-
విందులో విజయ్ ఎమోషనల్.. ఇక గుడ్బై
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పేరు వింటే చాలు తమిళనాడు ఊగిపోతుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ పేరు సినిమా రంగంలో ట్రెండింగ్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ అని తెలిసిందే. గతేడాదిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ రానున్న శాసనసభ ఎన్నికల్లో (2026) పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో జననాయకన్ తన చివరి చిత్రమని ఆయనే స్వయంగా ప్రకటించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి గ్రిప్పింగ్స్ ఇప్పటికే విడుదలై చిత్ర అంచనాలను పెంచేశాయి. కాగా జననాయకన్ చిత్ర టీజర్ను విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 22న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా చిత్ర ఓటీటీ హక్కులను ఒక సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి 2026లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా జననాయకన్ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులందరికీ బిరియానీ విందును ఇచ్చిన విజయ్ భావోద్రేకానికి గురైనట్లు సమాచారం. అప్పట్లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఎంజీఆర్ నటించిన చివరి చిత్రం మదురై మీట్ట సుందరపాండియన్. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. జననాయకన్ చిత్రం విజయ్ జీవితాన్ని ఎలా మారుస్తుందో అనే ఆసక్తి ఇరాన్ అభిమానుల్లో నెలకొంది. -
180 మీటర్ల రైడ్కు ఓలా!
రద్దీ ట్రాఫిక్లో త్రిచక్ర వాహనాలు, కార్లు రయ్మని దూసుకుపోవడం కష్టం. ఈ ట్రాఫిక్ కష్టాలను ద్విచక్ర వాహనాలు అంటే బైక్లు సులువుగా తగ్గిస్తాయి. ఇదే బాధతో ఒక కస్టమర్ సైతం తన బైక్ను బుక్ చేసుకుని ఉంటారని భావించిన ఒక ఓలా రైడర్కు ఊహించని ఘటన ఎదురైంది. నవ్వు తెప్పించే ఆ ఘటన వివరాలను ఆ రైడర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ‘రోహిత్ వ్లోగ్స్టర్’లో పొందుపరిచారు. ఒక టీనేజీ అమ్మాయి బుక్ చేసిన ఆ రైడ్ తాలూకు పూర్తి వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్చేయగా కొన్ని గంటల్లోనే 20 లక్షల మంది చూశారు. ఈ వీడియో చూశాక నెటిజన్లు ఆపకుండా కామెంట్లు పెట్టడం మొదలెట్టారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?పట్టపగలు నిర్మానుష్యంగా ఉన్న వీధిలో ఒక టీనేజర్ నుంచి ఓలా బైక్ రైడ్ బుక్ అవడంతో సంబంధిత అబ్బాయి వెంటనే లొకేషన్కు చేరుకున్నాడు. ట్రాఫిక్ ఏమీ లేకున్నా అమ్మాయి బైక్ ఎందుకు బుక్చేసుకుందా అని ఒకింత అనుమానంగా చూశాడు. అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకోవడానికి ముందుగా గమ్యస్థానాన్ని యాప్లో సరిచూశాడు. ఇక్కడి నుంచి గమ్యస్థానం కేవలం 180 మీటర్లదూరంలో ఉండటం చూసి అవాక్కయ్యాడు. ఇంత తక్కువ దూరానికి బైక్ అవసరమా? అని నేరుగా అడిగేశాడు. ‘‘ దూరం తక్కువే. కానీ కుక్కలే ఎక్కువ’’ అని అమ్మాయి చెప్పిన సమాధానంతో పక్కున నవ్వేశాడు. వీధి శునకాల సమస్యకు అమ్మాయి కనుక్కున్న పరిష్కారం చూసి మెచ్చుకున్నాడు. వెంటనే అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకుని గమ్యస్థానంలో దింపాడు. అంత తక్కువ దూరానికి కేవలం రూ.19 బిల్లు అయ్యింది. ఆ బిల్లు చెల్లించేసి అమ్మాయి చకచకా వెళ్లిపోవడం చూసి అవాక్కవడం అబ్బాయి వంతయింది. ‘ View this post on Instagram A post shared by ROHIT VLOGSTER (@rohitvlogster) 180 మీటర్లకు కూడా బైక్ బుక్ చేయొచ్చని నాకూ ఇప్పుడే అర్థమైంది. రైడ్ స్టార్ట్ చేసి అమ్మాయిని కారణం అడిగి, ఆమె నుంచి సమాధానం పూర్తిగా వినేలోపే స్టాప్ వచ్చేసింది’’ అని రైడర్ ఒక పోస్ట్లో పేర్కొన్నాడు. సంబంధిత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కొందరు నెటిజన్లు స్ట్రీట్ డాగ్కు డాగేశ్ అనే పేరు పెట్టి.. ‘డాగేశ్ ఉన్నాడంటే ఎవరైనా ఆ మాత్రం భయపడాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. డాగేశ్ అంటే మజాకానా!! అని మరొకరు స్పందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒకటో తేదీ వచ్చిందంటే వణుకు
