-
అయోధ్య రామాలయం అద్భుతం
అయోధ్య: టెక్నా లజీ దిగ్గజం, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ బుధవారం ఉత్తర ప్రదేశ్లోని అయో ధ్య రామమంది రాన్ని దర్శించుకు న్నారు. భారతీయ సంప్రదాయ కుర్తా పైజామా ధరించి, గర్భాలయంలో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. రామాలయ దర్శనం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని ఆనందం వ్యక్తంచేశారు. తాను ఇప్పటిదాకా చేసిన పనుల్లో ఇది చాలా గొప్ప అని చెప్పారు. ఈ ఆలయం చాలా అందంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇది అద్భుతమైన దేవాలయం అవుతుందని వెల్లడించారు. అయోధ్యలో హనుమాన్ గార్హీ ఆలయాన్ని కూడా ఎరోల్ మస్క్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎరోల్ మస్క్ వెంట కుమార్తె అలెగ్జాండ్ర మస్క్ కూడా ఉన్నారు. ఎరోల్ మస్క్ రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్కు ఎరోల్ మస్క్ గ్లోబల్ అడ్వైజర్గా పని చేస్తున్నారు. ఆయన ఈ నెల 1న ఇండియాకు వచ్చారు. 6వ తేదీ దాకా ఇక్కడే పర్యటిస్తారు. -
టెన్త్ ఫెయిలయినా.. పాఠశాలకు వెళ్లొచ్చు
కర్ణాటక: ఎస్ఎస్ఎల్సీ (టెన్త్)లో 3 పాఠ్యాంశాల్లో ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులు పాఠశాలకు వెళ్లి చదువుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని కూడా తెలిపింది. మళ్లీ పరీక్షలు రాసుకోవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలను విధించింది. ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మళ్లీ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవాలి. మామూలు విద్యార్థులకు మాదిరే చేరవచ్చు, చదువుకోవచ్చు. అందరు విద్యార్థులకు లభించే సౌకర్యాలు ఈ విద్యార్థులకూ లభిస్తాయి. డ్రాపౌట్స్ను తగ్గించడానికి, ఫెయిలయ్యామని చదువు మానివేయకుండా ఈ వెసులుబాటును కల్పించినట్లు తెలిసింది. -
ఆదునిక చరిత్రలో అతిపెద్ద సర్జికల్స్ట్రైక్- రష్యాకు తీరని అవమానం మిగిల్చిన ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
ఆదునిక చరిత్రలో అతిపెద్ద సర్జికల్స్ట్రైక్ - రష్యాకు తీరని అవమానం మిగిల్చిన ఉక్రెయిన్ డ్రోన్ దాడులు -
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
క్రైమ్: శుభకార్యానికి వెళ్లి తిరిగొస్తుండగా.. ఘోర ప్రమాదం ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఓ ట్రక్కు అదుపు తప్పి అనూహ్యంగా వాళ్లు ప్రయాణిస్తున్న వ్యాన్ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మధ్యప్రదేశ్ ఝుబువా(Jhabua) జిల్లా మేఘ్నగర్లో బుధవారం వేకువ జామున ఘోర ప్రమాదం జరిగింది. సిమెంట్ బస్తాల లోడ్ తీసుకెళ్లే ట్రక్కు ఒకటి.. సంజేలి రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి దాటుతుండగా అదుపు తప్పింది. పక్కన వెళ్తున్న ఓ వ్యాన్ మీద ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ఉన్న తొమ్మిది మంది మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లని, ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని ఎస్పీ పద్మవిలోచన్ శుక్లా వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపిన ఆయన.. దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.मध्यप्रदेश के झाबुआ में भीषण सड़क हादसाबेकाबू ट्रक और कार की जबरदस्त टक्करभीषण हादसे में 9 लोगों की मौके पर ही मौत2 लोग गंभीर रूप से घायल, अस्पताल में भर्ती#MadhyaPradesh #jhabua #accident pic.twitter.com/FIFsn8mRCg— Diksha singh (@DikshaSingh7522) June 4, 2025 -
