-
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు . శనివారం అర్ధరాత్రి వరకు 88,257 మంది స్వామిని దర్శించుకున్నారు. 45,068 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.68 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 7 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. జూన్ 9 నుంచి 11వ తేదీ వరకు జ్యేష్టాభిషేకంఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుంది.ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు.ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. -
IND-A vs ENG: 348 పరుగులకు భారత్-ఎ ఆలౌట్
నార్తంప్టన్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న రెండో అనాధికారిక భారత్-ఎ జట్టు బ్యాటర్లు రాణించారు. టాస్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్-ఎ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది. 319/7 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు.. అదనంగా 29 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్ను ముగించింది. ఇండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 168 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్తో 116 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. రాహుల్తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... గత మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన కరుణ్ నాయర్ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ మూడు వికెట్లు పడగొట్టగా..జోష్ టంగ్, జార్జ్ హిల్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అనాధికారిక టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.మరో 13 రోజుల్లో..ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. తొలి టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లేకుండా ఇంగ్లండ్కు వెళ్లిన టీమిండియా.. ప్రత్యర్ధి జట్టును ఎలా ఎదుర్కొంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ స్ధానంలో కొత్త టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
హమాస్ రహస్య సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్
జెరూసలేం: ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్ రహస్య స్థావరాన్ని గుర్తించాయి. గాజా ఆస్పత్రి కింద హమాస్ టన్నెల్ నెట్వర్క్ను కొనుగొన్నట్లు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా సాగించే హమాస్ కార్యకలాపాలకు ఈ సొరంగం కమాండ్ సెంటర్గా ఉపయోగిస్తుంటారని ఇజ్రాయెట్ తెలిపింది. అలాగే ఆయుధాలు, నిఘా సామగ్రితో కూడిన భూగర్భ మౌలిక సదుపాయాలు కలిగివున్న సొరంగపు ఫుటేజీని విడుదల చేసింది.గాజాలోని ఖాన్ యూనిస్లోని ఒక కీలక ఆస్పత్రి కింద ఈ సొరంగం ఉందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్ కింద ఉన్న ఈ సొరంగం సీనియర్ హమాస్ నేతల కమాండ్ అండ్ కంట్రోల్కు కేంద్రంగా ఉంటూ, ఇజ్రాయెల్ దళాలపై దాడులను సమన్వయం చేయడానికి ఉపయోగపడింది. ⭕️UNCOVERED: An underground tunnel route beneath the European Hospital in Khan Yunis, Gaza. In a special, targeted operation, IDF soldiers located an underground tunnel route containing numerous findings such as command and control rooms, weapons, and additional intelligence… pic.twitter.com/7bPM5ozHN8— Israel Defense Forces (@IDF) June 7, 2025ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో వీడియో ఫుటేజ్ను విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మార్గదర్శకత్వంలో గోలాని బ్రిగేడ్, యాహలోమ్ యూనిట్, ప్రత్యేక దళాలు పాల్గొన్న ఆపరేషన్ సమయంలో ఈ సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ తన ఉగ్రవాద ప్రయోజనాల కోసం గాజాలోని ఆస్పత్రులపై దాడులకు తెగబడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. 2023లో గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి కింద కింద ఒక హమాస్ సొరంగాన్ని కనుగొన్నట్లు ఐడీఎఫ్ గతంలో పేర్కొంది. అయితే యుద్ధంలో అది పూర్తిగా ధ్వంసమైంది. ఇది కూడా చదవండి: ఇండోర్ జంట మిస్సింగ్ మిస్టరీ.. ఏ రోజు ఏం జరిగింది? -