ఉద్యోగులు ప్రస్తుతం తాము చేస్తున్న కంపెనీ పని వాతావరణం నచ్చకో.. మరింత వేతనం ఆశించో.. ప్రమోషన్ కోసమో.. ఇలా విభిన్న కారణాలతో వేరే సంస్థకు మారాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తాము పని చేస్తున్న కంపెనీ వేతనం ఇచ్చిన తేదీ రోజున లేదంటే తర్వాత రోజున ఉద్యోగులు అధికంగా రాజీనామా పత్రాలను సమర్పిస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ తంతు యువకుల్లో మరీ ఎక్కువగా ఉంటోందంటున్నారు. ముంబయికి చెందిన స్టార్టప్ ‘పిట్@గో జీరో’ వ్యవస్థాపకురాలు కిరణ్ షా ఈ మేరకు వివరాలు వెల్లడించారు.‘ఉద్యోగులకు తాము చేస్తున్న కంపెనీలు నచ్చలేదంటే.. సరిగ్గా వేతనం పడే రోజున లేదా పడిన మరుసటి రోజున రాజీనామా చేస్తున్నారు. ఇది కొన్ని యాజమాన్యాలకు ఆందోళన కలిగిస్తుంది. ఈ తంతు యువకుల్లో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా అన్ని కంపెనీల్లో ఒకటో తేదీన జీతాలు ఇస్తారు. కాబట్టి ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే కొన్ని యాజమాన్యాలకు చుక్కలే. తమ ఉద్యోగులు ఎక్కడ రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉంటారోననే ఆందోళన చెందుతుంటాయి. ఉద్యోగులు కూడా ఈ విషయంలో కంపెనీలకు విదేయతతో ఉండాలి. తమ డిమాండ్లు ఏమిటో ముందుగా కంపెనీతో చర్చించాలి’ అన్నారు.ఇదీ చదవండి: 30ల్లోనే ముచ్చెమటలు.. తీవ్ర వ్యాధులు‘ఉద్యోగులు నిజంగా కంపెనీ నుంచి తప్పుకోవాలనుకుంటే హుందాగా తప్పుకోండి. తప్పా కంపెనీ వేతనం పడిన వెంటనే కొలువు నుంచి వైదొలగడం సరికాదు. అప్పటివరకు ఉద్యోగికి ఇచ్చిన బాధ్యతలు వెంటనే మరో వ్యక్తికి అసైన్ చేయాలంటే సంస్థకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తప్పుకుండా నోటీస్ పీరియడ్ చేయాలి. జీతం వేసిన వెంటనే మీ యజమానిని భయభ్రాంతులకు గురిచేయకండి’ అని తెలిపారు. -
'అతడొక సూపర్ స్టార్.. గిల్ స్దానంలో బ్యాటింగ్కు పంపండి'
తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్ టీమిండియా తరపున టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగే తొలి టెస్టులో సుదర్శన్ డెబ్యూ చేయడం దాదాపు ఖాయమైంది. భారత జట్టుతో పాటు లండన్కు చేరుకున్న సుదర్శన్ తన ప్రాక్టీస్ను మొదలుపెట్టాడు. వన్డే, టీ20ల్లో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకున్న సుదర్శన్.. ఇప్పుడు వైట్బాల్ జెర్సీలో భారత తరపున సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుదర్శన్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడొక అద్బుతమైన ఆటగాడని, మూడో స్ధానంలో బ్యాటింగ్కు పంపాలని క్లార్క్ సూచించాడు.కాగా విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశముంది. దీంతో గిల్ స్ధానంలో సుదర్శన్ బ్యాటింగ్కు రావాలని క్లార్క్తో పాటు పలు మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు."సాయిసుదర్శన్ ఒక సూపర్ స్టార్. అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. అతడు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా షాట్లు ఆడగలడు. టెస్టు క్రికెట్లో అతడు నంబర్ త్రీ స్ధానానికి సరిగ్గా సరిపోతాడు. అదే వన్డే, టీ20ల్లో అయితే ఓపెనర్గా అతడు ఇన్నింగ్స్ను ప్రారంభించాలని భావిస్తున్నాను. సుదర్శన్ భారత టెస్టు సెటప్లో భాగంగా ఉన్నాడు. కాబట్టి అతడికి ఇంగ్లండ్పై గడ్డపై అరంగేట్రం చేసే అవకాశం లభిస్తుంది" అని క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్కాస్ట్లో క్లార్క్ పేర్కొన్నాడు. -
మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా?
