Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Cm jagan Reaction On TDP Janasena Manifesto Slams Chandrababu
టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

సాక్షి, అన్నమయ్య జిల్లా: టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అర్థమైందన్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో తమ ఫోటో వద్దని బీజేపీ గట్టిగా చెప్పిందని పేర్కొన్నారు. బాబు డిక్లేర్ చేసిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ తేల్చేసిందన్నారు. ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు.అవ్వాతాతలకు ఇంటివద్దకే అందే పెన్షన్‌ను ఆపిన దుర్మార్గుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. మీ బిడ్డకు(జగన్‌) మంచి పేరు వస్తుందనే బాబు పెన్షన్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు. తన మనిషిని నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పనెన్షన్‌ను అడ్డుకున్నాడని.. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో తన కుట్రలను మనపై నెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ పూర్తి ప్రసంగంఈ ఎన్నికలు.. రాబోయే అయిదేళ్ల భవిష్యత్‌.జగన్‌కు ఓటేస్తే..పథకాలు కొనసాగింపు.చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే.పొరపాటున బాబుకు ఓటేస్తే..పసుపుపతి నిద్రలేస్తాడు.వదల బొమ్మాళి అంటూ పేదల రక్తం తాగుతాడు..బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే.2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?.రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పెట్టుబడి సాయం కింద బాబు ఏనాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు.బాబు ఏనాడైనా రైతుభరోసా కింద ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా.14 ఏళ్లలో బాబు ఏనాడు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు.డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు..చేశాడా?.రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?అక్కాచెల్లెమ్మలను మోసం చేసి రోడ్డుపై నిలబెట్టాడుఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?గర్భిణీ స్త్రీలకు రూ. 10 వేలు ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 100 సబ్సిడీ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు.. విడిపించాడా?ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?మీ బిడ్డ జగన్‌ రైతన్నకు అండగా నిలబడ్డాడు.పెట్టుబడి సాయం కింద మీ బిడ్డ ప్రతియేటా రూ. 13, 500 ఇచ్చాడు.జగన్‌కు, చంద్రబాబుకు ఉన్న తేడా గమనించండని కోరుతున్నా.అక్కా చెల్లెమ్మలకు మీ బిడ్డ జగన్‌ తోడుగా ఉన్నాడుఅక్కాచెల్లెమ్మల కోసం మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చా.అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో ఆదుకున్నాం.అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఆబీసీ నేస్తం తీసుకొచ్చా.31 లక్షల ఇళ్లపట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్‌.ఇంటి వద్దకే అవ్వాతాతలకు పెన్షన్‌ అందిస్తున్నాం.పెన్షన్‌ రూ. 3 వేల నుంచి రూ, ,500లకు పెంచుకుంటూ పోతాం.14 ఏళ్లలో చంద్రబాబు ఏనాడైనా పెన్షనర్లను పట్టించుకున్నాడా? చంద్రబాబు మోసాలను ఓడించడానికి మీరంతా సిద్ధమేనా.రైతుభరోసాగా ఏడాదికి రూ.16 వేలు.. ఐదేళ్లకు రూ.80 వేలు ఇస్తాడు మీ జగన్.చంద్రబాబు వల్ల రాష్ట్రంలోని మహిళలందరికీ కొన్ని రూ.వేల కోట్ల నష్టం జరిగింది. పిల్లలను బడులకు పంపే తల్లులకు ఇచ్చే అమ్మఒడిని రూ.17 వేలుకు పెంచాం.

Team India T20 World Cup Squad Announced
టీ20 వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టు ‍ప్రకటన.. స్టార్‌ ఆటగాళ్లకు దక్కని చోటు

కరీబియన్‌ దీవులు, యూఎస్‌ఏ వేదికలుగా జూన్‌ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌‍కప్‌ 2024 కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్‌ 30) ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగానే ఈ జట్టుకు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించనుండగా.. హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌ ప్రదర్శనల ఆధారంగా రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోగా.. స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌పై వేటు పడింది. చాలాకాలం తర్వాత చహల్‌ టీ20 జట్టులోకి రాగా.. సిరాజ్‌, అర్ష్‌దీప్‌ తమ స్థానాలు నిలుపుకున్నారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయని యశస్వి జైస్వాల్‌పై సెలెక్టర్లు విశ్వాసముంచగా.. వరల్డ్‌కప్‌ బెర్త్‌పై గంపెడాశలు పెట్టుకున్న  రింకూ సింగ్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎంపియ్యాడు.  శుభ్‌మన్‌ గిల్‌, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌ కూడా ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎం​పియ్యారు.టీ20 వరల్డ్‌కప్‌ కోసం టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రాట్రావెలింగ్‌ రిజర్వ్‌: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

Allu Arjun Pushpa 2 First Single Release Date and Time Reveiled
పుష్ప-2 ఫస్ట్‌ సింగిల్.. రిలీజ్‌ టైమ్ ఇదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటిస్తోన్న పుష్ప-2 మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్‌ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేశాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా సుకుమార్‌ డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా పుష్ప-2 మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ డేట్‌ అండ్‌ టైమ్‌ను ప్రకటించారు మేకర్స్‌.మే 1వ తేదీన ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్‌ చేయన్నట్లు ప్రకటించారు. ఏకంగా ఆరు భాషల్లో ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో నేషనల్‌ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందన సిండికేట్‌ నేపథ్యంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.  S̶e̶n̶s̶a̶t̶i̶o̶n̶a̶l̶ s̶u̶r̶p̶r̶i̶s̶e̶Sensational song ✅🔥🔥#Pushpa2FirstSingle out tomorrow at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali.#PushpaPushpa chant all the way 💥💥A Rockstar @ThisIsDSP Musical 🎵#Pushpa2TheRule Grand release worldwide on… pic.twitter.com/3fuyv9GFlA— Mythri Movie Makers (@MythriOfficial) April 30, 2024

