రస్తుతం యువత కెరీర్ ఫస్ట్ పెళ్లి, పిల్లలు, ఆ తర్వాత అంటోంది. దాంతో పరిస్థితి ఏ విధంగా తయారైందో అందరికి తెలిసిందే. ఇది కరెక్ట్ కాదని ఎంతోమంది మేధావులు, మానసిక నిపుణులు చెబుతున్నా.. యువత అందుకు ససేమరి నో అనే చెబుతోంది. అలాంటి యువతను చాకచక్యంగా మార్గంలో పెట్టేందుకు డ్రాగన్ కంట్రీ ఏఐ టెక్నాలజీతో భావోద్వేగ సందేశంతో పిలుపునిస్తూ..యువతరాన్ని ప్రభావితం చేసే పనిలో పడింది. ఏం చేస్తోందంటే..ఏం లేదండి..ఏఐ కృత్రిమ మేధస్సుతో రూపొందించిన ఆన్లైన్ వీడియోలతో బలమైన భావోద్వేగ సందేశాలతో యువత దృష్టిని ఆకర్షించే పనిలో పడింది. ఏఐ జనరేటెడ్ మహిళలు యువతను సరైన వయసుకి వివాహం చేసుకోవాలని పిలుపునిస్తూ రకరకాల వీడియోలను వైరల్ చేస్తోంది. వివాహం, కుటుంబానికి సంబంధించిన నిర్ణయాల్లో యువతకు స్పష్టమైన అవగాహన ఉండాలనే బలమైన సందేశాన్ని అందిస్తోంది. ఈ వీడియోల్లో మధ్య వయస్కురాలైన ఒంటిరి మహిళ తాను పెళ్లి చేసుకోకపోవడం, పిల్లలను కనకపోవడం పట్ల విచారం చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తూ..యూత్ని ఆ అంశాలపై ఆలోచనత్మాక దృష్టిని అందిస్తోంది. అంతేగాదు ఆ వీడియోల్లో ఆస్పత్రి లాంటి వాతావరణంలో మహిళలు ఏడుస్తున్నట్లు చిత్రీకరించాయి. తాము ఒంటరితనంతో విలపిస్తున్నామని, యంగ్గా ఉన్నప్పుడూ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల తమ జీవితాలు దుఃఖమయంగా మారాయంటూ రికార్డు చేసిన వీడియోలు యువతకు సరైన దృక్పథం తోపాటు సరైన దిశలో నడిపించేలా ప్రభావితం చేస్తున్నాయి. సరైన వయసులో పెళ్లి చేసుకోకపోతే.. వృద్ధాప్య జీవితం ఎంత భారంగా దయనీయంగా ఉంటుందో కళ్లకుకట్టినట్లు చూపిస్తూ..యువతను మేల్కొపేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంతేగాదు ఆ ఆ వీడియోలో వివేకవంతమైన మార్పు వైపుకి మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తున్నాయి. డబుల్ ఇన్కమ్, పిల్లలు లేని జీవితం అవసనా దశనను ఎంత దుర్భరంగా మారుస్తోంది కనువిప్పు కలిగేలా చేసి.. యువతకు కుటుంబం, పెళ్లి వంటి వాటికి ప్రాముఖ్యతనిచ్చి, మంచి నిర్ణయం తీసుకునేలా ఆ సాంకేతిక వీడియోలు బలమైన సందేశాన్నిస్తుండటం విశేషం. ఒకరకంగా చైనా సరికొత్త సందేశాత్మక ధోరణి.. సాంకేతికతను మంచి దృక్పథానికి ఎలా వాడాలనేది హైలెట్ చేసింది కదూ..!.(చదవండి: ఎకో ఫ్రెండ్లీ వాటర్ ఏటీఎం..! బాధ్యతయుతమైన పర్యాటకానికి కేరాఫ్గా..) -
‘సీఎంగా ఇంకెన్ని రోజులు ఉంటానో తెలియదు’
కొంతకాలంగా కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. పవర్ షేరింగ్ ఫార్ములా తెర మీదకు రావడం.. తన తండ్రి రాజకీయ భవిష్యత్తుపై సీఎం సిద్ధరామయ్య కొడుకు చేసిన వ్యాఖ్యలు.. అటుపై రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన పూర్తి కావడంతో నవంబరులో నాయకత్వ మార్పు (Karnataka CM) తథ్యమని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో పవర్ పాలిటిక్స్పై కర్ణాటక బీజేపీ యూనిట్ వ్యంగ్యంగా స్పందిస్తోంది. మొన్నీమధ్యే.. నవంబర్ వచ్చినా డీకేకు సీఎం సీటు మాత్రం దక్కలేదని పేర్కొంటూ ఏఐ ఫన్నీ (BJPs AI video) ఏఐ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా సీఎం సిద్ధరామయ్యను ఉద్దేశించి మరో వీడియోను పోస్ట్ చేసింది. అందులో.. సిద్ధరామయ్య ఫేస్బుక్ లైవ్లో ఉంటారు. సీఎంగా రెండున్నరేళ్ల పాలన