కేక్ కటింగ్.. ఆపై కటకటాలు
గౌరిబిదనూరు: పుట్టినరోజు అని లాంగ్ కత్తితో కేక్ కట్ చేసిన వ్యక్తి, తరువాత పోలీసుస్టేషన్కు అతిథిగా వెళ్లాడు. ఆకతాయి చర్యల ఫలితం ఇలాగే ఉంటుంది. వివరాలు.. తాలూకాలోని వైచకూరహళ్ళి గ్రామంలో ఆటోడ్రైవర్ అనిల్ పుట్టినరోజును స్నేహితులతో జరుపుకొన్నాడు. పెద్ద ఖడ్గంతో కేక్ను కత్తిరించాడు. ఈ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటిని చూసిన రూరల్ పోలీసులు అనిల్ను అరెస్టు చేశారు. నిబంధనల ప్రకారం పెద్ద కత్తిని కలిగి ఉండడం, దానిని ప్రదర్శించడం చట్టరీత్యా నేరం. దీంతో ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. Auto Driver Anil Kumar Arrested For Cutting Cake With A Long pic.twitter.com/e1UQnAKzG8— Suryakumari T (@SuryakumariT) June 3, 2025 -
నదుల్లో ఇసుక 'తోడే'ళ్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. చాలా రీచ్ల వద్ద సీసీ కెమెరాలు లేవు. ఉన్నతస్థాయి పర్యవేక్షణ లేదు. దీంతో ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. ఒక్క రోజులోనే లక్షల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. ఆ మేరకు సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారిక ఇసుక రీచ్లకు ఆన్లైన్ ఆర్డర్ కాపీ తీసుకుని వచ్చే లారీలో అదనంగా ఇసుక నింపి అక్రమ వసూళ్లకు పాల్పడటం ఒక రకమైన దోపీడీ అయితే, అసలు ఆర్డర్ కాపీయే లేకుండా ఈ రీచ్ల నుంచి ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అనధికారిక రీచ్ల నుంచి తరలిపోయే ఇసుకకు లెక్కాపత్రమే ఉండక పోవడం గమనార్హం. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండగా.. పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది లేకపోవడంతో ఇసుక అక్రమ దందా జోరుగా సాగిపోతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధుల అండదండలు, కనుసన్న ల్లోనే ఈ దందా సాగుతోందనే ఆరోపణలున్నాయి. మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తమ వంతు పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఆ నాలుగు నదుల్లో.. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 32 ఇసుక రీచ్లు అధికారికంగా నడుస్తుండగా, అనధికారికంగా 52 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. గోదావరి, మంజీరా, కృష్ణా, తుంగభద్ర నదుల్లో అధికారిక ఇసుక క్వారీలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 12, ఉమ్మడి వరంగల్లో 9, కరీంనగర్లో 6 ఉండగా, ఖమ్మం, మంచిర్యాల, నారాయణపేట, మహబూబ్నగర్, నల్లగొండల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇసుక కావాల్సిన వారు