Ap: Bjp Distanced From The Alliance Manifesto
బాబు అలవికాని హామీలు.. మేనిఫెస్టోకు బీజేపీ దూరం

సాక్షి, విజయవాడ: చంద్రబాబు అలవికాని హామీలకు మేం బాధ్యులం కాదంటూ బీజేపీ తప్పించుకుంది. కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది. మేనిఫెస్టోలో మోదీ, బీజేపీ ఫొటోలు వేయొద్దని ఆ పార్టీ అల్టిమేటం జారీ చేసింది.మోదీ, నడ్డా, అమిత్‌, పురేందేశ్వరి ఫొటోలు లేకుండా కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తామని ఇన్నాళ్లూ   టీడీపీ చెప్పింది. మీడియాను మూడు పార్టీల మేనిఫెస్టో అంటూ పిలిచారు. బీజేపీ ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు, పవన్‌ ఫొటోలతో మేనిఫెస్టో విడుదల చేశారు.​మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్‌ ఒప్పుకోలేదు. కూటమి మేనిఫెస్టోకు టీడీపీ, జనసేనదే బాధ్యత అని చంద్రబాబు చెబుతున్నారు. 2014లో మేనిఫెస్టోలో చంద్రబాబు.. మోదీ ఫొటో పెట్టారు.. హామీలు అమలు కాకపోవడంతో మోదీకి చంద్రబాబు చెడ్డపేరు తెచ్చారని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ వద్దని గట్టిగా చెప్పడంతోనే మోదీ ఫొటో పెట్టేందుకు చంద్రబాబు సాహసించలేదు.తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్లపై ప్రకటనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. ఆ విషయంలో బీజేపీ, టిడిపి మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు బీజేపీ అధికారికంగా దూరం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

