addakula accident
-
మహబూబ్నగర్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించాలని, మృతదేహాలను తరలించే విషయంలో చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాగానికి కేసీఆర్ తెలిపారు. జిల్లాలోని అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామం సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో రెండు వాహనాలు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. -
రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామం సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన ఇన్నోవా, మహారాష్ట్రకు చెందిన టవేరా వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. వేగంగా ఢీకొనటంతో వాహనాలు నుజునుజ్జు అయ్యాయి. ప్రమాదంలో కేరళకు చెందిన ఒక మహిళ, మహారాష్ట్ర వాసుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని, కార్లలో ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, మహారాష్ట్ర వాసులు తిరుపతి నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది.


