హైదరాబాద్ : ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ థాయ్లాండ్తో పాటు భారత్కు చెందిన బౌద్ధ భిక్షువులు చేపట్టిన చరిత్రాత్మక మూడో దమ్మ పాదయాత్ర బుధవారం నగరంలోని ఐమ్యాక్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు చేరుకుంది.
బుద్ధుడు బోధించిన శాంతి, కరుణ సందేశాలను చాటిచెప్పే లక్ష్యంతో సాగుతున్న ఈ పాదయాత్ర కర్ణాటకలోని సిద్ధార్థ బుద్ధ విహార్ నుంచి ప్రారంభమైంది.
మార్చి 1న నాగార్జున సాగర్లోని బుద్ధ వనాన్ని చేరుకుంటుంది. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షువులు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం హుస్సేన్ సాగర్లోని బుద్ధుడి విగ్రహాన్ని సందర్శించారు.