Ksr Comments On Revanth Reddy's Behavior To Support For Chandrababu
వీడని తీరుగా.. ఈ మాటల్లో గురు-శిష్యుల బంధం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూని గమనించారా? అందులో ఆయన ఒక అంశానికి ఇచ్చిన సమాధానం చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విధేయుడుగానే కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, రేవంత్ మనసు మాత్రం చంద్రబాబుపైనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని కనిపెట్టారు. ఓకే. ఏదో కాంగ్రెస్ పార్టీ నేత కనుక, ఆ పార్టీతో  వైఎస్సార్‌సీపీకి సంబంధం లేదు కనుక అలా మాట్లాడారులే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆశ్చర్యంగా బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చేలా చంద్రబాబుకు అనుకూలంగా అభిప్రాయాలు చెప్పడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది.తెలుగుదేశం పార్టీని ఏపీలో భుజాన వేసుకుని మోస్తున్న ఒక పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే?, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గెలుస్తున్నట్లు తమకు సమాచారం అందిందని కేసీఆర్‌, కేటీఆర్‌ అంటున్నారు.. ఇదేమైనా రాజకీయ వ్యూహమా? ఆ వ్యాఖ్య ప్రభావం తెలంగాణలో పడే అవకాశం ఉందా అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగారు. దానికి రేవంత్ ఏమి సమాధానం ఇచ్చారంటే.. చంద్రబాబునాయుడుపై ఉండే అసూయ, ద్వేషం.. అంతకంటే ఏమి ఉంటుంది? కేసీఆర్‌కు ఏదో ఓ బాధ, దుఃఖం. కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిల మధ్య అవగాహన ముందు నుంచి ఉన్నదే. చంద్రబాబు అరెస్టును కూడా సమర్దించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌ ఒక జట్టుగా వ్యవహరిస్తున్నారు.. అని రేవంత్ బదులు ఇచ్చారు. ఈ జవాబు ద్వారా తాను, బీజేపీ కూటమిలో ఉన్న చంద్రబాబు ఒక జట్టు అని రేవంత్ చెప్పకనే చెప్పేశారు.మరో ప్రశ్న ఏమిటంటే ఏపీ ఎన్నికల ఫలితాలపై మీ అంచనా అని అడిగారు..!?'ఎక్కడైనా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది. వాళ్లు చెప్పిన మాట నిలబెట్టుకోనందువల్ల ప్రతికూల వాతావారణం ఉంది. మేం షర్మిల నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ ఇన్నింగ్స్ ప్రారంభించాం. ఎన్ని సీట్లు గెలిపించుకోగలం? షర్మిల ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై ఎలా కొట్లాడుతున్నారు? ఆమెను ఎలా మద్దతుగా నిలబడాలి? అనేదే నా ప్రణాళిక. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనేదే మా రాజకీయ ప్రణాళిక. ఈసారి అక్కడ అన్ని సీట్లలో పోటీ దిగాం. మా దృష్టంతా కాంగ్రెస్‌కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికే'..."రేవంత్ సమాధానాలు చూస్తే ఏమనిపిస్తుంది! చంద్రబాబుపైన కేసీఆర్‌ కోపం ద్వేషం ఉన్నాయట. అదే నిజమైతే ఓటుకు నోటు కేసులో ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు నాయుడు పేరు కూడా కేసీఆర్‌ ప్రభుత్వం చేర్పించి ఉండేది కదా! ఆ కేసులో రేవంత్ నేరుగా దొరికిపోతే, చంద్రబాబు మొత్తం కథకు సూత్రధారి. ఏ కేసులో అయినా కుట్రదారులను పట్టుకోకుండా ఉంటారా? కేసు పెట్టకుండా ఉంటారా? ఇక కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక జట్టు అని రేవంత్ తేల్చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నడైనా తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టారా? నిజంగానే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కనుక తెలంగాణ రాజకీయాలలో కూడా తన పాత్ర పోషించడం ఆరంభిస్తే ఏ మేరకు ప్రభావం ఉంటుందో రేవంత్ ఊహించుకోలేని అమాయకుడు కాదు.చంద్రబాబు అరెస్టును కేసీఆర్‌ సమర్ధించారట. అప్పట్లో కేసీఆర్‌ ఆ ఉదంతంపై ఎక్కడా స్పందించలేదు. పైగా కేటీఆర్‌ కూడా చంద్రబాబు అరెస్టుపై సానుభూతి వ్యాఖ్యలే చేశారు. మరో మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఏకంగా ఖండించారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే చంద్రబాబు అవినీతి కేసులో ఉన్నా అరెస్టు చేయకూడదని రేవంత్ చెబుతున్నారా? అలాంటప్పుడు కేసీఆర్‌ పై నిత్యం అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయనతో పాటు, కేటీఆర్‌, హరీష్ రావులను కూడా జైలుకు పంపుతామని ఎలా అంటున్నారు. అంటే చంద్రబాబు తప్ప ఇంకెవరిపైన అయినా కేసులు పెట్టవచ్చని రేవంత్ చెబుతున్నారా. చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని రేవంత్ వదులుకోలేకపోతున్నారని అనుకోవాలి.చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకరించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆయన నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయినా ఆయన కోసం సానుభూతి వచనాలు పలకడం ద్వారా రేవంత్ తన గురు, శిష్య సంబంధాన్ని వదలుకోలేకపోతున్నారని చెప్పాలి. తెలంగాణలో బీజేపీపై ఘాటైన విమర్శలు చేస్తున్న రేవంత్ ఏపీలో ఎందుకు మాట్లాడలేదు. బీజేపీ ఊసే ఎత్తలేదు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశంకు ఓటు వేయవద్దని అనలేదు. కాంగ్రెస్ గురించి ఏదో మొహమాటానికి మాట్లాడినట్లు అనిపించింది. పైగా ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉందని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత గురించి నేరుగా అనకపోయినా, ఆయన ఉద్దేశం అర్థం అవుతూనే ఉంది.విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ తోను ఏకకాలంలో జట్టుకట్టి రాజకీయం చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించడంలోను, ఆ తర్వాత ఆమె చేస్తున్న ప్రకటనలలోను చంద్రబాబు పాత్ర ఉందన్న సంగతి బహిరంగ రహస్యం. ఇందులో ఎవరిది తప్పు అంటే ఏమి చెబుతాం. కాంగ్రెస్ నేతలుగా ఉన్న రేవంత్, షర్మిలలు తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని భావిస్తున్నారు. అంతే తప్ప బీజేపీతో మద్దతు కట్టిన టీడీపీ అనుకోవడం లేదు. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు తరచుగా రేవంత్ పై ఒక ఆరోపణ చేస్తుంటారు. బీజేపీ అగ్రనేతలతో కూడా రేవంత్ సంబంధాలు పెట్టుకున్నారని, భవిష్యత్తులో ఈయన బీజేపీలోకి జంప్ చేయవచ్చని ప్రచారం చేస్తుంటారు. ఇందులో నిజం ఉండకపోవచ్చు. కానీ ఏపీ రాజకీయాలలో ఈయన అనుసరించిన ధోరణి గమనిస్తే మాత్రం ఈయనకు నిజంగా బీజేపీ సిద్దాంతం పైన, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీపైన వ్యతిరేకత లేదన్న భావన కలుగుతుంది.ఒకప్పుడు చంద్రబాబుతో తనకు సంబంధం లేదని పైకి అన్నప్పటికీ, అధికారం వచ్చాక రేవంత్ తన మనసులో మాట బయటపెట్టారని అనుకోవచ్చు. ఒక వైపు ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉందని చెబుతున్న ఆయన తన ప్రభుత్వం గురించి ప్రజలలో మంచి అభిప్రాయం ఉందని అంటున్నారు. పార్లమెంటు ఎన్నికలు తన పాలనకు రిఫరెండమ్ అని అంటున్నారు. రేవంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే, అచ్చం తన గురువు చంద్రబాబు మాదిరే చేస్తున్నట్లుగా ఉంది. ఆరు గ్యారంటీలలో ఐదు అమలు చేశామని అంటున్నారు. నిజంగా అలా చేసి ఉంటే గొప్ప విషయమే అవుతుంది. కానీ ఒక్కో గ్యారంటీలోని కొన్ని అంశాలను అమలు చేసి, మిగిలినవాటిని పక్కనబెట్టిన సంగతి ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారు.ఉదాహరణకు ఆర్టీసీ బస్‌లలో మహిళల ఉచిత ప్రయాణం కల్పించిన మాట నిజమే. కానీ ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్న వాగ్దానం గురించి ఎందుకు చెప్పరు? గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలు ఎక్కడ అమలు అవుతున్నాయో ఎవరికి తెలియదు. పాతికవేల కోట్ల అప్పులు తీర్చామని చెప్పారు. బాగానే ఉంది. మరి 17వేల కోట్ల అప్పు ఎందుకు చేశారో వివరించాలి కదా? రైతు రుణమాఫీపై వాయిదాలు వేస్తూ ఆగస్టు పదిహేను అని అంటున్నారు. నిజంగా అప్పుడు చేస్తే గొప్ప విషయమే.కార్పొరేషన్ ఏర్పాటు చేసి, బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుంటామని అంటున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలాంటి ప్రయత్నం చేయకపోలేదు. అప్పట్లో కేంద్రంలో ఉన్నది తన అనుకూల ప్రభుత్వమే అయినా, ఆయన ప్రతిపాదనకు రిజర్వు బ్యాంక్ ఒప్పుకోలేదు. ఇప్పుడు రేవంత్ ఎలా చేయగలుగుతారో చూడాలి. పలు ప్రాంతాలలో కరెంటు కోతలు ఇబ్బంది పెడుతున్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. పద్నాలుగు సీట్లు సాధిస్తామని అంటున్నారు. తన ప్రభుత్వంలో తప్పు చేయలేదని అంటున్నారు. మంచిదే. ప్రజలను నిరాశపరచలేదని, కనుక రిఫరెండంగా భావిస్తున్నామని రేవంత్ అన్నారు.ఇది పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ క్యాడర్‌లో ఒక విశ్వాసం నెలకొల్పడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఒకవేళ రేవంత్ చెప్పినట్లు 14 సీట్లు సాధిస్తే కాంగ్రెస్‌లో తిరుగులేని నేత అవుతారు. అలాకాకపోతే ఆయన రిఫరెండమే ఆయనకు తలనొప్పిగా మారుతుంది. ఏది ఏమైనా ఏపీలో చంద్రబాబుకు మేలు చేకూర్చే పనిలో ఉన్న కాంగ్రెస్ నేతగా వ్యవహరిస్తారా? లేక బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీని వ్యతిరేకించి సిద్ధాంతానికి కట్టుబడి ఉండే నేతగా ఉంటారా! అన్నది ఆయనే తేల్చుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Big Blow For Congress In Madhya Pradesh Ramniwas Rawat Joined Bjp
ఓ వైపు రాహుల్‌ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్‌ కీలక నేత