క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.650 చొప్పున ఆన్లైన్లో చెల్లిస్తే ఆ మేరకు ప్రభుత్వం ఆర్డర్ కాపీ (ఓఆర్డీ) ఇస్తుంది. ఈ ఆర్డర్ కాపీ తీసుకుని రీచ్కు వెళితే కాంట్రాక్టర్ సిబ్బంది జేసీబీల ద్వారా లారీలో ఇసుకను నింపుతారు. ఈ విధంగా యంత్రాలు, సిబ్బందిని ఏర్పాటు చేసినందుకు గాను ప్రభుత్వం కాంట్రాక్టర్కు క్యూబిక్ మీటర్కు రూ.110 చొప్పున చెల్లిస్తోంది. ఒకవేళ గిరిజన సొసైటీల నిర్వహణలో రీచ్లు ఉన్నట్టైతే వాటికి క్యూబిక్ మీటర్కు రూ.250 చొప్పున ఇస్తోంది. ఈ క్రమంలో రీచ్ల వద్ద మైనింగ్ (టీజీఎండీసీ), రెవెన్యూ శాఖలకు సంబంధించిన సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి ఉండాలి. అన్లైన్లో బుకింగ్ చేసిన ప్రకారమే ఇసుక నింపుతున్నారా? అక్రమాలకు పాల్పడుతున్నారా? అనేది చూడాలి. ప్రతి వాహనాన్ని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలి. కానీ అలా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ఓఆర్డీ అసలే లేకుండా, ఒక్కో ఆర్డర్పై నాలుగైదు లారీల్లో.. చాలా క్వారీల్లో సిబ్బంది ఎటువంటి ఓఆర్డీలు లేకుండానే లారీకి రూ.50 వేలు తీసుకుని ఇసుక నింపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఒక్కరి పేరు మీద పర్మిట్ తీసుకుని, దానిపైనే నాలుగు, ఐదు లారీలల్లో ఇసుక సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కాగా అలా నింపిన లారీలను ఎలాంటి ఆటంకం లేకుండా గమ్యస్థానం చేరేలా స్థానిక నేతల అండదండలతో మైనింగ్, రవాణా, పోలీస్ తదితర శాఖల అధికారులను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి ఇలాకాలో ఇసుకాసురులు! ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తోంది. వెంకటాపూర్, వాజేడు, మంగపేట, ఏటూరునాగారం తదితర మండలాల్లోని గోదావరి రీచ్ల నుంచి సాగుతున్న ఇసుక దందాకు సదరు మంత్రి అనుచరులు కొందరి అండదండలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇసుక దందాను నిలువరించేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ప్రయత్నించక పోవడం, అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ ప్రచారం నిజమేననే వాదన విన్పిస్తోంది. పై స్థాయి ప్రజా ప్రతినిధుల అండదండలు ఉండబట్టే.. కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా గోదావరిలోకి రోడ్లు వేసి మరీ ఇసుక తోడుతున్నారని, మామూళ్లు తీసుకుంటూ అధికారులు పట్టీపట్టనట్లు ఉంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తే తమపైనే అక్రమ కేసులు బనాయిస్తారని స్థానికులు భయపడుతుండటం గమనార్హం. అనధికారిక రీచ్లలో ఏం జరుగుతోంది? అనధికారిక రీచ్లు పూర్తిగా చట్ట విరుద్ధం. చాలావరకు గతంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి విరమించుకున్న ప్రాంతాల్లోనే ఈ దందా సాగుతోంది. దీనిని నియంత్రించాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ములుగు టీజీఎండీసీ ప్రాజెక్టు అధికారి విష్ణువర్ధన్, భూపాలపల్లి పీవో శ్రీకాంత్ నుంచి ‘సాక్షి’ ఫోన్ ద్వారా వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. ఉచితం పేరిట