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) పేరు కొన్నాళ్లుగా మార్మోగిపోతోంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో అడ్డంగా వాదించడంతో ఆమెను ప్రభాస్ 'స్పిరిట్' నుంచి తీసేశారు. అత్యధిక రెమ్యునరేషన్ వంటి డిమాండ్లకు తలొగ్గినప్పటికీ వరుస డిమాండ్లు చేస్తుండటంతో సందీప్రెడ్డికి విసుగొచ్చింది. పైగా ఈ మధ్యే తల్లయ్యాను కాబట్టి.. రోజులో ఎనిమిది గంటలే షూటింగ్లో పాల్గొంటానని, సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని అనడంతో డైరెక్టర్కు కోపమొచ్చి ఆమెను తీసేశాడు. డిమాండ్లపై వెనక్కు తగ్గని దీపిక?దీపికా స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ని తీసుకున్నాడు. ఆ సమయంలో దీపిక కథ లీక్ చేసిందంటూనే పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు వంగా. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కూడా పని గంటల గురించి, పారితోషికం గురించి డిమాండ్ చేసిందట! దీంతో ఆమె పాత్ర నిడివి తగ్గించాలని లేదా తనను తీసేసి ఆమె స్థానంలో త్రిప్తిని తీసుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.బ్లాక్బస్టర్ కల్కిస్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్.. ఇవి రెండూ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలే! ఈ రెండిట్లోనూ త్రిప్తికి నటించే ఛాన్స్ వచ్చిందంటే మాత్రం తన క్రేజ్ రెట్టింపు కావడం ఖాయం. కాగా కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినిదత్ నిర్మించాడు. గతేడాది జూన్లో విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి: బన్నీ వాసు -
తెలుగు బ్యూటీ న్యూ బిగినింగ్స్.. పెళ్లికి రెడీ అన్న ఐశ్వర్య
దుబాయ్లోనే చిల్ అవుతున్న సమంత... నక్షత్రాలను అందుకుంటానంటూ పోస్ట్ఫుట్బాల్ గ్రౌండ్లో జెనీలియా దేశ్ముఖ్న్యూ బిగినింగ్స్ అంటూ గుడికి వెళ్లిన ఫోటోలు షేర్ చేసిన గౌరీప్రియడోసు పెంచిన రాశీ ఖన్నారెడ్ మిర్చిలా 3 రోజెస్ బ్యూటీ రాశీ సింగ్ పెళ్లికి రెడీ అంటున్న ఐశ్వర్య.. కాకపోతే ఎవరో పెళ్లో గెస్ చేయమన్న బ్యూటీ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Aishwarya pisse__Official (@aishwarya_pisse_) -
రూ.500 నోట్లు మళ్లీ రద్దవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే..