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తరుణంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, మాజీ హోమంత్రి రాంనివాస్‌ రావత్‌ బీజేపీలో చేరడం చర్చాంశనీయంగా మారింది.ఆరుసార్లు ఎమ్మెల్యేగామధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ మంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంనివాస్ రావత్ రాహుల్‌గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సుమారు వెయ్యి మంది మద్దతుదారులతో బీజేపీలో చేరారు. సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర పార్టీ చీఫ్ వీడీ శర్మ, మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. రావత్ విజయపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకులలో ఒకరు.బీజేపీలోకి కమల్‌ నాథ్‌ సన్నిహితుడు కాగా,ఎన్నికలు ప్రకటించిన తర్వాత బీజేపీలో చేరిన రెండో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రావత్. మార్చి 29న మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు అత్యంత సన్నిహితుడు, అమర్‌వాడ ఎమ్మెల్యే కమలేష్ షా బీజేపీలో చేరారునామినేషన్‌ ఉపసంహరణ.. ఆపై బీజేపీలోకి జంప్‌మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్‌ 29న ఇండోర్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్ధి అక్షయ్‌ కాంతి బామ్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కొన్ని గంటల్లోనే బీజేపీలో చేరారు. కాగా, బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీపై కాంగ్రెస్‌ నేత అక్షయ్‌ కాంతి బామ్‌ను రంగంలోకి దించింది. అనూహ్యంత్‌ అక్షయ్‌ కాంతి బామ్‌ బీజేపీ చెంతకు చేరడం మధ్యప్రదేశ్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. 

Sisodia Bail Petition Dismissed In Liquor Case By Delhi Court
లిక్కర్‌ కేసు: మనీష్‌ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు

న్యూఢిల్లీ: లిక్కర్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సిసోడియాకు బెయిల్‌ ఇచ్చేందుకు కేసు విచారిస్తున్న రౌస్‌ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. సిసోడియాకు బెయిల్‌ ఇవ్వకూడదని సీబీఐ,ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కోర్టులో వాదనలు వినిపించాయి. దీంతో కోర్టు సిసోడియాకు బెయిల్‌ నిరాకరించింది. కాగా, లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిసోడియాను సీబీఐ గతేడాది ఫిబ్రవరి26న అరెస్టు చేసింది. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉంటున్నారు.  సీబీఐతో పాటు ఈడీ పెట్టిన కేసుల్లో సిసోడియా రెగ్యులర్‌ బెయిల్‌ కోర్టు డిస్మిస్‌ చేయడం ఇది రెండవసారి. గతేడాది సిసోడియా వేసిన బెయిల్‌ పిటిషన్లను ట్రయల్‌కోర్టుతో పాటు హైకోర్టు,సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసిన విషయం తెలిసిందే. 