11న పొదిలికి వైఎస్ జగన్
పొదిలి రూరల్: పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. శనివారం పొదిలి–దర్శి రోడ్డులోని ఎస్ఆర్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ స్థలాన్ని వైఎస్సార్సీపీ ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, అన్నా కృష్ణచైతన్యతో కలిసి పరిశీలించారు.అనంతరం శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ గత నెల 28న పొదిలి పొగాకు బోర్డును వైఎస్ జగన్ సందర్శించాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడిందని పేర్కొన్నారు. ఈ నెల 11న కార్యక్రమం ఖరారైనట్లు చెప్పారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పొదిలి పొగాకు బోర్డుకు వైఎస్ జగన్ చేరుకుంటారన్నారు. వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుని భరోసా కల్పిస్తారని వివరించారు.అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. హెలిప్యాడ్ ప్రాంతంలో చేపట్టాల్సిన పనులు వేగవంతం చేయాలని బూచేపల్లి సిబ్బందికి సూచించారు. వారి వెంట వైఎస్సార్సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, వైఎం ప్రసాద్రెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కె.నరసింహారావు తదితరులు ఉన్నారు. -
రెండున్నరేళ్లలో 2 ఎయిర్పోర్టులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండున్నరేళ్లలో తెలంగాణలో ఒకేసారి రెండు విమానాశ్రయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్లో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉండగా, 2027 చివరికల్లా మూడు విమానాశ్రయాలు అందుబాటులో ఉండనున్నాయి. వరంగల్ శివారులోని మామునూరులో ఉన్న నిజాం కాలంనాటి ఎయిర్ర్స్టిప్, ఆదిలాబాద్ పట్టణ శివారు శాంతినగర్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో ఉన్న హెలిపోర్టుల స్థానంలో ఈ కొత్త విమానాశ్రయాలు నిర్మాణం కాబోతున్నాయి. ఈ సంవత్సరం చివరికల్లా టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపట్టేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చర్యలు ప్రారంభించింది. దాదాపు వేయి ఎకరాల విస్తీర్ణంలో వరంగల్ విమానాశ్రయాన్ని స్వయంగా ఏఏఐ నిర్మించనుండగా, ఆదిలాబాద్ విమానాశ్రయం విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నైట్ ల్యాండింగ్.. బోయింగ్ 737కు సరిపడా రన్వే.. ఈ విమానాశ్రయాలను ఆధునిక ఎయిర్పోర్టులుగా నిర్మించనున్నారు. సాధారణంగా విమానాశ్రయాలు నిర్మించేటప్పుడు తొలుత చిన్న విమానాలు దిగేలా రూపొందించి, భవిష్యత్తులో వాటిని విస్తరిస్తారు. కానీ, వీటిని ఒకేసారి పెద్ద విమానాశ్రయాలుగానే నిర్మించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపాదనకు ఏఏఐ సమ్మతించింది. రాత్రివేళ కూడా విమానాలు వచ్చిపోయే వసతులుండాలని సీఎం కోరగా, దానికీ ఓకే చెప్పింది. బోయింగ్ 737, ఎయిర్బస్ 320 లాంటి పెద్ద విమానాలు కూడా వచ్చిపోయేందుకు వీలుగా దాదాపు 3 వేల మీటర్ల పొడవైన రన్వేలను నిర్మించనున్నారు. నైట్ల్యాండింగ్, టేకాఫ్కు వీలుగా ఆధునిక మెకానిజం ఏర్పాటు చేయనున్నారు. వరంగల్ ఎయిర్పోర్టు వేయి ఎకరాల్లో, ఆదిలాబాద్ విమానాశ్రయం 600 ఎకరాల విస్తీర్ణంలో రూపొందుతాయి. ఒక్కో విమానాశ్రయం నిర్మాణానికి రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఒకేసారి 500 మంది ప్రయాణించేలా వీటిని నిర్మిస్తున్నారు. ఉడాన్ రీజినల్ కనెక్టివిటీ స్కీంతో వీటిని అనుసంధానిస్తారు. మూడేళ్లపాటు వయబిలిటీ గ్యాప్ ఫండ్ను కేంద్రం అందిస్తుంది. విమానాశ్రయ నిర్వహణ వ్యయంలో కేంద్రం 80 శాతం, రాష్ట్రం 20 శాతం భరిస్తాయి. వరంగల్లో చకచకా భూ సేకరణ నిజాం కాలంలో మామునూరులో ఎయిర్ర్స్టిప్ నిర్మించారు. ఇక్కడ 1,400, 1,000 మీటర్ల వెడల్పుతో రెండు శిథిల రన్వేలున్నాయి. ఇప్పుడు వీటి స్థానంలో 3 వేల మీటర్ల భారీ రన్వే రూపొందనుంది. పాత ఎయిర్ర్స్టిప్నకు సంబంధించి ఏఏఐ అధీనంలో 696.14 ఎకరాల భూమి ఉంది. ప్రతిపాదిత భారీ విమానాశ్రయానికి మరో 280 ఎకరాల భూమి అవసరం. సమీపంలోని ఉన్న రెండు ఊళ్లను ఖాళీ చేయించి ఆ భూమిని సేకరించే కసరత్తు ప్రారంభించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను ఇందుకోసం విడుదల చేసింది. ప్రస్తుతం అధికారులు ఆ రెండు గ్రామాల ప్రజలను ఒప్పించే పనిలో ఉన్నారు. సమీపంలోని ప్రభుత్వ భూమిని పరిహారంగా నిర్వాసితులకు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి రెండు ప్రణాళికలు రూపొందించారు. గ్రామస్తులు ఎంచుకున్న దానికి అమలు చేయనున్నారు. వరంగల్–ఖమ్మం, మరో రోడ్డును దారి మళ్లించనున్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు ఎన్ఓసీ నిజాం హయాంలో ఆదిలాబాద్ పట్టణ శివారులోని శాంతినగర్లో చిన్న ఎయిర్ర్స్టిప్ సేవలందించింది. ప్రస్తుతం అది ఐఏఎఫ్ అదీనంలో ఉంది. అక్కడ రన్వే బదులు హెలిప్యాడ్ మాత్రమే ఉంది. దీన్ని ప్రస్తుతం హెలిపోర్టుగా వినియోగిస్తున్నారు. దీన్ని భవిష్యత్తులో ఎయిర్ఫోర్స్ జెట్ల వినియోగానికి వీలుగా అభివృద్ధి చేయాలని చాలాకాలంగా ఐఏఎఫ్ ప్రయత్నిస్తోంది. తాజా నిర్ణయంలో ఆ కల సాకారం కానుంది. ఇందుకు సమ్మతిస్తూ తాజాగా ఐఏఎఫ్ ఎన్ఓసీ జారీ చేసింది. ప్రస్తుతం ఎయిర్ఫోర్స్ అదీనంలో 369 ఎకరాల భూమి ఉంది. మరో 250 ఎకరాలు సేకరించి విమానాశ్రయం నిర్మించనున్నారు. రెండు విమానాశ్రయాలను 24 నెలల్లో సిద్ధం చేయనున్నట్టు తాజాగా ఏఏఐ పేర్కొంది. అయితే, 18 నెలల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి లేఖ రాశారు. దీంతో రెండేళ్లలోపు అవి సిద్ధమవటం ఖాయంగా కనిపిస్తోంది. -
సికింద్రాబాద్లో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలో ఇవాళ హైడ్రా కూల్చివేతలు జరిగాయి. శుక్రవారం వేకువజాము నుంచే బేగంపేట ప్యాట్నీ పరిధిలోని నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగించారు. కంట్మోనెంట్ బోర్డు పరిధిలో తొలిసారి హైడ్రా కూల్చివేతలు జరగడం ఇక్కడ విశేషం.హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ గురువారమే రసూల్పురా నాలాను పరిశీలించారు. ఆపై కూల్చివేతలకు వారు ఆదేశించడంతో సిబ్బంది రంగంలోకి దిగారు. హైడ్రా (Hydra) అధికారులు కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి అక్రమ కట్టడాలను కూల్చివేశారు.. తాజా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) మీడియాతో మాట్లాడారు. నగరంలోని నాలాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారాయన. వచ్చే 4 నెలల పాటు ఈ అంశంపైనే దృష్టి పెడుతున్నట్లు, వరదనీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను తొలగిస్తామని.. పేదల నిర్మాణాల అంశాన్ని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్ చెప్పారు. హైడ్రా (HYDRA) అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ 🚜💥అనే ప్రత్యేక సంస్థ. ఇది హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను తొలగించడం, చెరువులను రక్షించడం, నగరాన్ని వరదల నుంచి కాపాడడం వంటి పనులు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఇప్పటికే వందల సంఖ్యలో కట్టడాలను కూల్చేసింది. మరోవైపు ఇది రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయ్యింది. -
డిన్నర్కి వెళ్తూ కోటీశ్వరులయ్యారు!
వాషింగ్టన్: అదృష్టం అంటే నిజంగా ఇదేనేమో! డిన్నర్ చేద్దామని సరదాగా హోటల్కు వెళ్తూ మధ్యలో ఆగి కొన్న లాటరీ టికెట్కు ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల(రూ.12.86 కోట్లు) సొమ్ము లభించింది. అమెరికాలోనూ న్యూజెర్సీలో ఈ సంఘటన జరిగింది. న్యూజెర్సీ దంపతులు డిన్నర్ కోసం హోటల్కు బయలుదేరారు. మధ్యలో ఓ దుకాణం వద్ద ఆగి 3 డాలర్లు(రూ.257) పెట్టి లాటరీ టికెట్ కొనేశారు. నిజానికి వారిద్దరిలో ఒకరికి ఇదే దుకాణంలో కొనడం ఇష్టంలేదు. మరోచోట చూద్దామని చెప్పారు. కాసేపు ఇద్దరూ చర్చించుకొని చివరికి ఇక్కడే కొనాలని నిర్ణయించుకున్నారు. టికెట్ కొన్న తర్వాత స్క్రాచ్ చేసి చూడగా, ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల సొమ్ము గెలుచుకున్నట్లు తెలిసిపోయింది. దంపతులు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోయారు. తమ కష్టాలన్నీ తీరిపోయినట్లేనని వారు ఆనందం వ్యక్తంచేశారు. బిల్లులు చెల్లించడానికి ఇన్నాళ్లూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇకపై ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. తమ జీవితం ఇక సుఖమయం అవుతుందని సంతోషపడ్డారు. 1.5 మిలియన్ డాలర్ల సొమ్మును 25 ఏళ్లపాటు విడతలవారీగా తీసుకొనేలా లాటరీ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. -
అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు.. కొలంబయాలో ఉద్రిక్తత
బొగోటా: అమెరికాలోని కొలంబియాలో దారుణం చోటుచేసుకుంది. కొలంబియన్ మితవాద ప్రతిపక్ష సెనేటర్, వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థి మిగ్యుల్ ఉరిబ్ టర్బే(39)పై కాల్పులు జరిగాయి. బొగోటాలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిగ్యుల్ ఉరిబ్ టర్బే జనం మధ్య ప్రసంగిస్తుండగా, ఆయనపై కాల్పులు జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. కొంతమంది అతనిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అటార్నీ జనరల్ లూజ్ అడ్రియానా కామార్గో కారకోల్ మీడియాతో మాట్లాడుతూ మిగ్యుల్ ఉరిబ్ టర్బే ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారని తెలిపారు.సెనేటర్ మిగ్యుల్ ఉరిబ్ టర్బే తలకు ఒక బుల్లెట్ తగిలిందని స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడిని ఖండిస్తున్నట్లు వామపక్ష అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రభుత్వం పేర్కొంది. ఈ హింసాత్మక చర్య కేవలం అతనిపైన మాత్రమే కాదని ఇది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, కొలంబియాలో చట్టబద్ధమైన రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగిన దాడి అని అధ్యక్ష కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. Urgente 🇨🇴 Aquí está el momento del atentado al Dr Miguel Uribe Que dolor de PatriaGobierno miserable !Imágenes sensibles pic.twitter.com/tA3VWGap5V— Luis Aníbal Rincón Arguello. ® 🇨🇴 (@Rincon001A) June 7, 2025డెమోక్రటిక్ సెంటర్ పార్టీ సభ్యుడైన మిగ్యుల్ ఉరిబ్ టర్బే గత అక్టోబర్లో తాను 2026లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. కాగా సాయుధుడైన ఒక వ్యక్తి తమ సెనేటర్ను వెనుక నుండి కాల్చాడని డెమోక్రటిక్ సెంటర్ పార్టీ తెలిపింది. ఈ దాడి ఒక రాజకీయ నాయకుని ప్రాణానికి ముప్పు కలిగించడమే కాకుండా, కొలంబియాలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలకు కూడా ముప్పు ఏర్పడేలా చేసిందని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. పార్టీ నేత కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్ మాట్లాడుతూ ఇది దేశానికున్న ఆశపై జరిగిన దాడిగా అభివర్ణించారు.బొగోటా మేయర్ కార్లోస్ గాలన్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షూటర్ పట్టబడ్డాడని తెలిపారు. ఈ ఘటనలో ఒక 15 ఏళ్ల బాలుడిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మిగ్యుల్ ఉరిబ్ టర్బే కొలంబియాలో రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తాత కొలంబియా మాజీ అధ్యక్షుడు జూలియో సీజర్ టర్బే. ఆయన 1978 నుండి 1982 వరకు అధికార బాధ్యతలు చేపట్టారు. ఆయన తల్లి డయానా టర్బే.. ఆమె ప్రఖ్యాత జర్నలిస్ట్. మిగ్యుల్ ఉరిబ్ టర్బే 2022 నుంచి సెనేటర్గా ఉన్నారు. గతంలో బొగోటా ప్రభుత్వ కార్యదర్శిగా, నగర కౌన్సిలర్గా పనిచేశారు. 2019లో నగర మేయర్ పదవికి కూడా పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు.ఇది కూడా చదవండి: జ్యోతి మల్హోత్రాకు పాకిస్తానీ రిటైర్డ్ అధికారితో లింకు ? -