యధేచ్చగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక సరఫరాకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాల (ఇందిరమ్మ) కింద ఇళ్లు నిర్మించునే వారు కేవలం రూ.1400 చెల్లిస్తే అతడికి రిజిస్టర్డ్ ట్రాక్టర్ యజమాని ఇంటికి వచ్చి ట్రాక్టర్ ఇసుక పోసి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధానంతో పేదలైన లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇసుక లభిస్తుండగా, మరోవైపు స్థానిక ట్రాక్టర్ యజమానులకు ఉపాధి దొరుకుతోంది. అయితే ఈ విధానాన్ని అనుకూలంగా మలచుకుని ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కొందరు ప్రజాప్రతినిధుల అండదండలతో గ్రామాల్లో ఉన్న చోటా మోటా నేతలు స్థానిక వాగులను తోడేస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో ఇసుకను డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆ ఇసుకను లారీల్లో ఇతర జిల్లాలకు, హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రతిరోజూ ఒక్కో జిల్లాలో ట్రాక్టర్ల ద్వారా 500 నుంచి 800 ట్రిప్పుల ఇసుకను ‘ఉచితం’ పేరిట తోడుతూ ఇష్టారాజ్యంగా అమ్మేసుకుంటున్నారే ఆరోపణలున్నాయి. ఇలా రోజుకు రూ.50 కోట్లకు పైగా విలువైన ఇసుక పక్కదారి పడుతున్నట్టు అంచనా. కాగా కొన్ని జిల్లాల్లో ఈ అక్రమ దందాను గ్రామ కమిటీలు వేలం ద్వారా కూడా నిర్వహిస్తుండటం గమనార్హం. హైదరాబాద్కు ఇలా.. అక్రమంగా తోడేస్తున్న ఇసుక చాలావరకు హైదరాబాద్కు, ఇతర ముఖ్య నగరాలకు వస్తోంది. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో ప్రభుత్వం ఇసుకను తక్కువ ధరకు అందించడానికి ‘తెలంగాణ ఇసుక బజార్’లను ఏర్పాటు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి అబ్దుల్లాపూర్ మెట్, వట్టినాగులపల్లి, బౌరంపేట, ఆదిభట్లలో నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించారు. త్వరలో శామీర్పేట్, ఘట్కేసర్ ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని టీజీఎండీసీ ప్రకటించింది. బ్లాక్ మార్కెట్లో ఇసుక ధరలు విపరీతంగా పెరిగి.. ప్రైవేట్ వ్యాపారులు టన్ను ఇసుకను రూ.2,000 నుండి రూ.3,000 వరకు విక్రయిస్తున్న నేపథ్యంలో.. ఈ దందాను అరికట్టడానికి ఈ బజార్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ బజార్ల ద్వారా అందుబాటులో ఉండేది. వాస్తవ అవసరాలతో పోల్చుకుంటే నామమాత్రమేనని బహిరంగ రహస్యం.ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏలికేశ్వరం ఇసుక రీచ్. బుధవారం ఇక్కడి నుంచి 7,356 టన్నుల ఇసుక తరలించేందుకు 228 ఆన్లైన్ ఆర్డర్లు బుక్ అయ్యాయి. అంటే 228 లారీల ద్వారా ఈ ఇసుకను తీసుకెళ్తారన్న మాట. లారీ సైజును బట్టి ఒక్కో దానిలో 16 టన్నుల నుంచి 35 టన్నుల వరకు లోడ్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం రీచ్ వద్ద సీసీ కెమెరాలు లేవు. మైనింగ్ విభాగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఒక్కో లారీలో నాలుగు నుంచి ఆరు బకెట్ల (జేసీబీ ఒక్కసారి తోడే ఇసుక) ఇసుక అక్రమంగా తరలిపోతున్నట్టు సమాచారం. ఇందుకోసం బకెట్కు రూ.1,500 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో లారీలో సగటున మూడు బకెట్లు వేశారనుకుంటే మూడు బకెట్లకు రూ.4,500 చొప్పున 228 లారీలకు గాను రూ.10.26 లక్షలు దోచుకుంటున్నారన్న మాట. టన్నుల కొద్దీ అక్రమాలు... రాష్ట్రంలోని 32 అధికారిక రీచ్ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం..ఆర్డర్ కాపీ మేరకు.. ఆరు టైర్ల లారీలో 7–8 క్యూబిక్ మీటర్లు (11.5– 12.5 టన్నులు), 10 టైర్ల వాహనంలో 12 క్యూబిక్ మీటర్లు (19.5 టన్నులు), 12 టైర్ల లారీలో 16 క్యూ.మీ. (26 టన్నులు), 14 టైర్ల వాహనంలో 20 క్యూ.మీ. (32 టన్నులు) మాత్రమే నింపాలి. కానీ సామర్థ్యానికి మించి, అలాగే బుక్ చేసుకున్న దాని కంటే అధికంగా సగటున 3 బకెట్ల వరకు ఇసుక అదనంగా నింపుతున్నారు. బకెట్కు రూ.1,500 చొప్పున వసూలు చేస్తున్నారు. కొన్ని రీచ్ల వద్ద ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది.. లారీల్లో అదనంగా ఇసుకను నింపుకోవాలని, అందుకు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇసుక లోడింగ్ సమయంలో ఒక్కో లారీకి (బకెట్ డబ్బులు కాకుండా) రూ.1,000–1,500 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. -
పవన్కళ్యాణ్ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ ఆవేదన
పిఠాపురం: ‘వృద్ధాప్య పింఛనే ఇప్పటివరకు నన్ను బతికించింది. ఇప్పుడు ఆ పింఛన్ కూడా ఆపేసి ఏవో కారణాలు చెబుతున్నారు. నేను బతికున్నట్టు నిరూపించుకోమంటున్నారు. నేను కాలు కదపలేను. ఎక్కడికీ వెళ్లలేను. పింఛన్ లేకపోతే నాకు దిక్కులేదు. దాన్ని కూడా తీసేసి బతికుండగానే చంపేస్తున్నారు’ అంటూ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ కన్నీటిపర్యంతమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్ కాలనీకి చెందిన చోడిశెట్టి సుబ్బారావు(85) కొన్నేళ్లుగా వృద్ధాప్య పింఛన్ అందుకుంటూ.. కుమార్తె పార్వతి వద్ద నివసిస్తోంది. వైఎస్ జగన్ సర్కార్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వలంటీర్ ద్వారా ఇంటి వద్దే పింఛన్ అందుకున్న ఆమెకు కూటమి ప్రభుత్వంలో కష్టాలు ఎదురయ్యాయి. ఈ నెల పింఛన్ను ఆపేసిన కూటమి సర్కార్.. బతికున్నట్లుగా నిరూపించుకోవాలంటూ ఆమెకు అగ్ని పరీక్ష పెట్టింది. దీంతో తనను ఆదుకోవాలంటూ ఆ వృద్ధురాలు విలపిస్తోంది. నేను బతికే ఉన్నా కదా.. ‘గతంలో ఏ ఇబ్బంది లేకుండా వలంటీరే అన్నీ చూసుకునేవాడు. ఇప్పుడు ఎవరూ రావట్లేదు. వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు పడడం లేదంటున్నారు. నా కళ్లు మసకబారడంతో ఐరిస్ కూడా పడటం లేదంటున్నారు. ఏది పడకపోయినా నేను బతికే ఉన్నా కదా. నాకు పింఛనే ఆధారం అని చెబుతున్నా ఎవరూ కనికరించడం లేదు. నాకు పింఛనైనా ఇప్పించండి లేదా నన్ను చంపేయండి’ అంటూ వృద్ధురాలు విలపించింది. ‘మా అమ్మకు నెలనెలా వచ్చే పింఛన్ డబ్బులతోనే మందులు కొంటున్నా. పవన్కళ్యాణ్కు ఓటు వేసినందుకు ఇప్పుడు పింఛన్ గురించి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది’ అంటూ ఆమె కుమార్తె పార్వతి వాపోయింది. తమకు న్యాయం చేయాలని కోరింది. -
'డయాబెటిక్ రైస్' అంటే..? ఇది మధుమేహాన్ని నియంత్రించగలదా..
