-
గుజరాత్ X ముంబై
ముల్లాన్పూర్: ఐపీఎల్ 18వ సీజన్లో బెంగళూరు జట్టు తుది పోరుకు అర్హత సాధించగా... గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్కు సిద్ధమయ్యాయి. శుక్రవారం జరగనున్న పోరులో గెలిచిన జట్టు... క్వాలిఫయర్–1లో ఓడిన పంజాబ్ కింగ్స్తో క్వాలిఫయర్–2లో తలపడనుంది. ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 5 పరాజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకున్న గుజరాత్ పట్టికలో మూడో స్థానంతో ‘ప్లే ఆఫ్స్’కు చేరుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై 14 మ్యాచ్ల్లో 8 విజయాలు, 6 పరాజయాలతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్కు చేరింది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరగగా... రెండింట్లోనూ గుజరాత్నే విజయం వరించింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్, హార్దిక్ పాండ్యా నమన్ ధీర్ ముంబై బ్యాటింగ్కు కీలకం కానుండగా... జస్ప్రీత్ బుమ్రా, బౌల్ట్, దీపక్ చహర్, సాంట్నర్ బౌలింగ్ భారం మోయనున్నారు. మరోవైపు స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ సేవలు అందుబాటులో లేకపోవడంతో గుజరాత్ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. కెపె్టన్ శుబ్మన్ గిల్, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ప్రదర్శనపైనే ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా సత్తా చాటాల్సిన అవసరముంది.ఐపీఎల్లో నేడు (ఎలిమినేటర్)గుజరాత్ X ముంబైవేదిక: ముల్లాన్పూర్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో -
ఆపరేషన్ సిందూర్ ఆగదు: ప్రధాని మోదీ
గాంగ్టక్/అలీపూర్ద్వార్: ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులకు తగిన గుణపాఠం నేర్పడానికి ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ ఆగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తేల్చిచెప్పారు. ముష్కర మూకలను కోలుకోలేని రీతిలో దెబ్బకొట్టడం ఖాయమని అన్నారు. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ప్రధాని మోదీ గురువారం సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవంలో వర్చువల్గా పాల్గొన్నారు. అనంతరం పశ్చిమ బెంగాల్, బిహార్లో పర్యటించారు. పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో గత నెలలో జరిగిన ఉగ్రదాడి భారతీయ ఆత్మ, ఐక్యత, మానవత్వంపై జరిగిన దాడిగా ప్రధాని అభివర్ణించారు. ఈ దాడి పట్ల నిర్ణయాత్మకంగా స్పందించామని, ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదులకు తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్పామని అన్నారు. పాకిస్తాన్ భూభాగంలో ముష్కరుల స్థావరాలు, మౌలిక సదుపాయాలు, వైమానిక కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో మనదేశం మొత్తం ఐక్యంగా ఉందని పునరుద్ఘాటించారు. దేశంలో మతపరంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలన్న లక్ష్యంతోనే పహల్గాంలో కుట్రపూరితంగా పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారని ప్రధాని ఆరోపించారు. మన ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచేస్తే చివరకు ఏం జరుగుతుందో చేసి చూపించామని స్పష్టంచేశారు. సిక్కిం రాష్ట్రం భారత్కు గర్వకారణమని అన్నారు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల సంపూర్ణ విశ్వాసం చూపుతున్నారని ప్రశంసించారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ వేడుకలకు తాను స్వయంగా హాజరు కాలేకపోవడం బాధగా ఉందన్నారు. సిక్కిం రాష్ట్రం ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు ఉగ్రవాద ఉత్పత్తి కర్మాగారంగా మారిన పాకిస్తాన్ భూభాగంలోకి మూడుసార్లు ప్రవేశించి దాడులు చేశామని ప్రధాని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని అలీపూర్ద్వార్ జిల్లాలో రూ.1,010 కోట్ల విలువైన సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టుకు ఆయన పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ను ప్రస్తావించారు. బెంగాలీ సంస్కృతికి సిందూర్తో భావోద్వేగ అనుబంధం ఉందన్నారు. దుర్గా పూజ సమయంలో ఇక్కడి మహిళలు ‘సిందూర్ ఖేలా’ వేడుక నిర్వహించుకుంటారని తెలిపారు.