రూ.500 నోట్లు మరోసారి రద్దవుతాయంటూ సోషల్ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే వచ్చే ఏడాది నాటికి రూ.500 నోటును రద్దు చేస్తారంటూ వచ్చిన వాదనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు దీనిపై స్పష్టత ఇచ్చింది.2026 మార్చి నుంచి రూ.500 నోట్లను దశలవారీగా రద్దు చేస్తామని పేర్కొంటూ గత కొన్ని రోజులుగా యూట్యూబ్లో ఓ వీడియో వైరల్ కావడంతో కరెన్సీ నోట్ల భవిష్యత్తుపై భయాందోళనలు మొదలయ్యాయి. క్యాపిటల్ టీవీ అనే ఛానెల్లో అప్లోడ్ చేసిన 12 నిమిషాల నిడివిగల ఈ వీడియో జూన్ 2 నుంచి ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.ఈ నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలపై స్పందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అటువంటి ప్రకటన చేయలేదు. ప్రజలు ఎటువంటి తప్పుడు సమాచారానికి గురికావద్దని భారత ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ సూచించింది. ‘రూ.500 నోట్లను రద్దు చేయలేదు. చట్టబద్ధంగానే ఉన్నాయి. వార్తలను నమ్మి.. షేర్ చేసే ముందు అధికారిక సోర్స్లను ఎప్పటికప్పుడు సందర్శించి నిర్ధారించుకోండి’ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పీఐబీ పోస్ట్ పేర్కొంది.కొత్త రూ.500 నోట్లు ఎప్పుడొచ్చాయంటే..2016 నవంబర్ లో పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుత నోటు 66 మిమీ x 150 మిమీ కొలతల్లో స్టోన్ గ్రే కలర్ లో ఉంటుంది. దీని వెనుక భాగంలో భారతీయ వారసత్వ ప్రదేశాల థీమ్ కు అనుగుణంగా ఎర్రకోట చిత్రం ఉంటుంది. -
అలా జరిగితే కోహ్లి రిటైర్మెంట్ వెనక్కి: మైఖేల్ క్లార్క్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు విరాట్ తన నిర్ణయాన్ని వెల్లడిండాడు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెడ్బాల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.అతడి స్ధానంలో కొత్త టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. కోహ్లి, రోహిత్ శర్మ వంటి ఇద్దరూ దిగ్గజాల లేకుండానే భారత జట్టు ఇంగ్లండ్కు పయనమైంది. కేఎల్ రాహుల్, జడేజా, బుమ్రా మినహా పెద్దగా అనుభవం ఉన్న ఆటగాళ్లు ప్రస్తుత భారత టెస్టు జట్టులో లేరు. దీంతో ఇంగ్లండ్పై గిల్ సారథ్యంలోని భారత జట్టు ఎలా రాణిస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి రిటైర్మెంట్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్టు సిరీస్లో టీమిండియా ఘోరంగా ఓడిపోతే విరాట్ తిరిగి తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటాడని క్లార్క్ అభిప్రాయపడ్డాడు."ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో భారత జట్టు 5-0 తేడాతో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొటే, కచ్చితంగా విరాట్ కోహ్లి తిరిగి రావాలని అంతా కోరుకుంటారు. ఆ సమయంలో కెప్టెన్, అభిమానులు, సెలక్టర్లు అభ్యర్దిస్తే కోహ్లి కచ్చితంగా తన మనసును మార్చుకుంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే అతడు ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ను ప్రేమిస్తున్నాడు. ఆ ఫార్మాట్పై అతనికి ఎంత మక్కువ ఉందో అందరికీ తెలుసు. విరాట్ ఇప్పటికీ మెరుగైన క్రికెట్ ఆడుతున్నాడు. అయితే విరాట్ రిటైర్మెంట్ గల కారణాలంటో మనకు తెలియదు. కానీ ప్రతీ ఒక్కరూ తమ కెరీర్ను ఏదో ఒక చోట ముగించికతప్పదు" అని బియాండ్23 క్రికెట్ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లార్క్ పేర్కొన్నాడు. తన కెరీర్లో 123 టెస్టు మ్యాచ్లు ఆడిన కోహ్లి, 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలతో మొత్తం 9,230 పరుగులు చేశాడు. చదవండి: రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్? -