ఇటీవల కాలంలో అందరిని వేధిస్తున్న తీపి వ్యాధి మధుమేహం. దీని కారణంగా ఏం తినాలన్నా..బాబోయ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయేమో అన్న అనుమానం వెంటాడుతుంటుంది చాలామందిలో. దాన్ని క్యాష్ చేసుకునేలా మార్కెట్ డయాబెటిస్ వాళ్లకు ఉపయోగపడే రైస్, కూరగాయాలు, స్వీట్లు అంటూ మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తున్నాయి. వాస్తవానికి చాలామందికి కూడా రైస్తో భోజనం కానిస్తే కానీ కడుపునిండిన ఫీల్ రాదు. ఇలానే అంటున్నారు బాలీవుడ్ ప్రముఖ హీరో గోవింద్ భార్య సునీతా అహుజా సైతం. ఆమె కూడా హాయిగా అన్నం తింటేనే ఆ అనుభూతే వేరు అంటున్నారు. కానీ తాను కూడా డయాబెటిస్తో పేషెంటేనని, అందుకని రైస్ని ఇలా తీసుకుంటానంటూ తన డైట్కి సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. అంతేగాదు మనకిష్టమైన రైస్నే వదులకోకుండా ఆరోగ్యకరంగా ఎలా తీసుకోవాలో కూడా చెప్పారామె. మరి నిపుణులు దీని గురించి ఏమంటున్నారో సవివరంగా చూద్దామా..!.సెలబ్రిటీ సునీతా ఆహుజా తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ..తాను నేపాలీగా ఎక్కువ వైట్రైస్ తినేందుకే ఇష్టపడతానని అన్నారు. అయితే మధుమేహం ఉంది కాబట్టి డయాబెటిక్ రైస్కి ప్రాధాన్యత ఇస్తానన్నారామె. దాంతోపాటు రోటీలు కూడా తీసుకుంటానని అన్నారు. ‘డయాబెటిక్ రైస్’ అంటే..ఈ ‘డయాబెటిక్ రైస్’ఇటీవలకాలంలో బాగా ప్రజాదరణ పొందింది. ఇది మధుమేహంతో బాధపడుతున్న వారికి ప్రత్యామ్నాయమైన రైస్ అని చెప్పొచ్చు. ఇవి రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఉపయోగిస్తారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. సాదారణ బియ్యం కంటే..వీటిలోనే గ్లూకోజ్ స్థాయిలను నెమ్మదిగా పెరుతాయి. అందువల్ల వీటికే మొగ్గు చూపుతున్నారు చాలామంది. అవేంటంటే..నల్ల బియ్యంఎర్ర బియ్యంగోధుమ బియ్యందంపుడు బియ్యంతక్కువ GI బాస్మతి బియ్యంమిల్లెట్ ఆధారిత బియ్యంప్రాసెస్ చేసిన తక్కువ-కార్బ్ బియ్యంవాటిల్లో గ్లైసెమిక్ సూచిక..తెల్ల బియ్యం: GI 70–89 (ఎక్కువ)గోధుమ బియ్యం: GI 50–60 (తక్కువ)ఎర్ర బియ్యం: GI దాదాపు 55 (తక్కువ)దంపుడు బియ్యం: GI 38–50 (అత్యల్పం )మిల్లెట్స్: GI దాదాపు 40–55 (అత్యల్పం)డయాబెటిక్ బియ్యంతో కలిగే లాభాలు..భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ పెరుగుదల తక్కువగా ఉంటుంది. సంతృప్తిని పెంచడం, భాగం నియంత్రణకు సహాయపడుతుందిదీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరగలదుశుద్ధి చేయబడిన తెల్ల బియ్యంతో పోలిస్తే, తృణధాన్యాలు లేదా తక్కువ GI బియ్యం గ్లూకోజ్ ప్రతిస్పందనను మాడ్యులేట్ చేయడంలో బెస్ట్నిపుణులు ఏమంటున్నారంటే..ఇక వైద్య నిపుణులు సైతం "డయాబెటిక్ బియ్యం"లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ అని చెబుతున్నారు. అదే సమయంలో ఇది ఆరోగ్యకరమని అతిగా తీసుకుంటే మాత్రం.. దీనివల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరించారుగ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి ఎల్లప్పుడూ స్టార్చ్ లేని కూరగాయలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిసి తీసుకోవాలని అన్నారు. దీంతోపాటు ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా నివారించాలని సూచించారు. చివరగా తక్కువ-GI, అధిక-ఫైబర్ బియ్యం రకాలు చక్కెర నిర్వహణను గణనీయంగా మెరుగుపరుస్తాయని నమ్మకంగా చెప్పారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి. (చదవండి: ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ అంటే..? ఈ చికిత్స ఎందుకోసం అంటే..) -
దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: తమిళ నిర్మాతల సంఘం వినతి
కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా నిషేధంపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు లేఖ రాసింది. ఈనెల 5న విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కమల్ హాసన్ కన్నడ భాషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో థగ్ లైఫ్ను బ్యాన్ చేస్తూ కేఎఫ్సీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తమ లేఖలో రాస్తూ..' ఎన్నో ఏళ్లుగా కన్నడ, తమిళ సినీ పరిశ్రమలు కలిసి పనిచేస్తున్నాయి. శివరాజ్కుమార్, ఉపేంద్ర, సుదీప్ లాంటి కన్నడ హీరోలు తమిళ సినిమాల్లో నటించారు. కోలీవుడ్ నిర్మాతలు, దర్శకులు సైతం కన్నడ చిత్రాలు తీశారు. కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం ఇద్దరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి భాషకు ఓ చరిత్ర ఉంది. ప్రత్యేకత ఉంది. ఈ సినిమా ఈవెంట్లో కమల్హాసన్ ప్రేమతో మాట్లాడారు. అంతేకానీ మీ భాషను తక్కువ చేయాలని కాదు. కన్నడ చిత్ర పరిశ్రమకు కమల్ ఎంతో సహకారం అందించారు. కన్నడ చిత్ర దర్శకులంటే ఆయన గౌరవం. థగ్ లైఫ్ వాయిదా వేసినా.. బ్యాన్ చేసినా భవిష్యత్తులో ఇండస్ట్రీల మధ్య రిలేషన్ దెబ్బతింటుంది.' ' అని ప్రస్తావించారు.కాగా.. థగ్ లైఫ్ ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ పుట్టిందని ఆయన కామెంట్స్ చేయడంతో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు కన్నడిగులు. ఈ నేపథ్యంలోనే కేఎఫ్సీసీ ఆయన సినిమా థగ్ లైఫ్ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కమల్ హాసన్ తాను క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశారు. -
ఉత్పత్తికి ముందే మండుతున్న 'ఇథనాల్'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇథనాల్ తయారీ యూనిట్ల ఏర్పాటుపై ప్రజల నిరసన జ్వాలలు చల్లారడం లేదు. గతంలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజలు తిరగబడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేసింది. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలోనూ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను అడ్డుకునేందుకు స్థానికులు దాడులకు దిగారు. ఇథనాల్ ఫ్యాక్టరీల ద్వారా వాయు, జల కాలుష్యం ఏర్పడి తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నారాయణపేట జిల్లా చిత్తనూరులోనూ ఇథనాల్ యూనిట్ ఏర్పాటుపై నిరసనలు వ్యక్తమైనా, నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించింది. నారాయణపేట జిల్లా హిందూపూర్, జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న ప్రైవేటు సంస్థలు.. ప్రజల నిరసనల నేపథ్యంలో పనులు చేపట్టేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ లక్ష్యం 43 కోట్ల లీటర్లు విదేశాల నుంచి శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో ‘నేషనల్ బయో ఫ్యూయల్ పాలసీ’ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా ‘ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్’కింద 2025–26 నాటికి మొలాసిస్ లేదా