బెంగాల్లో రాక్షస పాలన పశ్చిమ బెంగాల్లో అరాచక పాలన సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో హింస, అవినీతి పెచ్చుమీరిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఇక్కడ చట్టబద్ధమైన పాలన ఉందా? అని ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలు సంక్షోభాల్లో చిక్కుకున్నారని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. తృణమూల్ కాంగ్రెస్కు బెంగాల్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా మమతా బెనర్జీ సర్కారు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.పాట్నాలో మోదీ భారీ రోడ్ షో బెంగాల్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ బిహార్ రాజధాని పాట్నాకు చేరుకున్నారు. పాట్నా ఎయిర్పోర్టులో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే కొత్త సివిల్ ఎన్క్లేవ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గురువారం సాయంత్రం పాట్నాలో భారీ రోడ్షోలో మోదీ పాల్గొన్నారు. ఎయిర్పోర్టు సమీపంలోని అరణ్య భవన్ నుంచి బీర్చంద్ పటేల్ మార్గ్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం దాకా ఈ రోడ్షో జరిగింది. శుక్రవారం బిహార్, ఉత్తరప్రదేశ్లో పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. -
పాక్లో మకాం.. సిమ్ల దుర్వినియోగం.. రాజస్థాన్ యువకుడు అరెస్ట్
న్యూఢిల్లీ: ‘పహల్గామ్’ ఉగ్రదాడి అనంతరం భారత్లో ఉంటూ పాక్కు సహకరిస్తున్నవారిపై ప్రభుత్వం నిఘా సారించింది. ఈ నేపధ్యంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. తాజాగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(Pakistani intelligence operatives) (పీఐవో)కు అక్రమంగా భారత మొబైల్ సిమ్ కార్డులను సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.రాజస్థాన్ కు చెందిన కాసిమ్ (34)రెండుసార్లు పాకిస్తాన్కు వెళ్లాడని, మొదట 2024 ఆగస్టులో, తరువాత 2025 మార్చి లో పాకిస్తాన్కు వెళ్లి, దాదాపు 90 రోజులపాటు అక్కడే ఉన్నాడని పోలీసు అధికారులు తెలిపారు. కాసిమ్ తన పాక్ పర్యటనలో పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్(Inter-Services Intelligence) (ఐఎస్ఐ)అధికారులను కలిసినట్లు అనుమాలున్నాయని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ నేపధ్యంలో డీగ్ జిల్లాలోని గంగోరా గ్రామానికి చెందిన కాసిమ్ను అరెస్టు చేసి, పోలీసు రిమాండ్కు తరలించామన్నారు.కాసిమ్ భారత సైన్యంతో పాటు ప్రభుత్వ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని సేకరించడానికి భారత మొబైల్ నంబర్లను దుర్వినియోగం చేస్తున్నాడని స్పెషల్ సెల్కు నిఘా సమాచారం అందింది. ఆయన మొబైల్ సిమ్ కార్డులను భారత్లో కొనుగోలు చేసి, ఇక్కడి పౌరుల సహాయంతో సరిహద్దు మీదుగా పాక్కు పంపాడనే ఆరోపణలున్నాయని ఆ అధికారి తెలిపారు. తమకు అందిన ఇన్పుట్ల మేరకు చట్టప్రకారం కాసిమ్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని అధికారి వివరించారు. ఇది కూడా చదవండి: ‘ఇంకా ఎక్కువే చేయగలం’: పాక్కు రాజ్నాథ్ హెచ్చరిక -
కాజోల్ హారర్ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించేలా ట్రైలర్!