Yoga కడుపు ఉబ్బరమా..? ఉందిగా యోగా
కడుపు ఉబ్బరం చాలా మందిలో కనిపించే ఒక సాధారణ సమస్య. ఇది చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. క్రమంగా జీర్ణ సమస్యలు, మానసిక రుగ్మతలు, నిద్ర లేమి వంటి సమస్యలకు దారితీస్తుంది. సహజంగానే ఈ సమస్యను నివారించు కోవచ్చు. ఎందుకు వస్తుంది?కడుపులో ఏర్పడే కొన్నిరకాల రసాయనాల ద్వారా ఇలా జరుగుతుంది. సాధారణంగా కడుపు ఉబ్బరం అనేది మలబద్ధకం ద్వారా వస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా కడుపు ఉబ్బరాన్ని కొన్ని యోగాసనాల ద్వారా తగ్గించుకోవచ్చుకటి చక్రాసనం...పేరుకు తగ్గట్లుగానే ఈ ఆసనం వెన్నెముకకు సంబంధించినది. నేలపై నిల్చొని వీపును రెండు పక్కలా తిప్పుతూ ఉండాలి. ఈ సమయంలో చేతులను భుజాలకు రెండు వైపులా స్ట్రెచ్ చేస్తూ చా΄ాలి. ఇలా రెండువైపులా కనీసం 10 రౌండ్లు, 2 నిమిషాల వరకు చేయాలి.చదవండి: లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన బిలియనీర్ కొడుకులు: మెట్రోకు జై కొట్టిన ‘అమ్మ’సైడ్ యాంగిల్ పోజు: కాళ్లను స్ట్రెచ్ చేసి, ఒకవైపుగా వంగాలి. ఇంకో కాలును వెనక్కి చాపాలి. వంగిన కాలుమీద చేతిని ఉంచి మరో చేతిని నిటారుగా పైకి చూపిస్తూ, బాడీని వీలైనంత వరకు వంచాలి. మొదట్లో 15–20 సెకన్ల నుంచి ప్రారంభించి క్రమంగా 2 నిమిషాల వరకు చేయడం అలవాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: వీటికి చాలా దూరంగా ఉండాలి...ఫుడ్ @ 60ఫ్రాగ్ పోజ్: ముందుగా వజ్రాసన భంగిమలో మీ కాళ్లను వెనుకకు మడిచి యోగా మ్యాట్పై కూర్చోవాలి. మీ చేతులను పిడికిలిగా చేసి, వాటిని ఉదరం దగ్గర పెట్టుకుని మెల్లగా ముందుకు వంగాలి. ఈ ఆసనం కూడా మొదట్లో 15–20 సెకన్ల నుంచి ్ర΄ారంభించి క్రమంగా 2 నిమిషాల వరకు చేయాలి. -
భార్య తల నరికి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన భర్త.. కారణం ఏంటంటే?
బెంగళూరు,సాక్షి: బెంగళూరు సమీపంలో ఒళ్లు గగూర్పొడిచే సంఘటన చోటు చేసుకుంది. అనేకల్ ప్రాంతంలోని హీలాలిగె గ్రామంలో నివసిస్తున్న ఓ యువకుడు తన భార్యను నరికి, ఆమె తలతో పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయిన ఘటన కలకలం రేపింది.28 ఏళ్ల శంకర్ అనే వ్యక్తి తన 26 ఏళ్ల భార్య మానసను తల నరికి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శంకర్, మానస దంపతులు కొంతకాలంగా హీలాలిగె గ్రామంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. జూన్ 3 రాత్రి శంకర్ తన పని ముగించుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మానస మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి శంకర్ తీవ్రంగా కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, మానస పుట్టింటికి వెళ్లింది.అయితే, ఆ తర్వాత కొన్ని రోజులు మానస తిరిగి ఇంటికి వచ్చి శంకర్ను వేధించినట్లు సమాచారం. హత్యకు ముందు రోజు కూడా ఆమె ఇంటికి వచ్చి గొడవ పడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 6 రాత్రి శంకర్ తాను మానసను హత్య చేసి, ఆమె తల నరికి, నేరుగా సూర్యనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడే తాను హత్య చేసినట్టు పోలీసులకు చెప్పిన శంకర్, తలను కూడా పోలీసులకు చూపించాడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (బెంగళూరు రూరల్) సీకే బాబా మాట్లాడుతూ...రాత్రి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదంలో భార్యను తలను నరికి స్టేషన్కు తీసుకువచ్చాడు. మానసకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో గత వారం రోజులుగా ఈ దంపతులు తరచూ గొడవపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, శంకర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.