IPL 2024: KKR Bowler Harshit Rana Fined 100 Percent Of His Match Fees And Suspended For One Match
IPL 2024: కేకేఆర్‌ స్టార్‌ ప్లేయర్‌కు భారీ షాక్‌.. జరిమానాతో పాటు నిషేధం

కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణాకు భారీ షాక్‌ తగిలింది. నిన్న (ఏప్రిల్‌ 29) ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అతని మ్యాచ్‌ ఫీజ్‌లో 100 శాతం కోత విధించబడింది. ప్రస్తుత సీజన్‌లో రాణా రెండోసారి కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడటంతో అతనిపై ఓ మ్యాచ్‌ నిషేధం కూడా పడింది. ఢిల్లీతో మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు రాణాపై కఠిన చర్యలు తీసుకున్నారు. అభిషేక్‌  ఔటైన తర్వాత రాణా శృతిమించిన సంబురాలు (అభిషేక్‌ను డగౌట్‌ వైపు వెళ్లాలని కోపంగా ఆదేశించాడు) చేసుకుని తగిన మూల్యం చెల్లించుకున్నాడు. రాణా కొద్ది రోజుల కిందట ​కూడా ఇలాగే ప్రవర్తించి జరిమానాను ఎదుర్కొన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ను ఔట్‌ చేశాక ఓవరాక్షన్‌ (ఫ్లయింగ్‌ కిస్‌ ఇస్తూ కోపంగా చూశాడు) చేశాడు. అందుకు మ్యాచ్‌ ఫీజ్‌లో 60 శాతం జరిమానాను ఎదుర్కొన్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో రాణా అతి చేసినా బౌలింగ్‌లో ఆట్టున్నాడు. 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగా.. కేకేఆర్‌ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఫిలిప్‌ సాల్ట్‌ (68) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి కేకేఆర్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు కేకేఆర్‌ బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. కుల్దీప్‌ యాదవ్‌ (35 నాటౌట్‌) ఆ జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వరుణ్‌ చక్రవర్తి 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా తలో 2 వికెట్లు, స్టార్క్‌, నరైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.  

South Africa Announce T20 WC 2024 Squad 2 Uncapped Players In
T20 WC SA Squad: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఇద్దరు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు ఛాన్స్‌

టీ20 ప్రపంచకప్‌-2024 కోసం సౌతాఫ్రికా తమ జట్టు ప్రకటించింది. మెగా టోర్నీ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఐసీసీ ఈవెంట్లో ఐడెన్‌ మార్క్రమ్‌ సారథ్యంలో తలపడే టీమ్‌లో అన్రిచ్‌ నోర్జే, క్వింటన్‌ డికాక్‌లకు చోటు ఇవ్వడం గమనార్హం.కాగా ఇటీవలే వీరిద్దరిని సౌతాఫ్రికా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి బోర్డు తప్పించిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా పేసర్‌ ఆన్రిచ్‌ నోర్జే గతేడాది సెప్టెంబరు నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండగా.. వరల్డ్‌కప్‌-2023 టోర్నీ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు డికాక్‌.అన్‌క్యాప్ట్‌ ప్లేయర్ల పంట పండింది!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సత్తా చాటిన ఇద్దరు అన్‌క్యాప్ట్‌ ప్లేయర్ల పంట పండింది. ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని రియాన్‌ రికెల్టన్‌, ఒట్‌నీల్‌ బార్ట్‌మన్‌లు ఏకంగా ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించారు.  ఎంఐ కేప్‌టౌన్‌ తరఫున రికెల్టన్‌ 530 పరుగులతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ తరఫున బరిలోకి దిగిన బార్ట్‌మన్‌ 18 వికెట్లతో రాణించి జట్టును వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు సౌతాఫ్రికా పెద్దపీటవేయడం గమనార్హం. ఇక ఐపీఎల్‌-2024లో దుమ్ములేపుతున్న పవర్‌ హిట్టర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌లు కూడా మెగా ఈవెంట్లో భాగం కానున్నారు. కాగా జూన్‌ 1న ప్రపంచకప్‌నకు తెరలేవనుండగా.. జూన్‌ 3న సౌతాఫ్రికా న్యూయార్క్‌ వేదికగా శ్రీలంకతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.టీ20 ప్రపంచకప్‌-2024 కోసం సౌతాఫ్రికా జట్టు ఇదే:ఐడెన్‌ మార్క్రమ్‌(కెప్టెన్‌), ఒట్‌నీల్‌ బార్ట్‌మన్‌, గెరాల్డ్‌ కొయోట్జీ, క్వింటన్‌ డికాక్‌, జోర్న్‌ ఫార్చూన్‌, రీజా హెండ్రిక్స్‌, మార్కో జాన్సెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, డేవిడ్‌ మిల్లర్‌, అన్రిచ్‌ నోర్జే, కగిసో రబడ, రియాన్‌ రికెల్టన్‌, తబ్రేజ్‌ షంసీ, ట్రిస్టన్‌ స్టబ్స్‌.ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: నండ్రీ బర్గర్‌, లుంగి ఎంగిడి. 