బాలీవుడ్ భామ కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం మా(Maa Movie). ఈ సినిమాకు విశాల్ రేవంతి ఫూరియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై అజయ్ దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఈ మూవీ హారర్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో దెయ్యం సీన్స్ ఆడియన్స్కు వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నయి. ట్రైలర్ ఆద్యంతం ఆడియన్స్లో అత్యంత ఉత్కంఠ పెంచేలా ఉంది. దెయ్యం బారిన పడిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన యుద్ధమే ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో తనూజ దేవ్గణ్, రోనిత్రాయ్, సుభద్ర సేన్గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. -
నటుడు రవిమోహన్కు అత్త నోటీసులు
నటుడు రవిమోహన్ (జయం రవి), భార్య ఆర్తీల విడాకుల వ్యవహారం సీరియల్గా సాగుతోందనే చెప్పాలి. ముందు రవిమోహన్, ఆర్తీ ఒకరిపై ఒకరు విమర్శించుకున్నారు. తమ జీవితంలో వివాదం తలెత్తడానికి కారణం గాయని కెనిషానే కారణం అని ఆర్తిపై విమర్శలు చేశారు. అయితే మీ వివాదంలోకి తనను లాగొద్దని కెనిషా గట్టిగానే హెచ్చరించారు. కాగా రవిమోహన్, ఆర్తి విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. కాగా తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లో సామాజిక మాధ్యమాల్లో తొలగించాలని రవిమోహన్ ఆయన భార్య ఆర్తికి, అత్త సుజాతలకు నోటీసుల పంపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్తి తల్లి సినీ,టీవీ సీరియళ్ల నిర్మాత సుజాత తన న్యాయవాది ద్వారా రవిమోహన్కు ఒక నోటీస్ పంపారు. తమపై చేసిన తప్పుడు ఆరోపణలను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇకపై సోషల్మీడియాలో తప్పుడు పోస్ట్లను షేర్ చేయవద్దన్నారు. అదే నోటీస్ను మీడియాకు రిలీజ్ చేశారు. అందులో రవిమోహన్, ఆర్తీల వ్యవహారం గురించి, వారి వివాహ సమస్యల గురించిన ప్రసారాన్ని అన్ని సామాజిక మాధ్యమాల్లో తొలగించాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. అదేవిధంగా రవిమోహన్, ఆర్తి, ఆమె తల్లి సుజాతలకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం చేయకూడదని పేర్కొన్నారన్నారు. వీరి వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి. -
‘కూతురు కొడుకు ఎన్టీఆర్కు వారసుడా?’
సాక్షి, తాడేపల్లి: నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప.. నారా లోకేష్ ఎలా వారసుడు అవుతారని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి. చంద్రబాబు అవినీతి రాజకీయానికి మాత్రమే లోకేష్ వారసుడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తాజాగా మాట్లాడుతూ..‘మన సంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్కు కూతురు కొడుకైన నారా లోకేష్.. ఏ విధంగా ఎన్టీఆర్కు వారసుడు అవుతాడు?. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప, వేరే కుటుంబాల వారు కారు కదా? అందుకే నారా కుటుంబం నుంచి వచ్చిన లోకేష్, ఎప్పటికీ ఎన్టీఆర్ వారసుడు కాలేడు. చంద్రబాబు అవినీతి రాజకీయానికి మాత్రమే లోకేష్ వారసుడు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, అఘాయిత్యాలకు లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం. ఇలాంటి దగుల్బాజీ రాజకీయం చేసే వారు ప్రపంచంలో ఈ తండ్రీకొడుకులు తప్ప ఇంకొకరు ఉండరు. అవినీతితో వేల కోట్లు సంపాదించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మాత్రం ఈ తండ్రీకొడుకులను మించిన వారు ఉండరు. తండ్రీకొడుకులు రాష్ట్రానికి పట్టిన పీడ. అమరావతి పేరుతో అడ్డగోలుగా సంపాదిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు. రెడ్ బుక్ పాలన చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో అడుగుపెట్టడానికే వణికిపోతున్నారు. ముంబై నుంచి సినీ నటిని రప్పించి, ఆమెతో ఆరోపణలు చేయించి.. ఆమెను అడ్డం పెట్టి జిందాల్ కంపెనీ రాకుండా తరిమేశారు’ అని విమర్శలు చేశారు.కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేస్తారని భ్రమ పడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ఇద్దరే.. మహానాడును భ్రష్టుపట్టించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సి పోయి.. జగన్ను తిట్టడానికే సరిపోయింది. టీడీపీ జెండాలు, కరపత్రాలు వాళ్లే తగలపెట్టుకున్నారు. సూపర్ సిక్స్ అన్నారు తండ్రి.. కొడుకు ఇంకోటి అంటున్నారు. .