పూర్తైందని.. సీఎంగా ఇంకా ఎంత కాలం కొనసాగుతానో తెలియదని.. అందుకే మీ ముందుకు వచ్చానని అంటారు. ఈలోపు.. కింద కామెంట్ సెక్షన్లో అజ్మల్, జమాల్, రఫీక్, ఫైజ్.. అనే యూజర్లు ‘ఐదేళ్లు మీరే సీఎంగా ఉండాలి’ అంటూ కామెంట్ పెడతారు. అయితే శంకర్ కనకపుర అనే వ్యక్తి మాత్రం.. ‘ఇంకెంత కాలం సీఎంగా ఉంటారు. రాజీనామా చేసి దిగిపోండి’ అని కామెంట్ చేస్తాడు. దీంతో అగ్గి మీద గుగ్గిలం అయిన సిద్ధరామయ్య.. ఎవరా వ్యక్తి.. అతన్ని బ్లాక్ చేస్తా అంటాడు. రెండు వర్గాలను ఉద్దేశించేలా.. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ చేసిన ఈ సెటైరిక్ ఈ వీడియో ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. నాయకత్వ మార్పు నేపథ్యంతో అంతకు ముందు బీజేపీ ఏఐ ఆధారిత వీడియోలో డీకే శివకుమార్ని టార్గెట్ చేసింది. అందులో.. రాహుల్ గాంధీ వాట్సాప్లో హాయ్ అనే మెసేజ్ పంపిస్తారు. ఆ సమయంలో రాహుల్ పక్కన సిద్ధరామయ్య కూడా ఉంటారు. ఆ తర్వాత స్క్రాచ్ కార్డు పంపుతారు. డీకే దానిని స్క్రాచ్ చేయగా..‘నో ఛైర్ నవంబర్’ (No Chair November) అనే మెసేజ్ చూసి షాక్ అవుతాడు. మరోవైపు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య కూడా నవ్వుకుంటారు. అనంతరం స్క్రీన్పై హస్కీ డ్యాన్స్ను దీనికి జోడించారు. బీజేపీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. శివకుమార్కు ఇది కుర్చీలేని నవంబర్ అని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. View this post on Instagram A post shared by BJP Karnataka (@bjp4karnataka) -
గ్రోక్ ఏఐ వీడియో: స్పందించిన మస్క్
టెక్నాలజీ రంగంలో.. ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందులో భాగంగానే ఈయన తన ఏఐ వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్ గ్రోక్ ఇమాజిన్కు సంబంధించిన కొత్త వెర్షన్ 0.9ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త వెర్షన్.. ఇప్పటికే రియాలిటీగా కనిపించే వీడియోలను సృష్టించగల సామర్థ్యంతో యూజర్లను తెగ ఆకట్టుకుంది.ఇండియన్ కంటెంట్ క్రియేటర్ ప్రశాంత్.. ప్రముఖ హాలీవుడ్ చిత్రం ఐరన్ మ్యాన్ నుంచి ఒక సన్నివేశాన్ని.. రీక్రియెట్ చేసి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఇక్కడ కనిపించే వ్యక్తి మస్క్ను పోలి ఉన్నారు. వీడియో మొత్తం ఎడారి ప్రాంతం కనిపిస్తుంది. వీడియో షేర్ చేస్తూ.. ''గ్రోక్ ఇమాజిన్ 0.9 సినిమా నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది. ఐకానిక్ ఐరన్ మ్యాన్ దృశ్యాన్ని తిరిగి ఊహించుకున్నాను. ఇందులో విజువల్ క్వాలిటీ, ఆడియో జనరేషన్ వంటివి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది అద్భుతమైన మోడల్'' అని అన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. 'గ్రోక్ ఇమాజిన్ వెర్షన్ 0.9 నాట్ బ్యాడ్' అని అన్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. గ్రోక్ 0.9 వెర్షన్ ఇంత అద్భుతంగా ఉంటే.. 1.0 ఎలా ఉంటుందో అని ఒకరు అన్నారు. గ్రోక్ రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను సృష్టిస్తుందని ఇంకొకరు అన్నారు.Not bad for Grok Imagine version 0.9 … https://t.co/ihIzdVOylj— Elon Musk (@elonmusk) October 9, 2025 -
అది ఫేక్.. నిజం తెలుసుకొని రాయండి: మీడియాకు హీరో అక్షయ్ విజ్ఞప్తి!