ధాన్యం నుంచి 1,080 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించింది. తెలంగాణకు 43 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ లెక్కన తెలంగాణలో రోజుకు 5,256 కిలో లీటర్ల (కేఎల్పీడీ) ఇథనాల్ ఉత్పత్తి కావాలి. ఇథనాల్ తయారీ యూనిట్లు ఏర్పాటుచేసే సంస్థలకు ‘ఇథనాల్ ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్’కింద కేంద్రం వడ్డీలో రాయితీ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో 31 సంస్థలు ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రాగా, 2018–2022 మధ్య 28 సంస్థలకు అనుమతులు వచ్చాయి. అయితే, అనుమతి పొందిన సంస్థల్లో ఎన్ని నిర్మాణ పనులు ప్రారంభించాయనే సమాచారం తమ వద్ద లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. గతంలో ఉమ్మడి జాబితాలో ఉన్న ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టం (ఐడీఆర్ యాక్ట్) ప్రకారం ఇథనాల్ తయారీ కేంద్ర జాబితాలో చేరింది. దీనిని గతంలో 16 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆమోదించినా తెలంగాణ, ఆంధప్రదేశ్ దూరంగా ఉన్నాయి. అయితే, ఇథనాల్ తయారీని ఉమ్మడి జాబితాలో చేర్చి రాష్ట్రాలకు పర్యవేక్షక బాధ్యత అప్పగించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. అయినా రాష్ట్రంలో ఇథనాల్ తయారీ యూనిట్ల అనుమతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది. లైసెన్స్, రవాణా, మార్కెటింగ్, భూ కేటాయింపులు వంటి అంశాలతో తమకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ధాన్యం ఆధారిత ఇథనాల్పైనే వ్యతిరేకత రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమలు చెరకును గానుగ అడించడం ద్వారా వచ్చే మొలాసిస్తో ఇథనాల్ తయారు చేస్తున్నాయి. గాయత్రి (45 కేఎల్పీడీ), గణపతి (30 కేఎల్పీడీ), మధుకాన్ (60 కేఎల్పీడీ), కృష్ణవేణి (120 కేఎల్పీడీ) ఇథనాల్ను తయారు చేస్తున్నాయి. చెరకు ఫ్యాక్టరీకి రాని సీజన్లో ధాన్యం ఆధారిత మొలాసిస్ ద్వారా కూడా ఈ ఫ్యాక్టరీల్లో ఇథనాల్ తయారు అవుతోంది. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ కింద ఏర్పాటయ్యే యూనిట్లు వరి, మొక్కజొన్న, జొన్న తదితర ధాన్యాల నుంచి మొలాసిస్ను తయారు చేసే ప్రక్రియలో నీటి వినియోగం, దుర్వాసన, కాలుష్య వ్యర్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రకమైన పరిశ్రమలపైనే స్థానికుల్లో వ్యతిరేకత వస్తోంది. ప్రజలకు సరైన అవగాహన లేనందునే వ్యతిరేకత వస్తోందని పారిశ్రామికవర్గాలు చెప్తున్నాయి. అనుమతులు రద్దు చేయాలి పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల వెనుక అధికార పార్టీ అండదండలున్నాయి. రైతుల ఆవేదనను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలి. రైతులపై పోలీసు కేసులు, అరెస్టులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – డాక్టర్ ఆంజనేయగౌడ్, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ 12 గ్రామాలకు ఇబ్బంది పచ్చని పంట పొలాల నడుమ కాలుష్య చిచ్చును పెట్లే ఫ్యాక్టరీ వద్దంటున్నా పనులు చేపడుతున్నారు. గతంలో అధికారులకు ఎన్నోమార్లు వినతులు ఇవ్వడంతో పాటు నెలల తరబడి ఆందోళన చేస్తున్నాం. 12 గ్రామాల ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఫ్యాక్టరీ నిర్మించాలనే ప్రతిపాదన విరమించుకోవాలి. – విజయ్కుమార్, రాజోళి, గద్వాల జిల్లా