@naralokesh ఎన్టీఆర్ గారి వారసుడిగా కాలేడు:మన సంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్కు కూతురు కొడుకైన నారా లోకేష్, ఏ విధంగా ఎన్టీఆర్కు వారసుడు అవుతాడు?నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప, వేరే కుటుంబాల వారు కారు కదా? అందుకే నారా కుటుంబం నుంచి వచ్చిన… pic.twitter.com/mpEcSgXMPT— YSR Congress Party (@YSRCParty) May 29, 2025పనికిమాలిన రాజకీయానికి పరాకాష్ట ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ వీళ్లను పొగిడినట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్.. చంద్రబాబును తిట్టిన క్యాసెట్లు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్ ఆశయాన్ని మహానాడులో చెప్పలేదు.. కేవలం జగన్ను తిట్టడానికి పెట్టారు. మద్యం ద్వారా ఏపీలో కుటుంబాలను సర్వ నాశనం చేస్తున్నారు. అవినీతి సొమ్మును వైట్ మనీగా మార్చడానికి మహానాడులో విరాళంగా తీసుకుంటున్నారు. స్కిల్ స్కాంలో ఇచ్చిన సొమ్ము పార్టీ ఫండ్గా తీసుకున్నారు. చంద్రబాబు చేసింది పెద్ద మోసం. చంద్రబాబు దగ్గరకు ఈడీ ఎందుకు రాదు?. ఎన్టీఆర్ను చంపింది చంద్రబాబు. ఎన్టీఆర్ పేరుతో మళ్లీ విరాళాలు వసూలు చేస్తున్నారు. రెండు ఎకరాల చంద్రబాబుకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా వచ్చింది?. ఎన్టీఆర్ ఆత్మను కూడా ఏఐ ద్వారా ఉపయోగించుకున్న తీరు బాధాకరం’ అని మండిపడ్డారు. -
యూట్యూబర్ బయ్యా సన్నీ అరెస్టు కలకలం
సూర్యాపేటటౌన్, నూతనకల్: యూట్యూబ్ వ్లాగర్, బైక్ రైడర్ బయ్యా సన్నీయాదవ్ను నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసినట్లు జరుగుతున్న ప్రచారంతో ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా నూతనకల్లో కలకలం సృష్టించింది. సన్నీయాదవ్ ఇటీవల పాకిస్తాన్లో పర్యటించి.. తన యూట్యూబ్ చానల్లో ఆ పర్యటనకు సంబంధించిన బైక్ రైడింగ్ వీడియోలను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలపై ఇటీవల ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చెన్నైలో సన్నీయాదవ్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ కొంతమంది భారత సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తన వేగులుగా మార్చుకోవటంతో వారిని భారత దర్యాప్తు సంస్థలు ఇటీవల అరెస్టు చేశాయి. ఈ కోణంలోనే సన్నీయాదవ్ను కూడా ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు ఆయనపై మార్చి 22న నూతనకల్లో కేసు నమోదైంది. ఈ కేసులో అతడికి బెయిల్ లభించింది. కొద్దిరోజుల క్రితం నూతనకల్ వచ్చి.. ఇటీవల తన స్నేహితుడిని కలిసేందుకు చెన్నై వెళ్లాడు. అక్కడే ఎన్ఐఏ అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయం తమకు తెలియదని సన్నీ కుటుంబసభ్యులు తెలిపారు. -
ఫతేనగర్ వంతెన మెట్లు కూల్చివేత
బాలానగర్: ఫతేనగర్ ఫ్లైఓవర్కు సంబంధించిన పాత మెట్లు శిథిలావస్థకు చేరడంతో హైడ్రా అధికారులు మంగళవారం కూల్చేశారు. సోమవారం వీటి ద్వారా దిగుతుండగా కొన్ని విరిగిపడటంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఈ విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం ఆ ప్రాంతానికి వెళ్లి శిథిలావస్థకు చేరిన మెట్లను పరిశీలించారు. ప్రతి ఆదివారం సనత్నగర్లో సంత జరుగుతుందని, ఆ సందర్భంగా వందలాది మంది ఈ మెట్లను వినియోగిస్తారని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. కూలడానికి సిద్ధంగా ఉన్న ఆ మెట్ల వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉందని, వర్షాకాలంలో ముప్పు ఎక్కువని గుర్తించిన రంగనాథ్ వాటిని కూల్చివేయాలని ఆదేశించారు. దీంతో హైడ్రా అధికారులు ఆ మెట్లను తొలగించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో శిథిలావస్థకు చేరిన ఇలాంటి నిర్మాణాలను గుర్తించడానికి సివిల్ ఇంజినీరింగ్ నిపుణులతో తనిఖీ చేయాలని ఆదేశించారు. శిథిలావన్థలో ఉన్న వాటిని గుర్తించి కూల్చేయాలని సూచించారు. ఫతేనగర్ ఫ్లైఓవర్కు కొత్త మెట్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ సతీష్గౌడ్ పేర్కొన్నారు. -
కొలంబోలో అనసూయ చిల్.. ఎల్లో శారీలో రష్మిక హోయలు!