CM jagan Slams Chandrababu At mydukur Meeting
75 ఏళ్లు వచ్చినా చం‍ద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్‌

సాక్షి, కడప: చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్దాలు, కుట్రలే గుర్తొస్తాయని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటినా.. కనీసం పశ్చాతాపం కూడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పేదలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని తెలిపారు. వైఎస్‌ జగన్‌కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని.. పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని అన్నారు.కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్‌ మంగళవారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. 2014లో మేనిపెస్టోను అమలు చేశావా అంటే బాబుకు కోమొస్తుందని విమర్శించారు.  మన ప్రభుత్వ స్కీముల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని దుయ్యబట్టారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు చేసిన స్కీములేమిటని ప్రశ్నించారు.‘మైదుకూరు సిద్ధమా.. ఇంతటి ఎండలో కూడా చెరగని చిరు చిరునవ్వుల మధ్య ఏమాత్రం కూడా ఎండను ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు పంచిపెడుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు. 58 నెలల కాలంలోనే విప్లవాత్మక మార్పులు. ప్రతిఒక్కరూ కూడా నేను చెప్పేవి బాగా ఆలోచించమని కోరుతున్నాను. గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయాలు డీబీటీగా, 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం వాగ్ధానాల అమలు, గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మారిన ప్రభుత్వ బడులు, పిల్లల చదువులు, చరిత్రలో ఎప్పుడూ చూడనివిధంగా లంచాలు, వివక్ష లేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, ఇంటివద్దకే పథకాలు, చేయిపట్టుకుని నడిపించే వైద్యం, వ్యవసాయం, చరిత్రలో ఎప్పుడూ చూడనివిధంగా సామాజిక న్యాయం జరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగనివిధంగా ఈ 58 నెలలకాలంలోనే జరిగిన విప్లవాత్మక మార్పులు. మరి ఇలాంటి మార్పుల మధ్య మే 13వ తారీఖున అంటే రెండు వారాలు కూడా సరిగా లేవు. మే 13వ తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. నేను మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఈ జరగబోయే ఎన్నికలు ఒక జగన్‌కు, ఒక చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధం కాదు. ఈరోజు జరుగుతున్న ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ గెలుపునకు అర్థం.. ఈ విప్లవాత్మక మార్పులు, ఈ పథకాలన్నీ కొనసాగింపు, మరింతగా రెండడుగులు ముందుకు వేయడం. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే దాని అర్థం.. పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. చంద్రబాబు జీవితం అంతా మోసాలు, వెన్నుపోట్లు, కుట్రలే. ఈ మధ్య చంద్రబాబు వయస్సు 75 దాటింది. ఇంత జీవితం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలతోనే, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా 75 సంవత్సరాలు వచ్చాయి కదా ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనేలేదు. నేను వరుసబెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీముల లిస్టు చదువుతుంటే ఈ చంద్రబాబుకు పిచ్చికోపం వస్తోంది. నేను చదివే స్కీముల లిస్టు గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మనందరి పాలనలో ఈ 58 నెలల్లోనే ఎలా అడుగులు పడ్డాయో ఒకసారి చూడమని అడుగుతున్నాను. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే రూ.3వేల పెన్షన్ కానుక.. గతంలో ఎప్పుడూ చూడలేదు, గతంలో ఎప్పుడూ జరగలేదు. పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో నాడు-నేడు, బడి తెరిచే సమయానికే విద్యాకానుక, బడిలో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్, టోఫెల్ క్లాసులు, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ట్యాబ్లు కనిపిస్తున్నాయి, క్లాస్ రూముల్లో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన, పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒక పేజీ తెలుగు ఒకపేజీ ఇంగ్లీష్ లో ఉన్న టెక్స్ట్ బుక్స్ కనిపిస్తున్నాయ్, పూర్తి ఫీజులు చెల్లిస్తూ పెద్ద చదువులకు జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరిక్యులమ్ లోకి ఆన్ లైన్ సర్టిఫైడ్ కోర్సులుగా కనిపిస్తున్నాయి. బడులకు పిల్లలను పంపే తల్లులు ఆలోచన చేయమని మీ అందరితో అడుగుతున్నాను. ఇవన్నీ కూడా నేను ఏదైతే చదువుతున్నానో, ఏదైతే చెప్తున్నానో గతానికి భిన్నంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు కనిపిస్తున్నాయి. బడులకు పిల్లలను పంపే తల్లులకు ప్రోత్సాహమిస్తూ అమ్మఒడి.. గతంలో ఎప్పుడూ లేదు. పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులకు ఒక మంచి అన్నగా, ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఈరోజు అమ్మఒడి అందిస్తున్నాం. అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తూ చేయూత, అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఓ కాపునేస్తం, ఓ ఈబీసీ నేస్తం, అక్కచెల్లెమ్మలకు అండగా ఓ ఆసరా, ఓ వైఎస్సార్ సున్నావడ్డీ. అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ల పేరిటే రిజిస్ట్రేషన్, అందులో ఏకంగా నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్లు, అక్కచెల్లెమ్మలకు రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, వారికి రక్షణగా వాళ్ల ఫోన్లలోనే దిశ యాప్.. గతంలో ఎప్పుడూ జరగనివిధంగా ఏకంగా చట్టం చేసి మరీ అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లతో మహిళా సాధికారత. ఇవన్నీ నేను ఏదైతే చెప్తున్నానో గతంలో ఎప్పుడూ జరగనివిధంగా కనిపిస్తున్నాయి. రైతన్నలకు రైతుభరోసా, ఇ-క్రాప్, ఉచిత పంటలబీమా, పగటిపూట రైతన్నలకు 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్‌పుట్ సబ్సిడీ, గ్రామాల్లోనే రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ రైతన్నలకు అండగా ఈరోజు మన ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నాయి. పేదవాడికి అండగా విస్తరించిన ఆరోగ్యశ్రీ. పేదవాడికి తోడుగా, పేదవాడికి అండగా.. ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా చేయిపట్టుకుని నడిపించే ఆరోగ్య ఆసరా, ఇంటికే వైద్యం అందిస్తూ ఆరోగ్య సురక్ష, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్.. పేదలందరికీ కూడా తోడుగా, ఆరోగ్యంగా అండగా ఉండనిస్తూ. ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇవన్నీ నేను ఏదైతే చెప్తున్నానో గతానికి భిన్నంగా ఈరోజు కనిపిస్తున్నాయి. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ లాయర్లకు లా నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నేతన్నలకు నేతన్ననేస్తం, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు వాహనమిత్ర, నా అక్కచెల్లెమ్మలకు, చిన్న చిన్న షాపుల్లో వ్యాపారం చేసుకుంటున్న రోడ్డు పక్కనే ఉన్న నా అన్నదమ్ములకు తోడుగా ఓ చేదోడు, తోడు. ఎంఎస్ఎంఈలకు గతంలో చూడనివిధంగా సపోర్ట్. స్వయం ఉపాధి రంగానికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా ఈరోజు అడుగులు కనిపిస్తున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గతంలో కూడా ఎప్పుడూ చూడనివిధంగా ఈరోజు గ్రామగ్రామాన గ్రామ, వార్డు సచివాలయాలు కనిపిస్తున్నాయి. 