ఇక్కడ ఏమీ లేదు.. సమంత పోస్ట్ వైరల్
హీరోయిన్ సమంత(Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎప్పుడూ ఫుల్ యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగతం లేదా సినిమాలు, వర్కౌట్స్, ఆరోగ్య సూత్రాలు... ఇలా ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్లో ఉంటారు. ప్రస్తుతం ఆమె అబుదాబీలో ఉన్నారు. అక్కడ హ్యాపీగా... జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు సమంత. (చదవండి: అక్కినేని అఖిల్ పెళ్లి.. బరాత్లో జోరుమీదున్న నాగచైతన్య)‘‘ఇక్కడ ఏమీ లేదు... సౌండ్ లేదు... హడావిడి లేదు... చక్కని స్పేస్ ఉంది’’ అంటూ వెకేషన్లో భాగంగా అబు దాబీలో సంతోషంగా ఉన్న అక్కడి ఫొటోలను ఆమె షేర్ చేయగా, వైరల్గా మారాయి. దుబాయ్లో జరిగిన ఓ జ్యువెలరీ బ్రాండ్ ఈవెంట్లో పాల్గొన్న సమంత అనంతరం అక్కడి అందాలను చూస్తూ సందడి చేస్తున్నారు. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు సమంత. అయితే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న విడుదలైంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్తో పాటు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నారు సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
రియల్ఎస్టేట్ మోసాలకు ‘రెరా’ రెడ్ లైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల కొనుగోలుదారుల ప్రయోజనాలే ముఖ్యమని.. ప్రమోటర్లు, డెవలపర్లు, రియల్టర్లు కొనుగోలుదారులను మోసగించే చర్యలను సహించేది లేదని రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్ సత్యనారాయణ స్పష్టం చేశారు. రెరా నిబంధనలు ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ సంస్థలకు రూ.42 కోట్ల జరిమానాలు విధించినట్లు చెప్పారు. కొనుగోలుదారుల ఫిర్యాదులు, పత్రికల్లో వస్తున్న కొన్ని వాణిజ్య ప్రకటనల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.2023 జూన్లో రెరాకు పూర్తిస్థాయిలో చైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించిన తర్వాత ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సత్యనారాయణ వివరించారు. 500 చదరపు అడుగులకు పైబడిన లేదా కనీసం తొమ్మిది.. అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు, ప్లాట్లు నిర్మించే ప్రతి ప్రాజెక్టు ‘రెరా’కింద రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలని తెలిపారు. అనుమతుల సమయంలో హెచ్ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్ఎంసీ, పురపాలక సంఘాలు, సంస్థలు కూడా విధిగా ‘రెరా’రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రమోటర్లు, డెవలపర్లకు సూచిస్తున్నాయని చెప్పారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. రెరాలో ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి? ఈ ఏడాది మే చివరి నాటికి ‘రెరా’లో 9,641 ప్రాజెక్టులు నమోదయ్యాయి. 4,237 వ్యక్తులు/సంస్థలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు నమోదు చేసుకున్నారు.రెరా ప్రధాన బాధ్యతలేంటి? ప్రమోటర్లు, డెవలపర్లు కొనుగోలుదారులకు జవాబుదారీగా ఉండేలా చేయడం, న్యాయబద్ధంగా వ్యవహరించేలా చూడడం, పారదర్శకత నెలకొల్పి మోసాలను నివారించడం, ఒప్పందం ప్రకారం కొనుగోలుదారులకు సకాలంలో ప్రాపర్టీలను పూర్తిచేసి అందించేలా చూడడం, ఒప్పందాలు సరిగా అమలయ్యేందుకు నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం రెరా ప్రధాన బాధ్యతలు. ప్రజల నుంచి రెరాకు ప్రధానంగా ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి? ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడం లేదని, ఒప్పందం మేరకు నిర్ణీత గడువులోగా ఫ్లాట్లను అప్పగించటంలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. సకాలంలో ప్రాజెక్టులు మొదలుపెట్టకపోవటం, లేఅవుట్ నిబంధనలకు అనుగుణంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో అభివృద్ధి చేయకపోవడం, అ సంపూర్తిగా ఉన్న ఫ్లాట్లను రిజిస్టర్ చేయడం, నిధు లను మళ్లించడం, కొనుగోలుదారుల నుంచి వసూ లు చేసిన డబ్బును దుర్వినియోగం చేయడం, అగ్రిమెంట్లలో పేర్కొన్న మేరకు వసతులు కల్పించకపోవడం, ఒకే ప్లాట్/ఫ్లాట్ను ఇద్దరు ముగ్గురికి విక్రయించడం, వినియోగదారుల నుంచి డబ్బు వసూ లు చేసి కనిపించకుండా పోవటం, రెరాలో రిజిస్టర్ చేసుకోని ఏజెంట్లు ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడంపై ప్రధానంగా ఫిర్యాదులు వస్తున్నాయి.రెరా అనుమతి లేకుండానే ప్రకటనలు వస్తున్నాయి. వాటికి చెక్పెట్టే విధానం ఉందా? రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్టులపై సుమోటోగా కేసులు నమోదుచేస్తున్నాం. ప్రమోటర్ల అధికారిక వెబ్సైట్లను పరిశీలించి రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్టులను గుర్తించి షోకాజ్ నోటీసులు ఇస్తున్నాం. రెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిస్తే.. 040–29394972కు ఫోన్ చేసిగానీ, 9000006301 నంబర్కు వాట్సాప్ ద్వారా గానీ, rera&maud@telangana.gov.in, secy&rera&maud@telangana.gov.in వెబ్సైట్లలోగానీ ఫిర్యాదు చేయవచ్చు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ప్రీ లాంచింగ్ కార్యక్రమాలు చేపట్టడం రెరా చట్టరీత్యా నేరం. రిజిస్టర్ చేసుకోని సంస్థల ప్రకటనలను నియంత్రించేందుకు రెరా త్వరలోనే అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకోబోతోంది. ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు అందాయి? అందులో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు? చర్యల తరువాత సంస్థల తీరు మారిందా? మీ నిర్ణయాలపై అప్పిలేట్కు వెళ్లిన కేసులెన్ని? 2,198 ఫిర్యాదులు అందాయి. వాటిలో 1,278 ఫి ర్యాదులను పరిష్కరించాం. 862 ప్రాజెక్టులపై జరిమానాలు విధించాం. 42 కేసుల్లో అప్పీల్కు వెళ్లారు.ఇప్పటివరకు ఎంత జరిమానా విధించారు? అందులో సంస్థలు ఎంత చెల్లించాయి? నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు రూ.41,04,09,425 జరిమానా విధించాం. అందులో రూ.15,76,82,170 వసూలు అయ్యింది. వసూలు కాని జరిమానాను రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తారా? 92 కేసుల్లో రెవెన్యూ రికవరీ చట్టం కింద జరినామాలు వసూలు చేయాలని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లను కోరాం. అందులో 3 కేసుల్లో ఆర్ఆర్ యాక్ట్ కింద జరిమానాలు వసూలు చేశారు. మిగతావి కూడా త్వరలో వసూలు చేస్తాం.రియల్ ఎస్టేట్ మోసాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ మోసాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. నరెడ్కో, క్రెడాయ్, తెలంగాణ బిల్డర్స్ ఫోరం, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్, వినియోగదారుల సంఘాల సహకారంతో రియల్ మోసాలను అరికట్టే చర్యలు చేపట్టాం. రెరా అమలులో ఇతర రాష్ట్రాలు ఏవిధంగా ముందుకెళ్తున్నాయి? మన రాష్ట్రంలో రెరా పర్మనెంట్ అథారిటీని ప్రారంభించి రెండేళ్లు అవుతోంది. ఇతర రాష్ట్రాల్లో అంతకంటే ముందునుంచే ఉన్నా యి. అయినా వాటితో సమానంగా మన దగ్గర రిజిస్ట్రేషన్లు జరిగాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలో రెరాను 2017లోనే ప్రారంభించారు. మన రాష్ట్రంలో రెరా చైర్మన్గా నన్ను, సభ్యులుగా శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణను 2023 జూలైలో నియమిస్తే.. సిబ్బందిని 2024 నవంబర్లో కేటాయించారు. సభ్యులు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణలతో కలిసి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.