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగం నడుస్తోంది. ప్రతి రంగంలోనూ ఏఐని వాడేస్తున్నారు. అయితే కొంతమంది ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ఫేక్ వీడియో, ఫోటోలను సృష్టించి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సినీ తారల విషయంలో ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ.. అవే నిజం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్కు సంబంధించి ఓ ఫేక్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆయన వాల్మీకి మహార్షి పాత్రలో నటిస్తూన్నారంటూ.. ఐఏ సహాయంతో ఓ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ట్రైలర్గా రిలీజ్ చేశారు. దీంతో చాలా మంది ఇది నిజమనే నమ్మారు. ఈ వీడియో వైరల్ కావడంతో... చివరకు అక్షయ్ కుమారే స్పదించాల్సి వచ్చింది. ఆ ట్రైలర్ ఫేక్ అని.. ఎవరూ నమ్మొద్దు అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.‘నేను మహర్షి వాల్మీకి పాత్రలో ఓ సినిమా చేస్తున్నానంటూ ఏఐతో చేసిన ఫేక్ వీడియో ఒకటి వైరల్ చేశారు. అలాంటి వాటిని నమ్మకండి. దారుణమైన విషయం ఏంటంటే.. కొన్ని వార్తా ఛానల్స్ కూడా ఆ వీడియోలు నిజం అనుకొని ఆ ప్రాజెక్ట్ గురించి వార్తలు రాసేశారు. కనీసం రాసేముందు అవి నిజమా, మార్ఫింగ్ చేసినవా అని చూసుకోలేదు. ప్రస్తుతం ఏఐ వీడియోలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. నిజమైన వాటికంటే అవే ఎక్కువ వేగంగా వైరల్ అవుతున్నాయి. దీన్ని అందరూ గమనించాలని అభ్యర్థిస్తున్నాను. ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు దాన్ని పరిశీలించాలని కోరుతున్నా. వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు అందించాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నా’అని అక్షయ్ ఎక్స్లో రాసుకొచ్చారు. -
సరికొత్త ఆయుధంతో అరవ రాజకీయాల్లో యుద్ధం!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అరవ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరున్న పెరియార్ జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ ఏఐ వీడియోను రిలీజ్ చేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇది డీఎంకేకు ప్రచారంగానే కాకుండా.. అటు ప్రత్యర్థి విజయ్ టీవీకే పార్టీకి కౌంటర్గానూ ఉందన్న చర్చ నడుస్తోందక్కడ. తమిళనాడు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కాయి. ట్రెండ్కు తగ్గట్లే రాజకీయ పార్టీలు టెక్నాలజీని పుణికిపుచ్చుకున్నాయి. పార్టీల ఐటీ విభాగాల క్రియేటివిటీతో ‘పొలిటికల్ డిజిటల్ వార్’ ఇప్పుడక్కడ హాట్ టాపిక్గా మారింది. మైకుల్లో మాటలు, సోషల్ మీడియాలో పోస్టులకు అదనంగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. పైగా ప్రత్యర్థులను నేరుగా విమర్శించాల్సిన అవసరం లేకుండానే ఆ సెల్ఫ్ ప్రమోషన్ వీడియోలు భలేగా ఉపయోగపడుతున్నాయి పార్టీలకు. తాజాగా.. విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) ఓ ఏఐ జనరేటెడ్ వీడియోను రిలీజ్ చేసింది. 32 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు తొలి ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై విజయ్పై ప్రశంసలు గుప్పించినట్లు ఉంది. అదే సమయంలో తన సొంత పార్టీ డీఎంకే విధానాలను విమర్శించినట్లుగా ఉంది. ఈ వీడియో తమిళనాట నిన్నంతా ట్రెండింగ్లో కొనసాగింది. அண்ணாவின் வழியில்... தம்பி விஜய் ஆட்சி! என்று எல்லோரும் சொல்லட்டும்."தமிழக வெற்றிக்கழகம் வெல்லட்டும்" pic.twitter.com/jyh4SoxTrz— TVK IT Wing Official (@TVKHQITWingOffl) September 15, 2025ఈ పరిణామంపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీప్ఫేక్ వీడియోలతో విజయ్ టీవీకే పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధి శరవణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను ఇలా.. ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తూ ఉపయోగించడం బాధాకరమని అన్నారాయన. ఈ క్రమంలో బీజేపీతో డీఎంకే రహస్య బంధంలో ఉందంటూ విజయ్ చేస్తున్న ఆరోపణలనూ శరవణన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగానే.. విజయ్ టీవీకే పార్టీ పెరియార్ సిద్ధాంతాలను పూర్తిగా స్వీకరించలేదు. కానీ ఆయన భావజాలం నుంచి సామాజిక న్యాయం, మహిళా సాధికారత, హేతువాదం వంటి అంశాలను మాత్రం తీసుకుంటానని విజయ్ బహిరంగంగానే చెప్పాడు. ఈ క్రమంలో పెరియార్ ఫొటో దీంతో తాజా ఏఐ జనరేటెడ్ వీడియోతోతద్వారా స్టాలిన్ రాజకీయ నేరేటివ్ను తిరిగి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. పోనుపోను ఈ డిజిటల్ క్యాంపెయిన్ వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకునే అవకాశం లేకపోలేదు!.தந்தை பெரியார் - இனப்பகையைச் சுட்டெரிக்கும் பெருநெருப்பு! தமிழினத்தின் எழுச்சிக்கான பகுத்தறிவுப் பேரொளி!தந்தை பெரியார் என்றும் - எங்கும் நிலைத்திருப்பார்!#PeriyarForever #Periyar #SocialJusticeDay pic.twitter.com/B4RvgXCgzH— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) September 17, 2025