బ్లాక్ అవుట్ఫిట్లో బాలీవుడ్ భామ మలైకా అరోరా..కొలంబోలో అనసూయ చిల్..సెల్ఫీ ఫోజులో మహేశ్ బాబు కూతురు సితార..ఎల్లో శారీలో రష్మిక మందన్నా హోయలు..కాన్స్ ఫెస్టివల్ మూడ్లోనే ప్రణీత సుభాశ్.. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Karishma Patidar (@stylebykarishmaa) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
వల్లభనేని వంశీకి వైద్య సాయం అందించండి
సాక్షి, అమరావతి/నూజివీడు: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైద్య సాయం అందకుండా ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు, జైలు అధికారులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది. వంశీ ఆరోగ్య పరిస్థితిపై వచ్చే గురువారం నాటికి పూర్తిస్థాయి నివేదిక తమకు ఇవ్వాలని ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రిలో వంశీతో పాటు ఆయన భార్య లేదా కుటుంబ సభ్యులెవరైనా కూడా ఉండొచ్చంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపులపాడు మండల పరిధిలో నకిలీ ఇళ్ల పట్టాల మంజూరు వ్యవహారంలో హనుమాన్ జంక్షన్ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. తన తీవ్ర అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్పై విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి ఊరట మైనింగ్ వ్యవహారంలో గన్నవరం పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని వంశీని ఆదేశించింది. అలాగే చార్జిషీట్ దాఖలు చేసేవరకు ప్రతి రెండో శనివారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు, గన్నవరం, విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు అక్రమంగా మైనింగ్ జరిపి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారి ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై గన్నవరం పోలీసులు వంశీతోపాటు మరికొందరిపై అదే రోజు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది. వంశీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. అర్ధరాత్రి ఫిర్యాదు అందితే, ఆ వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఇది పోలీసుల దురుద్దేశాన్ని ప్రస్ఫుటం చేస్తోందని తెలిపారు. మైనింగ్ జరిగిన ఐదేళ్ల తరువాత విజిలెన్స్ నివేదిక ఆధారంగా వంశీపై కేసు నమోదు చేశారన్నారు. కేసుల మీద కేసులు పెడుతూ జైలు నుంచి బయటకు రాకుండా పోలీసులు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. అరెస్ట్ గురించి పిటిషనర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే ఆయనకు హైకోర్టు రక్షణ కల్పించిందన్నారు. కింది కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్ను అమలు చేయబోమని అడ్వొకేట్ జనరల్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వంశీ పోలీస్ కస్టడీ పిటిషన్ డిస్మిస్ వల్లభనేని వంశీని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి పోలీసులు రెండోసారి వేసిన పిటిషన్ను ఏలూరు జిల్లా నూజివీడులోని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు గురువారం కొట్టివేసింది. వంశీ రిమాండ్ గడువు ముగియడంతో వర్చువల్గా వంశీని జడ్జి ముందు హాజరుపరచగా, రిమాండ్ను జూన్ 12 వరకు పొడిగించారు.