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, గ్రామగ్రామాన కనిపిస్తున్నాయి. ఇంటివద్దకే పౌరసేవలు, లంచాలు వివక్షలేని పథకాలు వస్తున్నాయి. నేను చెప్పేవన్నీ కూడా గతంలో ఎప్పుడూ చూడనివిధంగా జరుగుతున్న మార్పులు. నాడు-నేడుతో బాగుపడ్డ హాస్పిటళ్లు, నాడు-నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, పిల్లల చదువులు. ఇవి నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ మచ్చుకు కొన్ని.. గడగడ మీ బిడ్డ చదివితే, గడగడ మీ బిడ్డ నోటికి వస్తే మచ్చుకు కొన్ని ఈరోజు మీ బిడ్డ మీ అందరితోనూ పంచుకున్నాడు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతానికి భిన్నంగా, గతంలో ఎప్పుడూ చూడనివిధంగా, జరగనివిధంగా ఏకంగా 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు.. మరొక్కసారి చెబుతున్నా ఏకంగా 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం ఎలాంటి లంచాలు, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్లిపోతున్నాయి. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇలాంటి పాలన ఎప్పుడైనా చూశారా? అన్నది ప్రతి ఒక్కరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. మరి చంద్రబాబును నీ స్కీములు ఏమిటని అడుగుతున్నాను. 14 ఏళ్లు, 3సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీపేరు చెబితే ఏ పేదవాడికైనా కానీ ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతున్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదా.. 3సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీపేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతున్నాను. బాబూ అండ్ బ్యాచ్ మీ సంస్కారానికి నమస్కారం. మీ బిడ్డ, మీ జగన్, ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం వస్తోంది. బాగా కోపం వస్తోంది. మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా? అని చెప్పి ఈనాడుకు కోపం వస్తోంది, ఆంధ్రజ్యోతికి కోపం వస్తోంది, టీవీ5కి కోపం వస్తోంది, దత్తపుత్రుడికి కోపం వస్తోంది, వదినమ్మకు కోపం వస్తోంది.. ఇలా వీరందరికీ కూడా పిచ్చిపిచ్చిగా కోపం వస్తోంది. వీరితో పాటు చంద్రన్న కాంగ్రెస్‌కు కూడా కోపం వస్తోంది. మనకు కౌంటర్ గా వారు కూడా లిస్టులు చదువుతున్నారు. కాకపోతే ఆ లిస్టులు స్కీమ్ ల లిస్టులు కాదు, ఆ లిస్టులు నా మీద తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు. ఇవి ప్రతిరోజూ కూడా గడగడ చదివేస్తున్నారు. నేను అడుగుతున్నాను. అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వారందరితో కూడా చెప్తున్నాను... ఎంతటి దారుణంగా మాట్లాడుతున్నారో తెలుసా వీళ్లంతా.. జగన్ ను మనిషి అనాలో, రాక్షసుడు అనాలో చంద్రబాబుకు అర్థంకావట్లేదట. జగన్‌ను ఎందుకు చంపకూడదు? అని అడుగుతాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. పనిలోపనిగా జగన్‌ను పాతేస్తాను అని చెప్పి కూడా అంటాడు. మొన్న నందికొట్కూరులో అన్న మాటలివి. మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలివి. నిజంగా నేను అడుగుతున్నాను. చేతగానివాడికి కోపం ఎక్కువ. నువ్వు పేదలకు చేసిన మేలేంటి చంద్రబాబూ... బాబు.. ఓ చంద్రబాబు నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను అమలు చేసావా అంటే సమాధానం రాదు. కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి? ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్‌ను తిట్టి పెడితే ఏం ప్రయోజనం? ఎవరు ఇంటింటికీ మంచి చేశారు, ఎవరు అందరినీ మోసం చేసారు, వారి చరిత్ర ఏంటి అందరికీ తెలుసు. అసత్యాల హరిశ్చంద్రులంతా కలిసి.. అసత్యాల హరిశ్చంద్రులంతా కలిసి 2014లో ఎన్నికల వేళ ఇచ్చిన వాగ్దానాలు చూద్దాం వీరి విశ్వసనీయత ఏమిటో చూద్దాం. 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో, చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ఇంటింటికీ పంపిన పాంప్లెట్ ఇది. ఈటీవీ చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా ఊదరగొట్టారు. అక్కచెల్లెమ్మల మెడలో మంగళ సూత్రం ఒక చెయ్యి లాగేస్తుంటే మరో చెయ్యి అడ్డుకున్న యాడ్ గుర్తుందా...బాబొస్తున్నాడు అనే అడ్వర్టైజ్ మెంట్ అది. బాబు మేనిఫెస్టోలో మొదటి హామీ రూ.87,612 కోట్ల రుణమాఫీ- చేసాడా? రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు అన్నాడు- రూ.12,205 కోట్లలో ఒక్క రూపాయి అయినా మాఫీ చేసాడా? మూడో హామీ ఆడబిడ్డ పుడితే 20వేలు బ్యాంకుల్లో వేస్తానన్నాడు. ఎవ్వరికైనా ఒక్కరూపాయి అయినా వేసాడా? నాలుగో హామీ ఇంటింటికీ ఓ ఉద్యోగం, ఇవ్వలేకపోతే నెలనెలా రూ.2వేలు నిరుద్యోగభృతి అన్నాడు, ఐదేళ్లకు కలిపి రూ.1,20,000 ఇచ్చాడా? అర్హులందరికీ మూడుసెంట్ల స్థలం, కట్టుకునేందుకు ఇల్లు అన్నాడు. ఎవ్వరికైనా ఒక్క సెంటు స్థలం అయినా ఇచ్చాడా? రూ.10వేలకోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత పవర్‌ లూమ్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా? విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తా అన్నాడు చేశాడా? సింగపూర్‌కు మించి అభివృద్ధి అన్నాడు జరిగిందా? ప్రతి నగరంలో హైటెక్‌సిటీ అన్నాడు జరిగిందా? మైదుకూరులో కనిపిస్తోందా? ఈ 58 నెలల్లో మీ బిడ్డ చేసిన పనులు చెప్పాను. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్క హామీ నెరవేర్చలేదు. కనీసం ప్రత్యేక హోదా కూడా తేలేదు. ఇలాంటి వ్యక్తిని నమ్మాలా? మళ్లీ ఇదే ముగ్గురు ఇవాళ సూపర్‌ సిక్స్‌ అంటున్నారు. కొత్త మేనిఫెస్టో అంటున్నారు. కొత్త మోసాలు, కొత్త అబద్ధాలు తెస్తున్నారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్ అంటున్నారు. ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్‌ కారు అంటున్నాడు నమ్ముతారా? వీళ్ల మోసాలకు, అబద్ధాలకు మనం గట్టిగా బదులివ్వాల్సిన అవసరం ఉంది. లంచాలు, వివక్ష లేని పాలన కోసం ఫ్యాను కే ఓటేయండి. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా? పేదవాడి భవిష్యత్ మారాలన్నా? పథకాలన్నీ కొనసాగాలన్నా? లంచాలు, వివక్షలేని పాలన జరగాలన్నా? మన పిల్లలు, బడులు, చదువులు బాగుపడాలన్నా? మన వ్యవసాయం, హాస్పటళ్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 కు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. మీరంతా సిద్ధమేనా.. మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి. మన ప్రభుత్వం వచ్చాక రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసాం. కొన్ని అనివార్యకారణాల వల్ల, కరోనా వల్ల అయితేనేమి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల అయితేనేమి అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్టు చేయలేకపోయాం. నాలుగేళ్లు పుష్కలంగా వర్షాలు పడ్డాయి, అన్ని ప్రాజెక్టులలో నీళ్లు నిండాయి. కాబట్టి రాజోలి ప్రాజెక్టు సంబంధించి ప్రాముఖ్యత ఏమిటి అని మనకు అంత అనిపించలేదు. కానీ ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగా పడటంతో ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత తెలుస్తోంది. వచ్చే టర్మ్‌లో కచ్చితంగా రాజోలి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. మీ చల్లని దీవెను ఆశీస్సులు కోరుతున్నాం. మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాష్ట్రాన్ని మారుస్తున్నాడంటే అందుకు కారణం మీరు చూపుతున్న ప్రేమానురాగాలే. అవే నన్ను అడుగడుగునా కాపాడుతున్నాయి. తోడుగా ఉన్నాయి. అవే దీవెనలు ఆశీర్వాదాలు, మీ బిడ్డ పట్ల, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పట్ల చూపించాలని కోరుకుంటున్నాను అని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement